-
నాగావళి నదిపై మరో వంతెన
రాజాం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజల రాకపోకలకు వీలుగా నాగావళి నదిపై మరో వంతెన నిర్మించనున్నారు. రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలం వాల్తేరు గ్రామం వద్ద ఉన్న బలసలరేవు నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ఇసుకలపేట రేవు మధ్య వంతెన నిర్మించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వంతెన నిర్మాణానికి ఏడాదిన్నరగా ఆర్అండ్బీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. తాజా గా ఫ్రీ ఎస్టిమేట్ నిర్వహించి అవసరమైన నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల చొరవతో నిధులు మంజూరుకావడంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. 50 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య ప్రయాణ దూరం తగ్గనుంది. నెలరోజలుగా కొలతలు నదిపై వంతెన నిర్మాణానికి సంబంధించి రూ.15 లక్షల వ్యయంతో అంచనా సర్వేను కోస్టల్ ల్యాండ్ సర్వే ఏజెన్సీ నిర్వహించింది. వంతెన నిర్మాణ ప్లానింగ్ను, అంచనా వ్యయాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది. రూ.87 కోట్లను ప్రభుత్వం మజూరు చేయడంతో ఆర్అండ్బీశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్లాన్ ప్రకారం నదికి ఇరువైపులా రోడ్డు చదును చేయడం, పిల్లర్లకు అనువైన ప్రదేశాలను నిర్ధారిస్తున్నారు. రోడ్డు సౌకర్యం, భవిష్యత్ వినియోగం, నదిలో మట్టి నమూనాలు సేకరణ, ఎంత లోతులో గ్రావెల్ ఉందనే అంశాలుపై పూర్తి వివరాలు సేకరించామని, ఈ నెలాఖరులోగా సీఎం జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా వంతెన పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్అండ్బీ జేఈ ఆంజనేయులు తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలగడంతో పాటు రెండు జిల్లాలను కలిపేవారధిలా మారనుంది. సంతకవిటి మండలంలో నాగావళి నదిపై రెండో వంతెనగా లెక్కల్లోకి వస్తుంది. 560 మీటర్ల పొడవున వంతెన నిర్మాణం కానుంది. 1998–99 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మిస్తామంటూ హామీ ఇచ్చింది. అప్పట్లో రూ.90 లక్షలు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించి నా పనులు చేయలేదు. 2017లో ఏడాదిన్నర పాటు వాల్తేరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు దీక్షలు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతీయుల వంతెన కలను నెరవేర్చుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రమాదాలకు చెక్ వాల్తేరు వద్ద నాగావళి నదిని దాటి వందలాదిమంది ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. నది ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు నాటు పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల కృషితో వంతెన కల సాకారమవుతోంది. ఈప్రాంత ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారు. – సిరిపురపు జగన్మోహనరావు, జెడ్పీ వైస్ చైర్మన్, హొంజరాం అందరి సహకారంతో ప్రజలు సమస్యలు పరిష్కరించడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గతంలో అర్ధాంతరంగా ఉండిపోయిన వంతెనలు, రోడ్లు కూడా పూర్తిచేస్తాం. వాల్తేరు వద్ద బలసలరేవు వంతెన నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తాం. అందరి సహకారంతో వంతెన నిర్మాణం సాకారంకానుంది. – కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే కష్టాలు తీరుతాయి.. ఇసుకలపేట నుంచి అటు శ్రీకాకుళం, ఇటు ఆమదాలవలస చాలా దగ్గర. మధ్యలో నాగావళి నది ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నరకయాతన పడేవారు. వంతెన నిర్మాణంతో ఆ కష్టాలన్నీ తీరుతాయి. మా గ్రామంతో పాటు పరిసర గ్రామాలు ప్రజలు, వంతెన సాధన కమిటీ తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – గురుగుబెల్లి స్వామినాయుడు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్, వాల్తేరు -
చీకట్లో నాగావళి వంతెన
శ్రీకాకుళం: నగరం నడిబొడ్డున నిర్మించిన రెండు భారీ వంతెనలను ఇటీవల ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే, వంతెనలపై పగటి పూట ప్రయాణం సౌకర్యంగా ఉన్నా రాత్రి ప్రయాణించాలంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో గత ప్రభుత్వ హయాంలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషి ఫలితంగా వంతెనలు మంజూరు చేసిన విషయం విధితమే. వంతెనలపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. వంతెనల నిర్మాణం ఎప్పుడో పూర్తయినా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని సాకుతో ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చేసిన పాలకులు, ఇప్పుడు ఆ పనులు చేయకుండానే ప్రారంభించారు. ఇదే పని రెండు నెలల క్రితమే చేసి ఉంటే ప్రజలకు కొంత కష్టాలు తప్పేవని పలువురు చెబుతున్నారు. గుజరాతిపేటలో ఇటీవల నిర్వహించిన జగన్నాథ ఉత్సవాలకు సైతం నదిలో నుంచి నడుచుకొని వెళ్లవలసి వచ్చిందని, కొంత కాలం వంతెనపై అడ్డుగా ఇనుప రాడ్లు వేసి రాకపోకలను అడ్డుకున్నారని, ఇవన్నీ ఎందుకు చేసినట్టని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి వంతెనలపై విద్యుత్ దీపాలు వేయించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
Advertisement