-
అధికార భూదందా
టీడీపీ చేతిలో రూ.5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ‘అధికార’ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ శాఖ మండిపడుతున్న పుత్తూరు పట్టణ ప్రజలు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా భూ దందాలకు పాల్పడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో చోటా నాయకులంతా ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడితే అక్కడ ఆక్రమణలకు సిద్ధపడుతున్నారు. తాజాగా పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం తమ్ముళ్లు విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేశారు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే భూమిలో ఉన్న ముళ్ల కంపలు తొలగించి చదును చేశారు. స్థానిక తహశీల్దార్ సంఘటనా స్థలాన్ని సందర్శించినా ఫలితం లేకపోరుుంది. విజయపురం: పట్టణంలోని పుత్తూరు-చిత్తూరు రహదారిని ఆనుకుని చెర్లోపల్లి రోడ్డు సమీపంలో సర్వే నెంబర్ 19లో సుమారు 3.84 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో గతంలో నెత్తం గ్రామానికి చెందిన వారు శ్మశాన స్థలంగా వాడుకునేవారు. కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ఆ భూమిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. గత కొన్నేళ్లుగా ఈ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం స్థలంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి స్థలాన్ని చదును చేశారు. ఈ స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖాధికారులు కనీసం ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు కూడా పెట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఈ ఆక్రమణ వెనుక టీడీపీ నేతల మద్దతు ఉండడంతో రెవెన్యూ శాఖాధికారుల ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయారు. మార్కెట్ రేట్ ప్రకారం ఈ స్థలం ఖరీదు సుమారు 5 కోట్ల రూపాయలు ధర పలుకుతోంది. పుత్తూరు పట్టణవాసులు తెలిపారు. పేదల పేరు చెప్పి టీడీపీ నాయకులు ఖరీదైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఈ భూమిలో కొంత కాల్వ పోరంబోకు భూమి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆక్రమణదారులు కాల్వను సైతం మట్టితో కప్పేశారు. ఇందులో ప్లాట్లు వేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నెత్తం గ్రామస్తులు కొందరు ఈ భూమిలో పాకలు వేసుకున్నారు. అరుుతే రెవెన్యూ శాఖాధికారులు శ్మశాన స్థలంతో పాటు చట్ట ప్రకారం కాల్వ పోరంబోకు స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పి పేదలు వేసిన పాకలను పీకి పారేశారు. దీనిపై పేదలు పలుమార్లు ధర్నాలు కూడా చేసినా అధికారులు ససేమిరా అన్నారు. కాని ప్రస్తుతం మాత్రం టీడీపీ నాయకుల ఒత్తిడితో పచ్చ తమ్ముళ్ల ఆక్రమణను రెవె న్యూ శాఖాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నారుు. అంతే కాకుండా రెవెన్యూ అధికారులను ఓ పేరు మోసిన అధికార పార్టీ నాయకుడు ఆ స్థలం వైపు కన్నెత్తి చూడకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకుని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పుత్తూరు, చెర్లోపల్లి, నెత్తం గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు. మా ఆధీనంలోనే ఉంది రెండు రోజులకు ముందు నెత్తం గ్రామస్తులు ఇంటి స్థలం కోసం సర్వే నెంబర్ 19లో ప్రభుత్వ భూమిని చదును చేశారు. అది తెలుసుకొని మేం నిలిపి వేశాం. ఆ భూమి ఇప్పటికీ మా ఆధీనంలోనే ఉంది. ఎవ్వరూ ఆక్రమించలేదు. - రంగస్వామి, పుత్తూరు తహశీల్దార్ -
భూ మాయాజాలం
♦ మనియార్పల్లిలో బహిర్గతం ♦ ప్రభుత్వ భూమి సర్కార్కే విక్రయం ♦ భూ పంపిణీ పథకం అపహాస్యం కోహీర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ పథకం పక్కదారి పట్టింది. ఓ గ్రామంలో ప్రభు త్వ భూమిని ప్రభుత్వానికే విక్రయిం చడం విమర్శలకు దారితీసింది. వాటిని అందుకున్న లబ్ధిదారులు ఏమిపాలుపోక అయోమయంలో పడిపోయారు. మండలంలోని మనియార్పల్లి, గొడిగార్పల్లి గ్రామాల్లో మొదటి విడత భూపంపిణీ జరిగింది. గొడిగార్పల్లిలో బండరాళ్లతో నిండిన భూములను పంపిణీ చేశారు. మనియార్పల్లిలో ప్రభుత్వ భూమినే తిరిగి కొనుగోలు చేసి పంపిణీ చేశారన్న ఆరోపణలు రావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.యానియార్పల్లికి 31 మార్చి 2015న భూ పంపిణీ పథకం మంజూరైంది. గ్రామ శివారులోని సయ్యద్ షఫియొద్దీన్, వికారొద్దీన్, సిరాజొద్దీన్, అబ్దుల్ నజీర్, ముతాసిమ్లకు చెందిన 170, 186, 187వ సర్వే నంబర్ భూములకు సంబంధించిన 35.30 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఈ భూమిని 11 మంది లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేయడానికి వీలుగా 16 ఏప్రిల్ 2015న ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. సదరు భూమిని స్థానిక అధికారులతోపాటు ఆర్డీఓ మధుకర్రెడ్డి, అప్పటి జేసీ శరత్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి చరణ్దాస్, ఎస్సీ కార్పొరేషన్ డెరైక్టర్ జైరాజ్ తదితరులు పరిశీలించారు. రూ.4.40 లక్షలకు ఎకరా చొప్పున కొనుగోలుకు నిర్ణయించారు. ఆ భూమిలో బోరు వేసి సాగుకు అనుగుణంగా తయారు చేసి ఇవ్వాలని నిబంధన పెట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన 2 జూన్ 2015న మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. అయితే 170 సర్వే నంబర్లోని 9 ఎకరాలు, 186 సర్వే నంబర్లోని 16.67 ఎకరాల భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు పంపిణీ నివేదికలో సైతం ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. నివేదికలో సమర్పించిన వివరాల ప్రకారం 1954-55 సంవత్సరంలో భూములకు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవు. చౌపస్లాలో నాట్ అవైల్ అని రాసి ఉంది. 1959-60లో 170 సర్వే నంబర్ బిచ్చప్ప, 186 సర్వే నంబర్ జాఫర్ పేరిట భూమిని కేటాయించారు. ఆ భూమి 1972-73 పట్టాభూమిగా మార్చారు. 1958 తర్వాత ప్రభుత్వ భూములను అమ్మొద్దు, కొనొద్దు అనే నిబంధన ఉంది. ప్రభుత్వ భూమి కొనడానికి అమ్మడానికి వీలులేని పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఈ విషయమై ఆర్డీఓ మధుకర్రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్!
పటాన్చెరు: సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో రైళ్ల రద్దీ కారణంగా వాటికి ప్రత్యామ్నాయంగా నగరశివారులోని ఈదులనాగులపల్లి(మెదక్ జిల్లా రామచంద్రాపురం)లో కొత్తగా రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారుల భావిస్తున్నారు. ఇప్పటికే వారు మౌలాలి, ఈదులనాగులపల్లిని పరిశీలించారు. అయితే టెర్మినల్ నిర్మాణానికి కావాల్సిన 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఈదులనాగులపల్లిలో ఉంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తూ.. రైల్వే అధికారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. తాజాగా విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటుపై కలెక్టర్తో మాట్లాడినట్లు తెలిసింది. ఇక్కడ టెర్మినల్ ఏర్పాటైతే వికారాబాద్, మెదక్ రైతులకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. దాదాపు సికింద్రాబాద్ స్టేషన్లో ఉండే రైళ్ల రాకపోకల సంఖ్యలో సగం వరకు ఈదులనాగులపల్లికి వచ్చిపోయే అవకాశం ఉంది.కాగా, ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్కు అవసరమైన స్థలాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ బొజ్జా పరిశీలించారు. -
150 గజాల వరకూ ఉచితం!
ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో పేదల కేటగిరీ పరిధి పెంపు మిగతా కేటగిరీల్లోనూ రాయితీలు పెంపు.. 250 గజాల వరకూ రిజిస్ట్రేషన్ ధరలో 25% చెల్లిస్తే క్రమబద్ధీకరణ 500 గజాల వరకు 50 %, ఆపై విస్తీర్ణమున్న స్థలాలకు 75% కడితే చాలు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నేడు కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అనుకున్నంత స్పందన లేకపోవటం, ఆశించినంత ఆదాయం రాకపోవటంతో ఈ విధానానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఉన్న పేదలకు లబ్ధి కల్పించడంతో పాటు సర్కారుకు ఆదాయం ఒనగూరేలా బహుళ ప్రయోజనాలు ఉండేలా మార్పులు చేసేదిశగా మరో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించే స్థలం పరిమితిని 125 గజాల నుంచి 150 గజాలకు పెంచాలని భావిస్తోంది. అంతేకాదు మిగతా కేటగిరీల్లో ఇస్తున్న రాయితీలనూ పెంచాలని నిర్ణయించింది. శుక్రవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా గత నెల 30న ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 125 గజాల్లోపు స్థలంలో నివాసాలు ఏర్పరచుకున్న నిరుపేదలకు ఉచితంగానే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మధ్యతరగతి వర్గాల కోసం 125 గజాల నుంచి 250 గజాల వరకు ఉన్న స్థలాలపై రిజిస్ట్రేషన్ ధరలో ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇచ్చింది. 250 నుంచి 500 గజాల్లోపు స్థలాలకు రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతం చెల్లిస్తే క్రమబద్ధీకరించేలా నిర్దేశించింది. 500 గజాలపైన స్థలానికి పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమబద్ధీకరణకు తొలుత ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తర్వాత దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. గత ప్రభుత్వ హయాంలో జీవో 166 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం ఏడాదిన్నర వ్యవధిలో 1.40 లక్షల దరఖాస్తులు రాగా... తాజాగా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధీకరణకు ఇరవై రోజుల వ్యవధిలోనే 1.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా దాదాపు మూడు లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ విభాగం అంచనా. కానీ రాష్ట్ర విభజన ప్రభావంతో మార్కెట్లో భూముల ధరలు తగ్గినా, రిజిస్ట్రేషన్ ధరలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటివే అమలవుతుండడంతో... భారీ విస్తీర్ణంలో స్థలాలను ఆక్రమించిన కబ్జాదారులు ఈ క్రమబద్ధీకరణకు దూరంగానే ఉన్నారు. దీంతోపాటు 125 గజాలకు మించిన విస్తీర్ణంలోనివాసమున్న నిరుపేదలు డబ్బులు చెల్లించే స్తోమత లేక వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ పథకం పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం రెవెన్యూ, సీసీఎల్ఏ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఇప్పుడున్న మార్గదర్శకాల్లో మార్పులు చేసి... పేదలకు మరింత ప్రయోజనం ఉండేలా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రమబద్ధీకరణపై సరిగా ప్రచారం చేయకపోవడం వల్లే ఆశించిన స్పందన రాలేదని.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో నిరుపేదలకు సంబంధించిన ఉచిత క్రమబద్ధీకరణ పరిమితిని 150 గజాల వరకు పెంచాలని నిర్ణయించారు. ఇక రుసుము చెల్లించే కేటగిరీల్లో.. 150 గజాల నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 25 శాతం... 250 నుంచి 500 గజాల్లోపు స్థలాలకు 50 శాతం... 500 గజాలపైబడిన స్థలాలకు 75 శాతం ధరను చెల్లిస్తే క్రమబద్ధీకరించేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంత రాయితీ పెం చితే.. ఏ మేరకు స్పందన వస్తుంది, ఎంత ఆదా యం సమకూరుతుందనే వివరాలపై సైతం అధికారులు చర్చించారు. తప్పనిసరి పరిస్థితుల్లో శిఖం భూములను కూడా డీనోటిఫై చేసి క్రమబద్ధీకరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలుండటంతో.. అలాంటి వాటిని కూడా క్రమబద్ధీకరించే అంశం పరిశీలనలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. -
రూ.4 కోట్ల స్థలం కబ్జా!
సాక్షి ప్రతినిధి,కడప: ప్రభుత్వ భూమి పక్కాగా అన్యాక్రాంతమైంది. పరిరక్షించాల్సిన యంత్రాంగం మత్తులో ఉంది. ప్రభుత్వ భూమికే ప్రజాధనం పరిహారంగా అప్పగించాలని రాష్ట్ర ఘనుల శాఖ సిద్ధమౌతోంది. ఓ రాజకీయ నాయకుడు, ఉన్నతాధికారి పరస్పర అవగాహనతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగించారు. అక్రమంగా పరిహారం పొందేందుకు సిద్ధం చేశారు. గ్రామస్థుల గతి ఏం కావాలి.. అని ప్రశ్నించిన నేరానికి వేధింపులు, ఛీత్కారాలు ఎదురవుతున్న వైనమిది. వివరాలిలా ఉన్నాయి. ఓబులవారిపల్లె మండలం మంగంపేట పంచాయతీ కాపుపల్లె పరిధిలో సర్వే నంబర్ 8లో 72.77 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. అందులో సుమారు 20 ఎకరాలు ఓ మాజీ ప్రజాప్రతినిధి బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరో 5ఎకరాలను ఏపీఎండీసీ ఆక్రమించి వేస్ట్ డంప్ వేస్తోంది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది, పరిర క్షించండి అంటూ 2013లో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్లోనే ఉంది. అయితే అనూహ్యంగా ఏపీఎండీసీ ఉన్నతాధికారి ఒకరు మాజీ ప్రజాప్రతినిధితో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ప్రభుత్వ భూమికి అక్రమంగా ప్రజాధనం అప్పగించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. భూసేకరణ ముసుగులో.... ఏపీఎండీసీ వేస్ట్ డంపు కోసం భూమి అవసరం ఉందని, 150 ఎకరాలు కేటాయించాలని దరఖాస్తులు చేసుకుంది. ఏపీఎండీసీ ఆశిస్తున్న 150 ఎకరాల భూమికి మధ్యలో సర్వేనంబర్ 8లోని 72.77 ప్రభుత్వ భూమి సైతం ఉంది. దానిలోని 20 ఎకరాలను ఇప్పటికే బినామీ పేర్లుతో రాజకీయ నేత దక్కించుకున్నారు. ఓ వైపు తహశీల్దార్ మొత్తం 72.77 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ప్రకటించారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవిన్యూ యంత్రాంగం విఫలం అవుతోంది. కాగా రెవిన్యూ యంత్రాంగానికి భూమి కావాలని అభ్యర్థించే వరకూ ఏపీఎండీసీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదు. అయితే పలానా చోట 150 ఎకరాలు అవసరం.. భూసేకరణలో భాగంగా అప్పగించండి అని కోరడం వెనుక మతలబును పలువురు ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వ పరిహారం ఎకరాకు రూ.20 లక్షలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా 20 ఎకరాలు బినామీల పేరుతో దక్కించుకున్న నేతకు రూ.4కోట్లు కీలక అధికారి నజరానా ముట్టజెప్పనున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థుల వేదన ఆరణ్య రోదన.... అన్యాక్రాంతమైన భూమిని పరిరక్షించాలని, కాట్రేవుడి గుడి, శ్మశానం, పశువుల మేత బీడు భూముల్ని కాపాడాలని 2013లో హైకోర్టులో గ్రామస్థులు రిట్ పిటిషన్ విపి నెంబర్-13660 దాఖలు చేశారు. అప్పటి నుంచి గ్రామస్థులు, రాజకీయ నేత మధ్య వివాదం తలెత్తింది. ఈపరంపరలో గ్రామంలో దాడులు సైతం చోటుచేసుకున్నారుు. పరస్పర కేసుల వరకూ దారితీశాయి. కాగా ఏపీఎండీసీ కేవలం గ్రామం వరకూ 150 ఎకరాలు మాత్రమే తీసుకుంటే, గ్రామస్థులు అక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు. మొత్తం గ్రామం ఖాళీ చేస్తాం, పరిహారం చెల్లించండి, లేదంటే గ్రామానికి దూరంగా భూసేకరణ చేపట్టండండి అని మొరపెట్టుకుంటున్నా విన్పించుకునే స్థితిలో యంత్రాంగం లేదని సమాచారం. అందుకు పక్కా వ్యూహం ప్రకారం ప్రభుత్వ భూమికి పరిహారం పొందాలనే అసలు లక్ష్యం ఉండడమే ముఖ్య ఉద్దేశమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గ్రామస్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోని ప్రభుత్వ భూమిని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement