-
ఐరాసలో జగన్ విజన్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్ దత్తా, రాజస్థాన్కు చెందిన మరో సర్పంచ్ నీరూ యాదవ్లు ‘లోకలైజింగ్ ది ఎస్డీజీ–‘విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్ అమలుచేసిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లా డుతూ.. భారత్లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు. -
ప్రసవించిన ప్రతి తల్లి బిడ్డ క్షేమం కోసం...తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్
పార్వతీపురంటౌన్: ప్రసవానంతరం తల్లీబిడ్డలు ఆస్పత్రినుంచి వారి ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని భావించి రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ (102) సర్వీసులు వారికి బాగా సేవలందిస్తున్నాయి. గతంలోనూ ఉన్న ఈ పథకం వాహనాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చింది. బాలింత చేరేగమ్యం ఎంత దూరమైనా, ఏప్రాంతమైనా మేమున్నామంటూ వాహనం ముందుకు వచ్చి సేవలందిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వారిని ఇళ్లకు చేరవేస్తూ ఏప్రిల్1న ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రప్రభుత్వం ఆధునీకరించిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలు పార్వతీపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్నాయి. గత ఏప్రిల్ 1న రాష్ట్రవ్యాప్తంగా 2వ తేదీన పార్వతీపురం పట్టణానికి ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పార్వతీపురంలో ఈ సేవలు అరకొరగా ఉండేవి. గతంలో ఒక్కో వాహనంలో నలుగురైదుగురు బాలింతలు వెళ్లాల్సివచ్చేది. ఉదయం డిశ్చార్జ్ అయినా సాయంత్రం వరకు ఊళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి నాలుగు వాహనాలు, పార్వతీపురం మండలానికి ఒక వాహనం, సీతానగరం మండలానికి ఒకటి కేటాయించింది. ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలను పూర్తి ఉచితంగా ఈ వాహనాల ద్వారా ఇళ్లకు చేరవేస్తున్నారు. ఈ సేవలతో బాలింతలు, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యం గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలింతలు ఎవరికి వారే సొంత వాహనాల్లో ఖర్చుపెట్టుకుని ఇళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చులేకుండా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా సొంతిళ్లకు చేరుస్తోంది. ఈ సేవలను నియోజవకర్గ వ్యాప్తంగా అందిస్తున్నాం. ఎస్.మన్మథనాయుడు, 102 సర్వీసుల పర్యవేక్షకుడు -
నిధులు లేవు.. అభివృద్ధి పనులు జరగవు
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభు త్వం ఓయూకు కేటాయించే బ్లాక్గ్రాంట్స్ నిధుల్లో సగానికి సగం కోత విధించడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయా యి. బ్లాక్గ్రాంట్స్ నిధులను వేతనాలు, పించన్లతో పాటు అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. గత మూడేళ్లులుగా అభివృద్ధి నిధులను నిలిపివేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అడిగినన్ని నిధులు విడుదల చేయనందున వివిధ వనరుల ద్వారా ఓయూకు లభించే ప్రతి పైసా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు వినియోగిస్తున్నారు. ఓయూ ఉద్యోగుల వేతనాలు, పించన్లకు ప్రతి నెలా రూ.30 కోట్లు, ఏడాదికి రూ.584 కోట్లు అవసరం. ఇందుకోసం ఓయూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లు బ్లాక్గ్రాంట్స్ నిధులు అడుగుతున్నారు.కానీ ప్రభుత్వం రూ.309 కోట్లను మాత్రమే విడుదల చేస్తోంది. ఈ నిధులు సరిపోకపోవడంతో మిగతా నిధులను ఓయూ సమకూర్చుకోవాల్సి వస్తున్నది. ఓయూకు వివిధ వనరుల ద్వారా లభించే ఆదాయాన్ని అభివృద్ధికి వినియోగించకుండా వేతనాలు, పించన్లకు వాడుతున్నారు. దీంతో ఓయూలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తగ్గుతున్న ఓయూ ఆదాయం ఓయూకు వివిధ వనరుల ద్వారా లభించే ఆదాయం ప్రతి ఏటా తగ్గుతుంది. గతంలో పీజీ అడ్మిషన్స్ కార్యాలయం, దూరవిద్యా కేంద్రం, విదేశీ విద్యార్థులు, ఎగ్జామినేషన్ బ్రాంచ్, క్రీడా మైదానాలు తదితరాల నుంచి కోట్లాది రూపాయాల ఆదాయం లభించేంది. ఈ ఆదాయాన్ని ఓయూలో వివిధ రకాల అభివృద్ధి పనులకు ఉపయోగించేవారు. తెలంగాణలో కొత్త వర్సిటీల రాకతో ఓయూకు ఆదాయం తగ్గింది. దీంతో ఉన్న నిధులు వేతనాలు, పించన్ల చెల్లింపులకే ఉపయోగిస్తున్నారు. మౌలిక వసతులు లేక నిలిచిన హాస్టల్ భవన ప్రారంభోత్సవం ఓయూ క్యాంపస్ ఐపీఈ ఎదురుగా 500 మంది పీజీ విద్యార్థుల వసతి కోసం పెద్ద హాస్టల్ భవనాన్ని నిర్మించారు. కానీ అందులో ఫర్నీచర్, మంచాలు (బెడ్స్) వంట సామాన్లు, ఫ్యాన్లు, టేబుల్స్, కుర్చీలు ఇతర మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించేందుకు నిధులు లేకపోవడంతో భవనం ప్రారంభానికి నోచు కోకుండా పోయింది. హాస్టల్ గదుల కొరతతో విద్యార్థులు నిత్యం రోడెక్కి ఆందోళనలు చేస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మించిన మెగా హాస్టల్ భవనంలో వసతులు లేక ఉత్సవ విగ్రహంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అభివృద్ధి గ్రాంట్స్ను పూర్తిగా నిలిపి వేసింది. ప్రస్తుతం ఓయూకు లభించే ప్రతి పైసాను నిబంధనలకు విరుద్ధంగా బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పించన్ల చెల్లింపునకు ఉపయోగిస్తున్నారు. ఓయూకు నిధులు తగ్గడం, ప్రభుత్వం నుంచి లభించే బ్లాక్గ్రాంట్స్లో కోత విధించడంతో ప్రతి నెలా వేతనాల చెల్లింపు సవాల్గా మారి విద్యార్థుల అభివృద్ధికి కోసం వాడాల్సిన నిధులను సైతం వేతనాలు, పించన్ల చెల్లింపునకు ఉపయోగిస్తున్నారు. -
బ్యాంకు‘బంధు’!
సాక్షి, హైదరాబాద్: రైతుల పట్ల బ్యాంకులు ఏమాత్రం కనికరం చూపడం లేదు. తమ అప్పులను వసూలు చేసుకోవడంపైనే అవి దృష్టి సారించాయి. రబీ పెట్టుబడి సొమ్ము రైతు ఖాతాలో పడగానే, ఆ సొమ్మును వారి అప్పుల కింద జమ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతుబంధు సొమ్మును అలా అప్పుల కింద జమ చేసుకోవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. అయినా కేంద్రం ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడంలో విఫలమైంది. రైతులకు కీలకమైన రబీ సీజన్లో పెట్టుబడి సొమ్ము ఉపయోగపడాల్సి ఉండగా, ఆ డబ్బును బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం సరాసరి ప్రతీ రైతుకు రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు రైతుబంధు కింద సొమ్ము అందుతుంది. ఆ సొమ్మును పాత బాకీల కింద వసూలు చేసుకుంటే రైతుకు మిగిలేది శూన్యమే. దీంతో ప్రభుత్వం అందజేసే రైతుబంధు సొమ్ము బ్యాంకులకు వరంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి. అయితే ఎంతమంది రైతుల నుంచి పెట్టుబడి సొమ్మును బ్యాంకులు అప్పులుగా వసూలు చేశాయన్న వివరాలు తమకు అందలేదని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. 15 లక్షల మంది రైతులు.. రూ.1,700 కోట్లు జమ.. ఖరీఫ్లో 52 లక్షల మంది రైతులకు రూ. 5,100 కోట్ల వరకు రైతుబంధు కింద ప్రభుత్వం మొదటిసారి పంపిణీ చేసింది. ఇంకా అనేకమంది ఎన్ఆర్ఐలకు, ఇతరులకు పెట్టుబడి చెక్కులు ఇవ్వాల్సి ఉండగా, వివిధ కారణాలతో అవి నిలిచిపోయాయి. ఇక రబీ సీజన్ కోసం పెట్టుబడి చెక్కులను వ్యవసాయశాఖ వర్గాలు ముద్రించాయి. అయితే ఎన్నికల కమిషన్ చెక్కుల పంపిణీ చేపట్టొద్దని, రైతు ఖాతాల్లోకే బదిలీ చేయాలని సూచించడంతో ఆ ప్రకారమే రైతుబంధును అమలు చేస్తున్నారు. సోమవారం నాటికి 15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,700 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి చెప్పారు. ఇంకా మిగిలిన రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. వారికి కూడా పెట్టుబడి సొమ్ము జమ చేయనున్నారు. అయితే అప్పుల కింద పెట్టుబడి సొమ్ము బ్యాంకులు జమ చేసుకుంటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పులున్న బ్యాంకు ఖాతాలు కాకుండా ఇతర బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వాలని, ఒకవేళ లేకుంటే కొత్తగా మరో బ్యాంకు ఖాతా తెరవాలని వ్యవసాయ శాఖ రైతులను కోరింది. రైతుబంధు సొమ్మును బ్యాంకులు రైతు అప్పుల కింద జమ చేసుకుంటుండటంపై అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే బ్యాంకులు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టడమేంటని మండిపడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోతున్నారు. ఎన్ఆర్ఐల ఖాతాల్లో ఖరీఫ్ చెక్కుల జమకు సన్నాహాలు ఇదిలాఉండగా ఇక్కడ భూమి కలిగి విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలకు ఖరీఫ్లో చెక్కుల పంపిణీ జరగలేదు. ఎట్టకేలకు వారి అనుమతి మేరకు ఇక్కడి వారి కుటుంబ సభ్యులకు చెక్కులు ఇచ్చేలా సర్కారు ఆదేశాలు జారీచేసింది. అయితే ఎన్నికల సీజన్ మొదలు కావడంతో చెక్కుల పంపిణీని ఎన్నికల కమిషన్ నిలిపివేయడంతో ఎన్ఆర్ఐ చెక్కుల పంపిణీకి కూడా బ్రేక్ పడింది. అయితే ఆ చెక్కుల సొమ్మును సంబంధిత ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఏ బ్యాంకు ఖాతాలో వేయాలో ఎన్ఆర్ఐలు తెలియజేస్తే ఆ ప్రకారం చేస్తామని వెల్లడించాయి. మొత్తం 63 వేల మంది ఎన్ఆర్ఐల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కానీ సమాచారం లేకపోవడంతో ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోకి రైతుబంధు సొమ్మును బదిలీ చేయలేదని అధికారులు తెలిపారు. -
ప్ర'గతులు'
- ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు - వేలాదిగా పింఛన్దారుల తొలగింపుపై విమర్శలు - కొండపిలో ‘జన్మభూమి -మా ఊరు’ లాంఛన ప్రారంభం నేడు శంకర్రావు వయస్సు 70 ఏళ్లు. రేషన్ కార్డులో తక్కువ వయస్సు నమోదైందని అతను ప్రభుత్వ పింఛన్ తీసుకోవడానికి అనర్హుడట. వయస్సు ధ్రువీకరణకు వైద్యుల దగ్గరకెళితే..మేమెలా నిర్ధారిస్తామని చెప్పి పంపారు. గత నాలుగేళ్లుగా ఠంచనుగా పింఛన్ పొందినా ప్రస్తుత సర్కారు వేసిన అనర్హత వేటుతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. శ్రీనివాసరావు ‘సదరమ్’ శిబిరంలో వికలాంగుడిగా అన్ని పరీక్షలు చేయించుకుని నాలుగేళ్లుగా ధ్రువీకరణ పత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. సర్వే అధికారులు వచ్చినప్పుడు వికలాంగ ధ్రువీకరణ పత్రం లేదంటూ అతన్ని ప్రభుత్వ పింఛన్పొందేందుకు అనర్హుడిగా ప్రకటించారు. సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక లేక అతను ఆశలొదిలేసుకున్నాడు. సావిత్రమ్మ భర్త చనిపోయి ఏళ్లు గడిచాయి. అప్పట్లో తహశీల్దార్, గ్రామసర్పంచి పంచనామా జరిపి మరణ ధ్రువీకరణ పత్ర మిచ్చారు. ఇప్పుడేమో అది పనికిరాదంటూ ... వితంతు పింఛన్ తీసుకోవడానికి అనర్హురాలిగా సావిత్రమ్మ పేరును జాబితాలో నుంచి తొలగించారు. కొత్తగా ఆర్డీవో కార్యాలయం ద్వారా ధ్రువీకరణ తెచ్చుకోవాలట. ఇప్పటికప్పుడు సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే, ఖర్చు రూ.వేలల్లో భరించాల్సి రావడంతో ఆర్థికస్థోమత లేని ఆమె మౌనంగా ఉంది. సాక్షి, ఒంగోలు: గాంధీ జయంతి రోజునే ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల సర్వే పూర్తయింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.500 తీసుకునే పింఛన్దారులు ఇకనుంచి నెలనెలా రూ.1000 నుంచి రూ.1500 వరకు అర్హతను బట్టి లబ్ధిపొందనున్నారు. ఇందుకోసం గత కొద్దిరోజులుగా జిల్లాలో అధికారులు, ప్రత్యేకంగా నియమించిన సర్వే కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హుల పేర్లను తొలగించి.. అర్హుల జాబితాను తయారు చేశాయి. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత తదితర పింఛన్లు పొందుతున్న వారు ఇప్పటివరకు 3.12 లక్షల మంది ఉన్నారు. వీరిలో 34 వేల మందికిపైగా పేర్లను అనర్హుల జాబితాలోకి చేర్చారు. మరో రెండు వేల మంది ధ్రువపత్రాలకు సంబంధించి పరిశీలన ప్ర‘గతులు' కొనసాగుతోంది. కమిటీల్లో అధికారపార్టీ నేతలుండటంతో ఇష్టానుసారంగా అర్హులను తొలగించి.. తమ కార్యకర్తలు, అనుచరులకు లబ్ధిచేకూర్చడానికే పనిచేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగించిన జాబితాలో సుమారు 20 వేల మందికిపైగా పింఛన్దారులకు ఆధార్కార్డుల్లేవని తొలగించగా, మరికొందరికి వయస్సు తక్కువని, కొందరు వితంతువులు, వికలాంగులు కాదని, చేనేత కార్మికులే కాదంటూ తమకు నచ్చని పేర్లను తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే పరిధిలోని అత్యధిక గ్రామాల్లో కొందరిపై పనిగట్టుకుని కక్షపూరితంగా తొలగించారంటూ.. నిరుపేద (బీపీఎల్) కేటగిరీ కాదని, మరికొందరు గ్రామంలో ఉండకుండా వెళ్లిపోయారంటూ .. ఇలా రకరకాల కారణాలతో పింఛన్దారులను అర్హులజాబితాలో నుంచి తొలగించారు. సుజలం ఎలా..? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి ఆరంభంలోనే అవరోధాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కనీసం, ఐదువేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రజలకు రూ.2కే 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని అందించాలని భావించారు. ఇప్పటికే పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క ప్లాంటుకు రూ.2 లక్షల (వెయ్యిలోపు జనాభా) నుంచి రూ.4 లక్షలు (మూడువేల లోపు జనాభా) వరకు ఖర్చవుతోందని అంచనా వేశారు. జిల్లాలో వెయ్యికి పైగా గ్రామాలుండగా, వీటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్స్) ఉన్నాయి. ఇందుకుగాను 818 ఆర్వోప్లాంట్లు పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపారు. దాతలెవరూ ముందుకురాకపోవడం, కొన్ని రాజకీయ సమస్యల నేపథ్యంలో తొలిదశ లో మండలానికొకటి చొప్పున 56 ఆర్వోప్లాంట్లు అమల్లోకి తెస్తున్నట్లు జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. ఈ పథకానికి ఎలాంటి నిధులు విదల్చని ప్రభుత్వం ..దాతలను సమీకరించి ప్లాంట్లను ఏర్పాటుచేయాలని రెండ్నెల్లకిందట స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అప్పట్నుంచి విడతలవారీగా జిల్లాలోని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర దాతలతో జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు, కలెక్టర్ జేఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్నిసార్లు సమీక్షించినా.. సమావేశాలు పెట్టినా.. వారినుంచి అనుకున్నంత స్పందన రాలేదు. అక్టోబర్ రెండు నాటికి జిల్లాలో 56 ప్లాంట్లు అమల్లోకి తేవాలని అనుకున్నా... అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక్క కొండెపి నియోజకవర్గంలో 9 ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కాగా .. ఆ నియోజకవర్గంలోని అనకర్లపూడి గ్రామంలోని ప్లాంటును మంత్రి సిద్ధా రాఘరావు గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నిధులివ్వని ‘జన్మభూమి - మా ఊరు’ రోజుకో గ్రామంలో ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో గురువారం నుంచి ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యేకంగా పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఎ. కరికాలవలన్ను నియమించింది. మండలంలో 14 గ్రామాలుంటే ఒక బృందం, 25 గ్రామాలుంటే రెండు, అంతకు మించితే మూడు బృందాలుగా అధికారులను ఇప్పటికే విభజించారు. ఒంగోలు నగరంలో రోజుకు నాలుగుచోట్ల, చీరాల, మార్కాపురం, కందుకూరుల్లో రోజుకు మూడుచోట్ల సభలకు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి ఎంపీడీవో, తహశీల్దార్, కమిషనర్, ఇతర అధికారులు నేతృత్వం వహిస్తారు. బ్యానర్లు, ప్రదర్శనలు, అవగాహన సదస్సులతో ప్రచారం కల్పించాలి. పింఛన్ల పంపిణీతో పాటు ప్రజల సమస్యలకు తక్షణపరిష్కారాలు చూపేందుకు అధికారులు పనిచేయాలి. అయితే, జిల్లాకు ప్రత్యేక నిధులు విడుదల కాకుండా అభివృద్ధిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది అధికారుల అంతర్మథనం. జిల్లాకోరోజు పర్యటిస్తానని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు .. ‘ప్రకాశం’ పర్యటనలో రెండు నియోజకవర్గాలు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement