-
ఆర్మీ యూనిఫాంలో ఏడుగురు ఉగ్రవాదులు?
దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయం, మెట్రో స్టేషన్లన్నింటినీ ఒక్కసారిగా అప్రమత్తం చేశారు. ఏడుగురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, వాళ్లు మన ఆర్మీలోని సుబేదార్, కెప్టెన్ ర్యాంకుల వాళ్లు ధరించే యూనిఫాంలు సంపాదించారని నిఘావిభాగం నుంచి ఎలర్ట్ రావడంతో వీటిలో భద్రతను పెంచారు. చక్రి, గుర్దాస్పూర్ బోర్డర్ పోస్టులకు సమీపంలో ఏడుగురు ఉగ్రవాదులు కనిపించారని, వాళ్లంతా ఆర్మీ యూనిఫాంలు కూడా సంపాదించారని అమృతసర్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలర్ట్ తెలిపింది. ఢిల్లీ ఎయిర్పోర్టు, మెట్రో స్టేషన్లతో పాటు పంజాబ్లో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో అదనంగా రెండంచెల భద్రతను ఏర్పాటుచేశామని, విమానాశ్రయంలో ఫ్రిస్కింగ్ పెంచామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వాళ్లు క్యూలైన్లలో ఉండగానే ఒకసారి, మెటల్ డిటెక్టర్ దాటి వచ్చిన తర్వాత మరోసారి వాళ్లను చెక్ చేస్తున్నామన్నారు. అయితే, తమ బ్యాగులను రెండేసి సార్లు స్క్రీన్ చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళా ప్రయాణికులను నగలు తీయమంటున్నారని, మరికొన్నిసార్లు ఎంట్రీ గేటు వద్దే బ్యాగులు తెరిచి చూపించమంటున్నారని, చెకిన్ కౌంటర్ల వద్ద కూడా క్యూలైన్లు బాగా పెరిగిపోయాయని రాధా సింగ్ అనే ప్రయాణికురాలు ఆరోపించారు. అయితే, ఉగ్రవాద దాడి జరుగుతుందన్న అనుమానాలు వచ్చినప్పుడు, అందునా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఎలర్ట్ వచ్చినప్పుడు ఈమాత్రం తనిఖీలు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. చివరిగా విమానంలోకి ఎక్కే ముందు కూడా మరోసారి క్షుణ్ణంగా ప్రయాణికులను తనిఖీ చేయాల్సిందిగా విమానయాన సంస్థల సిబ్బందికి చెప్పామన్నారు. ప్రస్తుతం క్యూలైన్లు పెరగడం వల్ల ప్రయాణకులు విమాన సమయం కంటే ముందుగానే రావాల్సిందిగా సూచిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. ఇలా విమానంలో ఎక్కే ముందు కూడా తనిఖీలు అనేవి ప్రమాదం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. ప్రస్తుతం కేవలం అమెరికా వెళ్లే విమానాల్లో మాత్రమే ఈ తరహా తనిఖీలు చేస్తుండగా, ఇకమీదట అన్ని విమానాల్లో చేయనున్నారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్లు
ఏడుగురు ఉగ్రవాదుల హతం ఒక జవాను మృతి శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో వేరు వేరు జిల్లాల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్పీఎఫ్ జవాను చనిపోగా, ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్లోని నౌహట్టాలో జమా మసీదు వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి జరపగా ఒక జవాను మరణించాడు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ దాడులపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఐదుగురు తీవ్రవాదులు హతం... భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడిన ఐదుగురు ఉగ్రవాదులను భారత జవాన్లు హతమార్చారు. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా వద్ద అనుమానాస్పద కదలికల సమాచారం రాగానే బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ప్రమోద్ కుమార్ అనే జవానుకు మెడ భాగంలో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అతడిని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement