-
ఇంజనీంగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి షెడ్యూల్ను ప్రకటించారు. జూన్ 12 నుంచి 21 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 16 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లను మార్చుకొనేందుకు అవకాశం ఉందన్నారు. జూన్ 28న విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు 21 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాపిరెడ్డి తెలిపారు. ఆయా కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి జూలై 3 వరకు గడువు విధించినట్ల షెడ్యూల్లో ప్రకటించారు. -
ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టండి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టని కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామన్నారు. హాస్టళ్లు ఉన్న కాలేజీలు, వర్సిటీల్లో రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ర్యాగింగ్పై సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, అవసరమైతే తొలి ఏడాదిలో చేరిన విద్యార్థులకు వేరుగా నివాస వసతి కల్పించాలని సూచించారు. బాలికల హాస్టళ్లల్లో మహిళా అధ్యాపకులు, బాలుర హాస్టళ్లలో పురుష అధ్యాపకులు రాత్రి వేళల్లో నిద్రించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. -
రాష్ట్రం వచ్చినా ఇంకా అసంతృప్తి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణ రావడమే సర్వరోగ నివారిణి కాదు గత పాలకులు ఉన్నత విద్యను భ్రష్టు పట్టించారు: దేశపతి ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి: కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా నిరుద్యోగ యువతలో అసంతృప్తి కనిపిస్తోందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం రావడం ఒక్కటే అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణి కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ వికాస సమితి, తెలంగాణ సోషల్ ఫౌండేషన్, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో ‘ఉన్న త విద్యా రంగంలో ప్రస్తుత సవాళ్లు- వాటి పరిష్కారానికి చర్యలు’ అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సిలబస్ను రూపొందించామని, దాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. తద్వారా యువతకు కొంత ఊరట లభిస్తుందన్నారు. ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సిలబస్ను రూపొందించినట్లు చెప్పారు. ఈ సదస్సులో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆయా అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు, సీఎం సలహాదారు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సోషల్ ఫౌండేషన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్రెడ్డి ఈ సదస్సుకు అధ్యక్షులుగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఆక్టా ప్రతినిధి డాక్టర్ శ్రీధర్రెడ్డి, న్యాయవాది భరత్కుమార్ తదితరులు సదస్సులో ప్రసంగించారు. ‘ప్రైవేటు’ చేతుల్లో ఉన్నత విద్య గత ప్రభుత్వాల 60 ఏళ్ల పాలనలో ఉన్నత విద్య ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. వారంతా విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రస్తుతం సంస్కరణలు అవసరం. యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి. ఖాళీలను భర్తీ చేయాలి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలి. వర్సిటీలకు నిధులిచ్చి బలోపేతం చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రైవేటు రంగాన్ని నియంత్రించాలి. - దేశపతి శ్రీనివాస్ నాటి పరిణామాలే కారణం 1990 నుంచి మొదలైన పరిణామాలే ప్రస్తుతం ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం. అప్పట్నుంచే ఉన్నత విద్యలో పెట్టుబడులు పెట్టలేమని ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. 1994 నుంచి మరీ ఎక్కువైంది. ప్రైవేటు భాగస్వామ్యం పెరిగింది. ఉన్నత విద్యను అత్యవసరంగా కాకుండా.. ఒక లగ్జరీగానే చూడాలని ప్రపంచ బ్యాంకు చెప్పడంతో సబ్సిడీలను 25 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. యూనివర్సిటీలను వదిలేసింది. 1989 తర్వాత ప్రొఫెసర్ల నియామకాలు లేవు. ప్రస్తుతం నియామకాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగం బలంగా తయారు కావాలి. వర్సిటీల్లో డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలి. - ప్రొఫెసర్. కోదండరాం పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి ప్రైవేటు రంగం కేవలం బోధన కే పరిమితమైంది. ప్రభుత్వ రంగం దెబ్బతింది. ఇప్పటికైనా పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) ప్రభుత్వ రంగంలో చర్యలు మొదలు కావాలి. కొత్త రాష్ట్రం అయినందున ఈ దిశగా దృష్టి పెట్టాలి. ఉన్నత విద్యా రంగం దెబ్బతింటే అన్ని రంగాలకు అది సమస్యే అవుతుంది. - చెన్నమనేని రమేశ్, ఎమ్మెల్యే
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement