-
‘రైతుబంధు’ బావుందా..?
కొణిజర్ల : ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎలా ఉంది.. రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయా.. పెట్టుబడి చెక్కులు బ్యాంకు నుంచి మార్చుకున్నారా.. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు..’ అంటూ రైతుబంధు పథకం జిల్లా ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం తీరుతెన్నులను మండలంలోని అమ్మపాలెం గ్రామంలో మంగళవారం ఆమె పరిశీలించారు. గ్రామంలో ఎంత మంది రైతులు ఉన్నారు.. ఎన్ని పట్టాలు.. చెక్కులు ఎన్ని ఇచ్చారని రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొందరికి చెక్కులు ఇవ్వనట్లుగా రికార్డుల్లో నమోదు చేయగా.. దానిపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్ఆర్ఐ రైతుల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వారికి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడారు. గ్రామంలో అసైన్డ్ భూమి కొనుగోలు చేసి అనుభవదారులుగా ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వకూడదని నిర్ణయించామని కలెక్టర్ లోకేష్కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ భూములను అలాగే ఉంచామన్నారు. ఆ భూములకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఆమె ఉపాధిహామీ పథకం గురించి రైతులకు వివరించారు. పొలాల్లో నీటి గుంటలు తీసుకోవాలని, పాడైపోయిన బోర్లు బాగు చేయించుకోవడానికి ఈజీఎస్లో రూ.20వేల వరకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధిహామీ పథకం కింద బావి పూడిక కూడా తీయించుకోవచ్చన్నారు. అయితే దీని గురించి ఈజీఎస్ సిబ్బంది తమకు చెప్పలేదని రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. ఆవులు, మేకలు, గొర్రెలు ఉన్న వారికి షెడ్ల నిర్మాణానికి రూ.55వేలు ఇస్తామన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామన్నారు. మూడున్నర ఎకరాల గ్రామకంఠం భూమి గ్రామంలో ఉందని, దానిని శ్మశాన వాటిక కోసం కేటాయించాలని స్థానికులు కోరగా.. పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ టి.పూర్ణచంద్ర, డీపీఓ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ ఇందుమతి, తహసీల్దార్ ఎం.శైలజ, ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, సర్పంచ్ జ్యోతి, జెడ్పీటీసీ సభ్యుడు సోమ్లా, ఈఓపీఆర్డీ కె.జమలారెడ్డి, ఏఓ టి.అరుణజ్యోతి, ఏపీఓ సరిత, ఆర్ఐ కొండలరావు, వీఆర్ఓ ఎస్.రామారావు, ఏఈఓ జగదీష్ పాల్గొన్నారు. ‘పెట్టుబడి’కే వినియోగించాలి.. చింతకాని : రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందజేసిన పెట్టుబడి సాయాన్ని ఇతర ఖర్చులకు కాకుండా వ్యవసాయానికే వినియోగించుకోవాలని నీతూ ప్రసాద్ తెలిపారు. చినమండవ, లచ్చగూడెం గ్రామాల్లో రైతుబంధు పథకం అమలు తీరును పరిశీలించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో ఫొటోలు, పేర్లు, విస్తీర్ణాలు, ఆధార్ నంబర్లు, కులం పేర్లు తప్పుగా నమోదయ్యాయని కొంతమంది రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. తమకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని మరికొందరు చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని, ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులను వెంటనే సరిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చినమండవ, లచ్చగూడెం గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడి పనులపై ఆరా తీశారు. పనిచేసినా వేతనాలు రావటం లేదని కొంతమంది కూలీలు తెలిపారు. వేతనాలు రాని కూలీల వివరాలను పంపిస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఇందుమతి, స్థానిక తహసీల్దార్ కారుమంచి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎండీ నవాబ్పాషా, ఏఓ కాసర అనిల్కుమార్ పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు పేదల దరిచేరేలా చూస్తా
-పీఆర్అండ్ఆర్డీ నూతన డెరైక్టర్ - బాధ్యతలు స్వీకరించిన నీతూకుమారి ప్రసాద్ సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను చిట్టచివరి లబ్దిదారునికి కూడా సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డెరైక్టర్ నీతూకుమారి ప్రసాద్ అన్నారు. పీఆర్అండ్ఆర్డీ విభాగానికి నూతన డెరైక్టర్గా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. పీఆర్అండ్ఆర్డీతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్)లకు సీఈవోగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం నీతూప్రసాద్ కే అప్పగించింది. నూతన బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆమెసాక్షి’తో మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమన్వయంగా ముందుకు తీసికెళ్లేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను మంచి అవకాశంగా భావిస్తున్నానన్నారు. ప్రధానంగా.. ఇటీవల జిల్లాల పునర్విభజన ప్రక్రియతో ఏర్పడిన కొత్త జిల్లాల్లో శాఖాపరమైన సమస్యలున్నాయని, వాటి పరిష్కారంపై ముందుగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ సరిపడినంత సిబ్బంది లేకపోవడం, డీఆర్డీఏలో డ్వామా సంస్థను విలీనం చేసి ఆయా జిల్లాల ప్రాజెక్ట్ డెరైక్టర్లను డీఆర్డీవోలుగా నియమించడం, వారికి వేతనాలు ఏ పద్దు నుంచి చెల్లించాలనే అంశంపై స్పష్టత లేకపోవడం.. వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే, సెర్ప్లో పనిచేస్తున్న సుమారు 4వేల మంది ఉద్యోగులకు రెండు నెలలుగా వేతన సవరణ బకాయిలు అందలేదని, రెండు మూడ్రోజుల్లో వారి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఉపాధిహామీ పనులు మెరుగ్గా జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి కేటాయించిన మొత్తం పనిదినాలు డిసెంబరులోగానే ఖర్చుకానున్నాయన్నారు. అదనపు పనిదినాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయని, వీలైనన్ని ఎక్కువ పనిదినాలు మంజూరయ్యేలా కృషిచేస్తానని నీతూ ప్రసాద్ చెప్పారు. దాదాపు 36లక్షలమంది ఆసరా పథకం లబ్దిదారులకు సకాలంలో పింఛన్ అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతానన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఇతర విభాగాలు కూడా తనవద్దే ఉన్నందున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సమన్వయం లేమికి అవకాశం ఉండదన్నారు. మొత్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేసేందుకు కృషిచేస్తానన్నారు. నిస్తేజంగా ఉన్నచోట దూకుడుగా వ్యవహరిస్తానని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. -
సాక్షరభారత్ అవార్డుకు వీర్నపల్లి
కలెక్టర్ నీతూప్రసాద్ కరీంనగర్/ఎల్లారెడ్డిపేట: వందశాతం అక్షరాస్యత సాధించిన ఎంపీ వినోద్కుమార్ దత్తత గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి సాక్షరభారత్ అవార్డుకు ఎంపికైందని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అవార్డును ఈనెల 8న న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో భారత రాష్ట్రపతి అందజేస్తారని వివరించారు. వీర్నపల్లిలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషిచేసిన వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు, గ్రామప్రత్యేకాధికారి, డిప్యూటీ సీఈవో, సంబంధిత జిల్లా అధికారులు, సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ అధికారి, గ్రామ, మండల అధికారులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. సాక్షరభారత్ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణం అని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని ఇతర అన్ని గ్రామాలు 100 శాతం అక్షరాస్యత సాధించుటకు పోటీతత్వంతో కషి చేయాలని పిలుపునిచ్చారు. అవార్డు రావడంపై ఎంపీడీవో చిరంజీవి, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఎంపీపీ ఎలుసాని సుజాత, ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, సర్పంచ్ మాడ్గుల సంజీవలక్ష్మి, ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్ హర్షం వ్యక్తంచేశారు. -
జియోట్యాంగింగ్ చేయాలి
ముకరంపుర : హరితహారంలో భాగంగా వివిధ శాఖల ద్వారా జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలన్నింటికీ వెంటనే జియోట్యాగింగ్ చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షించారు. నాటిన మొక్కలన్నింటికీ రిజిస్టర్ చేయాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. మొక్కలను స్మార్ట్ఫోన్ ద్వారా ఫొటో తీసి జియోట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ విధానంపై బుధవారం సాయంత్రం 4 గంటలకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని శాఖల అధికారులు తమ కంప్యూటర్ ఆపరేటర్ను శిక్షణకు పంపించాలని ఆదేశించారు. -
140 గ్రామాల్లో వందశాతం హరితహారం
కలెక్టర్ నీతూ ప్రసాద్ ముకరంపుర: జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలకు గాను 140 గ్రామ పంచాయతీలలో వంద శాతం మొక్కలు నాటినట్లు కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలంగాణకు హరితహారం ప్రగతిపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో వంద శాతం మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2.86 కోట్ల మొక్కలను నాటామని, వాటి సంరక్షణకు ఫెన్సింగ్, వాటరింగ్ వంటివి సమకూర్చి మొక్కల పెంపుదలకు పటిష్ట ప్రణాళికలు చేపడుతామన్నారు. 2 లక్షల మొక్కలు గ్యాప్ ఫిల్లింగ్ నాటినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు 17 లక్షల మొక్కలు ఆకస్మికంగా తనిఖీ చేసారని వివరించారు. నాటిన మొక్కల వివరాలను అటవీశాఖ వెబ్సైట్లో పొందుపరుస్తున్నామన్నారు. 1.45 కోట్ల పండ్లు, యూకలిప్టస్ తదితర మొక్కల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా ఇప్పటివరకు 17 లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 5.20 కోట్ల మొక్కలను నర్సరీల్లో పెంచుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ జోయెల్ డేవిస్, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్ తదితరులున్నారు. హరితహారం, వంద శాతం, కలెక్టర్ నీతూ ప్రసాద్, harithaharm, 100% in 140 villages, collector neetu prasad
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement