-
సిద్దిపేట ‘సేంద్రియ ఎరువు’.. పేరేంటో తెలుసా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారైన నాణ్యమైన సేంద్రియ ఎరువు త్వరలో మార్కెట్లోకి రానుంది. మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్తను సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ తడి చెత్తతో ఇప్పటికే సీఎన్జీని తయారు చేసి విక్రయిస్తుండగా.. తాజాగా ఎరువును కూడా తయారు చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో ఈ నెల 21న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణ.. సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 కుటుంబాలు ఉండగా 1,57,026 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను ఇంటింటి నుంచి సేకరించడాన్ని డిసెంబర్ 2020లో ప్రారంభించారు. ఈ చెత్తను సేకరించేందుకు 52 వాహనాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 60 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో 70 శాతం తడి, 30 శాతం పొడి చెత్త ఉంటోంది. ఈ లెక్కన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త, 18 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.6 కోట్ల వ్యయంతో బయో – సీఎన్జీ ప్లాంట్, సేంద్రియ ఎరువుల కేంద్రం నిర్మించారు. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. రాష్ట్రంలోనే మొదటిదైన ఈ ప్లాంట్ను 2021 డిసెంబర్ 20న బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్తో కలసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఇళ్ల నుంచి సేకరించిన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త నుంచి ఆహార వ్యర్థాలు, కురగాయలు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇలా వేరుచేసిన తర్వాత 10 మెట్రిక్ టన్నుల తడి చెత్తను బయో–సీఎన్జీ తయారు చేయడానికి మిగతా 32 మెట్రిక్ టన్నుల చెత్తను సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. సిద్ధం చేసిన సేంద్రియ ఎరువును 40 కేజీల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్యాగు అసలు ధర రూ.600 కాగా సిద్దిపేట రైతులకు రూ.300కే విక్రయించనున్నారు. 21న రైతులకు అవగాహన సదస్సు సేంద్రియ ఎరువుల ఆవశ్యకతపై రైతులకు ఈ నెల 21న సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో అవగాహన కల్పించనున్నారు. అనంతరం మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట బ్రాండ్తో సేంద్రియ ఎరువు: మంత్రి హరీశ్రావు మంత్రి హరీశ్రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిద్దిపేట బ్రాండ్తో చెత్త ద్వారా తయారు చేసిన ఎరువును రైతులకు అందించబోతున్నామన్నారు. సిద్దిపేట ప్రజలు రోజు వేసే చెత్తతో ఒక గొప్ప సంపదను తయారు చేసి రైతులకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సేంద్రియ ఎరువుతో అన్నీ పంటల నుంచి అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందని చెప్పారు. -
Siddipet: తడి చెత్తతో సీఎన్జీ
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా తడి చెత్తతో సీఎన్జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) తయారు చేసే ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్వచ్ఛబడిని ఏర్పాటు చేసి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి, హానికరమైన చెత్తను సేకరిస్తున్నారు. ఇప్పటికే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నా, అంచనాలకు మించి చెత్త రావడంతో బెంగళూరు తరహాలో సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు నిర్ణయించారు. మంత్రి ఆలోచన మేరకు మున్సిపల్ అధికారులు ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యయం.. రూ.4.7 కోట్లు సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.4.7 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షెడ్ నిర్మాణం చివరి దశకు చేరింది. స్వచ్ఛ భారత్ నిధులతో ఈ ప్లాంట్ను నెలకొల్పుతున్నారు. ఈ మున్సిపాలిటీలో 39,616 కుటుంబాల్లో 1.46 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ నిత్యం 25 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నారు. ప్రాజెక్ట్ నమూనా చిత్రం గ్యాస్ తయారీ ఇలా ఇంటింటా సేకరించిన తడి చెత్తను తొలుత క్రషింగ్ చేస్తారు. అనంతరం దీనిని పైపు ద్వారా ఫ్రి డైజెస్టర్ అనే ట్యాంక్లోకి పంపిస్తారు. తర్వాత డైజెస్టర్ ట్యాంక్లోకి పంపించి మూడు రోజులు నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి 14 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తు ఉన్న మరో ట్యాంక్లోకి ఇక్కడ తయారైన ద్రావణాన్ని పంపిస్తారు. అనంతరం ఆ ట్యాంక్లో మైక్రో ఆర్గాన్లను వేస్తారు. ఆ సమయంలో విడుదలయ్యే మిథేన్ గ్యాస్ నుంచి సీఎన్జీని వేరు చేసి సిలిండర్లలో నింపుతారు. నిర్వహణ బాధ్యత ప్రైవేటుకు గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపాలిటీతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. గ్యాస్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని 25 శాతం మున్సిపాలిటీ, 75 శాతం కంపెనీ తీసుకుంటాయి. ఆగస్టు చివరి వరకు పూర్తి ఆగస్టు చివరి నాటికి గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తవు తుంది. అనంతరం ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్య తలు అప్పగిస్తాం. దాదాపు ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాం. –రమణాచారి, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట -
సిద్దిపేటలో వినూత్న ప్రక్రియ
సాక్షి, సిద్దిపేట: వినూత్న ప్రక్రియలకు సిద్దిపేట వేదికగా నిలుస్తోంది. కొన్నేళ్లుగా ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను వార్డు స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి అక్కడ ఎరువు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇలా తయారైన ఎరువును పట్టణంలోని మిద్దె తోటల పెంపకందారులకు నామమాత్ర రుసుముతో అందించాలని యోచిస్తోంది. మున్సిపల్ ఆలోచనకు సత్ఫలితాలు లభిస్తే భవిష్యత్తులో పట్టణంలో మిద్దె తోటల పెంపకానికి సేంద్రియ ఎరువులు అందుబాటులోకి రానున్నాయి. తడి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువు తయారీ ఇలా ఇంట్లో ప్రతిరోజూ మిగిలిపోయిన కూరగాయలు, పూజకు వినియోగించిన పువ్వులు, కుళ్లిన పండ్లు, మిగిలిన అన్నం– కూరలు, మాంస వ్యర్థాలు ఇతరత్రా తడి చెత్త నుంచి సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ ఎరువు తయారు చేసే ప్రక్రియను గతేడాది చేపట్టారు. అందుకు అనుగుణంగానే పట్టణంలోని పాత మాతాశిశు సంక్షేమ కేంద్రం, లింగారెడ్డిపల్లి, మందపల్లి డంప్యార్డు, బుస్సాపూర్ డంప్యార్డులో తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని ఇళ్ల నుంచి 27 మెట్రిక్ టన్నుల తడి చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన తడి చెత్తను నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇలా రోజూ సేకరిస్తున్న తడి చెత్త నుంచి ఆయా ప్రాసెసింగ్ యూనిట్లలో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ లెక్కన రోజూ తొమ్మిది మెట్రిక్ టన్నుల తడి చెత్తను ఎరువుగా మార్చుతున్నట్లు మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి. నాలుగు చోట్ల తయారీ స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యంగా పట్టణంలో నాలుగు చోట్ల ప్రస్తుతం తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. మంత్రి హరీశ్రావు ఆలోచనకు అనుగుణంగా వార్డు స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లను భవిష్యత్తులో విస్తరించే ఆలోచనలో ఉన్నాం. వార్డులో ప్రజల నుంచి సేకరించిన తడి చెత్తను అదే వార్డులో ఎరువుగా తయారు చేస్తాం. ముందుగా హరితహారం మొక్కలకు, మిద్దె తోటల పెంపకందార్లకు సేంద్రియ ఎరువును పంపిణీ చేస్తాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ బల్దియా ఆలోచన బాగుంది మిద్దె తోటలకు తడి చెత్తతో తయారైన సేంద్రియ ఎరువును అందించాలనే మున్సిపల్ అధికారుల ఆలోచన మంచిది. ప్రస్తుతం పట్టణాలో మిద్దె తోటల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే పెద్దసంఖ్యలో మిద్దె తోటల పెంపకం సాగుతోంది. బహిరంగ మార్కెట్లో పది రూపాయలు పెట్టి ఎరువును కొంటున్నాం. మున్సిపల్ అధికారులు ఇప్పుడు నామమాత్ర ధరతో ఎరువు పంపిణీ చేస్తే ఉపయోగకరమే. – నాగరాజు, మిద్దె తోటల పెంపకదారుడు మిద్దె తోటలకు సరఫరా దిశగా.. జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణీకరణ పెరుగుతోంది. ప్రజల జీవనశైలి మారుతోంది. తమ అభిరుచులకు అనుగుణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మున్సిపల్ రికార్డుల ప్రకారం పట్టణంలో అపార్ట్మెంట్ల సంస్కృతి 20 శాతం మేరకు పెరిగింది. అదే సమయంలో ఇష్టపడి నిర్మించుకుంటున్న ఇళ్ల పై భాగంలో మిద్దె తోటల పెంపకానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వంద వరకు మిద్దె తోటలను సంబంధిత గృహ యజమానులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పట్టణంలో తడి చెత్త ద్వారా తయారైన సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు, రైతులకు పంపిణీ చేసిన మున్సిపల్ అధికారులు ఇక మీదట మిద్దె తోటలకు సేంద్రియ ఎరువును సరఫరా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే ప్రతిరోజూ తొమ్మిది మెట్రిక్ టన్నుల తడి చెత్త ద్వారా ఉత్పత్తి అవుతున్న సేంద్రియ ఎరువును మిద్దె తోటలతో పాటు హరితహారం కింద పెంచే మొక్కలకు అందించాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పట్టణంలో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద ప్రత్యేకంగా సేంద్రియ ఎరువు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మిద్దె తోటల యజమానులను చైతన్యం చేసే దిశగా మున్సిపల్ యంత్రాంగం ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. నామమాత్ర రుసుముతో సేంద్రియ ఎరువును విక్రయించడం ద్వారా తడి చెత్త సమస్య పరిష్కారంతో పాటు బల్దియాకు ఆదాయపరంగానూ కలిసొచ్చేలా ద్విముఖ వ్యూహంతో మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ చదవండి: మీకిస్తే సరిపోతుందా .. పొట్టు పొట్టు జేస్తా: మంత్రి మల్లారెడ్డి ఆడియో కరోనా సెకండ్ వేవ్: రానున్న మూడు నెలలూ గడ్డురోజులే! -
సేంద్రియ పాల ఆవశ్యకత
రైతులకు బాసటగా నిలుస్తున్నది. మన దేశం సగటున రోజుకు 170 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తూ, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అధిక పాల ఉత్పత్తితో పాటుగా, నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పాల ఉత్పత్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ పూర్వరంగంలో మనం కూడా సేంద్రియ పాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భూమిలో సేంద్రియ ఎరువులు వేసి పండించిన దాణాలను, పశుగ్రాసాలను మేసిన పశువులు ఇచ్చే పాలే సేంద్రియ పాలు. ఇందులో ఎటువంటి రసాయనిక అవశేషాలు ఉండవు. సేంద్రియ పాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. ► రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం, తద్వారా ఖర్చు తగ్గడం. ► రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యమైన, కల్తీ లేని పాలను ఉత్పత్తి చేయటం. ► సేంద్రియ పాలలో ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. అలానే పాలీ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువే. ► సేంద్రియ పాల పదార్థాలలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ► రసాయనిక ఎరువుల అవశేషాలు పాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అవి శరీరంలోని ముఖ్యభాగాలను – కాలేయాన్ని, మూత్రపిండాలను, పేగులను దెబ్బతీస్తాయి. ► సేంద్రియ పాలను ఉత్పత్తి చేయటం అంత తేలికైన విషయం కాదు. పశువుకు మేపే దాణా, మేత మొత్తాన్నీ సేంద్రియ పద్ధతుల్లోనే పండించాలి. మొక్కజొన్న, జొన్నలు, తవుడు మొదలైనవి. ► సాధారణంగా భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. రసాయనిక ఎరువుల వాడకం వలన ఇవి నశిస్తాయి. దీని వలన భూసారం తగ్గిపోయి, భూమి తన ఉత్పాదక శక్తిని కోల్పోతుంది. ► రసాయనిక ఎరువులు గాని, పురుగుమందులు గాని పశుగ్రాసాల సాగులో వాడితే ఆ పశుగ్రాసాలను తిన్న పశువుల పాలలో వాటి అవశేషాలు పేరుకుంటాయి. కొవ్వులతో జత కట్టే గుణం రసాయనాలకు ఉండటమే ఇందుకు కారణం. ఇటువంటి పాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ► పిల్లలు త్వరగా పరిపక్వ దశకు రావడానికి కూడా ఇదే కారణం. కాబట్టి సేంద్రియ పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ఉత్తమం. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి. -
చెత్త చక్కని ఎరువై.. పచ్చని ఇంటిపంటలై..!
గుంటూరు నగరంలో తడి చెత్త, సేంద్రియ వ్యర్థాలపై గృహిణులు సమరం ప్రకటించారు. తడి చెత్త, వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి ఇవ్వకుండా సేంద్రియ ఎరువు తయారు చేస్తూ.. సేంద్రియ ఎరువుతో ఎంచక్కా ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో కుండీలు, కవర్లు, కంటెయినర్లలో ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను పెంచుతున్నారు. నగరపాలక సంస్థకు భారంగా మారిన చెత్త తరలింపు సమస్య పరిష్కారం కావడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ కూరగాయలు లభిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండి దోమలు, అంటు వ్యాధుల బెడద తగ్గుతోంది. గుంటూరు నగరంలోని 23,24,25,28 వార్డుల్లో గృహిణులు తమ ఇళ్ళల్లో వచ్చే తడి వ్యర్ధాలతో ఇంటి దగ్గరే కంపోస్టు తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ గుంటూరు సాధన కృషిలో భాగస్వాములవుతున్నారు. నగరపాలక సంస్థ, ఐటీసీ ‘బంగారు భవిష్యత్తు’ విభాగాల ఆధ్వర్యంలో నాలుగు వార్డుల్లో ఘన వ్యర్థాల నిర్వహణ పైలట్ ప్రాజెక్టు అమలును చేపట్టారు. ఇళ్లు, అపార్టుమెంట్లలో ఐటీసీ సిబ్బంది, వార్డు ఎన్విరాన్మెంటల్ సెక్రెటరీలు, వార్డు వలంటీర్లు ఎవరికి వారు ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీపై అవగాహన కల్పించారు. 1,572 ఇళ్ళలో హోం కంపోస్టింగ్, ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. కంపోస్టు తయారీ విధానం ఇలా.. నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి కంపోస్టు తయారీకి 20 లీటర్ల ఖాళీ బక్కెట్ సరిపోతుంది. బక్కెట్ చుట్టూ రంధ్రాలు చేయాలి. బక్కెట్లో ఒక అంగుళం మేర కొబ్బరి పొట్టు వేయాలి. ప్రతి రోజూ వంట గదిలో పోగుపడే కూరగాయలు, ఆకుకూరల వ్యర్ధాలు, ముక్కలు, పండ్ల తొక్కలు, పూలు, టీ పొడిని ఈ కంపోస్టు బక్కెట్లో వేయాలి. తడి చెత్తను ఇందులో వేసిన ప్రతిసారీ పైన అంగుళం మందాన కొబ్బరి పొట్టును వేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ వారంలో రెండు సార్లు బక్కెట్లో కింది నుంచి పైకి కలియ తిప్పాలి. పది రోజుల తరువాత వేసిన వ్యర్ధాలు కుళ్లడం ప్రారంభమవుతుంది. 45 రోజులకు నాణ్యమైన రసాయనాలు లేని సారవంతమైన సేంద్రియ ఎరువు తయారవుతోంది. బక్కెట్లో ఒక్కోసారి పురుగులు కనిపించే అవకాశం ఉంటుంది. బక్కెట్లోని వ్యర్థాల్లో 40 శాతం తేమ ఉండేలా చేసుకోవడంతోపాటు, మార్కెట్లో లభ్యమయ్యే ద్రావణం వేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. వంటింటి నుంచి వెలువడే తడి చెత్త, వ్యర్థాలను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయడానికి అవసరమైన కొబ్బరి పొట్టును నగరపాలక సంస్థ ఉచితంగా ఇస్తుండడంతో గృహిణులు కంపోస్టు తయారీపై ఆసక్తి చూపుతున్నారు. వ్యర్థాల పునర్వినియోగంతో పాటు నగరవాసుల సేంద్రియ ఇంటిపంటల సాగుకు నగర పాలకుల ఊతం దొరకడం హర్షించదగిన పరిణామం. చెత్తకు కొత్త అర్థం ఇస్తున్నాం ఇంట్లో చెత్తను రోడ్లపై, కాలువల్లో పడేయకుండా హోంకంపోస్టు ద్వారా ఎరువుగా మార్చి చెత్తకు కొత్త అర్ధం ఇస్తున్నాం. జీఎంసీ, ఐటీసీ సహకారంతో మా ఇంట్లోనే నాణ్యమైన ఎరువు తయారు చేసుకుంటున్నాం. మా వీధుల్లో ఎవరూ చెత్త వేయడం లేదు. దోమలు, ఈగలు తగ్గాయి. – ఏలూరి విజయలక్ష్మి, వేమూరివారి వీధి, గుంటూరు వలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం తడి వ్యర్ధాల నిర్వహణ ఇంట్లోనే జరుగుతోంది. ఇళ్ళల్లో చక్కని కిచెన్ గార్డెన్ పెంచడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండి, దోమలు, అంటువ్యాధుల నివారణ జరుగుతోంది. ఐటీసీ సహకారంతో వార్డు వలంటీర్లు, వార్డు ఎన్విరాన్మెంట్ సెక్రటరీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పెద్ద మొత్తంలో వ్యర్ధాలు ఉత్పత్తి చేసే కళ్యాణమండపాలు, హోటల్స్లో క్లస్టర్ కంపోస్టుల ఏర్పాటు జరుగుతోంది. ఇళ్లలోనే చెత్తతో కంపోస్టు చేయడం, కిచెన్ గార్డెన్ల సాగుపై నగర ప్రజలందరూ దృష్టి పెట్టాలి. స్వచ్ఛ సర్వేక్షన్ 2020లో నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించాలి. – చల్లా అనురాధ, కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ సొంత కంపోస్టుతో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం మా ఇంటిలో చెత్తను బక్కెట్లో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నాను. ఆ కంపోస్టును మొక్కలు, ఆకుకూరలకు ఎరువుగా వేస్తుంటే ఎంతో ఏపుగా, చక్కగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువులు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేందుకు సేంద్రియ ఎరువును మేమే తయారు చేసుకొంటున్నాం. చెత్తను మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వడం లేదు. – వేమూరి విశాలక్షి, ఏటీఅగ్రహారం, గుంటూరు కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం గుంటూరు నగరంలో తడి చెత్త, వ్యర్థాల నిర్వహణపై ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నాం. సేంద్రియ ఎరువు తయారీపై గృహిణులకు అవగాహన కల్పించాం. అందుకు అవసరమైన కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం. ఈ సేంద్రియ ఎరువుతో రసాయన మందులు వినియోగం లేకుండా, చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు కిచెన్ గార్డెన్లో పెంచుకోవచ్చు. నగర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలి. – ఐ.శామ్యూల్ ఆనందకుమార్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్, గుంటూరు – ఓబుల్రెడ్డి వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు – గజ్జెల రాంగోపాల్రెడ్డి, స్టాప్ ఫొటోగ్రాఫర్, గుంటూరు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement