-
రబీకి సాగర్ నీరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగర్ ఆయకట్టులో ఈ ఏడాది రెండో పంట రబీకి నీటిని పుష్కలంగా అందించనున్నారు. మంగళవారం నుంచి రబీకి నీటి సరఫరాను పాలేరు రిజర్వాయర్ నుంచి ప్రారంభించారు. వారబందీ విధానంలో ఈ నీటిని సరఫరా చేయనున్నారు. 9 రోజుల పాటు జిల్లాలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనుండగా.. 6 రోజుల పాటు నిలుపుదల చేయనున్నారు. ఇలా 8 విడతల్లో మార్చి చివరివరకు నీటిని సరఫరా చేస్తారు. అయితే రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని, దీంతో కాల్వ పరిధిలోని చివరి భూములన్నింటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించడం సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఎన్నెస్పీ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తంలో 17 వేల ఎకరాలు మినహా మిగిలింది జోన్–2 పరిధిలో ఉంది. 17 వేల ఎకరాలు జోన్–3 పరిధిలో ఉండటంతో ఏపీలోని ఆయకట్టు ద్వారా నీరు రావాల్సి ఉంటుం ది. ఈ కారణంగా ఖరీఫ్లో జోన్–3లో రెండు, మూడు తడులు మాత్రమే అందించారు. ఇక జోన్–2 పరిధిలో ఉన్న దాదాపు 8 వేల ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. ఇక మిగిలిన ఆయకట్టులో ఖరీఫ్లో సగం వరి పంటలు వేయగా.. మరో సగం మెట్ట పైర్లను సాగు చేసినట్లు ఎన్నెస్పీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే ఈ ఆయకట్టు మొత్తానికి సాగర్ నీరు పుష్కలంగా సరఫరా చేశారు. 20 నుంచి సరఫరా చేయాల్సి ఉన్నా.. సాగర్ నీటి విడుదలపై ఖమ్మం జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. ఈనెల 20 నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే ఖమ్మం డివిజన్ పరిధిలోని బోనకల్, కొణిజర్ల, ముదిగొండ తదితర మండలాల పరిధిలో నీటి అవసరముందని రైతుల నుంచి డిమాండ్ రావడంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జోక్యంతో జిల్లా ఆయకట్టుకు షెడ్యూల్ కంటే 10 రోజులు ముందే పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం రోజుకు 600 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టు ఎడమ కాల్వ మొత్తానికి 60 టీఎంసీలు అవసరముంటుందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. జోన్–2లోని ఖమ్మం జిల్లా (టేకులపల్లి సర్కిల్) పరిధిలో రబీకి 29 టీఎంసీలు అవసరముంటుందని లెక్కలు తయారు చేశారు. -
చెరువులకు సాగర్ జలాలు తరలింపు
చీమకుర్తి రూరల్ : రామతీర్థం రిజర్వాయర్లోని సాగర్ జలాలను మరో వారం రోజుల పాటు చెరువులకు తరలించనున్నారు. ఇరిగేషన్ ఈఈ రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం... రామతీర్థం రిజర్వాయర్ నీటిమట్టం 85.3 మీటర్లు కాగా, ప్రస్తుతం 77.5 మీటర్ల వరకూ నీరు ఉంది. దానిలో డెడ్స్టోరేజీ పాయింట్ 74.9 మీటర్లకు చేరుకునే వరకు చెరువులకు నీరు సరఫరా చేయనున్నారు. రిజర్వాయర్కు దిగువనున్న చెరువులకు మేజర్లు ద్వారా శనివారం 405 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇప్పటికే ఒంగోలులోని ఎస్ఎస్ ట్యాంకులకు నీరిస్తున్నారు. త్రోవగుంట మేజరు పరిధిలోని 16 చెరువులకుగాను 12 చెరువులను నింపారు. కారుమంచి మేజరు పరిధిలో 7 చెరువులుండగా, దాదాపు 5 చెరువులను, కొప్పోలు మేజరు పరిధిలో 5 చెరువులకుగానూ ఇప్పటికే 3 చెరువులను నీటితో నింపారు. ఈతముక్కల మేజరు కింద రానున్న వారం రోజుల్లో నీరిస్తారు. వాటితో పాటు ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని 43 చెరువులకు సాగర్ నీరు ఇస్తున్నారు. ఒకవైపు చెరువులకు ఇస్తూనే మరోవైపు పొగాకు, మిర్చి పంటలు సాగు చేసే రైతులకు కూడా ఒక తడికి సాగర్నీరు అందిస్తున్నారు. రామతీర్థం రిజర్వాయర్లోని సాగర్ జలాలు డెడ్స్టోరేజీకి చేరే వరకూ చెరువులకు నీరు సరఫరా చేస్తామని, సద్వినియోగం చేసుకోవాలని ఈఈ తెలిపారు. -
వేసవి గట్టెక్కేనా..?
= సాగర్ డ్యాం నుంచి నేడో రేపో నిలిచిపోనున్న నీటి సరఫరా = రెండువారాలుగా విడుదల చేస్తున్నా.. జిల్లాలో సగానికిపైగా చెరువులు ఖాళీ = ప్రస్తుతం రామతీర్థం రిజర్వాయర్ నీటిమట్ట 79.5 మీటర్లు = వేసవిలో నీటి సమస్య నుంచి గట్టెక్కడం ప్రశ్నార్థకమే చీమకుర్తి రూరల్: నాగార్జునసాగర్ డ్యాం వద్ద జిల్లాకు సంబంధించిన కుడికాలువకు గురు, శుక్రవారాల నుంచి నీటి విడుదలను నిలిపివేయనున్నట్లుతెలిసింది. నిలిపివేసిన తర్వాత కూడా వారం రోజుల వరకు బుగ్గవాగు నుంచి రామతీర్థం రిజర్వాయర్కు సాగర్ జలాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, రెండు వారాల నుంచి వస్తున్న సాగర్ నీటితో రామతీర్థం రిజర్వాయర్ ఇంకా పూర్తిగా నిండలేదు. సాగర్ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు నోటిఫైడ్ చెరువులు, నాన్నోటిఫైడ్ చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు అందిస్తున్నారు. అయినా గ్రామాల్లో ఇంకా సగానికిపైగా చెరువులు ఖాళీగా ఉన్నాయి. ఒంగోలు ఎస్ఎస్ ట్యాంక్–1కు ఇంతవరకు చుక్క నీరు ఇవ్వలేదు. ఎస్ఎస్ ట్యాంక్–2కు మాత్రమే గత ఆదివారం నుంచి రోజుకు 80 నుంచి 90 క్యూసెక్కుల చొప్పున సాగర్నీరు సరఫరా చేస్తున్నారు. రెండు ట్యాంకుల పూర్తిసామర్థ్యం 5,800 మిల్లీలీటర్లు కాగా, ప్రస్తుతం రెండింటిలో కలిపి 2,138 మిల్లీలీటర్లు మాత్రమే ఉంది. ఇంకా 3,660 మిల్లీలీటర్లు నింపుకోవాల్సి ఉంటుంది. రెండు ట్యాంకులు నింపడానికి రోజుకు 150 మిల్లీలీటర్ల చొప్పున విడుదల చేస్తే ఇంకా 25 రోజులు, 200 మిల్లీలీటర్ల చొప్పున ఇస్తే 18 రోజులు పడుతుందని పబ్లిక్ హెల్త్ డీఈ ప్రసాద్ తెలిపారు. చీమకుర్తిలోని ఎస్ఎస్ ట్యాంకుకు కూడా సరిపడా నీరు రావాల్సి ఉంది. ప్రస్తుతం రామతీర్థం రిజర్వాయర్లోకి 340 క్యూసెక్కులు వస్తుండగా, రిజర్వాయర్ నుంచి బయటకు మాత్రం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 85.34 మీటర్లు కాగా, ప్రస్తుతం 79.5 మీటర్లకు నీరు చేరింది. రానున్న వారం రోజుల వరకు మాత్రమే సాగర్నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు, రైతులు ముందు మిగిలిన చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులు నింపుకుంటేనే వేసవి కాలం గట్టెక్కే అవకాశం ఉంది.లేకుంటే వేసవిలో నీటి తిప్పలు తప్పేలా లేవు. -
నూజివీడు ప్రాంతానికి సాగర్జలాలు సరఫరా చేయాలి
నూజివీడు: నూజివీడు ప్రాంతంలో రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులున్నందున ఎన్నెస్పీ ఉన్నతాధికారులు వెంటనే నూజివీడు ప్రాంతానికి సాగర్జలాలను సరఫరా చేయాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ నూజివీడు బ్రాంచి కాలువ పరిధిలో నూజివీడు, బాపులపాడు, మాచవరం మేజర్లు ఉన్నాయని, వీటి పరిధిలోని చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయన్నారు. ఈ చెరువుల కింద సాగుచేసిన ఆరుతడి పంటలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో కూడా కేవలం మూడురోజులు మాత్రమే సాగర్జలాలను సరఫరా చేసి నిలిపివేశారన్నారు. చెరువులు నింపకపోతే వ్యవసాయ బోర్లులో కూడా నీటిమట్టం పడిపోయి ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులు అధికారులు ప్రభుత్వానికి తెలిపి సాగర్జలాలు సరఫరా చేసేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఆగిరిపల్లిలోని సమ్మర్స్టోరేజీ ట్యాంకును సాగర్జలాలతో నింపాలన్నారు. అతిపెద్దచెరువైన కొమ్మూరు చెరువును నింపాలన్నారు. నూజివీడు మేజర్పై ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా సుంకొల్లు, యనమదల చెరువులతో పాటు నూజివీడు పెద్ద చెరువును సాగర్జలాలతో నింపాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నూజివీడుప్రాంతానికి సాగర్జలాలను మళ్లించి చెరువులను నింపాలని సూచించారు. -
సాగర్ నీరు.. రైతుల పోరు..
• ఖరీఫ్ పంటల రక్షణకేనంటున్న అధికారులు • మా ప్రాంతానికి ఎక్కువ వదలండని ఒత్తిడి చేస్తున్న రైతులు • బోనకల్ బ్రాంచ్ కాలువకు నీరు విడుదల • మరో 2 రోజులు పెంచాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లాకు ప్రధాన నీటి ఆధారమైన సాగర్ నీటి కోసం అనేక ప్రాంతాల నుంచి డిమాండ్ పెరిగింది. గత నెల 26 నుంచి సాగర్ నీటిని పాలేరు దిగువ రెండు, మూడు జోన్ల పరిధిలోని పంటలను కాపాడటానికి విడు దల చేస్తున్నారు. పాలేరుకు సాగర్ నుంచి 2,600 క్యూసెక్కుల నీరు వస్తుంటే అంతే నీటిని పాలేరు దిగువ కాలువకు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అరుుతే, సాగర్ కాలువ సరిహద్దులను ఆనుకుని ఉన్న అనేక చెరువులను సైతం అవకాశం ఉన్న మేరకు నింపేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. జిల్లా లో సాగర్ ఆయకట్టు మొత్తం 2,51,800 ఎకరాలు. ఈ ఏడాది వర్షాభావంతో సాగర్ నుంచి నీరు విడుదల చేయకపోవడంతో అనేక వేల ఎకరాల్లో వరి సాగు లేకుండా పోరుుంది. కొందరు రైతులు వరి పొలాల్లో అక్కడక్కడ ఆరుతడి పంటలు సాగు చేశారు. ప్రసుత్తం ఖరీఫ్లో సాగుచేసిన పంటలను కాపాడుకోవడానికి వారం రోజుల పాటు నీటి విడుదలకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. సుమారు 1 టీఎంసీకి పైగానే నీటిని విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఆ మేరకు సాగర్ ప్రధాన కాలువ పరిధిలోని 2, 3 జోన్ల పరిధిలోని సిరిపురం, రామచంద్రాపురం, గూడూరు-1, గూడూరు- 2, లక్కవరం మేజర్, కల్లూరు పెద్ద చెరువు, మధిర బ్రాంచ్ కాలువ, పోచారం, కోర్లగూడెం, టేకులపల్లి, తుమ్మలపల్లి, తిరువూరు మేజర్లకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలి పారు. జోన్-3లో లంకాసాగర్కాలువ, కాకర్ల, కుంచుపర్తి మేజర్లకు నీటిని విడుదల చేశారు. ఈ మొత్తం కల్లూరు డివిజన్ పరిధిలో ఉంది. ఖమ్మం డివిజన్లో చింతకాని, బోనకల్ బ్రాంచ్ కాలువ ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల పరిధిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో మొత్తం 179 చెరువులున్నారుు. వాటిలో మాత్రం ఇప్పటివరకు వర్షం ద్వారా వచ్చిన నీటితోనే రైతులు పంటలు సాగు చేశారు. కాలువకు సమీపంలో ఉన్న చెరువులను అనధికారికంగానే నింపే ప్రయత్నాలు సాగుతున్నారుు. వాటి ద్వారా అరుునా పంటలను కాపాడుకోవాలని రైతులు ఆరాట పడుతున్నారు. కల్లూరు డివిజన్ పరిధిలో నీటి విడుదల నిలిపివేయాల్సిన గడువు దాటినప్పటికీ రైతుల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మరో 2-3 రోజులైనా నీటిని యథాతథంగా కొనసాగించాలని ఎన్నెస్పీ అధికారులు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఉన్నతాధికారులను కోరుతున్నట్లు తెలిసింది. కల్లూరు డివిజన్లోని కొన్ని కాలువల పరిధిలోని రైతులు తమ కాలువకు నీరు ఎక్కువ విడుదల చేయాలని ఎన్నెస్పీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బోనకల్ బ్రాంచ్ కాలువకు నీరు విడుదల చేసి చివరి దశలో ఉన్న పంటలను కాపాడాలని సీపీఎం నాయకులతో పాటు, రైతు సంఘాల నాయకులు సోమవారం ఎన్నెస్పీ ఎస్ఈని కలిసి వేడుకున్నారు. రబీ సాగుకు ఈ నెల రెండో వారంలో లేదా, మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి బోనకల్ బ్రాంచ్ కాలువకు దశలవారీగా పెంచుతూ 600 క్యూసెక్కులను విడుదల చేసినట్లు ఎన్నెస్పీ ఈఈ వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. పంటలను కాపాడేందుకే ఖరీఫ్లో ఉన్న స్టాండింగ్ పంటలను కాపాడటానికి సాగర్ నీటిని విడుదల చేశాం. కాలువల నుంచి నీటిని చెరువులకు తరలించి నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు. సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కు వస్తున్న నీరు 2,600 క్యూసెక్కులు. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. -కోటేశ్వరరావు, ఎస్ఈ
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement