-
రేపొక్క రోజే ఏడు రోజులు
ఇండిపెండెన్స్ డే.. రిపబ్లిక్ డే...దేశం ఇంకా ఏదైనా సాధిస్తే ఆ డే..ఇవీ మనకు దినోత్సవాలు.తిథుల్ని బట్టి పండుగలూ ఉంటాయి.‘థీమ్’ పాటింపు ‘డే’లు.. కొత్తవి.మంచి ఎక్కడున్నా తీసుకోవలసిందే.రేపొక్క రోజే ఏడు ‘డే’ లున్నాయి.‘డూమ్స్డే’ అని కూడా అంటున్నారు.దాన్నొదిలేసిమిగతా ‘డే’లను స్వాగతిద్దాం యోగా డే (ఒక్క ఆసనమైనా నేర్చుకుందాం) భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనపై ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినం’గా గుర్తించింది. 2015 నుంచి యోగా డేను జరుపుకుంటున్నాం. ఈ రోజును సూచించినది కూడా మోదీనే. ఏడాది మొత్తం మీద పగటిపూట ఎక్కువగా ఉండే జూన్ 20–21–22.. ఈ మూడు రోజుల మధ్య రోజైన 21న యోగా డేకి మోదీ ఎంపిక చేశారు. మ్యూజిక్ డే (ఒక మంచి పాట విందాం) వరల్డ్ మ్యూజిక్ డే తొలిసారి పారిస్లో 1982 జూన్ 21న జరిగింది. ఆ తర్వాతి నుంచి ఇండియా సహా 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఔత్సాహిక, ఉద్ధండ సంగీతకారులను సత్కరించుకోవడం ఈ డే ఉద్దేశం. ఫ్రెంచి సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్, ఫ్రెంచి సంగీతకారుడు ఫ్లు హెమోవిస్ కలిసి మ్యూజిక్ డే నెలకొల్పారు. వరల్డ్ హ్యూమనిస్డ్ డే (సాటి మనిషికి చేయూతనిద్దాం) హ్యూమనిస్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ ‘వరల్డ్ హ్యూమనిస్డ్ డే’ ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే తాత్విక భావనను వ్యాప్తి చేయడానికి ప్రపంచ దేశాలలోని అనేక మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో హ్యూమనిస్ట్ డే ఆవిర్భవించింది. 1980ల నుంచి ఒక పరిణామక్రమంలో ఈ ‘డే’ జరుగుతూ వచ్చిందే కానీ, కచ్చితంగా ఫలానా సంవత్సరం నుంచి ప్రారంభం అయిందని చెప్పడానికి తగిన ఆధారాల్లేవు. అయితే జూన్ 21 అందుకు ఫిక్స్ అయింది. హ్యాండ్ షేక్ డే(విశ్వంతోకరచాలనంచేద్దాం) ఇది ఈ ఏడాది గానీ, మరికొన్నేళ పాటు గానీ ఈ ‘డే’ జరిగే అవకాశాలు లేవు. కరోనాతో భౌతిక దూరం తప్పని సరైంది కనుక ఈ ‘వరల్డ్ హ్యాండ్షేక్ డే’ కి తాత్కాలికంగా కాలం చెల్లినట్లే. నిజాకిది చేతులు చేతులు కలిపే హ్యాండ్షేక్ డే గా మొదలవలేదు. సముద్రపు నీళ్లలో చెయ్యి పెట్టి, చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్హ్యాండ్ ఇచ్చినట్లుగా అనుభూతి చెందడంతో ప్రారంభం అయింది. ఇవాన్ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరునికి కలిగిన ఆలోచన నుంచి సముద్రానికి హ్యాండ్షేక్ ఇవ్వడం అనే ఆధ్యాత్మిక భావన అంకురించిందని అంటారు. ఏటా జూన్ 21న ఈ డే ని జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే (నాన్న దీవెనలు కోరుకుందాం) తేదీ ఏదైనా గానీ మదర్స్ డే మే రెండో ఆదివారం వస్తే, ఫాదర్స్ డే జూన్ మూడో ఆదివారం వస్తుంది. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 21న వచ్చింది. కుటుంబం పాటు పడుతుండే తండ్రిని గౌరవించుకోవడం కోసం ప్రపంచం ఆయనకొక రోజును కేటాయించింది. జూన్ మూడో వారమే ఫాదర్స్ డే ఎందుకు? ఆ ‘డే’న గుర్తిస్తూ ప్రభుత్వ సంతకాలు అయిన రోజది. మదర్స్ డే కూడా అంతే. హైడ్రోగ్రఫీ డే (నీటికి నమస్కరిద్దాం) హైడ్రోగ్రఫీ అంటే జల వనరుల భౌతిక స్వరూపాల, కొలమానాల విజ్ఞాన శాస్త్రం. నదులు, సముద్రాలు, మహా సముద్రాలు, సరస్సులు, ఇతర జలాశయాలను అన్ని రంగాల ఆర్థికాభివృద్ధికి హైడ్రోగ్రఫీ తోడ్పడుతుంది. ‘ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫిక్ ఆర్గనైజేషన్’ ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో 2005 నుంచి జూన్ 21న ‘వరల్డ్ హైడ్రాలజీ డే’ ని నిర్వహిస్తోంది. టీ షర్ట్ డే (ట్రెండేమిటో తెలుసుకుందాం) సాధారణంగా ‘డే’లన్నీ యు.ఎస్. నుంచి ప్రపంచానికి విస్తరిస్తాయి. టీ షర్ట్ డే మాత్రం జర్మనీలో మొదలైంది. తొలిసారి బెర్లిన్లో 2008లో ఇంటర్నేషనల్ టీ షర్ట్ డే జరిగింది. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్ డేని ఏర్పరిచారు తప్ప ఇందులో సంఘహితం ఏమీలేదు. అయితే వ్యక్తి సౌలభ్యం ఉంది. ధరించడానికి సులువుగా ఉండటం, ఒక స్టెయిల్ స్టేట్మెంట్ అవడంతో యూత్ ఎక్కువగా ఈ ‘డే’ని ఫాలో అవుతుంటారు. ఫాలో అవడమే సెలబ్రేషన్. జూన్ 21న దీనినొక ఉత్సవంలా కొన్నిదేశాలలో నిర్వహిస్తారు. -
కరచాలనం చేస్తున్నారా.. జాగ్రత్త
సాక్షి, సిరిసిల్ల : మనం ఆదమరిస్తే అప్రమత్తం చేసేలా ఓ సెన్సర్ స్మార్ట్ వాచ్ను రూపొందించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థిని. కరోనా వైరస్ కట్టడి కోసం కరచాలనం చేయొద్దని, చేతితో కళ్లను, నోటిని, ముక్కును ముట్టుకోవద్దని వైద్యులు చెపుతున్న విషయం తెలిసిందే. అయితే అలవాటులో పొరపాటులా చెయ్యి ముఖాన్ని తాకుతూనే ఉంటుంది. ఇలాంటి అలవాటును దూరం చేసే లక్ష్యంతో సెన్సర్ స్మార్ట్ వాచ్ను తయారు చేసింది బుధవారపు స్నేహ. స్మార్ట్ సెన్సర్ వాచ్ను చూపుతున్న స్నేహ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్న స్నేహ.. ఓ వాచ్ను రూపొందించి, దానికి సెన్సర్ డివైస్ను ఏర్పాటు చేసింది. మనం కరచాలనం చేయబోయినా.. ముక్కు, నోరు, కళ్లను తాకబోయినా వెంటనే ఆ సెన్సర్ గుర్తించి శబ్దం చేస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా స్మార్ట్ వాచ్ హెచ్చరిస్తుంది. తన తండ్రి ప్రోత్సాహంతో ఈ స్మార్ట్ వాచ్ను తయారు చేసినట్లు స్నేహ తెలిపింది. స్నేహ కృషిని జిల్లా అధికారులు సోమవారం అభినందించారు. -
మానవ స్పర్శకు కరోనాతో గండి
వ్యక్తులతో ముఖాముఖిగా కాకుండా వర్చువల్గానే ఎక్కువగా సంభాషిస్తున్న, టెక్నాలజీ ప్రాధాన్యం–సామాజిక అనుసంధానం తెగిపోవడం ప్రాతిపది కన నడుస్తున్న ప్రపంచంలో జీవిస్తున్నాం కనుకే మానవ స్పర్శ అనేది మనిషి జీవితంలో తగ్గుముఖం పడుతోంది. ఒకసారి కరోనా వైరస్ పరిసమాప్తి అయ్యాక, మనకు ఎదురయ్యే పెను సవాల్ మానవ స్పర్శ పట్ల మన ఆలోచనలను పునర్నిర్మించుకోవడం ఎలా అన్నదే. కరోనా వైరస్కి చెందిన భయానకమైన అనుభవం నుంచి వైదొలగడానికి కూడా మనకు ఒక స్పర్శ, ఒక వెచ్చని కౌగిలింత అవసరం కావచ్చేమో మరి. మానవులకు స్పర్శ అనేది విస్తారమైన ప్రయోజనాలను కలిగిస్తుందనడంలో సందేహమే లేదు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా, ప్రజలు అనేక కారణాలతో సామాజికంగా ఇతరులను స్పర్శించడం పట్ల జాగరూకంగా ఉంటూండటం పెరుగుతూ వస్తోంది. తాజాగా ప్రపంచాన్ని కరోనా వైరస్ ముట్టడిస్తుండంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ప్రజలు ఇప్పటికే పరస్పరం చేతులు కలపటాన్ని మానేస్తున్నారు. బ్రిటిష్ రాణి సైతం వైరస్ బారిన పడకుండా ఉండటానికి ముందుజాగ్రత్తగా చేతులకు గ్లోవ్స్ ధరించి కనిపించారు. ఇప్పటికే పరస్పరం చేతులు కలపడాన్ని వీలైనంతవరకు మానేయాలి అనే భావన ప్రపంచంలో ఉనికిలో ఉంది. కరోనా వైరస్ ఈ కరస్పర్శకు సంబంధించి దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగించనుంది. మానవ స్పర్శకు అంత ప్రాధాన్యత ఎందుకు? మనం ఇతరుల పట్ల ఎలా అనుభూతి చెందుతున్నామో స్పర్శ చాటుతుంది. మన మాటల వ్యక్తీకరణను స్పర్శ పెంచుతుంది. ఉదాహరణకు ఇతరులను ఓదార్చుతున్నప్పుడు వారి చేతిని స్పర్శించడం అనేది మనం వారి పట్ల నిజంగా కేర్ తీసుకుంటున్నామని తెలుపుతుంది. తమ జీవితకాలం పొడవునా ప్రజలు భౌతిక స్పర్శ ద్వారా ప్రయోజనం పొందుతూనే ఉంటారు. మనిషికి స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో సంభవించే క్షేమం, సుఖసంతోషాలపై ప్రభావం చూపే స్పర్శ సామర్థ్యానికి సంబంధించి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి కూడా. చిన్నారుల్లో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి మానవ స్పర్శ అనేది ఎంతో కీలకమైంది. ఒత్తిడిని తగ్గించే సంజీవని స్పర్శ సామాజిక స్పర్శకు చెందిన భావోద్వేగ ప్రభావం మన జీవశాస్త్రంలో అంతర్నిహితంగా ఎప్పట్నుంచో కొనసాగుతోంది. స్పర్శ అనేది ఒత్తిడిని తగ్గించే హార్మోన్ అయిన అక్సిటోసిన్ విడుదలను వేగవంతం చేస్తుంది. నిజానికి, మానవులలో ఒత్తిడి స్థాయిలను తగ్గించే శక్తి ఒక్క స్పర్శకు మాత్రమే ఉంది. శస్త్రచికిత్సకు ముందు రోగిని నర్సు ఊరకే అలా స్పర్శిస్తే చాలు.. రోగుల్లో ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుందని మనందరికీ తెలుసు. తాము సమాజం నుంచి వేరుపడ్డామనే అనుభూతిని స్పర్శ తగ్గిస్తుంది. అంతేకాకుండా నర్సింగ్ హోమ్లో గడుపుతున్న వృద్ధులు తీసుకునే ఆహార పరిమాణాన్ని కూడా స్పర్శ పెంచుతుంది. ప్రజల క్షేమానికి, సుఖసంతోషాలకు సామాజిక స్పర్శ ఎంత అవసరమైనదో తెలుస్తోంది కనుక, ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్పర్శకు అత్యంత ప్రధానమైన పాత్ర ఉందని అర్థం చేసుకోవాలి. సామాజిక స్పర్శ తగ్గుముఖం గత కొన్ని దశాబ్దాల్లో సామాజిక స్పర్శ అనేది తగ్గుముఖం పడుతోంది. వ్యక్తులతో ముఖాముఖిగా కాకుండా వర్చువల్గానే ఎక్కువగా సంభాషిస్తున్న టెక్నాలజీ ప్రాధాన్యం, సామాజిక అనుసంధానం తెగిపోవడం ప్రాతిపదికన నడుస్తున్న ప్రపంచంలో జీవిస్తున్నాం కనుకే మానవ స్పర్శ మనిషి జీవితంలో తగ్గుముఖం పడుతోంది. అంటే గతంలోకంటే ఇప్పుడు మనం చాలా తక్కువగా మాత్రమే పరస్పరం స్పర్శించుకుంటున్నామని దీనర్థం. అయితే మనుషుల మధ్య స్పర్శ తగ్గుముఖం పట్టడానికి ప్రధానంగా అసభ్య స్పర్శ ప్రభావానికి గురికావలసి వస్తుందన్న భయమే కారణం. కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు కరోనా వైరస్ విస్తరణతో ఎదుటివారిని స్పర్శించాలంటేనే ప్రజలు భీతిల్లుతున్నారు. అలా తాకడం ద్వారా అప్పటికే వైరస్ సోకిన వ్యక్తులనుంచి తమకూ వైరస్ సోకుతుందన్న భయం ఎక్కువవుతోంది. అంటే ఎదుటివారందరూ వైరస్ వాహకాలే అని భావించడం మరింత భయపెడుతోంది. కరోనా వైరస్ తారస్థాయిలో చెలరేగుతున్నందున ఇతరులను స్పర్శించడం పట్ల జాగ్రత్తగా ఉంటూనే వైరస్ మితిమీరిపోకుండా తగిన చర్యలన్నీ తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలు వైరస్ గురించి తీవ్రమైన ఆందోళనలతో గడుపుతున్నందువల్ల అలాంటివారిని స్పర్శద్వారా పరామర్శిస్తే ఆ ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మనుషులు తోటి మనుషులకు దూరంగా మెలగడం దీర్ఘకాలంపాటు కొనసాగితే సామాజిక స్పర్శకు, దానిపట్ల ప్రతికూల వైఖరికి మధ్య ఒకరకమైన సహసంబంధం నెలకొనే ప్రమాదం కూడా ఉంటుంది. కొంతకాలానికి ప్రజలు వైరస్ గురించి మర్చిపోవచ్చు కానీ సామాజిక స్పర్శ పట్ల వారి భయం అలాగే కొనసాగవచ్చు. తామెం దుకు అలా దూరదూరంగా ఉంటున్నామో వారికి బహుశా తెలీకపోవచ్చు కూడా. ఎందుకంటే ప్రజల మధ్య సానుకూల సంబంధాల కంటే ప్రతికూల సంబంధాలే ఎక్కువగా మనుషుల జ్ఞాపకాలను ప్రభావితం చేయవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పర్శ అవసరం అయితే వైరస్ ప్రబలిపోయిన సమయంలో ప్రజలు పరస్పరం స్పర్శిం చుకోవడం మంచిది కాదు. ప్రత్యేకించి వృద్ధులు, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని వారితో స్పర్శకు దూరంగానే ఉండాలి. అయితే మన చేతులను మనం పదే పదే శుభ్రపర్చుకుంటున్నంతకాలం మనకు ప్రియమైన వారితో భౌతిక స్పర్శను కొనసాగిస్తూనే ఉండవచ్చు. కరోనా వైరస్ వంటి ప్రతికూల జీవన ఘటనలు దీర్ఘకాలంలో అవాంఛనీయమైన రీతిలో సామాజిక స్పర్శపై, వ్యక్తుల మధ్య పరామర్శలపై ప్రతి కూల ప్రభావం చూపవచ్చు. ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ ప్రతికూల ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండటమే. ప్రతికూల పరిస్థితుల్లోనూ మనుషుల మధ్య స్పర్శ ప్రాధాన్యతను గుర్తించకపోయినట్లయితే అది మానవ స్పర్శపట్లే ప్రతికూల జ్ఞాపకాలను పెంచే ప్రమాదం ఎంతైనా ఉంది. ఒకసారి కరోనా వైరస్ పరిసమాప్తి అయ్యాక, మనకు ఎదురయ్యే పెనుసవాల్ మానవ స్పర్శ పట్ల మన ఆలోచనలను పునర్నిర్మించుకోవడం ఎలా అన్నదే. కరోనా వైరస్కి చెందిన భయానకమైన అనుభవం నుంచి వైదొలగడానికి కూడా మనకు ఒక స్పర్శ, ఒక వెచ్చని కౌగిలింత అవసరం కావచ్చేమో మరి. సాహిత్య చరిత్ర మనకు నేర్పే పాఠం ప్రాచీన కాలంలో హోమర్ నుంచి ఆధునిక కాలంలో స్టీఫెన్ కింగ్ దాకా పాశ్చాత్య సాహిత్య చరిత్రలో సాంక్రమిక వ్యాధుల గురించి అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. మానవులు ప్రజారోగ్యం సంక్షోభంలో పడినప్పుడు ఎలా స్పందించారో, కెథార్సిస్ రూపంలో తమ తీవ్రమైన భావోద్వేగాలను ఎలా ప్రకటించారో, రాజకీయంగా ఎలా వ్యాఖ్యానించారో ఈ కథనాలు చాటి చెబుతూ వచ్చాయి. కోవిడ్ 19 సాంక్రమిక వ్యాధి పట్ల మన స్పందనలను కూర్చడంలో సాహిత్యానికి కీలకపాత్ర ఉంది. కరోనా వైరస్ చుట్టూ అలుముకుంటున్న జాత్యహంకారం, జాతి ఉన్మాదం, వివక్షలను మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా సాహిత్యమే మనకు దారి చూపుతుంది. ప్రాచీన కావ్యాల నుంచి ఆధునిక నవలల వరకు సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన అధ్యయనం అనిశ్చితపరిస్థితుల్లో తర్వాత ఏం జరుగుతుందో మార్గదర్శినిగా మనకు దారి చూపుతుంది. హోమర్ రాసిన ప్రామాణిక కావ్యం ఇలి యడ్.. ట్రాయ్ వద్ద విడిది చేసిన గ్రీక్ సైనిక శిబిరాల్లో చెలరేగిన ప్లేగ్ వ్యాధి గురించిన వర్ణనతో మొదలవుతుంది. క్రిసీస్ జాతీయులను బానిసలుగా చేసుకున్న గ్రీకులను శిక్షించడానికే ప్లేగ్ విరుచుకుపడిం దని ఆ కావ్యంలో పాత్రలు చెబుతాయి. గ్రీకుల దుష్ట ప్రవర్తన ఫలితంగానే ప్లేగ్ మహమ్మారి వారిపై విరుచుకుపడిందనే నైతిక చర్చను ఇలియడ్ లోని పాత్రలు ప్రదర్శించాయి. అలాగే క్రీ.శ. 1353లో గివోవన్నీ బొకాసియో రాసినది డెకమెరోన్, రచనలో కూడా బ్లాక్ డెత్ సంక్షోభ సమయంలో రెండువారాలపాటు ఏకాంతంగా గడిపిన పాత్రలు నీతి, ప్రేమ, లైంగిక రాజకీయాలు, వాణిజ్యం, అధికారం వంటి అంశాలపై చర్చించాయి. సాంక్రమిక వ్యాధుల కారణంగా స్తంభించిపోయిన సాధారణ జీవితాలను పునర్నిర్మించుకోవడంపై సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో పలు రచనలు ఎత్తిచూపాయి. 20వ శతాబ్దంలో ఆల్బర్ట్ కాము రాసిన ‘ది ప్లేగ్’ (1942) స్టీఫెన్ కింగ్ రాసిన ‘ది స్టాండ్’ (1978) సాంక్రమిక వ్యాధులు చెలరేగిన సమయంలో సమాజంలో వాటి ప్రభావాలపై దృష్టి పెట్టాయి. సామూహిక ఏకాంతవాసం, ప్రభుత్వాల వైఫల్యాల నేపథ్యంలో సాంక్రమిక వ్యాధిని నివారించడం లేక భయాందోళనలను తగ్గించడంపై ఈ రెండు రచనలూ చర్చించాయి. ప్రత్యేకించి కామూ నవల ప్లేగ్ చెలరేగిన సమయంలో మానవ సంబంధాలు, పౌరుల మధ్య పరామర్శల పట్ల జాగరూకత గురించి వర్ణించింది. కోవిడ్ 10 వైరస్ కూడా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలను ప్రకంపింప చేస్తూనే గతంలో ఇలాంటి సందర్బాల్లోనే తలెత్తిన సంక్షోభాలను ప్రాచీనులు ఎలా ఎదుర్కొన్నారు అనే చర్చకు దారి తీయడం విశేషం. వ్యాసకర్త: కేథరీన్ జాన్సన్, రీడర్, కన్సూమర్ సైకాలజీ, అంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (బ్రిటన్) -
నో షేక్హ్యాండ్.. ఓన్లీ మోచేతి స్పర్శ
-
కరోనా అలర్ట్: ఇక షేక్హ్యాండ్కు బైబై!
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అప్రమత్తతే సరైన విరుగుడు అని వైద్యులు, పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్యే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. కరచాలనం, ముద్దు పెట్టుకోవడం చేయొద్దంటున్నారు. ఈనేపథ్యంలో చాలామంది షేక్హ్యాండ్కు ప్రత్యామ్నాయంగా ఒకరికొకరు మోచేతులతో హలో చెప్పుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్ర గవర్నర్ పీట్ రికెట్స్ కూడా అదే చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ వద్ద ఆయన కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు మోచేతులతో హలో చెప్పారు. ఈ వీడియో వైరల్ అయింది. (చదవండి: వ్యక్తిగత శుభ్రత పాటించండి: హీరో యశ్) ఇదిలాఉండగా.. నాలుగు రోజుల క్రితం జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఎదురైన వింత అనుభవం కూడా కరోనా నేపథ్యంలో షేక్హ్యాండ్కు దూరంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేసింది. తన కార్యాలయానికి వచ్చిన ఛాన్సలర్ సహచర మంత్రి ఒకరితో చేయి కలపబోగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో మెర్కెల్ ‘మీది మంచి నిర్ణయం’అని చెప్పి మెచ్చుకున్నారు. ఇక చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన కరోనా వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. భారత్లోనూ కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. (చదవండి: ప్రపంచం మొత్తం ‘నమస్తే’ పెడుతోంది : మోదీ) (చదవండి: కరోనా: జియో, బీఎస్ఎన్ఎల్ సందేశం విన్నారా?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement