-
విష సర్పాలకన్నా భయానకంగా విపక్షాల వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై తెలుగుదేశం, జనసేన పార్టీల వ్యాఖ్యలు చూస్తుంటే, వారి కూతలు వింటుంటే వాళ్లలో రాక్షసత్వం ఎంతగా పేరుకుపోయిందో అర్ధం అవుతోంది. వాళ్లసలు మనుషులే కారన్న కఠోర వాస్తవం బోధ పడుతుంది. వాళ్లు కూడా మిగతా మనుషులతో కలిసి సమాజంలో తిరుగుతోంటే భయమేస్తుంది. ఏ మాత్రం బాధ్యత లేని వారి తెంపరి తనాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ కీచకులకు వంతపాడే పండుముదుసలి రామోజీ పత్రిక పైత్యం చూసి ఒళ్లు మండుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను తుదముట్టించడమే లక్ష్యంగా కిరాయి హంతకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన వెను వెంటనే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచం. ఘోరాతి ఘోరం. ఈ దాడిని జగన్ మోహన్ రెడ్డే చేయించుకున్నారని అచ్చెన్న కూస్తే.. లోకేష్ వాగుడు మరీ బాధ్యతారాహిత్యం. ఆ రాళ్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాయట. లోకేష్ ఇలా కూయడానికి కారణాలు ఉన్నాయి. తన తాత అని లోకేష్ పదే పదే చెప్పుకునే నందమూరి తారకరామారావుపై తన తండ్రి చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటట్పై నుంచి చెప్పులు వేయించిన ఘటన లోకేష్ గుండెల్లో పదిలంగా ఉన్నట్లుంది. అందరూ తన నాన్నలాగే కౄరంగానే ఆలోచన చేస్తారని లోకేష్ అనుకుంటూ ఉండచ్చు. లేకపోతే ఇటువంటి పిచ్చి కూతలు రావడం సాధ్యం కాదు. ఇక జనసేన నాయకుడు సినీ నటుడు కొణిదెల నాగబాబు మరో అడుగు ముందుకేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్..ఎక్కడా స్క్రిప్టెడ్ అనిపంచనే లేదు అంటూ వెకిలి కామెంట్ ను ట్వీట్ చేశారు నాగబాబు. నటుల వంశం కాబట్టి వెండితెరపై అంతగా నటించలేకపోయినా.. రాజకీయ తెరపై నటనలో ఇరగదీసేస్తున్నారు నాగబాబు. తాను పెట్టిన ట్వీట్ను చూసిన తన సర్కిల్లోని వారే తిట్టారో.. మరీ అసహ్యంగా ఉందన్నారో తెలీదు కానీ తాను మొదట పెట్టిన ట్వీట్ను తీసేసి కొత్తగా మరో ట్వీట్ పెట్టారు. ఈ సారి తెచ్చిపెట్టుకున్న సంస్కారాన్ని నటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు మంచివి కావంటూ సింగిల్ టేక్లో డైలాగ్ కట్ చేశారు.నాగబాబు మొదట పెట్టిన ట్వీట్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా సంస్కారం ఉన్న వారంతా ఛీఛీ అన్నారు. సినీ రంగంలోని ప్రముఖులు అయితే మరీ ఇంత చీప్గా అనడం ఏంటని ఆశ్చర్యపోయారు. నిజానికి నాగబాబు కమెడియన్కు ఎక్కువ. తమ్ముడు పవన్కు తక్కువ అని సినీ జనాలు అంటూ ఉంటారు. ఆయ నెంచి సంస్కారాన్ని ఆశించవద్దని వారంటారు. అయినా వాలంటీర్లు మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారని ఒళ్లు కొవ్వెక్కి దారుణపు కూత కూసిన పవన్ కల్యాణ్కు అన్న నాగబాబు.. కాబట్టి ఆయనుంచి సంస్కారాన్ని ఆశించలేం అంటున్నారు పాలక పక్ష నేతలు. చదవండి: ‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’ సీఎం జగన్పై హత్యాయత్నం చేసిందెవరో తేలాలి. వారి వెనుక ఉన్న శక్తులేంటో తెలియాలి. కచ్చితంగా ఇది హత్యాయత్నమే అనడంలో సందేహం లేదు. హత్యాయత్నం జరిగితే దాడి చేసిన వారు విలన్లు .చేయించిన వారు సూత్రధారులు అవుతారు. కానీ రామోజీ పత్రిక మాత్రం దాడి చేసిన వారిని వదిలేసి భద్రతా వైఫల్యాలు ఉన్నాయంటూ వెర్రి కథనం ఒకటి వండి వార్చింది. మనుషులకు చెట్ల మాదిరిగానే ఏళ్ల వయసు వచ్చి పడుతుంది కానీ..వయసు పెరిగినంత మాత్రాన సంస్కారం, మానవత్వం పెరగవని చాటి చెప్పడానికి రామోజీ, చంద్రబాబులను మించిన సాక్ష్యాలు అవసరం లేదంటారు మేథావులు. హత్యాయత్నానికి కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ను రాళ్లతో కొట్టాలని ఓ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా పిలుపు నిచ్చారు. విన్నారుగా. చంద్రబాబు ఎందుకిలా అన్నారో తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు. తాను చేపట్టిన ప్రజాగళం సభకు జనం రారు. సీఎం సభకు ప్రజలకు ఇళ్లల్లో పనేమీ లేనట్లు సునామీలా తరలి వస్తారు.ఆ తేడా చూస్తూ బాధ వేయదాండీ? దాడి చంద్రబాబు నాయుడో టీడీపీ వారో చేయించారని ముందుగానే ఎవరూ అనడం లేదు. కాకపోతే దాడి జరిగిన వెంటనే టీడీపీజనసేన ఎల్లో మీడియాల ఓవర్ యాక్షన్ చూస్తే మాత్రం కచ్చితంగా ఇది వారి పనే అని ఎవ్వరికైనా అనిపించక మానదు. సరే హత్యాయత్నానికి ఎవరు ప్లాన్ చేశారు. ఎవరు కిరాయి హంతకులను పంపారు అన్నవి దర్యాప్తులో తేలతాయి. అవి పక్కన పెడదాం. పాలక పక్ష నాయకుడు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగినపుడు ప్రతిపక్ష నాయకులు ఖండించాలనుకుంటే ఖండించవచ్చు. లేదంటే మౌనంగా ఉండచ్చు. కానీ టడీపీ, జనసేనలు ఎంతగా దిగజారిపోయాయంటే ఈ దాడి జగన్ మోహన్ రెడ్డే చేయించుకున్నారని సిగ్గుమాలిన దిక్కుమాలిన కూతలు కూశాయి. దశాబ్ధాల క్రితం ఎల్లో మీడియా కానీ టీడీపీ కానీ ఇంత బరితెగింపు వ్యాఖ్యలు చేయలేదు. హత్యలు చేయిస్తే చేయించి ఉండచ్చు కానీ వాటిపై జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడేవారు. అదే వంగవీటి రంగా దారుణ హత్య ఇపుడు జరిగి ఉంటే ఇదే టీడీపీనేతలు రంగాయే తనపై దాడి చేయించుకుని ఫేమస్ అయిపోదామనుకున్నారని అని ఉండేవారు. మీడియాలో పైకి ఎదిగిపోవాలన్న దుర్బుద్ధితోనే పింగళి దశరథరామ్ తానే మనుషులను పురమాయించుకుని తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారని.. అది వికటించి ఆయన మరణించారని అని ఉండేవారు. రామోజీ పత్రిక అయితే రంగా, దశరథరామ్ హత్యల విషయంలో భద్రతా లోపాలు ఎక్కడున్నాయో భూతద్దం పెట్టి వెతికేది. ఇవన్నీ చూస్తోంటే ఓ అనుమానం కూడా వేయక మనదు. 2003లో చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో జరిగిన దాడి బహుశా చంద్రబాబే ప్లాన్ చేయించుకుని ఉంటారు. అందుకే ఆ దాడి జరిగిన వెంటనే ముందస్తు ఎన్నికలకు వాజ్ పేయ్ఒను ప్పించి డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను మే నెలకి తీసుకు వచ్చారు. అని రాజకీయ పరిశీలకులు ఇపుడు అనుమానిస్తున్నారు.పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. పచ్చపార్టీ నేతలకూ అంతే. తాము చేసే ప్రతీ వెధవపనినీ తమ ప్రత్యర్ధులు కూడా చేస్తారని పసుపు పార్టీ నేతల ఎరుపు ఐడియా. సీఎం జగన్ను హత్యాయత్నాలతోనూ దాడులతోనూ ఎవరూ బెదిరించలేరు. ఆ విషయం 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్పై హత్యాయత్నానికి తెగబడిన ఘటనే నిరూపించింది. అపుడు కూడా ఆయన దాడి జరిగింది కదా అని ,నెత్తురు కారింది కదా అని భయపడలేదు. ధైర్యంగా ముందుకు సాగారు. టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారు. ఈసారి కూడా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈసారి టీడీపీకి ఆ 23 స్థానాలు కూడా రానే రావంటున్నారు రాజకీయ పండితులు. సీఎన్ఎస్. యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
అబ్బో.. ఇంతకీ ఇద్దరిలో త్యాగాల త్యాగరాజు ఎవరో?
కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ ఆసక్తికరమైన సంగతి చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీట్లను తగ్గించుకుని త్యాగం చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ ఆయనతో చెప్పి బాధపడ్డారట. అయినా పొత్తు ధర్మం కోసం, రాష్ట్రం కోసం తమ సీట్లను తగ్గించుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. నిజంగా పవన్ ఈ మాట చెప్పి ఉంటే రాజకీయాలలో ఇంతకన్నా బానిసత్వం ఇంకొకటి ఉండదు. ఒకవైపు జనసేన కార్యకర్తలు తమకు కనీసం నలభై అసెంబ్లీ సీట్లు అయినా పొత్తులోభాగంగా కేటాయించలేదని బాధ పడుతుంటే, పుండుమీద కారం చల్లినట్లు పవన్ కల్యాణ్ తమకు ఇచ్చినవే ఎక్కువని బాధపడ్డారా?. ఈ విషయం విన్న జనసైనికులకు ఏమనిపిస్తుంది! పేరుకు జనసేన తప్ప, తమది టీడీపీ భజన సేన అని అనుకోరా! తొలుత జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. బీజేపీకి ఇవ్వడం కోసం మరో మూడు తగ్గించుకున్నారు. పోనీ ఆ ఇరవై ఒక్కటి అన్నా జనసేన వారికి ఇచ్చారా అంటే అలా చేయలేదు. టీడీపీ, వైఎస్సార్సీపీ వంటి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి కొన్ని సీట్లు ఇచ్చేశారు. మూడు ఎంపీ సీట్లు ఇస్తారని అనుకున్నారు. దానిని పవన్ కల్యాణ్ మూడుకు తగ్గించుకున్నారు. పైగా ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిని అని ఆయన నిస్సిగ్గుగా చెప్పి జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన సంగతులు ఏమిటంటే ఏళ్ల తరబడి జనసేన ముఖ్య నేతలనే పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. అందులో స్వయంగా ఆయన సోదరుడు నాగబాబు కూడా ఉండడం విశేషం. నాగబాబుకు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇస్తారని భావించారు. ఏమైందో తెలియదు కాని అనకాపల్లిని బీజేపీకి త్యాగం చేశారు. అందులో కూడా ఎవరు పోటీచేశారో తెలుసు కదా! సీఎం రమేష్ కు. ఆయన ఎవరో కూడా తెలుసు కదా! టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేత. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. బీజేపీలో చేరినా కాంగ్రెస్ కు ముప్పై కోట్ల విరాళం ఇచ్చిన ప్రముఖుడు.ఈ మధ్యనే 400 కోట్ల ఫోర్జరీ కేసు కూడా ఆయనపై నమోదు అయింది. ఇతరత్రా ఉన్న ఆరోపణలు చెబితే చాంతాడు అంత అవుతాయి .సీఎం రమేష్ కోసం తన సోదరుడినే బలి చేశారంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉండాలన్నది పలువురి అబిప్రాయంగా ఉంది. పవన్ ఈ రకంగా అనకాపల్లి సీటును అమ్మేశారని జనసేన కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మరో సీటును వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి ఇచ్చారు. ఆయనకు వైఎస్సార్సీపీ టిక్కెట్ రాలేదు. దాంతో పవన్ కల్యాణ్ ఆ సీటును ఆయనకు అమ్మి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో జనసేనకు నేతలే లేరా? అంటే ఉన్నారు. 2019లో జనసేన పక్షాన పోటీచేసి ఓడిపోయిన పార్లమెంటు అభ్యర్ది ఉన్నారు. అలాగే అసెంబ్లీకి పోటీచేసిన అబ్యర్దులు ఉన్నారు. కాని వారెవ్వరిని కాదని బాలశౌరికి ఇవ్వడంలో ఉన్న మతలబు ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అసెంబ్లీ టిక్కెట్ల విషయానికి వస్తే భీమవరంలో టీడీపీ నేతగా ఉన్న పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. అక్కడ జనసేన కోసం పనిచేసిన కొందరు ప్రముఖులు ఉన్నారు. వారినెవ్వరిని కాదని ఈయనకు ఎందుకు ఇచ్చారు! లోగుట్టు పెరుమాళ్ల కెరుక. విజయవాడ పశ్చిమలో పార్టీకోసం పోతిన మహేష్ అనే నేత విశేషంగా కృషి చేశారు. ఆయన కు టిక్కెట్ వస్తుందని అంతా భావించారు. కాని ఆశ్చర్యంగా అక్కడ బలం లేని బీజేపీకి టిక్కెట్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. అది త్యాగమా?లేక మంచి బేరమో తెలియదు కాని బీజేపీ పక్షాన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీకిగాను జనసేన నేతను బలి చేయడానికి పవన్ కల్యాణ్ వెనుకాడలేదు. సుజనా చౌదరి అత్యంత ధనికులలో ఒకరు. బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగవేశారన్న కేసులు ఎదుర్కుంటున్న నేత. తాను నిజాయితీపరుడనని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆచరణలో ఇలా చేసేసరికి ఆయనలో నిజాయితీ అన్నది నేతిబీరకాయలో నెయ్యి వంటిదని జనసైనికులు భావించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే పోతిన మహేష్ తీవ్ర స్థాయిలో పవన్ పై విరుచుకుపడ్డారు. ఇంతకాలం పార్టీ కోసం పని చేస్తే నమ్మించి గొంతు కోశారని ఆయన బాధపడ్డారు. జనసేన ప్లెక్సీలు, జండాలను ఆయన అనుచరులు దగ్దం చేశారు. మహేష్ మీడియా సమావేశం పెట్టి పవన్ ను ఏకీపారేశారు.ఇది ప్రజారాజ్యం -2 అని , మరో ఏడాది తర్వాత ఈ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత డెబ్బై రెండేళ్ల ఎన్నికల చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరపున కమ్మ సామాజికవర్గం నేత ఎవరూ పోటీ చేయలేదు. అక్కడ నివసించేవారిలో అత్యధికులు ముస్లింలు, నగరాలు,వైశ్యులు తదితర వర్గాల వారు ఉన్నారు. కాని ఈసారి సుజనా చౌదరి పోటీచేస్తున్నారు. బీజేపీ కూడా ఒరిజినల్ పార్టీ నేతలకు కాకుండా సుజనా వంటివారికే ఎక్కువ సీట్లు కట్టబెట్టడం కూడా విమర్శలకు దారి తీసింది.అవినీతిపై బోలెడు సోది కబుర్లు చెప్పే పవన్ కల్యాణ్ ఈ విధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారి కోసం తన పార్టీవారిని బలి చేశారంటేనే ఆయన తత్వం అందరికి తెలిసిపోయింది. ఈ విషయాలన్నిటిని పోతిన మహేష్ ప్రస్తావించి అనేక ప్రశ్నలు సందించారు.పలు కొత్త విషయాలు వెల్లడించారు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ కనీసం పాతిక సీట్లు కూడా పోటీ చేయలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ నిజ స్వరూపం తెలుసుకోవాలని, ఆయన మేడిపండు వంటివారు అని మహేష్ తీవ్రంగా ద్వజమెత్తారు. కన్నతల్లిని దూషించిన బినామీ చానల్ కు యజమాని అయిన వ్యక్తికి బీజేపీ టిక్కెట్ ఇస్తే పవన్ ఎలా మద్దతు ఇచ్చారని అని అడిగారు. మొత్తం 21 జనసేన సీట్లలో ఏడుగురే పార్టీ వారని, మిగిలినవారంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని ఆయన తేల్చి చెప్పారు. కమ్మవారికోసం బిసిలను బలి చేస్తారా అని మహేష్ ప్రశ్నించారు.ఆయన అడిగినవాటికి పవన్ కల్యాణ్ వద్ద జవాబులు లేవనే చెప్పాలి. చివరికి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తీసుకున్న ఇంటి గృహ ప్రవేశానికి భార్య అన్నాలెజెవోను తీసుకు రావాలని మహేష్ అనడం సంచలనంగా ఉంది. అందరూ ఆ సక్తిగా ఈ విషయాన్ని గమనిచంచారు. ఏమైందో తెలియదు కాని, పవన్ కల్యాణ్ తన భార్య లేకుండానే గృహ ప్రవేశం చేశారు. దీంతో రకరకాల ఊహాగానాలకు పవన్ కల్యాణ్ అవకాశం ఇచ్చారు. ఏది ఏమైనా జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టి పూర్తిగా అప్రతిష్టపాలయ్యారని చెప్పాలి. నిజంగానే మహేష్ అన్నట్లు టీడీపీకి బి బ్యాచ్ గా తయారై వారికోసం పనిచేయడానికి జనసేనను పెట్టడం ప్రజలను మోసం చేయడానికే అన్న భావన వస్తుంది. మరికొన్ని ఉదాహరణలు కూడా చెప్పాలి. అవనిగడ్డ నుంచి టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్ ను పార్టీలో చేర్చుకుని జనసేన టిక్కెట్ ఇచ్చారు. పాలకొండ నియోజకవర్గంలో కూడా అదే ప్రకారం నిమ్మక జయకృష్ణను టీడీపీ నుంచి తీసుకుని టిక్కెట్ ఇచ్చారు. తణుకు లో తమ పార్టీ నేత ఒకరికి టిక్కెట్ ప్రకటించి, తదుపరి ఆ సీటును టీడీపీకి వదలివేశారు. అంటే చంద్రబాబు ఏమి చెబితే అది చేశారని అర్ధం అవుతుంది.తణుకు లో కూటమి సభ పెట్టినప్పుడు తణుకు నేత రామచంద్రరావు వర్గీయులు నిరసన కూడా తెలిపారు. ఇంత జరిగినా చంద్రబాబు దృష్టిలో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించినట్లేనట.ఆ మాటను పవన్ కల్యాణ్ అన్నారని చెబుతున్నారు. ఇంతకన్నా పరువు తక్కువ ఏమన్నా ఉందా! పిఠాపురంలో తన గెలుపుకోసం టీడీపీ నేత వర్మ కాళ్లా,వేళ్లా పడడం చూసి జనసేన కార్యకర్తలను సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం రాజకీయం అంతా చంద్రబాబు కోసం చేస్తున్నారని తేలిపోతుంది. పోనీ తనను ఎంతో కొంత ఆదరించిన కాపు సామాజికవర్గానికి అయినా న్యాయం చేశారా అంటే అదీ లేదు. కేవలం వారి ఓట్లు పొంది చంద్రబాబుకు మేలు చేయడానికే ఈ పొత్తు పెట్టుకున్నారని స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమ్మ నాగబాబు.. ఇంత కడుపు మంట?
అధికారమే పరమావధిగా ఏర్పడిన టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు అప్పుడే స్టార్టయ్యాయి. జనసేన పార్టీకి సీట్ల కేటాయింపుల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నుసన్నుల్లోనే జరుగుతుండడం జనసైన్యానికి మింగుడు పట్టడం లేదు. కొంతమంది బహిరంగంగా బాబు తీరును విమర్శిస్తుంటే.. మరికొంతమంది అంతర్గతంగా మాట్లాడుకొని తగిని బుద్ది చెప్పాలని డిసైడ్ అవుతున్నారు. (చదవండి: ట్వీటు రాజా? పోటీ లేదా?) పొత్తు పట్ల పవన్ వైఖరి అతని సోదరుడు నాగబాబుకు కూడా నచ్చడం లేదు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినప్పటికీ.. బాబు కుట్రతో ఆయన పోటీకి దూరమయ్యాడు. అంతేకాదు పలు చోట్ల జనసేన అభ్యర్థులను ఓడించడానికి బాబు కుట్ర పన్నినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నాగబాబు వరకు చేరినట్లు ఉంది. అయితే సోదరుడు పవన్ కల్యాణ్ బాబుని గుడ్డిగా నమ్ముతుండడంతో నేరుగా అతనితో చెప్పలేకపోతున్నాడట. అందుకే ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. తాజాగా కన్ఫ్యూషియస్ కొటేషన్ని ఎక్స్లో షేర్ చేస్తూ పరోక్షంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్కు చురకలు అంటించాడు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లువుతారు’ అనే కన్ఫ్యూషియస్ కొటేషన్ని నాగబాబు ఎక్స్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘వయసులో బాగా పెద్దవారైనా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడటం చాలా తప్పు, పైగా మీ పార్టీ టీడీపీతో పొత్తుతో ఉందన్న సంగతి మర్చిపోవద్దు, పొత్తు ధర్మాన్ని పాటించండి’ ‘ఇది అయితే చంద్రబాబు నే అంటున్నావ్ అని క్లియర్ గా తెలుస్తుంది....లేదంటే మోడీ గారిని’, ‘అయ్యో మీరు ఇలా డైరెక్ట్ గా చంద్రబాబు గారిని అనడం చాలా తప్పు’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ( గమనిక: ఏమి మాట్లాడిన మా గురించే ఏమో అని ఆపాదించుకుంటున్నారు,ఇది ఎన్నికల సమర సమయం నా ఉద్దేశాలు చెప్తున్న తప్ప ఎవరిని ఉద్దిషించి కాదు పైన చెప్పింది జీవిత సత్యం) pic.twitter.com/HhOfVu4igE — Naga Babu Konidela (@NagaBabuOffl) March 21, 2024 -
నాగబాబు గాయబ్.. ఫోన్ స్విచ్ ఆఫ్!
సినిమాల్లో అంతే.. కొన్ని సీన్లను, కొంతమంది నటులను షూటింగులో షూట్ చేస్తారు. ఆ సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయని, రష్ చూసి సంబరపడతారు. ఆ సీన్లు తనకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని, తననుంచి నటనను పిండుకోవడంలో డైరెక్టర్ చూపిన ప్రతిభ అంతా ఇంతా కాదని, అయితే అంతా తాను ప్రెస్మీట్లో చెప్పలేనని మిగతాది వెండితెరమీద చూస్తేనే అర్థం అవుతుందని నటీనటులు చెప్పుకుంటారు. తీరా చూస్తే సినిమా రిలీజయ్యాక ఆ సీన్లు ఉండవు.. ఏంది వయ్యా అంటే సినిమా నిడివి ఎక్కువైనందున ఎడిటింగులో ఆ సీన్లు తీసేశామని, చల్లగా చెబుతారు. సరే.. సినిమా లెంగ్త్ ఎక్కువైంది.. కొంత కట్ చేయాలి.. దానికి నేను నటించిన సీన్లనే తీసెయ్యాలా.. ఇంకేమీ లేవా అనే ప్రశ్నకు ప్రొడక్షన్ హౌస్ నుంచి సమాధానం ఉండదు.. ఇప్పుడు జనసేన అనే పొలిటికల్ సినిమాలో నాగబాబు పాత్ర కూడా అలాగే లేచిపోయింది. మొన్నటివరకు అంతా తానే అంటూ హడావుడి చేయడం.. సీనియర్ నాయకులూ.. మంత్రులు.. ఎంపీలను సైతం అచ్చం జబర్దస్త్ కామెడీ గాళ్ళను ఎటకారం చేసినట్లు చేయడం.. ట్విట్టర్లో పోస్టింగులు పెట్టడం.. దీంతో బాగా ఓవర్ యాక్షన్ చేసిన నాగబాబు ఇప్పుడు సరైన టైం వచ్చేసరికి గాయబ్ అయ్యారు. వాస్తవానికి నాగబాబును అనకాపల్లి ఎంపీగా ముందు ఫోకస్ చేసారు. ఈ నేపథ్యంలో ఆయన అచ్యుతాపురం వద్ద ఇల్లు కూడా రెంటుకు తీసుకుని కొన్నాళ్ళు కార్లు.. నౌకర్లు.. జెండాలతో హడావుడి చేసారు. దీంతో అక్కడ ఆయన కొన్నాళ్ళు ఉండడమే కాకుండా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేయడంతోబాటు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ పెట్టారు. వారితో అదీ ఇదీ మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు. ఏమంటే నిధులు.. విరాళాల గురించి మాట్లాడారు. వంద రూపాయల నుంచి ఎంత వరకైనా విరాళం ఇవ్వవచ్చని చెబుతూ నేరుగా క్యూ ఆర్ కోడ్ను సైతం చూపించారు. అంటే ఆయనకు పార్టీ ఇచ్చిన అసలు బాధ్యత విరాళాలు సేకరించడం అని కేడర్కు అర్థమైంది. దాంతోబాటు ఆయనకు క్యాడర్ మీద అధికారము చెలాయించడం తప్ప బాధ్యత కూడా లేదని వాళ్లకు మెల్లగా తెలిసొచ్చింది. ఇదిలా ఉండగానే అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు లేదని.. వేరే ఎవరికో కేటాయిస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీంతో నాగబాబు చిన్నగా ఇల్లు ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్లిపోయారు. సినిమా భాషలో చెప్పాలంటే ప్యాకప్ చెప్పేసారు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్లకు సైతం దొరకడం లేదని అంటున్నారు. ఫోన్లు ఏకంగా స్విచ్చాఫ్ చేసేశారని.. ఎక్కడున్నారోకూడా తెలియడం లేదని అంటున్నారు. ఆయనమీద నమ్మకంతో కొంతమంది భారీగా విరాళాలు సైతం ఇచ్చారు. అంతేకాకుండా ఆయన మరికొంతమందికి టిక్కెట్ హామీలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లకు సమాధానం చెప్పలేక నాగబాబు పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి పరారైనట్లు చెబుతున్నారు. తనతో కేవలం హడావుడి మాత్రమే చేయించారని.. టిక్కెట్ విషయానికి వస్తే తనకు ఏమీ లేకుండా చేసారని ఆయన అవమానంగా ఫీలవుతున్నట్లు తెలిసింది. ఇక జనసేనకు రెండంటే రెండే ఎంపీ స్థానాలు దక్కడంతో అందులో ఒకటి మచిలీపట్నం కాగా అక్కడి నుంచి వల్లభనేని బాలసౌరి పోటీ చేస్తున్నారు. ఇంకోటి కాకినాడ కాగా అక్కడ పవన్ బరిలో ఉంటారని అంటున్నారు. దీంతో నాగబాబుకు ఎంపీ సీట్ ఎక్కడా కనిపించడం లేదు. పోనీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే దానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. చేస్తే ఎంపీగానే అనేది ఆయన ఆలోచన. గతంలో 2019 లో కూడా ఆయన నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు ఏకంగా టిక్కెట్ కూడా లేకపోవడంతో తాను కేడర్కు మొహం చూపించలేక మొత్తం గాయిబ్ అయినట్లు చెబుతున్నారు. రెండు వారాలుగా ఆయన ఎక్కడా సభలు.. సమావేశాల్లో కానరావడం లేదు. ఎక్కడున్నారో తెలీదు. మొత్తానికి విరాళాలు దండుకుని పారిపోయారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్'
మెగా హీరో సాయి దుర్గ తేజ్ కొత్త జర్నీని ప్రారంభించాడు. ఆయన ముందుగు చెప్పినట్లే నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు తెలిపాడు. తను ఏర్పాటు చేసిన కొత్త ప్రొడక్షన్ హౌస్కు 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ తాజాగా తను పేరును కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన అమ్మగారి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్గా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్కు కూడా తన అమ్మగారి పేరుతోనే 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అని ఫిక్స్ చేశాడు. అమ్మపేరు మీద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలా తెలిపాడు. 'మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్కల్యాణ్ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 'సత్య' సినిమా టీమ్తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకంక్షలు చెబుతున్నారు. A New beginning ☺️ Happy to announce a small gift to my mother on her name, Our Production House @VijayaDurgaProd 🥳 Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama & my guru garu @PawanKalyan mama My Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
Advertisement