-
చిప్ తయారీకి విధానాలు ముఖ్యం
ముంబై: దేశీయంగా చిప్ తయారీ వ్యవస్థ విజయవంతమయ్యేందుకు విధానాలలో స్పష్టత, నిలకడ అవసరమని మనీష్ భాటియా పేర్కొన్నారు. అత్యధిక పెట్టుబడుల ఆవశ్యకత కలిగిన పరిశ్రమకావడంతో ఈ రెండింటికీ ప్రాధాన్యత ఉన్నట్లు యూఎస్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీ గ్లోబల్ కార్యకలాపాల ఎగ్జిక్యూటివ్ వైస్ప్రెసిడెంట్ మనీష్ తెలియజేశారు. మైక్రాన్ టెక్నాలజీస్ దేశీయంగా గుజరాత్లోని సణంద్లో 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో భాటియా ప్రసంగించారు. చిప్ తయారీ వ్యవస్థ వేళ్లూనుకునేందుకు దేశీయంగా ఎన్ని సౌకర్యాలను కలి్పంచినప్పటికీ విధానాలలో స్పష్టత, నిలకడ కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చిప్ తయారీలో విస్తారిత వ్యవస్థకు ఇవి దోహదం చేస్తాయని తెలియజేశారు. భారత్కు అవకాశాలు ఇతర అభివృద్ధి చెందుతున్న పలు దేశాలతో పోలిస్తే భారత్కు పలు ప్రయోజనాలున్నాయని, దీంతో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశమున్నదని మనీష్ భాటియా వివరించారు. వెరసి మైక్రాన్ వంటి మరిన్ని దిగ్గజాలను ఆకట్టుకోవాలంటే రానున్న ఐదేళ్లకుకాకుండా 25 ఏళ్లకుమించి విధానాలకు తెరతీయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. సణంద్లో ప్లాంటు ఏర్పాటుకు గతేడాది సెపె్టంబర్లో మైక్రాన్ తెరతీయగా.. 2024 డిసెంబర్కల్లా ప్రారంభంకాగలదని అంచనా. 2025 ప్రారంభంలో ప్లాంటు సిద్ధంకాగలదని భాటియా తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంటుకు కేంద్ర నుంచి సవరించిన అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ పథ కంకింద అనుమతి లభించిన విషయం విదితమే. -
మూడేళ్లలో 17 బిలియన్ డాలర్లకు!
నాస్కామ్–బీసీజీ నివేదిక ముంబై: దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ ఏటా 25–35% వృద్ధి చెందుతోంది. కంపెనీలు టెక్నాలజీపై మరింతగా ఖర్చు చేస్తుండటం, ఏఐ నిపుణులు.. ఏఐపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2027 నాటికి ఇది 17 బిలియన్ డాలర్లకు చేరనుంది. టెక్నాలజీ, లీడర్ షిప్ ఫోరం 2024 సందర్భంగా సంయుక్త నివేదికలో టెక్ సంస్థల సమాఖ్య నాస్కామ్, బీసీజీ ఈ మేరకు అంచనా వేశాయి. అంతర్జాతీయంగా ఏఐపై పెట్టుబడులు 2019 నుంచి ఏటా 24% వృద్ధి చెందాయి. 2023లో 83 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా డేటా అనలిటిక్స్, జెన్ఏఐ, ఎంఎల్ అల్గోరిథమ్స్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. వినూత్న సొల్యూషన్స్ .. టెక్నాలజీ సర్విస్ ప్రొవైడర్లు సాంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధిని దాటి ఏఐ ఆధారిత వినూత్న సేవలు, సొల్యూషన్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆటోమేషన్ టూల్స్, డేటా అనలిటిక్స్ సొల్యూషన్స్తో పాటు హెల్త్కేర్, బ్యాంకింగ్ .. ఫైనాన్స్, రిటైల్ వంటి నిర్దిష్ట రంగాల అవసరాలకు అనుగుణమైన ప్రొప్రైటరీ ఏఐ.. జనరేటివ్ఏఐ ప్లాట్ఫామ్స్ కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది. ► ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా ఏఐ నైపుణ్యాలున్న ప్రతిభావంతులు మూడు రెట్లు అధికంగా ఉన్నారు. గత ఏడేళ్లుగా చూస్తే ఏఐ నిపుణుల సంఖ్య 14 రెట్లు పెరిగింది. ఏఐ నిపుణుల విషయంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ► ఏఐలో పెట్టుబడులు పెరిగే కొద్దీ భారత్లో కృత్రిమ మేధ నిపుణుల సంఖ్య 2027 నాటికి వార్షికంగా 15 శాతం మేర వృద్ధి చెందనుంది. -
టెక్ పరిశ్రమ ఆదాయం 254 బిలియన్ డాలర్లకు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ టెక్నాలజీ పరిశ్రమ ఆదాయం 3.8 శాతం వృద్ధి చెంది 254 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ అంచనా వేసింది. టెక్ రంగం గత ఆర్థిక సంవత్సరంలో 244.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. ఈసారి హార్డ్వేర్ని మినహాయిస్తే ఆదాయం 3.3 శాతం పెరిగి 199 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని వార్షిక నివేదికలో నాస్కామ్ తెలిపింది. గతేడాది టెక్నాలజీపై కంపెనీలు చేసే వ్యయాలు 50 శాతం మేర, టెక్ కాంట్రాక్టులు 6 శాతం మేర తగ్గిపోయినప్పటికీ దేశీ పరిశ్రమ 3.8 శాతం (9.3 బిలియన్ డాలర్లు) వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. అలాగే నికరంగా 60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించింది. ‘ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం పరిశ్రమ వృద్ధి చెందనుంది. ఆశ్చర్యకరంగా ఎగుమతులు కొంత తగ్గినప్పటికీ దేశీ మార్కెట్ గణనీయంగా పుంజుకుంది. దేశీయ మార్కెట్కి ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి కావచ్చు‘ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వం, కంపెనీలు ఖర్చులు చేయడం వల్ల దేశీయంగా పరిశ్రమ ఆదాయ వృద్ధికి ఊతం లభిస్తోందని ఆమె వివరించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు భారత్ అత్యంత ప్రాధాన్య హబ్గా కొనసాగుతోందని తెలిపారు. ఎగుమతుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో ఇంజినీరింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్డీ) విభాగం వాటా 48 శాతంగా ఉందని ఘోష్ చెప్పారు. ఈ రంగం అంచనాలకు మించిన పనితీరు కనపర్చవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఏఐ, క్లౌడ్లో ఉద్యోగాలు.. కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతున్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ వాస్తవానికి ఉపాధి కల్పన పెరిగిందని ఘోష్ చెప్పారు. పరిశ్రమలో నికరంగా 60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని, మొత్తం సిబ్బంది సంఖ్య 54.3 లక్షలకు చేరిందని ఆమె తెలిపారు. ఏఐ, డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నియామకాలు ఉండనున్నాయని చెప్పారు. దీంతో కంపెనీలు తమ సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై మరింతగా కృషి చేస్తున్నాయన్నారు. అంతర్జాతీయంగా 6,50,000 మంది పైచిలుకు ఉద్యోగులు జనరేటివ్ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారని ఘోష్ చెప్పారు. -
తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్–కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన వివాద పరిణామాలను దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిశితంగా పరిశీలిస్తోంది. కెనడాలోని తమ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వారి అభిప్రాయం ప్రకారం తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదని పేర్కొంది. ఖలిస్తానీ వేర్పాటువాది హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. పలు భారతీయ ఐటీ దిగ్గజాలు కెనడాలో కార్యకలాపాలను సాగిస్తుండటంతో పాటు అక్కడ పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాస్కామ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ప్రస్తుతానికైతే టెక్ పరిశ్రమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం లేకపోయినా.. ఈ వివాదం ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాల్సి ఉంటుందని పరిశ్రమ దిగ్గజం టీవీ మోహన్దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. -
నాస్కామ్-డెలాయిట్ సర్వే: ఎమర్జింగ్ ఐటీ సిటీ విశాఖపట్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు నాస్కామ్–డెలాయిట్ సంయుక్త సర్వే వెల్లడించింది. దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను పెద్ద నగరాలు కంటే చిన్న నగరాలకు విస్తరించడానికి మొగ్గుచూపుతున్నాయని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఈ విస్తరణకు ఐదు కీలక అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా 26 ఎమర్జింగ్ ఐటీ హబ్స్ను నాస్కామ్–డెలాయిట్ ఎంపిక చేసింది. ఇందులో మన రాష్ట్రం నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు చోటు దక్కగా, తెలంగాణ నుంచి వరంగల్ ఎంపికైంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలికవసతులు, రిస్్క–వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్–లివింగ్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వీటిని ఎంపిక చేసినట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ పేరుతో ఇప్పటికే విశాఖ నగరాన్ని ప్రోత్సహిస్తుండటమే కాకుండా నూతనతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు, స్టార్టప్ ఇంక్యుబేటర్స్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాండ్శాండ్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. విశాఖలో మొత్తం 1,120 స్టార్టప్స్ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటిలో 20 శాతానికిపైగా స్టార్టప్స్ టెక్నాలజీ రంగానికి చెందినవే ఉన్నాయి. ఇప్పటికే 250కి పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు విశాఖ వేదికగా పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడలో 80కి పైగా టెక్నాలజీకి చెందిన స్టార్టప్స్ ఉండగా, 550కి పైగా టెక్నాలజీ ఆధారిత వ్యాపారసంస్థలు ఉన్నాయి. చదవండి: వియ్యంకుల వారి భూ విందు అంతేగాకుండా ఏటా 25 వేలమందికి పైగా ఐటీ నిపుణులు అందుబాటులోకి వస్తున్నారు. ఐటీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ముందువరుసలో ఉంటోంది. తిరుపతిలో ఇప్పటికే 25 టెక్నాలజీ స్టార్టప్స్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, 50కి పైగా టెక్నాలజీ బేస్డ్ సంస్థలున్నాయి. ఇవన్నీ ఈ మూడు నగరాల్లో పెట్టుబడులను పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. 30% వ్యయం తక్కువ పెద్ద నగరాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ద్వితీయశ్రేణి నగరాల్లో లభిస్తుండటం, రియల్ ఎస్టేట్ ధరలూ తక్కువగా ఉండటంతో ఐటీ కంపెనీలు ఈ 26 నగరాల్లో కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ప్రధాన కారణమని నాస్కామ్–డెలాయిట్ పేర్కొంది. పెద్ద నగరాలతో పోలిస్తే మానవ వనరుల వ్యయం 25 నుంచి 30 శాతం తగ్గుతున్నట్లు తెలిపింది. దేశీయ ఐటీ నిపుణుల్లో 15 శాతం ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల నుంచి వస్తున్నవారే కావడంతో వారి వద్దకే కార్యాలయాలను తీసుకెళ్లే యోచనలో కంపెనీలున్నాయి. రియల్ ఎస్టేట్ భవనాలు, అద్దెల వంటివీ చిన్న నగరాల్లో తక్కువగా ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐటీ కంపెనీలు టైర్–2 సిటీస్ బాట పడుతున్నట్లు ఆ నివేదిక విశ్లేషించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement