-
పెళ్లయ్యాక నాగశౌర్య వేరేకాపురం పెట్టాడు: హీరో తల్లి
టాలీవుడ్ హీరో నాగశౌర్య గతేడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన పెళ్లాడారు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన కొంతకాలానికే శౌర్య వేరు కాపురం పెట్టాడట! ఈ విషయాన్ని అతడి తల్లి బయటపెట్టింది. కూతురిలా చూసుకుంటా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య తల్లి ఉషా ప్రసాద్ మాట్లాడుతూ.. 'అనూష నాకు మూడేళ్ల క్రితమే తెలుసు. ఆమెను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటాను. నన్ను మమ్మా అని పిలుస్తుంది. నా భర్తను డాడీ అని పిలుస్తుంది. తను చాలా మంచి అమ్మాయి. తనకు చాలా మెచ్యూరిటీ ఉంది. శౌర్య-అనూష మేడ్ ఫర్ ఈచ్ అదర్. పెద్ద కోడలు అమెరికాలో సెటిలైంది. యాపిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. చిన్న కోడలు అనూష ఇంటీరియర్ డిజైనర్గా ఫుల్ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్న అన్ని పనులను బాగా చక్కబెట్టుకుంటుంది. అది ఎప్పుడో అనుకున్నాం.. నాగశౌర్య-అనూష పెళ్లవగానే వేరే కాపురం పెట్టారు. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడనుకున్నది కాదు.. పిల్లలు పుట్టినప్పుడు, పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నాం.. ఇప్పుడున్న జనరేషన్కు ఎవరి స్వాతంత్య్రం వారికిస్తే బాగుంటుంది. ఇది మాకు మొదటి నుంచీ ఉన్న అభిప్రాయం.. అంతే! ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఉషా ప్రసాద్.. నిర్మాతగా నాగశౌర్యతో నాలుగు సినిమాలు చేసింది. ఇటీవల రెస్టారెంట్ బిజినెస్ సైతం ప్రారంభించింది. చదవండి: విజయకాంత్ అంత్యక్రియలు.. విజయ్పైకి చెప్పు విసిరిన వ్యక్తి.. -
'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే
Rangabali Movie OTT: ఈ మధ్య కొత్త సినిమాలు మరీ త్వరగానే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. 'సామజవరగమన', 'నాయకుడు' లాంటి మూవీస్ అయితే థియేటర్లలో ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించాయి. హిట్ అనిపించుకున్నాయి. కానీ నెల తిరగకుండానే ఇప్పుడు ఓటీటీల్లోక వచ్చేశాయి. దీని రూట్లో మరో తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' జూలై 7న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఫస్టాప్లో కామెడీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ.. సెకండాఫ్ తేలిపోవడంతో పెద్దగా కలెక్షన్స్ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్.. ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. కథేంటి? శౌర్య అలియాస్ షో(నాగశౌర్య) రాజవరం అనే ఊరిలో ఆవారాగా తిరిగే కుర్రాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వైజాగ్ వెళ్తాడు. అక్కడ మెడికల్ స్టూడెంట్ అయిన సహజ (యుక్తి తరేజా)తో లవ్లో పడతాడు. పెళ్లి కోసం ఆమె తండ్రిని ఒప్పించేందుకు సహజ ఇంటికెళ్తాడు. అక్కడ శౌర్యకు ఓ విషయం తెలుస్తుంది. ఇంతకీ శౌర్య ఊరిలోని రంగబలి సెంటర్కు అతడి పెళ్లికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) -
రంగబలి మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
ఛలో తర్వాత రంగబలి
‘‘రంగబలి’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ మరో బ్లాక్ బస్టర్ ఇచ్చింది. మంచి కథతో సినిమా తీసిన పవన్కి, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సుధాకర్కి థ్యాంక్స్’’ అన్నారు హీరో నాగశౌర్య. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం (జులై 7న) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్లో పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి’’ అన్నారు. -
ఎవరినైనా బాధపెట్టి ఉంటే సారీ: నాగశౌర్య
హీరో నాగశౌర్య, హీరోయిన్ యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 7న విడుదలైంది. సినిమా రిలీజవడానికి ముందు చిత్రయూనిట్ వేరే లెవల్లో ప్రమోషన్స్ చేశారు. టాలీవుడ్లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ స్పూఫ్ చేశారు. కమెడియన్ సత్య చేసిన ఈ స్పూఫ్ వీడియోకు విశేష స్పందన వచ్చింది. కానీ కొందరు మాత్రం హర్టయినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు హీరో నాగశౌర్య దృష్టికి తీసుకెళ్లాడు. మీడియా మీద సెటైర్ వేయాలన్న ఆలోచన ఎవరిది? అని అడిగాడు. దీనికి నాగశౌర్య స్పందిస్తూ.. 'మీడియా, మేము ఒకటే ఫ్యామిలీ. మేమైతే అలాగే అనుకుంటున్నాం. అదే మీడియా వాళ్లు చంద్రబాబు, కేసీఆర్లను డూప్లు పెట్టి వీడియోలు చేస్తారు. మేము సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేయడానికి ఎవరినీ హర్ట్ చేయకుండా మీ అందరికీ తెలిసిన వ్యక్తులను సెలక్ట్ చేసుకున్నాం. ఒక హీరోను వాళ్లు తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందని సరదాగా చూపించాం. అంతేతప్ప ఎవరినీ ఎగతాళి చేయలేదు. ఇది ముందుగా అనుకుని కూడా చేయలేదు. ఒకవేళ దీనివల్ల ఎవరైనా హర్ట్ అయితే నన్ను క్షమించండి. ఎవరి మీదైతే స్పూఫ్ చేశామో వాళ్లేమైనా హర్ట్ అయ్యారేమో అని అడిగి తెలుసుకున్నాం. చాలామంది ఎంజాయ్ చేశామన్నారు. కానీ ఒకరిద్దరు హర్ట్ అయ్యారంటూ వేరే ఎవరో ప్రచారం చేయడం వల్లే అది ఫేమస్ అయింది తప్ప ఎవర్నీ హర్ట్ చేయలేదు, ఎవరూ హర్ట్ అవలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: నటనే రాదు కానీ స్టార్ హీరో... ప్రభాస్పై అనుచిత వ్యాఖ్యలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement