-
చీరను వండింది
టెక్నాలజీ ఎంతవేగంగా ఎదుగుతోందో మనిషిలోని సృజనాత్మకత అంతే వేగంగా విభిన్న కోణాల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. క్రియేటివిటీకి హద్దులు లేకపోవడంతో అనేక రంగాల్లో చిత్రవిచిత్ర ఆలోచనలకు రూపురేఖలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అగ్గిపెట్టెలో పట్టగలిగే చీరలు, బంగారంతో నేసిన చీరలను తయారు చేయడం గురించి విన్నాం. తాజాగా కేరళకు చెందిన మహిళా బేకర్ నమిలి మింగేయగల సరికొత్త చీరను రూపొందించింది. మహిళలు ధరించే పరిమాణం, ఆకర్షణీయమైన డిజైన్తో కేరళ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చీర ఉండడం విశేషం. కేరళలోని కొల్లంకు చెందిన అన్నా ఎలిజబెత్ జార్జ్... క్యాన్సర్ అండ్ న్యూరోబయాలజీలో పీహెచ్డీ చేస్తోంది. ఒక పక్క చదువుతూనే మరోపక్క తన కిష్టమైన కుకింగ్లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇటీవల ముగిసిన ఓనం వేడుకల్లో సరికొత్తగా ఏదైనా తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే మలయాళీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, కేరళలో జరిగే ప్రతి సంప్రదాయ కార్యక్రమానికి తప్పసరిగా కట్టుకునే ‘కేరళ కసువ చీర’ను సరికొత్తగా రూపొందించింది. తెల్లని రంగు, గోల్డెన్ జరీ అంచుతో ఉండే కసువా చీరను బంగాళ దుంప గుజ్జుతో చేసిన పొడి, బియ్యప్పిండిని ఉపయోగించి చీరను తయారు చేసింది. అన్నా.. వంటలు చేయడమేగాక ఫ్యాషన్ డిజైనర్గా, ఫ్లోరిస్ట్ గా రాణిస్తుండడంతో, తన సృజనాత్మకతను కొంత జోడించి... దుంపల గుజ్జు నుంచి తీసిన పొడి, బియ్యప్పిండిలని కలిపి అరఠావు పరిమాణంలో పలుచటి పొరను తయారు చేసి వాటిని చీరకు బేస్గా వాడింది. అలా దాదాపు వంద పలుచటి పొరలను వాడి ఐదున్నర మీటర్ల చీరను రూపొందించింది. కేక్ డెకరేషన్స్లో వాడే గోల్డెన్ రంగులను చీర అంచుకు అద్దింది. ముప్పై గంటలపాటు శ్రమించి స్వీట్ చీరను తయారు చేసింది. తియ్యటి చీరకు మొత్తం ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. రెండు కేజీల బరువున్న ఈ చీరను భుజం మీద వేసుకుని, సరదాగా కొంగును కొరుకుతున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యి మాకు ఒకటి చేసివ్వండి అని కామెంట్లు చేస్తున్నారు. తన తాతయ్య జాకబ్ దగ్గర వంటలు నేర్చుకుంది అన్నా. తాతయ్య గుర్తుగా ఆయన పేరుమీద బేకింగ్, ఫ్లోరల్ ప్రాజెక్టులను చేస్తోంది.‡‘‘జీవితంలో తొలిసారి ఇంత ఖర్చు పెట్టి తియ్యటి చీరను తయారు చేసాను. ఓనంకు ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న ఉద్దేశ్యం తోనే ఈ చీరను తయారు చేసాను. కణజీవ శాస్త్రం (సెల్ బయాలజీ) పరిశోధకురాలిగా సరికొత్తగా చేయాలన్న ఉద్దేశ్యంతో సెల్ బయాలజీని నా బేకింగ్ స్కిల్స్ యాడ్ చేసి ప్రపంచంలోనే తొలిసారి కట్టుకుని కొరుక్కు తినగల చీరను తయారు చేశాను’’ అని అన్నా చెప్పింది. -
ఆ 40 మందికి ఎలా సోకింది?
న్యూఢిల్లీ: వారు విదేశాలు వెళ్లిన దాఖలాలు లేవు.. చుట్టాలు పక్కాలు, ఇరుగు పొరుగు వారెవరూ విదేశాల నుంచి రాలేదు.. ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందితోనూ సంబంధాలు లేవు..లేబొరేటరీల్లోనూ పని చేయలేదు..అయినా సరే 40 మందికి కరోనా సోకింది. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది..ఎందుకిలా?? ఇప్పుడిదే కేంద్రానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్లో కరోనా వ్యాప్తిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో (ఎస్ఏఆర్ఐ) బాధపడుతున్న వారిలో ఎంపిక చేసిన 5,911 మందికి ఐసీఎంఆర్ కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. వారిలో 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 40 మందికి వ్యాధిగ్రస్తులెవరితోనూ నేరుగా సంబంధాలు లేకపోవడం, విదేశాల నుంచి వచ్చిన చరిత్ర లేకపోవడం ప్రభుత్వానికి షాక్ కలిగించింది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 52 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు తాజాగా ఐసీఎంఆర్ మెడికల్ జర్నల్లో వెల్లడయ్యాయి. సర్వే నివేదిక ముఖ్యాంశాలు.. ► తీవ్రమైన శ్వాస కోశ సమస్యలతో బాధపడే రోగులకు (ఎస్ఏఆర్ఐ) మార్చి 14 కంటే ముందు కరోనా వైరస్ అసలు సోకలేదు. అదే ఏప్రిల్ 2 వచ్చేసరికి అలాంటి వారిలో 2.6% మందికి కోవిడ్–19 సోకింది. ► 50 ఏళ్లకు పైబడినవారిలోనూ, పురుషులపైనా ఈ వైరస్ పంజా విసురుతోంది. 50–59 ఏళ్ల మధ్య వయస్కుల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► ఎస్ఏఆర్ఐ రోగుల్లో 5,911 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 104 మందికి (1.4%) కరోనా ఉన్నట్టు తేలింది. ► ఈ కరోనా కేసుల్లో 40 మంది విదేశీ ప్రయాణాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధాలు లేకపోయినా వైరస్ సోకింది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో ఇలాంటి కేసులున్నాయి. ► శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ కోవిడ్–19 బారిన పడిన వారిలో గుజరాత్ నుంచి అత్యధికంగా కేసులు (792) నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు (577), మహారాష్ట్ర (533), కేరళ (503) ఉన్నాయి. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇవే కావడం గమనార్హం. నిబంధనలు కఠినతరం చేయాలి దేశవ్యాప్తంగా 36 జిల్లాల్లో ఎలాంటి లింకులు లేకపోయినా కరోనా వ్యాపించడంతో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. భారత్లో సమూహ వ్యాప్తికి ఇది సంకేతమని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్ అభిప్రాయపడ్డారు. సరిహద్దులు జాగ్రత్త బీఎస్ఎఫ్కు అమిత్ షా ఆదేశాలు న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట చొరబాట్లను అడ్డుకునే దిశగా మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి సరిహద్దు భద్రతాదళాన్ని(బీఎస్ఎఫ్)ను ఆదేశించారు. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో, ముఖ్యంగా ఫెన్సింగ్ లేని ప్రాంతాలపై, మరింత దృష్టి పెట్టాలన్నారు. ఈ సరిహద్దుల్లో పరిస్థితిపై శుక్రవారం బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అమిత్ షా సమీక్ష జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో చొరబాట్లకు అవకాశం కల్పించకూడదని వారికి ఆదేశాలిచ్చారు. ఈ వివరాలను హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియాకు వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 37,978 రిలీఫ్ క్యాంప్లు ఏర్పాటయ్యాయని, వాటిలో 14.3 లక్షల మంది కార్మికులు, వలస కూలీలకు ఆశ్రయం కల్పించామన్నారు. ఎఫ్సీఐ ఉద్యోగులకు బీమా సౌకర్యం ► లక్ష మందికి పైగా ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) అధికారులు, కార్మికులకు రూ. 35 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ► ఉద్యోగులు తమ వేతనాల నుంచి యాజమాన్యాల ద్వారా పీఎంకేర్స్ నిధికి విరాళం ఇస్తున్నట్లయితే.. ఆ వివరాలను యాజమాన్యాలు ఆయా ఉద్యోగుల ఫామ్–16 టీడీఎస్ సర్టిఫికెట్లో చూపించాలని ఐటీ శాఖ కోరింది. ► దేశవ్యాప్త లాక్డౌన్ పరిస్థితుల్లో వీధుల్లో తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం కల్పించేందుకు తీసుకున్న చర్యలను రెండు వారాల్లోగా వివరించాలని హోం శాఖను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ► మధ్యప్రదేశ్లో 75 వేల జనాభాకు ఒక వెంటిలేటర్, 47 వేల మందికి ఒక ఐసీయూ బెడ్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తాజా అధికార గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 426 కరోనా కేసులు, 33 మరణాలు సంభవించాయి. -
సందడి పట్టుకోండి
ముహూర్తాలు మూటగట్టుకొని మాఘమాసం వచ్చింది. పెళ్లి పీటల మీద వధువు పక్కన పేరంటాలను కళకళలాడేలా చేయనుంది. అంతా సందడి.. ముచ్చటగా తయారవ్వాలనే తపన ఆలస్యమెందుకు పట్టు అందుకోండి సందడి పట్టుకోండి. ►కంచిపట్టు చీర వివాహ వేడుకలకు ఎవర్గ్రీన్. దీనికి కాంబినేషన్గా బెనారస్ లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ను ధరిస్తే గ్రాండ్లుక్తో ఆకట్టుకుంటారు. దీని మీదకు వెడల్పాటి చోకర్స్, టెంపుల్ జువెల్రీ లేదా పెద్ద పెద్ద ముత్యాల హారాలు రాణికళను తెప్పిస్తాయి. ►పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు అందమైన పట్టుచీరల రెపరెపలు కూడా ఉండాలి. అవి వధువుకైనా, వేదికను అలంకరించే వనితలకైనా నిండుతనాన్ని తీసుకువస్తాయి. పెళ్లింటికి లక్ష్మీ కళను మోసుకువస్తాయి. ►కంచిపట్టు చీరకు డిజైనర్ లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ ఎంపికతో వివాహ వేడుకలో గ్రాండ్గా కనిపిస్తారు. అందులోనూ లాంగ్ స్లీవ్స్ ట్రెండ్లో ఉన్న స్టైల్. ఆధునికతను, హుందాతనాన్ని కోరుకునే అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు. కుందన్స్ ఆభరణాలు కంచిపట్టు చీరలకు అమితమైన కళను తీసుకువస్తాయి. ►పెళ్లిలో గ్రాండ్గా కనిపించడానికి సిల్వర్ జరీ పట్టుచీరల కాంబినేషన్ బాగా నప్పుతుంది. జరీ రంగులో డిజైనర్ బ్లౌజ్ ధరించి, పెద్ద పెద్ద రాళ్ల హారాలను ఎంపిక చేసుకుంటే లుక్ గ్రాండ్గా కనువిందు చేస్తుంది. ►సింపుల్, మార్వలెస్ అనిపించే కలర్ కాంబినేషన్స్ చిలకపచ్చ, గులాబీ రంగులు. ఈ రంగు కాంబినేషన్ బ్లౌజ్కి ఎంబ్రాయిడరీతో ప్రత్యేకత తీసుకురావచ్చు. వజ్రాలు, పచ్చల హారాలు హెవీగా అనిపించక స్మార్ట్నెస్ను తలపిస్తున్నాయి. – శశి వంగపల్లి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ద ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్ -
మీ లుక్ ఇలా మార్చుకోండి
ఎత్తు తక్కువ ఉన్నవారు పొడవుగా కనిపించాలన్నా, సన్నగా ఉన్నవారు కొంచెం బొద్దుగా కనిపించాలన్నా ఈ చిన్న చిన్న కిటుకులు పాటించాలి... ఎత్తు తక్కువ ఉన్నవారు చిన్న అంచు(బార్డర్) లేదా అసలుఅంచు లేని చీరలు కట్టుకుంటే పొడువుగా కనిపిస్తారు.చర్మరంగుకు దగ్గరగా ఉండే రంగు దుస్తులను ధరిస్తే మీ రూపం పొడువుగా కనిపిస్తుంది. సన్నగా ఉన్నవారు అలంకరణలు ఎక్కువ ఉన్న అంటే గ్రాండ్గా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు, చీరలు కట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.నలుపు, ఎరుపు, నీలం.. వంటి బాగా ముదురు రంగు దుస్తుల మీదకు బంగారు ఆభరణాలు ధరిస్తే అందం రెట్టింపు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బొద్దుగా ఉన్నవారు చర్మం రంగు దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు.బొద్దుగా, ఎత్తు తక్కువ ఉన్నవారు చారల దుస్తులు, చీరలు ధరించాలంటే.. నిలువు చారలున్నవి ఎంచుకోవాలి. -
పూసా వసూల్
తెల్లని ముత్యాలుఒక్కొక్కటి ఒక్కో తీరుగుట్టపూసలని వాటికి పేరుఒక్కో పూస చేర్చిఒద్దికగా అల్లితేఆ పూస గుచ్చిన అందాన్నిచూసినవారు ఒళ్లంతా కళ్లు చేసుకోవాల్సిందే! వేడుక ఏదైనా పూసలు మేనును మెరిపించాల్సిందే!ప్రతి పూసా చూపులలెక్కలు వసూల్ చేయాల్సిందే! గుట్ట పూసల హారాలు పట్టు చీరల మీదకు ఎంత అందంగా ఉంటున్నాయో తెలిసిందే కదా! పెళ్లి, పండగ సంప్రదాయ వేడుకల్లో గుట్టపూసల ఆభరణాల ధరించడం ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. అయితే, వీటి ఖరీదు ఎక్కువే! గుట్టపూసల ఆభరణాన్ని భర్తీ చేయడానికా అన్నట్టుగా ఇప్పుడు మగ్గం వర్క్లో గుట్టపూసలతో చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకే పరిమాణంలో కాకుండా ఇష్టం వచ్చిన తీరులో ఉండే గుట్టపూసల(ముత్యాలు)ని హారంగా చేసి, అతివ మెడను అందంగా అలంకరించారు ఆభరణాల నిపుణులు. అదే థీమ్ని తెల్లని పూసలతో పట్టుచీర జాకెట్ల మీద ముచ్చట గొలుపుతున్నారు ఎంబ్రాయిడరీ డిజైనర్లు. ఈ డిజైన్లో ఎన్ని పూసలు ఎక్కువ వాడితే అంత ఖరీదు అని గుర్తించాలి. సింపుల్ లేదా గ్రాండ్ డిజైన్ అనేది బడ్జెట్ చీర హంగును బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత చిన్న డిజైన్ అయినా గుట్టపూసల డిజైన్ వేడుకలో హైలైట్గా నిలుస్తుంది. కుందన్స్తో కనువిందు ఎరుపు, పసుపు, పచ్చ కుందన్స్తో మరింత అందంగా దోస్తీ కడుతున్నాయి తెల్లని పూసలు. వీటికి జరీ జిలుగులు కూడా తోడై కొత్త సింగారాలతో వయ్యారాలు పోతున్నాయి. పట్టు చీర అంచు మీద నాటి రోజుల్లో పట్టుచీరలోనే వచ్చే కాంబినేషన్ బ్లౌజ్ను డిజైన్ చేయించుకునేవారు. ఆ స్టైల్ పాత బడి మూలన పడింది. అయితే, ఇటీవల మళ్లీ ఈ తరహా స్టైల్ వెలుగులోకి వచ్చింది. పట్టు చీర అంచు ఉండే పొడవు చేతులకు గుట్టపూసలతో చేసిన డిజైన్ అదనపు హంగులతో ఆకట్టుకుంటుంది. దీంతో ఓల్డ్ అని మూలన పడేసిన స్టైల్ ఇప్పుడు ‘వావ్’ అనిపిస్తోంది. కాసుల కాంబినేషన్ లక్ష్మీ కాసులతో డిజైన్ చేసిన మగ్గం వర్క్లు తెలిసినవే! ఇప్పుడు అందంగా ఉండే గుట్టపూసల డిజైన్కి అదనంగా కాసులను కూడా వాడి మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నారు. ముదురు రంగులు ముదురు ఎరుపు, నీలం, పచ్చ, గులాబీ రంగు పట్టు ఫ్యాబ్రిక్లు పూసల డిజైన్కి బాగా నప్పుతాయి. తెల్లటి ముత్యాలు, పూసలను ఈ డిజైన్ ఔట్లెట్గా వాడుతారు. ముదురు రంగు ఫ్యాబ్రిక్ అయితే తెల్లటి పూసల హంగులు మరింత బాగా కనిపిస్తాయి. నిర్వహణ - ఎన్.ఆర్.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement