-
ఈ హీరోయిన్ గుర్తుందా? ప్రభాస్, నాగార్జునతో మాత్రమే!
ఈ హీరోయిన్ పుట్టింది లండన్లో.. కానీ హీరోయిన్ కావాలనుకుంది. అలా ప్రయత్నం చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్, నాగార్జున లాంటి హీరోలతో నటించింది. వీటిలో ఒకటి ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్ కాగా, మరొకటి యావరేజ్గా నిలిచింది. వీటి తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చాయి గానీ ఒకే ఒక్క కారణంతో యాక్టింగ్కి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె స్టోరీ ఏంటి? (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగేకొద్ది గ్లామర్ తగ్గుతుంది. అదేంటో ఈమెకు మాత్రం అది రివర్స్లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే 40 ఏళ్లు వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ యంగ్ హీరోయిన్లు పోటీ ఇచ్చేలా తయారైంది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదు. అన్షు అంబానీ. ఇప్పటికీ గుర్తురాలేదా? 'మన్మథుడు' ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్ ఈమెనే. ఇక ఈమె పేరు అన్షు అంబానీ. భారతీయ మూలాలున్న ఈ బ్యూటీ లండన్లో పుట్టి పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో హీరోయిన్ అవుదామనుకుంది. దీంతో ప్రయత్నాలు చేసింది. అలా ప్రభాస్ కెరీర్ మొదట్లో చేసిన 'రాఘవేంద్ర' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇది షూటింగ్ పూర్తి చేసుకునేలోపు, నాగార్జున 'మన్మథుడు'లో ఈమె ఓ హీరోయిన్గా చేసింది. (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) ఇలా తెలుగులో కేవలం రెండంటే రెండు సినిమాలు చేసింది. 'మిస్సమ్మ' చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. తమిళంలో 'జై' అనే మూవీ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కానీ ఈమె వాటిని అంగీకరించలేదు. తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. సినిమాలు చేద్దామనే ఇంట్రెస్ట్ ఉంది గానీ కేవలం ఒకటి రెండు అని ముందే ఫిక్స్ అయిందట. అలా తన డ్రీమ్ నెరవేరగానే ఇంటికెళ్లిపోయింది. ఇక లండన్కి వెళ్లిపోయిన అన్షు.. సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది. ఫ్రీ టైంలో జిమ్ వర్కౌట్ వీడియోలు, గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకప్పటి క్యూట్గా ఉండే ఈమె ఇప్పుడు 40ల్లోనూ హాట్గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? లేదా ఇదంతా చదివిన తర్వాత గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) -
హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా: మీ పిల్లలకు ఇతన్ని చూపండి
కుర్రాళ్లు వినరు. బైక్ ఎక్కి తుర్రుమంటారు. భర్తలకు నిర్లక్ష్యం. హెల్మెట్ లేకుండానే బయలుదేరుతారు. ఇంటి మగవారి అసురక్షిత ప్రయాణం స్త్రీలకు ఎప్పుడూ ఆందోళనకరమే. ప్రతి ఇంట్లోని స్త్రీలు ఆ ఇంటి మగవారికి రాఘవేంద్ర కుమార్ను చూపాలి. స్నేహితుణ్ణి ప్రమాదంలో కోల్పోయిన అతను సొంత డబ్బుతో ఇప్పటికి 56,000 హెల్మెట్లు పంచాడు. పురుషులైనా స్త్రీలైనా హెల్మెట్ లేకుండా బండెక్కారంటే ఇంటి మీదకు ముప్పు తెచ్చినట్టే అంటాడు రాఘవేంద్ర. అతను చెప్పేది వినండి. ‘ఒంటి మీద ఎక్కడా దెబ్బ లేదు. తల ఒక్క దానికే తగిలింది’ అని అయినవారిని కోల్పోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఆ తలకు దెబ్బ తగలని రీతిలో జాగ్రత్త తీసుకుని ఉంటే వారంతా బతికేవారు. హెల్మెట్ వాడితే బతికేవారు. చట్టాలు ఎన్ని చెప్పినా, నిబంధనలు విధించినా జీవితాన్ని సీరియస్గా తీసుకోని వారు ఎప్పుడూ ఉంటారు. వారు ఎక్కడో వేరే కుటుంబాలలో ఉంటారనుకోవద్దు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కాలేజీకి వచ్చిన కొడుకు, ఉద్యోగానికి వెళ్లే భర్త, ట్రయినింగ్లో ఉన్న కూతురు.. వీరు కూడా ‘ఆ.. ఏముందిలే’ అనుకుని హెల్మెట్ వాడకుండా ఉండొచ్చు. అలాంటి వారు తన కంట పడితే ఊరుకోడు రాఘవేంద్ర కుమార్ (36). ఇతణ్ణి అందరూ ఇప్పుడు ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటారు. నోయిడాలో నివాసం ఉండే ఇతను ఉద్యోగం వదిలేశాడు. ఇతర పనులు మానేశాడు. కేవలం హెల్మెట్కు సంబంధించిన చైతన్యం కోసం పని చేస్తున్నాడు. అతడు రోజూ చేసే పని కారు వేసుకుని, అందులో కొన్ని హెల్మెట్లు పడేసుకుని నోయిడా ఆగ్రాల మధ్య ఉండే ఆరు లేన్ల యమునా ఎక్స్ప్రెస్కు చేరుకుంటాడు. ఆ దారి మీద బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా ఎవరైనా వెళుతుంటే వారిని వెంబడించి ఆపుతాడు. హెల్మెట్ వాడకపోతే ఉండే ప్రమాదం గురించి చెప్పి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి పంపుతాడు. ‘2014 నుంచి నుంచి నేను హెల్మెట్లు పంచుతున్నాను. ఇప్పటికి 56 వేల హెల్మెట్లు పంచాను. నేను పంచిన రోజునో ఆ తర్వాత ఐదారు రోజుల్లోనో ప్రమాదానికి గురై నేనిచ్చిన హెల్మెట్ వల్లప్రాణాలు కాపాడుకున్న వారు 30 మంది ఉన్నారు. వారంతా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నాకు ఫోన్ చేసి తాముప్రాణాలతో ఉండటానికి కారణం నేనేనని చెబుతారు. చాలామందికి భారీ యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగినా తల మాత్రం ఏమీ కాకపోవడంతో బతికిపోయారు’ అంటాడు రాఘవేంద్ర కుమార్. అయితే అతనికి కూడా హెల్మెట్ విలువప్రాణ స్నేహితుడు మరణించాకే తెలిసింది. బిహార్కు చెందిన రాఘవేంద్ర కుమార్ 2009లో నోయిడా వచ్చి లా కోర్సులో చేరాడు. అదే బిహార్ నుంచి ఇంజినీరీంగ్ చేయడానికి వచ్చి కృష్ణకుమార్ అతని రూమ్మేట్ అయ్యారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. కాని 2014లో కొత్తగా వేసిన యమున ఎక్స్ప్రెస్ వే మీద హెల్మెట్ లేకుండా వెళుతూ కృష్ణకుమార్ యాక్సిడెంట్కు లోనయ్యాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. తలకే తగిలింది. మరణించాడు. ‘ వాళ్లింట్లో వాళ్లకి నా స్నేహితుడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడి అమ్మా నాన్నల గుండెలు పగిలిపోయాయి. హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా అన్న బాధ ఇప్పటికీ వదల్లేదు నన్ను’ అంటాడు రాఘవేంద్ర. అప్పటి నుంచి అతడు ఒక ఉద్యమంగా హెల్మెట్లు పంచుతున్నాడు. భార్య కొత్తల్లో సహకరించింది. కాని రాఘవేంద్ర కుమార్ దాదాపు తన ఆస్తులన్నీ అమ్మి ఇప్పటికి రెండు కోట్ల వరకు ఖర్చు చేసి హెల్మెట్లు పంచాడు. ‘ఉన్నదంతా ఊడ్చేశాను. పర్వాలేదు. బిహార్లోని నా సొంత పల్లెకు వెళ్లిపోతాను’ అని ఇటీవల అతను ప్రకటించాడు. కాని అది పైమాటే. తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశంలో హెల్మెట్ల బ్యాంకులు తెరవాలని ఎవరైనా సరే అరువు తీసుకుని వెళ్లి వాడుకునేలా హెల్మెట్లు అందుబాటులో ఉంచాలని అతని కోరిక. ‘4 ఏళ్లు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నేను సుప్రీం కోర్టులో పిల్ వేశాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశాను’ అంటాడు రాఘవేంద్ర. ‘ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి రాదు’ అంటాడు. హెల్మెట్ను వాడటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరికి రాఘవేంద్ర చెబుతున్న విషయం అర్థం కావాలి. ప్రాణం ఉంటే లోకం ఉంటుంది. -
పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం?
టి20 ప్రపంచకప్లో భాగంగా బుధవారం సూపర్-12లో బంగ్లాదేశ్, టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో ఉత్కంఠగా సాగిన పోరులో ఐదు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ సందర్భంగా ఒక వ్యక్తి తన చర్యలతో అందరిని మాట్లాడుకునేలా చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో సదరు వ్యక్తి పదే పదే మైదానంలోకి వస్తున్నాడు పోతున్నాడు. ఇలా ఎందుకు చేశాడనేది మొదట ఎవరికి అర్థం కాలేదు. కానీ అతను ఎందుకు వచ్చాడన్న దానిపై క్లారిటీ వచ్చాకా మాత్రం అందరు ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంతకీ ఆ వ్యక్తి చేస్తున్న పనేంటో తెలుసా.. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మైదానం ఔట్ఫీల్డ్ కాస్త చిత్తడిగా మారింది. ఆటగాళ్ల షూస్కు బురద అంటుతుండడంతో ఫీల్డింగ్ చేసే సమయంలో జారి పడితే ఇబ్బంది అని భావించిన సదరు వ్యక్తి ప్రతీసారి మైదానంలోకి వచ్చి వారి షూస్ క్లీన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్గా మారాయి. అలా టీమిండియా ఆటగాళ్ల షూస్ క్లీన్ చేసి అందరి మనుసుల దోచేసిన ఆ వ్యక్తి పేరు రాఘవేంద్ర(రఘు). టీమిండియాకు సైడ్ఆర్మ్ బాల్ త్రోయర్గా విధులు నిర్వహిస్తున్నాడు. క్రికెట్పై ఉన్న ప్రేమతో ఆటగాడిగా మారాలన్న రఘు కోరిక నెరవేరలేదు. అందుకే గత ఆరేళ్లుగా టీమిండియా సపోర్ట్ స్టాఫ్లో సైడ్ ఆర్మ్ త్రోయర్గా పనిచేస్తూ ఆటగాళ్లకు చాలా దగ్గరయ్యాడు. చదవండి: వర్షం రాకపోయుంటే.. టీమిండియా గెలిచేదా! IND Vs BAN: బంగ్లాదేశ్పై టీమిండియా విజయం.. సెమీస్ బెర్త్ ఖాయం..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డీఆర్డీఎల్ ప్రోగ్రామ్ డైరెక్టర్కు కొండలరావు అవార్డు
సాక్షి, హైదరాబాద్: క్షిపణులు, వైమానిక వ్యవస్థల అభివృద్ధిలో కీలకమైన పరిశోధనలు చేసినందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్) ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి ప్రతిష్టాత్మక డాక్టర్.ఎన్. కొండలరావు స్మారక అవార్డు లభించింది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డును శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన డాక్టర్ జోషీ.. పూణే యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ సైన్సెస్లో మాస్టర్స్ పట్టా పొందారు. వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్లోనే పీహెచ్డీ సంపాదించారు. దేశంలోనే దిగ్గజ శాస్త్రవేత్తలు ఆర్.చిదంబరం, అనిల్ కాకోద్కర్, డాక్టర్ జి.సతీష్ రెడ్డి వంటి వారు కూడా ఎన్.కొండలరావు స్మారక అవార్డు అందుకున్నారు. -
కామారెడ్డి లో ఏ ఆర్ ఎస్సై రాఘవేంద్ర కరోనా తో మృతి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement