-
ముచ్చటైన కోట.. 'మొలంగూర్'
శత్రుదుర్భేద్యమైన నిర్మాణంగా ఒకప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న మొలంగూర్ కోట నేడు నిరాదరణకు గురవుతోంది. గతంలో అనేక దేవాలయాలతో శోభాయమానంగా వెలిగి, నేడు దైన్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ కోట కరీంనగర్కు 30 కి.మీ, వరంగల్కు 46 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఎలగందుల, ఓరుగల్లు కోటను కలిపే మార్గానికి మధ్యలో ఉండటంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మొలంగూర్ కోటపై కథనం.. – సాక్షి, హైదరాబాద్ చారిత్రక నేపథ్యం.. మొలంగూర్ గ్రామం పూర్వపు పేరు ముదగర్. కానీ కొండకింది భాగాన ‘మంగ్ షావలి’సమాధి ఉండటంతో ఈ ఊరు కొంతకాలంపాటు మలంగూరుగా పిలవబడి అదే కాలక్రమంలో మొలంగూర్గా ప్రసిద్ధి పొందిందని చరిత్ర చెబుతోంది. కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రు ని అధికారులలో ఒకడైన వొరగిరి మొగ్గరాజు నిర్మించిన శత్రు దుర్భేద్యమైన కోట ఇది. ఈ దుర్గానికి పడమటివైపు నున్నని బండరాయి, ఉత్తరం వైపు కోటపైకి ఎక్కడానికి వీలులేని నిలువైన బండరాళ్లు, దక్షిణ దిశ వైపు కోట ఉన్న కొండకు సమాంతరంగా మరొక కొండ ఉన్నాయి. శత్రువు ప్రవేశించడానికి వీలు లేకుండా ఈ కోట నిర్మించబడింది. నిర్మాణ శైలి.. రెండు గుట్టల నడుమ కోటకు తూర్పు పడమరల్లో రెండు పటిష్టమైన ప్రవేశ ద్వారాలున్నాయి. కొండపైకి వెళ్లడానికి కొంతదూరం వరకు రాతి మెట్లు ఉన్నా, ఆపై ఎవరూ ఎక్కడానికి వీల్లేకుండా క్లిష్ట మైన మార్గం ఉంది. కొండపైకి వెళ్ళే మార్గం చూస్తే ఆ కాలంలో ప్రజలు, ముఖ్యంగా రాజు కోటపైకి ఎలా ఎక్కగలిగారన్న అనుమానం కలుగుతుంది. స్థానికులు మాత్రం కొండపై ఉన్న ఆంజనేయస్వామి దర్శనానికి చాలా అరుదు గా గుంపుగా వెళ్తారు. వారి తోడ్పాటులేనిదే కోట పైభాగానికి చేరుకోవడం ఎవరికైనా కష్టం. కోట పైభాగంలో చుట్టూ రాతి ప్రాకారం, అక్కడక్కడా బురుజులు, మర ఫిరంగులు మొదలైనవన్నీ శిథిలావస్థలో కనిపిస్తాయి. పైభాగంలో విశాలమైన మైదానం చెట్లు చేమ లతో నిండి ఉంది. రెండు బండరాళ్ల వంపుతో సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు ఒకటి వుంది. కోట లోని ప్రజలు, సైనికుల నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ కోనేరులో అన్ని కాలాల్లోనూ నీరు పుష్కలంగా లభించేదట. ఆసఫ్జాహీల కాలంలో ఎలగందుల కోట, రామగిరి కోటతో పాటుగా ఈ కోట కూడా వారి అధీనంలోనే ఉండేది. ఎలగందుల పాలకులలాగే, మొలంగూర్ పాలకుల పాలన కూడా ప్రజారంజకంగా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. నిర్లక్ష్యం..నిరాదరణ.. మొలంగూర్ కోటని ప్రభుత్వ అధికారులెవరూ పట్టిం చుకోకపోవడం బాధాకరంగా ఉందని, ఈ కోటను అభివృద్ధి చేసి సందర్శనాయోగ్యంగా మారిస్తే పూర్వ వైభవం సంతరించుకోవడమేగాక, చారిత్రక సంపదను కాపాడుకున్నవాళ్లమవుతాం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీని పైభాగాన ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేయడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి ప్రతి శ్రావణ మాసంలో కొందరు భక్తులు అతి ప్రయాసతో కొండ ఎక్కుతుంటారు. కానీ కోటపైకి వెళ్లడానికి సరైన మెట్లు లేక, పూర్తిగా పైకి ఎక్కలేక మధ్యలోనే నిరాశగా వెనక్కి వెళ్లిపోతుంటారు ఆశ్చర్యపరిచే దూద్ బావి మొలంగూర్లోని దూద్ బావి నీటి గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఈ గ్రామానికి అత్యంత ప్రాచుర్యాన్ని కలిగించిన దూద్బౌలి అనే పేరుగల బావి, కొండ కింది భాగంలో ఇప్పటికీ ఉంది. ఇందులోని నీరు పాల లాగ స్వచ్ఛంగా, తియ్యగా ఉంటాయి. అప్పట్లో ఈ బావిలోని నీటిని ఇక్కడి నుంచి నిజాం కోసం ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళేవారని చెబుతారు. ఇప్పటికీ ఈ బావిలోకి నీరు చేరగానే ప్రజలు బారులు కట్టి తీసుకువెళ్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ నీటిని తెప్పించుకుని తాగడానికి ఆసక్తి చూపేవారట. ఈ నీటిలో నాణెం వేసినా స్పష్టంగా కనిపిస్తుందని, ఈ నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని పరిసర ప్రాంతాల ప్రజలు విశ్వసిస్తారు. -
చారిత్రక కట్టడం మొలంగూర్ ఖిల్లా
పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని విన్నపం మొలంగూర్ దూద్బావి నీటికి ప్రాముఖ్యత శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ ఖిల్లా చారిత్రక కట్టడాలకు నిలయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అలిగిరి మహరాజ్ అనే అనే సంస్థానదీశుడు మొలంగూర్ గుట్టను ఖిల్లాగా చేసి ఇక్కడి నుండి ఓరుగల్లును పరిపాలించేవాడని స్థానికులు చెప్తారు. చత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించి ఇక్కడి నుంచి గుట్టపైకి అశ్వాలపై వెళ్లేందుకు రాతిబాటను నిర్మించారు. మొలంగూర్ గ్రామంలో కోటను నిర్మించి , కోనేరు తవ్వించారు. ఈ కోటలోనే అశ్వాలు సేదతీరేవని ప్రచారం ఉంది. మొలంగూర్ గ్రామం కోటలు, ఖిల్లా ముఖద్వారంతో పాటు, గుట్టపై కోనేరు నిర్మితం కావడం విశేషం. ఖిల్లా ముఖం ద్వారం నుండి ముందుకు వెళగానే దూద్బావి దర్శనమిస్తుంది. ఈ దూద్బావి నీటిని నాటి రాజులు హైదరాబాద్కు గుర్రం బండిపై తీసుకెళ్లేవారని ప్రచారంలో ఉంది. మొలంగూర్ ఖిల్లా అందాలను చూడడానికి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లానుంచి పర్యాటకులు వస్తున్నప్పటికీ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోలేదు. రెండేళ్ల క్రితం మొలంగూర్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా చేయాలని అధికారులు నివేదించారు. పలు మార్లు ప్రజలు, ప్రజాప్రతినిదులు వినతులు ఇస్తున్నారు. విద్యార్థుల సందడి.. మొలంగూర్ ఖిల్లా వైభవాన్ని తెలుసుకునేందుకు విద్యార్థులను ఈ ప్రాంతానికి తీసుకొస్తారు. మొలంగూర్ ఖిల్లాపైకి చేరుకొని నాటి కళావైభవాన్ని స్థానికులను అడిగి తెలుసుకుంటారు. కరీంనగర్,వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్పాఠశాల విద్యార్థులు ఇక్కడి విశేషాలను తెలుసుకోవడానికి వస్తారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కనీసం ఇలాంటప్పుడైనా చెప్పుకోవడానికి మీరు ఏదైనా చేసుంటే బావుండేద్సార్!
నిలకడగా శిశువు ఆరోగ్య పరిస్థితి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది
పోలింగ్ సమయం గంట పెంపు
పాంచ్ న్యాయ్తో అన్ని వర్గాలకు న్యాయం
9 నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు
ప్రశాంతంగా నీట్
మట్టి మాయగాళ్లు
మీటర్ మోగుతోంది!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement