-
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
సాక్షి, సిద్ధిపేట: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, పార్టీ పార్లమెంటరీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కేసీఆర్ అన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలి. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనన్నారు. కాగా, కేసీఆర్కు ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్లోని తన నివాసంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.. సర్జరీ అనంతరం నేడు తొలిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్ట్మార్టం చేసిన బీఆర్ఎస్.. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా రెండు జాతీయ పార్టీలపై పైచేయి సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఎన్ని కల సన్నద్ధతను వేగవంతం చేస్తూనే, మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా దృష్టి సారించారు. -
ప్రజలకు, నాకు దూరం పెంచొద్దు: పీఎం మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘మోదీజీ’, ‘ఆదరణీయ’ వంటి గౌరవ సూచకమైన పదాలను ఉపయోగించి తనను సంబోధించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ ఎంపీలకు కోరారు. గురువారం నిర్వహిచంన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బీజేపీ పార్టీలో తాను కూడా ఓ చిన్న కార్యకర్తనని అన్నారు. అయితే తనను పిలిచే క్రమంలో పేరు ముందు, వెనక గౌరవ సూచక పదాలు ఉపయోగించవద్దని అన్నారు. దేశ ప్రజల దృష్టిలో తాను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరినని పేర్కొన్నారు. తనను సంబోధించే క్రమంలో ‘శ్రీ, ఆదరణీయ’ వంటి అనే గౌరవ సూచకమైన పదాలు దేశ ప్రజలకు తనకు మధ్య దూరం పెంచినట్లు అవుతుందని చెప్పారు. ప్రజలు తనను కూడా మీఅందరిలో ఒకడిగానే చూస్తారని పేర్కొన్నారు. ఇక ఇటీవల మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించడంలో.. బృందంగా అందరి సమృష్టి కృషి ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. -
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ
-
అవినీతిపరులను కాపాడేందుకే... విపక్షాల ఉద్యమం
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల వల్లే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలు అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరును ఆపలేవని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఖ్యాతి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఈ సమయంలో, భారత వ్యతిరేక శక్తులు అంతర్గతంగా, వెలుపలా చేతులు కలపడం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఆయన.. కొన్ని ‘అవినీతి రక్షణ ఉద్యమం’ ప్రారంభించాయంటూ పరోక్షంగా దుయ్యబట్టారు. కొందరికి కోపం కూడా వస్తోందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే గతంలో ఇంతగా అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. ‘తప్పుడు ఆరోపణలతో దేశం తలవంచదు. అవినీతిపై చర్యలు ఆగవు. భారత వ్యతిరేక శక్తులు బలమైన పునాది వంటి రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తున్నాయి. దేశాభివృద్ధిని ఆపేందుకు దాడికి దిగుతున్నాయి. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, వాటి విశ్వసనీయతను నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి’అని ఆరోపించారు. 2004–14 సంవత్సరాల మధ్య యూపీఏ ప్రభుత్వం మనీలాండరింగ్ ఆరోపణలపై రూ.5 వేల కోట్ల సొత్తును స్వాధీనం చేసుకోగా 9 ఏళ్లలో తమ ప్రభుత్వం రూ.1.10లక్షల కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయాలకు, తమ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలకు సంబంధముందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతగా విజయాలు సాధిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అంతగా లక్ష్యంగా చేసుకుంటాయన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై పలు అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. బీజేపీ వరుస విజయాలు నమోదు చేసుకుంటున్న నేపథ్యంలోనే గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల విమర్శల దాడులు ఎక్కువైనట్లు చెప్పారు. మున్ముందు ఈ విమర్శలు అన్ని స్థాయిల్లోనూ తీవ్రతరమవుతాయని హెచ్చరించారు. ఏప్రిల్ 6–14 మధ్య సేవా కార్యక్రమాలు బీజేపీ వ్యవస్థాపక దినం ఏప్రిల్ 6 నుంచి మొదలుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజు వరకు సొంత నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని మోదీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. సమాజంపై ఎంతో ప్రభావం చూపే రాజకీయ నేతలు రాజకీయేతర అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. ‘‘విష రసాయనాల నుంచి నేలకు విముక్తి కల్పించాలి. ఎంపీలు కొత్త సాంకేతికతను అలవర్చుకునేందుకు నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలకు మోదీని పార్టీ ప్రశంసించింది. బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ‘దొంగలందరి ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఆందోళనలకు బీజేపీ ఓబీసీ మోర్చా నిర్ణయించింది. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 14 దాకా రాహుల్కు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టనున్నట్టు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఓబీసీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో ర్యాలీ చేశారు. ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
దేశ భద్రతపై మౌనమా? కేంద్రాన్ని నిలదీసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు అంశంపై పార్లమెంట్లో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమిటని నిలదీశారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ ఎంపీలను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. మన దేశ భూభాగాన్ని చైనా దురాక్రమిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో చర్చిద్దామని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశ రక్షణ, సరిహద్దు పరిస్థితిపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తన చర్యలు, విధానాలు ఏమిటో కూడా చెప్పాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? దేశ సరిహద్దును చైనా సైన్యం ఉల్లంఘిస్తుండడం అత్యంత ఆందోళనకరమైన అంశమని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చైనా సైన్యం దాడులను సమర్థంగా తిప్పికొడుతున్న మన జవాన్లకు మన దేశం యావత్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సవాలు ఎదురైనప్పుడు పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోవడం ఒక ఆనవాయితీ అని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చ జరగకపోవడం వల్ల రాజకీయ పార్టీలకు, ప్రజలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో తెలియడం లేదన్నారు. దేశంలో విభజన రాజకీయాలు, సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కొనసాగుతున్నాయని, దీనివల్ల విదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదిరించడం మన దేశానికి కష్టతరం అవుతుందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను చట్టం పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. జ్యుడీషియరీని పలుచన చేయొద్దని సూచించారు. ‘చైనా’పై చర్చ జరగాల్సిందే పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా మీ హయాంలో చర్చించారా?: కేంద్రం న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలన్నీ మరోసారి డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ సారథ్యంలో బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(యూ), వామపక్షాలతో సహా 12 విపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ మౌనం వీడాల్సిందే. చైనా దురాక్రమణ యత్నాలపై మా ప్రశ్నలకు సభలో బదులిచ్చి తీరాల్సిందే’’ అని వారంతా నినదించారు. అయితే ఆ డిమాండ్ను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో ఇలాంటి అంశాలను సభలో చర్చకు తాము డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement