-
మళ్లీ మళ్లీ.. TDP చీప్ ట్రిక్స్
ఈ ఫొటోలో పచ్చ కండువా కప్పించుకుంటున్న వ్యక్తి కడప బాలాజీనగర్కు చెందిన మాజీ కార్పొరేటర్ రాజశేఖరరెడ్డి. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి సమక్షంలో తిరిగి టీడీపీలో చేరారు. టీడీపీ నేతగా గత కొంతకాలంగా కడపలో చలామణీ అవుతున్నారు. అంతలోనే చంద్రబాబు వద్ద మరోమారు అదే మాజీ కార్పొరేటర్కు టీడీపీ కండువా కప్పించారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరికలంటూ ప్రచారం చేసుకున్నారు. ఇతను ప్రొద్దుటూరు 22వ కౌన్సిలర్ మహమ్మద్గౌస్. టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి తీసుకెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్పించారు. మూడు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మరోమారు టీడీపీ కండువా కప్పి, తెలుగుదేశం పార్టీ చేరినట్లు ప్రచారం చేపట్టారు.జిల్లా వ్యా ప్తంగా ఇలాంటి చేరికలను టీడీపీ ప్రోత్సహిస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: అంతంత మాత్రమే ఉన్న ప్రజామద్దతు... ఎక్కడికెళ్లిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబి్ధదారుల ప్రతిఘటన. పైగా నాన్ లోకల్ ఎఫెక్ట్.. ఇవన్నీ మరిపించేందుకు తెలుగుదేశం అభ్యర్థులు చీప్‘ట్రిక్స్’కు పాల్పడుతున్నారు. వలసల ఉధృతి అంటూ ప్రచార ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనువుగా ఎల్లోమీడియా ప్రచారం కల్పిస్తోంది. వాస్తవంలో టీడీపీ నాయకులు నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారు. ఐదేళ్లుగా ప్రజల చెంతకు చేరకుండా ఉనికి కోసం మమ అన్పిస్తూ కాలక్షేపం చేశారు. ఎన్నికలు సమీపించే కొద్ది చీప్‘ట్రిక్స్’ప్రదర్శిస్తూ ప్రజల్లో చర్చకు ఆస్కారం ఇస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. నాన్ లోకల్ అభ్యర్థిత్వం మరిపించేందుకు.... జిల్లాలో టీడీపీకి స్థానికంగా అభ్యర్థులు కరువయ్యారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులున్నా, డబ్బులున్నవారికే ఆ పార్టీ అధిష్టానం టికెట్లు కట్టబెట్టింది. ఈ కోవలో కడప, రాజంపేట అభ్యర్థులు మాధవీరెడ్డి, సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్లు చెప్పవచ్చు. ఇద్దరు రాయచోటి నియోజకవర్గానికి చెందిన వారు. కడపకు మాధవీరెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యాక సోషల్ మీడియాలో ఫోకస్ కోసం తాపత్రయం పడుతున్నారు. లేని ఊపును సృష్టించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడో నివాసం ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నా మాధవీరెడ్డి సోషల్ మీడియాలో పొందుతున్న ప్రచారాన్ని పసిగట్టిన టీడీపీ అభ్యర్థులు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో ఈవీ సుధాకర్రెడ్డి, ముక్తియార్, కడపలో చలపతి, సత్య లాంటి నేతలకు తాజాగా కండువాలు కప్పడమని పలువురు ఉదహరిస్తున్నారు. మరోవైపు ఐదేళ్లు టీడీపీ కోసం కష్టపడిన వారిని కాదని అభ్యరి్థత్వాలు ఖరారు చేయడం కూడా ఇలాంటి టీప్‘ట్రిక్స్’కు ప్రధాన కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. రాజంపేటలో కూడా ఇలాంటి పరిస్థితే తెరపైకి వచ్చింది. స్థానిక నాయకులను కాదని రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రమణ్యం అభ్యరి్థత్వాన్ని ఖరారు చేశారు. ఇంకా ప్రచా రం చేపట్టిన ఆయన ఇలాంటి ఎత్తుగడలతోనే ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో జోష్... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన తర్వాత వైఎస్సార్సీపీ జోష్ మీదున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పైగా నా హయాంలో మీకుటుంబానికి లబ్ధి చేకూరి ఉంటేనే మీ బిడ్డను మరోమారు ఆశీర్వదించండి. తర తమ భేదం లేకుండా పేదలకు మేలు చేసి ఉంటేనే ఓట్లు వేయండని ధైర్యంగా అభ్యరి్థస్తుండడం వైఎస్సార్సీపీకి అదనపు అర్హత అయిందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామం తెలుగుదేశం పారీ్టకి రుచించడం లేదు. దీంతో టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ‘మేమంతా సిద్ధం’కార్యక్రమం తర్వాత వైఎస్సార్సీపీ ఊపు పెరగడమే అందుకు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అనేక మంది టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, మైదుకూరులో రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రవిశంకర్రెడ్డి, కొండారెడ్డి, కమలాపురంలో సాయినాథశర్మ లాంటి నాయకులు వచ్చి చేరడాన్ని పలువురు ఉదహరిస్తుండడం విశేషం. -
ప్రొద్దుటూరు టీడీపీలో గందరగోళం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. తెలుగుతమ్ముళ్లు తలోదారిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్రమం తప్పకుండా ఒకరి తర్వాత మరొకరు తెరపైకి వస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరికి వారు అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలదన్నట్లు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మైండ్గేమ్ ఆడుతున్నారు. అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయకముందే అభ్యర్థిగా పోస్టర్లు ఒకరు వేయిస్తే, టికెట్ మనదే, పోటీలో ఉండేది మనమే అంటూ మరొకరు వారి వారి నెట్వర్క్ ద్వారా ప్రచారపర్వాన్ని అందుకుంటున్నారు. ‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’అన్నట్లుగా ప్రొద్దుటూరు తెలుగుతమ్ముళ్ల పరిస్థితి నెలకొంది. ఓ వైపు టీడీపీ సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేకపోగా, పొత్తుల సమీకరణ పనిలో అధినేత చంద్రబాబు నిమగ్నమ య్యారు. అధినేత ఆ పరిస్థితిలో ఉంటే నాయకులు ప్రొద్దుటూరులో టికెట్ తమదేనని ఎవరికి వారు తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డిలు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నం కాగా, సోదరులమంతా అధినేతను కలిశాం. తుది జాబితాలో తానే ఉంటానంటూ సురేష్నాయుడు తెరచాటు మంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సీనియర్ నేత వరదరాజులరెడ్డితో వైరం లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. వరదపై మల్లెల మండిపాటు ఈమారు ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు కొండారెడ్డి పోటీలో ఉంటామని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే అర్హత వరదరాజులరెడ్డికి లేదని జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శిస్తున్నారు. సభ్యత్వమే లేని వరద ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాటలు నిజమే అయితే, అధినేత చంద్రబాబు వద్దకెళ్లి వరద కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించే చర్యలు చేపట్టవచ్చు కదా...అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోయినా నోరెత్తని లింగారెడ్డి, ఉనికి కోసం ఆరాట పడుతున్నారని వరద వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుండటంతో ప్రొద్దుటూరు తెలుగుదేశంలో గందరగోళం నెలకొంది. తలోదిక్కుగా తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తుండటం విశేషం. ప్రవీణ్కు వాసు వత్తాసు పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డికి వత్తాసుగా నిలుస్తున్నారు. ఆయన చర్యలే అందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్కుమార్రెడ్డి పేరుతో ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. నలుగురు ఆశావహులు ఉండటం, అధిష్టానం ప్రకటనతో నిమిత్తం లేకుండా రాత్రికి రాత్రి వాల్ పోస్టర్లు తెరపైకి రావడంతో తక్కిన వారు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తింది. తాజాగా శ్రీనివాసులరెడ్డి ఏడాది క్రితమే నారా లోకేష్, ప్రవీణ్ నాయకత్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తేల్చి చెప్పారు. తాను సైతం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. రామేశ్వరం రోడ్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు. కాగా, ఆకార్యక్రమానికి స్థానికంగా నివాసం ఉంటున్న జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డిని ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇన్చార్జి ప్రవీణ్ చర్యలకు వత్తాసుగా నిల్చే విధంగా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి చర్యలున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
-
పుట్టా...పుత్తాకు ఝలక్... ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్కుమార్రెడ్డికే
సాక్షి ప్రతినిధి, కడప: యువగళం పాదయాత్రలో టీడీపీ సీనియర్లకు నారా లోకేష్ షాక్ ఇస్తున్నారు. ఒకవైపు పార్టీ టికెట్లు ఇచ్చేది చంద్రబాబే అని అంటూనే, పరోక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో ఇన్చార్జిల అభ్యర్థిత్వాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, మైదుకూరు, కమలాపురం అభ్యర్థిత్వాలపై నర్మగర్భంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా ఈవినింగ్ వాకింగ్ను తలపించేలా యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నిత్యం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై పరిస్థితి బట్టి రాత్రి 11 గంటల లోపు ముగుస్తోంది. జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని భావిస్తే, అలాంటి వారు తప్పులో కాలేసినట్లే. యువగళం చెంతకు టీడీపీ కేడర్ మినహా, ప్రజలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు సమీకరించిన కేడర్తో ముఖాముఖీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదీ కూడా కులాలు ఆధారంగా చేపడుతూ సాగుతున్నారు. ► పాదయాత్ర అంటే ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని ఆయా సమస్యలను ఎక్స్ఫోజ్ చేయడం ఆనవాయితీగా చూశాం. నాలుగు దశాబ్దాలుగా ఇలాంటి పాదయాత్రనే ప్రజానీకం గమనించింది. కాగా నారాలోకేష్ పాదయాత్ర అందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ప్రతిరోజూ ఈవినింగ్ వాకింగ్లా సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈలోపు స్థానికంగా టీడీపీ నాయకులు సమీకరించిన జనాలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదీకూడా ప్రణాళిక బద్ధంగా కులాలు ఆధారంగా చేపడుతుండడం విశేషం. టీడీపీ కేడర్తోనే చిలుక పలుకులు చెప్పించడం, ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిందిస్తూ నారా లోకేష్ ప్రసంగించడం. ముందస్తుగా రచించిన వ్యూహం ప్రకారం యువగళం పాదయాత్ర చేపట్టడం మినహా వాస్తవికత ఆధారంగా చేపట్టడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మదనపడుతోన్న సీనియర్లు... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆ పార్టీ సీనియర్లను మదనపెడుతోంది. జిల్లాలో చోటుచేసుకున్న పరిణామం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జమ్మలమడుగులోకి ప్రవేశించిన ఆయన ‘లోకేష్–భూపేష్’ జోడి అదిరింది కదూ, అంటూనే అక్కడి కేడర్కు భూషేష్ అభ్యర్థిత్వంపై గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ప్రొద్దుటూరుకు వచ్చే కొద్ది ప్రవీణ్కుమార్రెడ్డికే టికెట్ అని లోకేశ్ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రొద్దుటూరు పౌరుషాన్ని నిలబెట్టింది ప్రవీణ్. మీ తరపున పోరాడినందుకు 29 రోజులు జైలుకెళ్లింది ఈ ప్రవీణ్ (అతన్ని చూపుతూ) అంటూ ఆకాశానికెత్తారు. లోకేష్ మాటలతో అదే వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, టీడీపీ నేత పోట్లదుర్తి సురేష్నాయుడు మొహాల్లో నెత్తురు చుక్కలేదు. మా సహకారం లేకుండా ఏజెంట్లను కూడా పెట్టుకోలేని ప్రవీణ్ను అభ్యర్థిగా ప్రకటించడం ఏమిటి, ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలు సన్నిహితుల వద్ద వాపోతుండడం విశేషం. యువగళం విజయవంతం కోసం.... ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా యువగళం విజయవంతం కోసం టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. నారా లోకేష్ కటౌట్లు పెట్టించడం నుంచి పబ్లిక్ను చూపించడం వరకూ తంటాలు పడుతున్నారు. ఈపరిస్థితుల్లో బయటి ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు పెట్టి ప్రజానీకాన్ని కడపకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఆపై పసుపు కండువాలు వారి చేతికి అప్పగించి, నిర్ణయించిన ప్రాంతంలో లోకేష్ పర్యటన కంటే ముందే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు నిర్వహిస్తుండడం విశేషం. పుట్టా...పుత్తాకు ఝలక్ మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో కొనసాగిన యువగళం యాత్రకు అక్కడి ఇన్ఛార్జిలు పుట్టా సుధాకర్యాదవ్, పుత్తా నరసింహారెడ్డిలు కృషి చేశారు. కాగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో లాగా ఇక్కడ కూడా ఆ ఇరువురి నేతల అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇస్తారని ఆశించారు. కాగా, పసువు జెండాను గెలిపించాలని లోకేష్ కోరడం మినహా ఇక్కడి అభ్యర్థులుగా ఆ ఇరువుర్ని గెలిపించాలని లోకేష్ పేరు పెట్టి చెప్పకపోవడం, పుట్టా, పుత్తాల వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. పైగా అటు పుట్టా సుధాకర్ వ్యతిరేకిస్తున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలు నారా లోకేష్ యువగళంలో ప్రత్యక్షం కావడంతో వారు మరింత ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. చెన్నూరు సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంపులో నారా లోకేష్తో వీరశివారెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం కమలాపురం టీడీపీలో అలజడి రేపుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్ జిల్లా) : డ్వాక్రా మహిళలపై దాడి చేసిన కేసులో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షురాలు బోగాల లక్ష్మీనారాయణమ్మతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి పొదుపు ఖాతాల్లో అవినీతి జరగలేదని, ఆడిట్ జరిగి ఒకవేళ అవినీతి జరిగిందని నిర్ధారణ అయితే ఆ డబ్బు తాను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు తమ డబ్బు ఇవ్వాలని ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం వేకువజామున ప్రవీణ్కుమార్రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిపై 147, 148, 323, 324, 307, 386, 509 రెడ్విత్ 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. గురువారం జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రవీణ్కుమార్రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఘర్షణ : ఏఎస్పీ ప్రేర్ణాకుమార్ టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్లే గొడవ జరిగిందని ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణాకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 12న లక్ష్మీనారాయణమ్మ అనే మహిళ రూ.40 లక్షల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ డ్వాక్రా మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణమ్మ గురువారం ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్లి మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఏదైనా ఉంటే తన ఇంటి వద్దకు రమ్మని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడారన్నారు. దీంతో డ్వాక్రా మహిళలు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని తెలిపారు. ‘ధైర్యం ఉంటే లోపలికి రండి..’ అంటూ ప్రవీణ్ మరోమారు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty : గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement