-
Maharashtra Family Death: ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
-
మహారాష్ట్ర: ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
-
మహారాష్ట్రలో విషాదం.. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ముంబైకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్ గ్రామంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఇంట్లోనే విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ముగ్గురి మృతదేహాలు ఒకచోట, ఆరుగురి మృతదేహాలు వేర్వేరు చోట్ల లభ్యమయ్యాయని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్ గెడమ్ తెలిపారు. అయితే పోస్టుమార్టం అనంతరం 9 మంది మరణానికి సంబంధించికచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చదవండి: సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు -
14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా భిలావడిలో గుర్తుతెలియని వ్యక్తులు 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మాలావలి గ్రామంలో రోడ్డు పక్కన బాధితురాలి మృతదేహం కనిపించడంతో జనవరి 5న ఈ సంఘటన వెలుగుచూసింది. ఆమెను అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఇంటి దగ్గర్లో నివసిస్తున్న కొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, గుర్తుతెలియని నిందితులపై అత్యాచారం, హత్య కేసులు నమోదుచేశామని చెప్పారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భిలావడి పోలీస్ స్టేషన్ బయట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులు పలానా కులం, మతానికి చెందిన వారని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తాయి. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. శాంతి భద్రతలకు ముప్పు తలెత్తే పరిస్థితులు కనిపించడంతో భిలావడిలో భద్రతా సిబ్బందిని మోహరించారు. -
బాణసంచాకు 11 మంది బలి
- మృత్యువుతో పోరాడుతున్న మరొక వ్యక్తి - కొన్ని మీటర్ల మేర ఎగిరిపడిన మృతదేహాలు - సాంగ్లీ జిల్లా తాస్గావ్ తాలూకా కవాతే ఏకంద్లో ఘటన - టపాసుల తయారీకి ఆ గ్రామం ప్రసిద్ధి.. - అనుమతి లేని తయారీ కేంద్రాలెన్నో.. పట్టించుకోని అధికారులు సాక్షి, ముంబై: భద్రత లేని టపాసుల కేంద్రంలో పనిచేస్తూ మరోమారు బడుగుజీవులు అసువులు బాసారు. బతుకుతెరువు కోసం వెళ్లి మంటలకు ఆహుతయ్యారు. సాంగ్లీ జిల్లా తాస్గావ్ తాలూకా కవాతే ఏకంద్లోని ‘ఈగల్ ఫైర్ వర్క్స్’ టాపసుల తయారీ కంపెనీలో సంభవించిన భారీ పేలుడులో 11 మంది మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి శరీరాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలి రక్తపు మరకలతో మాంసపు ముద్దలతో హృదయవిదారకంగా మారింది. రెండు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాస్గావ్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ పాటిల్ ‘సాక్షి’కి ఫోన్లో అందించిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా ఈగల్ ఫైర్ కంపెనీలో పేలుడు సంభవించింది. దీంతో మొత్తం కవాతే ఏకంద్ గ్రామంతా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఈగల్ఫైర్ వర్క్స్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి గ్రామస్తులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొద్ది సేపటికే అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. ఈ ఘటనలో ప్రమాదస్థలిలోనే ఆరుగురు మరణించగా, తీవ్రగాయలైన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరో అయిదుగురు మరణించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతులు అనికేటి గురవ్(16), శరత్ గురవ్(30), ఇందూబాయ్(60), జిబిదా నదాబ్(53),సునందగిరి(45), శంభుగిరి, రామగిరి అని పోలీసులు తెలిపారు. మిగతా నలుగురు మృతుల పేర్లు తెలియ రాలేదు. భద్రత లోపమే...? భద్రత, నియమాల ఉల్లంఘనలే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈగల్ ఫైర్ వర్క్స్లో జరిగిన పేలుడుకు కారణాలు ఏవన్నది ఇంకా తెలియరాలేదు. టపాసుల తయారీకి కవాతే ఏకంద్ గ్రామం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ అనేక టపాసుల తయారీ ఫ్యాక్టరీలున్నాయి. కానీ ఏ ఫ్యాక్టరీలోనూ నిర్దేశించిన భ ద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అనుమతి లేకుండా ఇష్టారీతిన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం, నిర్దేశింన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట ఇదే గ్రామంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. పదేపదే ఇలాంటి ఘటనలు జరిగినా మేలుకోని అధికారులు, ఫ్యాక్టర్లీ యజమానులు భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనుమతి లేకుండానే చాలా ఫ్యాక్టరీల్లో టపాసులు తయారీ చేస్తున్నట్టు ఆరోపణ ఎప్పటి నుంచో ఉన్నాయి. పేలుడుకు సంబంధించి కంపెనీ యజమానిపై తాస్గావ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement