-
పుట్టపర్తి వైభవం.. ఖండాంతరం!
పుట్టపర్తి అర్బన్: నాలుగు దశాబ్దాల క్రితం పది పూరి గుడిసెలతో ఉన్న కుగ్రామం నేడు బహుళ అంతస్తులకు కేంద్రీకృతమైంది. ఒకప్పడు రోడ్డు పక్కన కర్ణాటకలోని బాగేపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి వేచి చూసిన జనం.. నేడు కేవలం గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా విమానంలో చేరుకునేలా ఏర్పాటైన విమానాశ్రయాన్ని చూస్తున్నారు. కుగ్రామం నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగిన పుట్టపర్తి ప్రస్థానంపై సత్యసాయి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి.. పుట్టపర్తి ఆవిర్భావం వెనుక పురాణ కథను స్థానికులు నేటికీ గుర్తు చేస్తుంటారు. ‘కులాలు, వర్ణాల వారీగా కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, కర్ణాటక నుంచి వచ్చి చిత్రావతి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతంలో పది ఇళ్లు మాత్రమే ఉండేవి. గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి గొల్లపల్లి అని పిలుచుకునేవారు. జీవనం కోసం ఎక్కువగా గోవులను పెంచేవారు. ఓ ఆవు పాలు ఇవ్వకుండా మొరాయిస్తుండడంతో దాని యజమాని నిఘా ఉంచాడు. ఓ మధ్యాహ్న సమయంలో ఆవు పుట్ట వద్దకెళ్లి నిల్చోన్నప్పుడు పొదుగు నుంచి పాలు పుట్టలోకి ధారాపాతంగా కారుతుండడం గమనించాడు. ఇది గమనించిన యజమాని బండరాయితో ఆవును కొట్టబోగా అది తప్పించుకుంది. అదే సమయంలో పుట్టలోని నుంచి వెలుపలకు వచ్చిన పాముకు బండరాయి తగిలి చనిపోతూ గొల్లపల్లి పుట్టల మయంగా మారుతుందని, పాడి పశువులు కనుమరుగవుతాయని శపించింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు శాప విమోచనం కోసం పుట్ట ఉన్న ప్రాంతంలో పూజలు నిర్వహించి వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు’. అలా గొల్లపల్లి కాస్త పుట్టపర్తిగా రూపాంతరం చెందింది. సత్యసాయి ఆవిర్భావంతో మహర్దశ.. గొల్లపల్లిలో 1926 నవంబర్ 23వ తేదీన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ.. 1940 అక్టోబర్లో అవతార ప్రకటనతో సత్యసాయిగా మారారు. ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం 1948లో ప్రశాంతి నిలయానికి సత్యసాయి శంకుస్థాపన చేశారు. 1950 నవంబర్ 23 నాటికి ప్రశాంతి నిలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అక్కడే పూర్ణచంద్ర ఆడిటోరియం నిర్మించి అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారు. సత్యసాయిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారాయి. వచ్చే భక్తులకు విడిది, ఇతర సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ పరిధి విస్తరించింది. దీంతో 1964లో పంచాయతీగా పుట్టపర్తి మారింది. అనంతరం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ 1980 నవంబర్లో సత్యసాయి తాలూకాను ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధి కోసం 1981లో డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించారు. 1984లో నిర్మాణ పనులు చేపట్టి 1991లో అన్ని రకాల సదుపాయాలతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1990లో ఆర్టీసీ బస్టాండ్, 1991 నవంబర్లో సత్యసాయి విమానాశ్రయం, 2000 నవంబర్లో ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. 1995 జూలైలో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించి అప్పట్లో 771 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేశారు. 1995 జూలైలో సాయికుల్వంత్ మంటపాన్ని నిర్మించారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పంచాయతీని 1980లో సమితిగాను, 2006 ఆగస్టులో మేజర్ పంచాయతీగా, 2011 ఆగస్టులో నగర పంచాయతీగా, 1991లో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్(పుడా)గా అనంతరం 2009లో అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. (చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష) -
మహా సమాధి దర్శనానికే భక్తులకు అనుమతి
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధి దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా గురువారం నుంచి సాయికుల్వంత్ మందిరంలో భజనలు, సంగీత కచేరీ, వేద పఠనం పూర్తిగా నిలిపేస్తున్నట్టు చెప్పారు. అయితే మంగళహారతి అనంతరం ఉదయం 9.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటల తర్వాత భౌతిక దూరం పాటిస్తూ క్యూలో వెళ్లి మహాసమాధిని దర్శించుకుని బయటకు వెళ్లిపోవాలని తెలిపారు. భక్తులంతా విధిగా మాస్క్లు ధరించాలని, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని రత్నాకర్ సూచించారు. -
సత్యసాయి సమాధిని దర్శించుకున్న గవర్నర్
సాక్షి, పుట్టపుర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ అశోక్ కుమార్, ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సాయి దర్శనం అనంతరం ట్రస్ట్ సేవల గురించి ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. అనంతరం నరసింహన్ బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు. -
సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత బాబాదే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మన రొట్టె మనమే తినడం ప్రకృతి, పక్కవాని నుంచి దొంగిలించి తినడం వికృతి, మన రొట్టెను పక్కనున్న వానికి పెట్టడం సంస్కృతి. ఇది భారతీయ సంస్కృతిలోని గొప్పదనం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత సత్యసాయి బాబాది’ అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. బాబా సమాధికి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, భక్తులనుద్దేశించి ప్రసంగించారు. తాను మొదట అద్వానీతో కలిసి పుట్టపర్తికి వచ్చానని, అద్వానీ నన్ను పరిచయం చేయబోతే బాబా.. ‘వెంకయ్యనాయుడు నాకు తెలుసు. ఆరోగ్యం ఎలా ఉంది?’ అని అడిగారని గుర్తు చేశారు. నిజానికి నాకు ఆరోగ్యం బాగాలేని సంగతి బాబాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయానన్నారు. ‘గాడ్బ్లెస్ యూ’ అని దీవించారన్నారు. భారతీయ పురాణాలు, సంస్కృతి, చరిత్ర ‘మానవ సేవే మాధవ సేవ’ అని చెబుతుందని, దాన్ని బాబా ఆచరించి ప్రపంచాన్ని మొత్తం చైతన్యం చేశారన్నారు. ఈ రోజు బాబా చూపిన మార్గంలో సత్యసాయి ట్రస్టు పయనిస్తోందన్నారు. మంచినీరు, విద్య, వైద్యసేవల్లో ట్రస్టు సేవలు ఎనలేనివని కొనియాడారు. బాబాను పూజించడమంటే చిత్రపటాలకు పూలమాల వేయడం, నమస్కరించడం కాదని.. బాబా చూపిన సేవామార్గంలో నడిచినప్పుడే ఆయన్ను పూజించినట్లని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమ, సేవ రెండూ ఉంటే శాంతి ఉంటుందన్నారు. ‘సర్వధర్మ సమభావన’ అనేది పుట్టపర్తిలో ఉందని, ఇది విశ్వవ్యాప్తంగా కావాలని కాంక్షించారు. కొంతమంది రాజకీయ నేతలు సెక్యులరిజమ్ అని గొప్పగా చెబుతుంటారని, భారతదేశంలోని ప్రతి ఒక్కరి డీఎన్ఏలో సెక్యులరిజమ్ ఉంటుందన్నారు. భావితరాలకు సత్యసాయి బోధనలు.. సత్యసాయి అవతార విశేషాలు, బోధనలు, సందేశాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సత్యసాయి ఆర్కీవ్స్ భవనాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. -
పుట్టపర్తిలో ప్రపంచ వేద సమ్మేళనం
సాక్షి, అనంతపురం: పుట్టపర్తిలో సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ వేద సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేద పండితులు, దేశవిదేశాల నుంచి సత్య సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. వేదాలపై పరిశోధనలు జరిపి ప్రజలను పీడిస్తున్న సమస్యలను ఏవిధంగా పరిష్కరించవచ్చనే దానిపై కూలంకషంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 వేల మంది సత్యసాయి శిష్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో ఉన్న 600 మంది ప్రియ శిష్యులు సామూహిక వేద పారాయణం చేయనున్నారు. రెండవ రోజు రుద్ర తత్వం-ఏకత్వం అనే నాటికను తమిళనాడుకు చెందిన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement