-
మళ్లీ ఎక్కడికో..!
పునరావాస కాలనీల్లోంచే రైలుమార్గం ఆందోళనలో చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీవాసులు మళ్లీరోడ్డున పడనున్న 200కు పైగా కుటుంబాలు కొత్తపల్లి–మనోహారాబాద్ రైలుమార్గం తెచ్చిన తంటా మధ్యమానేరు ప్రాజెక్టు కోసం ఎవుసం పొలాలు వదిలి పెట్టారు.. పాడిగేదెలను కాదనుకున్నారు.. ఎండ, వాన, చలి నుంచి కాపాడిన గూడును విడ్చిపెట్టారు.. పెంచుకున్న అనుబంధాన్ని పక్కనబెట్టారు.. ప్రాజెక్టు కడితే తమలాంటోళ్లు లక్షలాదిమంది బాగుపడుతారని సర్వం ధారపోశారు.. పాలకుల మాటలు నమ్మి.. అధికారులు చెప్పినట్లు తలూపారు.. ఉన్న ఊరును ఖాళీ చేసి పునరావాసకాలనీల్లో తలదాచుకునేందుకు వచ్చారు.. ఇక్కడా విధి వక్రీకరించింది. కొత్తపల్లి– మనోహరాబాద్ రైలు మార్గం నిర్మాణం ద్వారా వారు మళ్లీ నిర్వాసితులు కాబోతున్నారని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. చింతలఠాణా, చీర్లవంచ, శివపార్వతులకాలనీ పునరావాస ప్రాంతాల్లోంచే రైలుమార్గం నిర్మించేందుకు అధికారులు సర్వే ప్రారంభించడం వారిలో గుబులు రేపుతోంది. – వేములవాడ రూరల్ -
జలం జన‘సాగరం’
-
నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత
10 గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల ప్రాజెక్టులోకి 1.95 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నిజాంసాగర్ : మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ఆదివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తారు. ప్రాజెక్టు 10 వరద గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా 1.95 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఇన్ఫ్లోగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు ముందస్తుగానే ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,400 అడుగుల(11 టీఎంసీలు) నీరుంది. ప్రమాదకరస్థాయిలో ఇన్ఫ్లో వస్తుండడంతో నీటిని విడుదల చేయాలని నిర్ణయించామని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆనందంగా ఉంది.. చాలా ఏళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు నిండిందని, వరద గేట్ల ద్వారా నీటిని వదులుతున్నందుకు ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తిన సందర్భంగా మంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు, హల్దీ వాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు నిజాంసాగర్లోకి వస్తోందన్నారు. ప్రాజెక్టులోకి వరదనీరు ప్రమాదకర స్థాయిలో వస్తుండడంతో ముందుజాగ్రత్తగా దిగువకు నీటిని వదులుతున్నామన్నారు. వర్షాకాలం ఇంకా పూర్తికాలేదని, మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండగానే వస్తానని ముఖ్య మంత్రి చెప్పారన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే సీఎం పర్యటన ఉంటుందన్నారు. -
‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్ప్లో డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది. డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది. ‘సాగర్’ వెల వెల జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి. -
‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్ప్లో డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది. డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది. ‘సాగర్’ వెల వెల జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
Advertisement