-
రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు
సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.బాలకృష్ణారెడ్డిపై వేటు పడింది. సంచలనం రేపిన ఇబ్రహీంపట్నం కర్ణంగూడ రియల్టర్ల జంట హత్యల కేసులో విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణ నేపథ్యంలో బాలకృష్ణారెడ్డిని అంబర్పేట సీఏఆర్ హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ఎం.శంకరయ్యను నియమించారు. ఇదే వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పీఎస్లో దీర్ఘకాలంగా విధుల్లో ఉన్న మరో పోలీసు అధికారిపై కూడా త్వరలోనే వేటు పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలోఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ విజయ్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రైటర్గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణను అంబర్పేట హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సీరియస్.. కర్ణంగూడలోని లేక్విల్లా ఆర్చిడ్స్లో నెలకొన్న భూ వివాదాలపై అసోసియేషన్ ప్రతినిధులతో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డి గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ, పోలీసులు శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీ స్థాయిలోనే ముడుపులు ముట్టాయని ఆరోపణలు వినిపించాయి. ఏం చేయలేని స్థితిలో మట్టారెడ్డి హత్యకు పథకం రచించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. పోలీసుల వ్యవహారంపై సీరియస్ అయిన సర్కారు.. శాఖాపరమైన విచారణకు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇక్కడ పరారీ..అక్కడ జైలులో.. హత్య జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు ప్రధాన నిందితుడు మట్టారెడ్డితో సహా ఖాజా మోహియుద్దిన్, బుర్రి భిక్షపతి, సయ్యద్ రహీమ్, సమీర్ అలీ, రాజు ఖాన్లను అరెస్ట్ చేయగా.. హత్యలో వినియోగించిన రెండు తుపాకులను తయారు చేసిన చందన్ సిబాన్, సోనులు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు నిందితుల కోసం బీహార్కు వెళ్లిన ప్రత్యేక బృందాలకు షాకింగ్ న్యూస్ తెలిసిందే. అప్పటికే నిందితులు ఇద్దరిపై బీహార్లో పలు కేసులు ఉండటంతో వారిద్దరు స్థానిక జైలులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఉత్తి చేతులతో తిరుగు ప్రయాణమైన రాచకొండ పోలీసులు.. పిటీ వారెంట్ను సమర్పించి నిందితులు ఇద్దరిని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.∙ -
రియల్టర్ విజయ్భాస్కర్రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ?
సాక్షి, అల్వాల్, రసూల్పుర: హైదరాబద్లోని తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కబేళా ఖాళీ స్థలంలో శవమై కనిపించిన రియల్టర్ తోట విజయ్భాస్కర్రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలు టెంపుల్ అల్వాల్లోని శ్రీనివాసనగర్కు చెందిన తోట విజయ భాస్కర్రెడ్డి, నరేందర్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికి వారుగా చేసుకునే వారు. అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్ వాటి నుంచి బయటపడటానికి, తనకు రావాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకీని ఖరీదు చేసిన నరేందర్ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆది వారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. చదవండి: అమ్మ లొంగలేదని అమ్మాయిని బలిగొన్న కామాంధుడు పథకం ప్రకారం.. సోమవారం ఉదయం తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదుతో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్భాస్కర్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తరవాత శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకువస్తానంటూ ఇంట్లో చెప్పాడు. కొద్ది దూరంలో నివసించే నరేందర్ను తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్రెడ్డి పథకం ప్రకారం విజయ్భాస్కర్రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్భాస్కర్రెడ్డి తలలోకి కాల్చాడు. పుర్రెను చీల్చుకుంటూ దూసుకుపోయిన తూటా లోపలే ఉండిపోయింది. దీంతో ఆయన ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. భాస్కర్రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న నరేందర్ అక్కడ నుంచి నగదును తీసుకుని పారిపోయాడు. కారులో రక్తం మడుగులో ఉన్న విజయ్భాస్కర్ను సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు. తుపాకీ ఎక్కడ? రంగంలోకి దిగిన పోలీసులు నరేందర్ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడు నాటు తుపాకీని రహస్యంగా దాచినట్లు తేలడంతో దాని కోసం గాలిస్తున్నారు. మరోపక్క ఇతడికి ఎవరైనా సహకరించారా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. బుధవారం నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. విజయ్భాస్కర్రెడ్డి మృతితో శ్రీనివాసనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఈయనకు భ్యార్య, కుమారుడు, కుమర్తె ఉన్నారు. కుమారుడు ఇటీవల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడని సన్నిహితులు పేర్కొన్నారు. -
అల్వాల్లో రియల్టర్ విజయ్ భాస్కర్రెడ్డి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అల్వాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరిలోని కారులో సోమవారం విజయ్ మృతదేహం లభ్యమైంది. కాగా సోమవారం ఉదయం 10 గంటలకు ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం పది లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే కారులోనే దుండగులు కత్తితో విజయ్ రెడ్డి మెడపై పొడిచి చంపారు. కాగా సోమవారం నాడు ఉదయం 11 గంటలకే విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ మద్యవర్తులే చంపినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులకు తెలియజేశారు. మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి, మరో వ్యక్తి అబ్రహంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్
-
కారుతోపాటు మృతదేహం కాల్చివేత: శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, మెదక్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. మృతుని భార్య వద్ద పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు ముందు కీలక నిందితుడు శివ.. హతుడి భార్యతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ భార్యకు శివ దూరపు బందువుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈకేసులో మొత్తం అయిదుగురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు శివతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో ఇటీవల దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్దిగా గుర్తించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు వెల్లడైంది. చదవండి: కారు డిక్కీలో శవం... కేసును ఛేదించిన పోలీసులు Medak: కారు డిక్కీలో శవం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement