-
పల్లె ‘నాడి’ పట్టడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం నా హక్కు’.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరికొత్త నినాదమిది. ప్రతి వ్యక్తికి నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందాలనేది డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా నిర్దేశించి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ బాధ్యతను ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన జీవనం అందుతుందని సూచిస్తోంది. దేశంలో ఆరోగ్య సేవలపై నివేదకను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ పేరిట పేదలకు అరోగ్య సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల తీరు ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరువేరుగా చూస్తే గ్రామీణ ప్రాంతంలో సేవలు బాగా వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పేదరికంతో సతమతం... గ్రామీణ భారతంలో పేదలే ఎక్కువ. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం నుంచి 47 శాతం మంది శస్త్రచికిత్సల కోసం రుణాలు తీసుకోవడం, అప్పులు చేస్తున్నారు. ఇక 20 శాతం నుంచి 28 శాతం మంది ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికే నోచుకోవడం లేదు. పట్టణ ప్రాంత జనాభాతో పోలీస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 64% మంది వయసు మీదపడకముందే మరణిస్తున్నారు. ఇక దేశ జనా భాతో పోలిస్తే 6లక్షల డాక్టర్ల కొరత ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లక్ష్యాలు బాగున్నా... ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలు వైద్య సేవల కోసం చేస్తున్న సగటు ఖర్చు జీడీపీలో 5.8శాతం కాగా, భారత్ మాత్రం 1%మాత్రమే ఖర్చు చేస్తోంది. 195 దేశాల్లో వైద్య సేవలపై అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్ఓ పలు కేటగిరీల్లో దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఆస్పత్రి ప్రసవాల్లో 125వ ర్యాంకు, శిశు మరణాల్లో 135వ ర్యాంకుతో భారత్ సరిపెట్టుకుంది. కేటాయింపులు రెట్టింపు చేయాలి వైద్య రంగానికి ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు రెట్టింపు చేయాలి. అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు లేకపోవ డంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కొరవడతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెడికల్ టీచర్స్ -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
ఇంటింటా ఇన్నోవేటర్
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలతో దేశంలోనే అత్యున్నత ఇన్నోవేటివ్ హబ్గా తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోంది. ఈ ఆవిష్కరణల్లో హైదరాబాద్ నగరం వేదికగానే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఇన్నోవేటర్స్ తమవంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ వినూత్న ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ), ఐటీఈ–సి’ శాఖలు కీలకంగా పని చేస్తున్నాయి. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ వేదికలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2019లో టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో ఉన్నటువంటి ఆవిష్కర్తలను వెలికితీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగోవడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 700 పైగా ఇన్నోవేటర్స్ తమ విభిన్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ఏడాది కూడా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమం కోసం ఆవిష్కర్తల దరఖాస్తులను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆహా్వనిస్తోంది. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఐసీ ప్రకటించింది. ఔత్సాహికులు తమ పేరు, ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో, నాలుగు ఫొటోలను 9100678543 నెంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. టీఎస్ఐసీ సహకారం 2020 ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శలో భాగంగా విత్తనాలు ఉన్న పేపర్ నాప్కిన్స్ను తయారు చేశాను. ప్రతిరోజు ఇంట్లో ఉండే తడి చెత్తను కంపోస్ట్ పిట్లో పెట్టడంతో దుర్వాసన వచ్చేది. ఆ సమయంలో వచ్చిన ఈ ఆలోచనతో దీనిని తయారు చేశాను. ఈ పేపర్ను మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో విత్తనాలు కూడా ఉండడంతో కొత్త మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించిన టీఎస్ఐసీ అప్పటినుంచి సహకారం అందిస్తున్నారు. –అరుణ్ జ్యోతి, గృహిణి, నల్గొండ జిల్లా అకుంర దశలోనే ప్రోత్సాహం.. 33 జిల్లాలో ఎంతో మంది ఇన్నోవేటర్స్ ఉన్నారు, వారికీ సరైన సహకారం, దిశానిర్దేశం చేయడానికి ఈ వేదిక రూపొందించబడింది. ఏ ఆవిష్కరణకైనా అకుంర దశ నుంచి ప్రోత్సహించాలి. టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, భాగస్వాముల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆవిష్కర్తలను గుర్తిస్తూ వారి జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతీ ఒక్కరూ వినూత్నంగా ఆలోచించాలి, వారి ఆవిష్కరణలతో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాం. ఎంపికైనవారికి ఆగష్టు 15 స్వత్రంత దినోత్సవ సంబరాలలో తమ ఆవిష్కరణ ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. –డా. శాంతా తౌటం, తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ -
రవాణా మరింత సులభతరం.. మరిన్ని గ్రామీణ రోడ్లకు మహర్దశ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా మరింత సులభతరం అవనుంది. పాడుబడిపోయిన పాత రోడ్లను పునర్నిర్మించి, ఆధునికంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంజీఎస్వై కింద 2,684 కిలోమీటర్ల రోడ్లను ఆధునీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో 916.22 కిలోమీటర్ల పొడవున రహదారులను పునర్నిర్మించనుంది. పీఎంజీఎస్వై ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో రూ. 1066.10 కోట్లతో 115 పాడుబడిన పాత తారు రోడ్లను పునర్నిర్మించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఆ రోడ్లలో 74 పెద్ద పెద్ద బ్రిడ్జిలను కూడా నిర్మిస్తారు. వీటి మొత్తం నిడివి 6918.97 మీటర్లు (అంటే దాదాపు ఏడు కిలో మీటర్లు) ఉంటుంది. వీటిలో 22 బ్రిడ్జిలు ఒక్కొక్కటి 150 మీటర్ల పొడవుకన్నా ఎక్కువ నిడివి ఉంటాయని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఎంపవర్డ్ కమిటీ మీటింగ్లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1,069 కిలోమీటర్ల పొడవున 131 తారు రోడ్ల పునర్నిర్మాణానికి రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారు. వీటిలో 115 రోడ్ల పునర్నిర్మాణానికి ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటిలో 153.01 కిలోమీటర్ల మేర రోడ్లను 5.5 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్కు రూ.85.20 లక్షల ఖర్చుతో పునర్నిర్మిస్తారు. మిగిలిన రోడ్లను 3.75 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్కు 58.41 లక్షలతో పునర్నిర్మిస్తారు. పీఎంజీఎస్వై కింద ఈ రోడ్ల ఆధునీకరణకు అయ్యే ఖర్చులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ రోడ్లకు అంచనాలు ఇప్పటికే పూర్తయినందున, కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. పీఎంజీఎస్వై పథకంలోనే 2684 కి. మీటర్ల కొత్త రోడ్లు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 1.25 లక్షల కిలోమీటర్ల మేర పాత రోడ్ల పునర్నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ 2019లో పీఎంజీఎస్వై –3ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవున రోడ్ల ఆధునీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత నాలుగేళ్లలో అందులో 2,314 కిలోమీటర్ల రోడ్లకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటిలో 1804 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి తోడు పీఎంజీఎస్వై, ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ (నక్సల్స్, తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం) కింద గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి పలు రోడ్లను కేంద్రం మంజూరు చేసింది. వాటికి నిధులు కూడా విడుదల చేసింది. అయినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పనులు పూర్తి చేయలేదు. ఇలా పెండింగ్లో ఉన్న 880 కిలోమీటర్ల రహదారులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో పూర్తి చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మొత్తం 2,684 కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తయిన పనులకు బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. -
గ్రామాల్లో కొనుగోళ్లు.. గంపెడాశలు పెట్టుకున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు!
న్యూఢిల్లీ: కమోడిటీ ద్రవ్యోల్బణం చల్లబడడం ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగానికి అనుకూలమని కంపెనీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన ఐదారు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పడిపోగా, తిరిగి అది పుంజుకుంటుందన్న అంచనాతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో ఉన్నాయి. మార్జిన్లు మార్చి త్రైమాసికంలో పెరుగుతాయని గోద్రేజ్ కన్జన్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్) సైతం అంచనాతో ఉంది. ‘‘మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ రంగం క్రమంగా రికవరీని చూసింది. వార్షికంగా చూస్తే అమ్మకాల పరిమాణం పెరిగింది. పట్టణాల్లో, ప్రీమియం ఉత్పత్తుల విభాగాల్లో అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం చల్లబడడం మొత్తం మీద వినియోగానికి, గ్రామీణ మార్కెట్లకు అనుకూలం’’అని మారికో తెలిపింది. కొబ్బరి ధరలు స్థిరంగా, సానుకూల శ్రేణిలోనే ఉండగా, వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థూల మార్జిన్లు పెరుగుతాయని, వార్షికంగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్లో సహేతుకమైన వృద్ధి ఉంటుందని మారికో తెలిపింది. ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పూర్తి స్థాయిలో కోలుకోకపోయినా, త్రైమాసికం వారీగా చూస్తే మార్చిలో పుంజుకున్నట్టు డాబర్ పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు తిరిగి సానుకూల ధోరణికి చేరాయని, గ్రామీణ మార్కెట్లలోనే ఇంకా సాధారణ స్థితికి చేరుకోవాల్సి ఉందని తెలిపింది. సమీప కాలంలో వినియోగంపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, వినియోగదారుల్లో విశ్వాసం పెరగడం, ప్రభుత్వ వినియోగం పెరగడం అనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. అధిక శాతం కమోడిటీల ధరలు గరిష్ట స్థాయి నుంచి దిగి రావడంతో, స్థూల మార్జిన్లను మెరుగుపడతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఒక అంకె వృద్ధి.. డాబర్ దేశీయ, అంతర్జాతీయ వ్యాపారం 5–6 శాతం స్థాయిలో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. దేశీ మార్కెట్లో వినియోగ డిమాండ్ ధోరణలు మార్చి త్రైమాసికంలో నిలకడగా ఉన్నాయని, ఎఫ్ఎంసీజీ రంగం నిలకడైన వృద్ధిని చూస్తుందని సీజీపీఎల్ చెబుతోంది. మొత్తం మీద వృద్ధి అనేది అన్ని విభాగాల్లోనూ ఉంటుందని, హోమ్కేర్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో అమ్మకాలు, ఆదాయం పరంగా రెండంకెల వృద్ధిని చూస్తామని అంచనా వేస్తోంది. భారత్ తర్వాత గోద్రేజ్ కన్జ్యూమర్కు ఇండోనేషియా రెండో అతిపెద్ద మార్కెట్ కాగా, కన్సాలిడేటెడ్ స్థాయిలో రెండంకెల వృద్ధిపై కంపెనీ అంచనాలతో ఉంది. ‘‘మా ఉత్పత్తుల నాణ్యతలో పురోగతి ఉంది. మార్కెటింగ్పై అదే పనిగా పెట్టుబడులు పెడుతుండడం వల్ల, స్థూల మార్జిన్లు కోలుకుంటాయి. దీంత ఎబిట్డాలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’’అని జీసీపీఎల్ తెలిపింది. వర్షాల సీజన్ సానుకూలంగా ఉండడం రానున్న త్రైమాసికాల్లో వృద్ధికి కీలకమని పరిశ్రమ భావిస్తోంది. ‘‘బ్రాండ్లు, ఆవిష్కరణలపై బలంగా పెట్టుబడులు పెడుతున్నాం. పంపిణీని విస్తరిస్తున్నాం. తద్వారా మా మార్కెట్ వాటాను పెంచుకోవడంతోపాటు, స్థిరమైన వృద్ధిని నమోదు చేయాలనుకుంటున్నాం’’అని డాబర్ తెలిపింది. దేశీయ డిమాండ్ పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ సైతం చెబుతోంది. కాకపోతే వర్షాలు, వాతావరణ మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ వినియోగాన్ని ఆలస్యం చేయవచ్చన్న అభిప్రాయంతో ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement