-
బీటెక్లో ఆన్లైన్ వ్యాల్యుయేషన్
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలో ఇకపై ఆన్లైన్లో వ్యాల్యుయేషన్ చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం ఎంటెక్లో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ వ్యాల్యుయేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన జేఎన్టీయూహెచ్.. ఇకపై బీటెక్లోనూ దానిని అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎంటెక్ పరీక్షల్లో ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్లో చేరే విద్యార్థుల సెమిస్టర్ పరీక్షల మూల్యాంకనాన్ని ఆన్లైన్లో చేపట్టాలని భావిస్తున్నట్లు జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి వెల్లడించారు. మరోవైపు పరీక్షల మూల్యాంకన విధానంలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక లెక్చరర్ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసిన తరువాత అతనికి తెలియకుండానే దానిని మళ్లీ మరో లెక్చరర్తో మూల్యాంకనం చేయిస్తున్నామని, తద్వారా మూల్యాంకనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఇద్దరు చేసిన మూల్యాంకనంలో భారీ తేడాలు ఉంటే మొదట మూల్యాంకనం చేసిన లెక్చరర్ను పిలిపించి మళ్లీ మూల్యాంకనం చేయిస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు జేఎన్టీయూలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతేడాది ఎంటెక్లో ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టిన తాము ఈసారి ఎంటెక్లో 80 సీట్లతో డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలు.. ఈసారి రాష్ట్రంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు, కొన్ని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకునేందుకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి వివరించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అనుబంధ గుర్తింపు కోసం పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. వాటి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. గతంలోనే ప్రభుత్వం రాష్ట్రంలో అదనంగా ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు వద్దని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి కోరినట్లు వివరించారు. మరోవైపు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ పరిశీలన తరువాత ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని వెల్లడించారు. నెలాఖరులో ఇంటర్వ్యూలు.. ఈ నెలాఖరులో 36 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. దీనికోసం 340 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో 154 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, రోస్టర్ విధానంపై స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. -
'ఎంసెట్ కౌన్సెలింగ్పై సుప్రీంకోర్టులో ఇంప్లీడ్'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్పై రేపు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. ఆగస్టు 4న తీర్పుఅ నుకూలంగా వస్తే యథావిధిగా కౌన్సెలింగ్ కొనసాగిస్తామని చెప్పారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిపై 5న సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉన్నత విద్యామండలి ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
'సాక్షి'లో పాలీసెట్ 2014 ఫలితాలు
హైదరాబాద్: పదో తరగతి తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ పరీక్ష ఫలితాలను మే 31న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్లో విడుదల చేశారు. ఫలితాలు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మే 21న నిర్వహించిన పాలీసెట్ పరీక్షకు 2,38,947 మంది హాజరు కాగా 1,67,360 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 9 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. తమ వెబ్సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకొని 9 నుంచి 17 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించారు. ఓఎంఆర్ జవాబు పత్రాలను కూడా జూన్ 4వ తేదీన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సాక్షి వెబ్సైట్లో పాలీసెట్ మాక్ కౌన్సెలింగ్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా విద్యార్థులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటొస్తుందో కూడా తెలుసుకోవచ్చు. పాలీసెట్ 2014 ఫలితాల కోసం చూడండి http://www.sakshieducation.com/results2014/polycet.htm ఏపీఆర్జేసీ, ఆర్డీసీ ఫలితాలు విడుదల రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్జేసీ, ఆర్డీసీ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. అభ్యర్థులు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో తమ మార్కులు, ర్యాంకులు చూసుకోవచ్చు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
Advertisement