-
కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మట జీవితాలు
పాకిస్తానీ రచయిత మొహ్సీన్ హమీద్ తొలి నవల అయిన, ‘మోథ్ స్మోక్’ 1998లో లాహోర్లో మండుతున్న వేసవిలో, ఒకానొకప్పుడు జూనియర్ బ్యాంకర్ అయిన దారాషికో (దారూ) తను చేయని హత్యకి, జైల్లో కూర్చునుండగా ప్రారంభం అవుతుంది. పేదింటి దారూ ధనిక కుటుంబానికి చెందిన ఔరంగజేబ్ (ఓజీ)షాకి స్నేహితుడు. దారూ బాల్యం కాలేజీలో చేరేంతవరకూ సామాన్యంగానే గడుస్తుంది. తరువాత అతని స్నేహితులు ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్ళిపోతారు. ఓజీ తిరిగి అమెరికా నుండి వెనక్కి రావడంతో దారూ అభద్రతాభావం ఎక్కువవుతుంది. తనకి లేకపోయిన ప్రతీదీ ఓజీ వద్ద ఉంటుంది. పెజొరో కారు, మంచి ఉద్యోగం, అందమైన భార్య ముంతాజ్, కొడుకు. వాళ్ళవల్ల దారూ తిరిగి ఆ ధనిక వృత్తంలోకి అడుగుపెట్టి , బ్లాక్ లేబెల్ విస్కీలు తాగే పార్టీకి వెళ్ళిన మర్నాడే అతని ఉద్యోగం పోతుంది. అదే దారూ అంతానికి ప్రారంభం. ముంతాజ్ పట్ల అతనికున్న కాంక్షా, అతని హెరాయిన్ సేవనం హెచ్చవుతుండగా, అతని సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతుంటాయి. ‘నేను ఆమె పట్ల ఆకర్షితుడైనట్టే ఆమె కూడా అయింది. ముంతాజ్ అనే కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మటని నేను. ఆమె కూడా కొవ్వొత్తి అయిన నా చుట్టూ తిరిగే చిమ్మటే’ అంటాడు దారూ. నవల శీర్షిక– దారూ, ముంతాజ్ మధ్యన పెంపొందిన ప్రేమకి రూపకం. కొవ్వొత్తి చుట్టూ ప్రాణాంతకమైన మోహంతో తిరిగి, పొగగా మారి స్వీయ నాశనాన్ని ఎదురుకునే చిమ్మటని ఉటంకిస్తుంది. నవల్లో అధికభాగం దారూ దృష్టికోణంతోనే ఉన్నదైనప్పటికీ, అతనికి డ్రగ్స్ సరఫరా చేసే రిక్షా అతనితో సహా నవల్లో ఉన్న పాత్రలందరి ఆలోచనా ధోరణులూ పాఠకులకు పరిచయం చేయబడతాయి. తను ఎందుకు ‘మంచి/చెడ్డ వ్యక్తో’ అని ప్రతీ పాత్రా వివరిస్తుంది. లంచగొండి అవడం ఎంత అవసరమో అని ఓజీ, భర్త ఆప్త మిత్రుడితో ఎందుకు సంబంధం పెట్టుకోవలిసి వచ్చిందో అని ముంతాజ్, తను డ్రగ్స్ తీసుకోవడమేకాక అమ్మే దశకి కూడా ఎందుకు చేరుకున్నానో అని దారూ చెప్తారు. జీవితం గిరగిరా తిరుగుతూ చేతుల్లోంచి ఎలా జారిపోగలదో అర్థం అవుతుంది పాఠకులకి. తన్ని తాను లోకువ చేసుకుంటూ వినిపించే దారూ స్వగతాలకి అదనంగా, ఇతర గొంతులూ వినిపిస్తాయి. ‘డ్రమెటిక్ మొనొలోగ్’ అన్న ప్రక్రియని నవల్లో విరివిగా ఉపయోగించారు రచయిత. నవల పాకిస్తాన్ ధనిక వర్గపు దురాశా, అభద్రతనీ కనపరిచి– ధనిక వర్గానికీ, పేదవారికీ ఉన్న వ్యత్యాసాన్ని కూడా విశదపరుస్తుంది. పాత్రలని సాంప్రదాయికమైన నైతిక చట్రంలో చూపకుండా– వైరుధ్యం, వంచనతో నింపారు హమీద్. అమెరికన్ పదజాలాన్ని భారీగా ఉపయోగించారు. నవల్లో సమకాలీన పాకిస్తాన్ కనిపించినప్పుడు, ఇది నిజంగా ప్రపంచానికి తెలిసిన దేశమేనా! అన్న అనుమానం కలుగుతుంది. పుస్తకంలో ఉన్న ఏ పాత్రా అనవసరమయినది అనిపించదు. పాకిస్తానుకీ, ఇండియాకీ మధ్యనున్న పరమాణు సంబంధమైన పోటీ అన్న ప్రస్తావన పలుమార్లు కనిపిస్తుంది. నవల– మానవ ఘర్షణలు, ప్రేమ, ద్రోహం, ఓటమి, అసమానతల గురించినది. కథనంలో చమత్కారం, నిష్కల్మషతా కనబడతాయి. పుస్తకం బెట్టీ ట్రాస్క్ అవార్డు గెలుచుకుని, పెన్/హెమింగ్వే అవార్డుకి ఫైనలిస్టుగా ఎంచుకోబడింది. దీని ఆధారంగా, అజ్ఫర్ అలీ దర్శకత్వంతో తీసిన పాకిస్తానీ ఫిల్మ్ ‘దాయిరా’(వృత్తం) వచ్చింది. రాహుల్ బోస్తో తీయాలనుకున్న హిందీ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. యు. కృష్ణ వేణి -
‘సింగిల్ హ్యాండ్ స్నాచర్’..మోసిన్
స్నాచింగ్... ఈ పేరు చెప్పగానే ఓ ద్విచక్ర వాహనం, దానిపై హెల్మెట్/మాస్క్లతో దూసుకువచ్చే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. దీనికి భిన్నంగా సిటీలో సింగిల్ హ్యాండ్ స్నాచింగ్ సైతం జరిగింది. మధ్య మండలంలోని అబిడ్స్ ఠాణా పరిధిలో గతేడాది ఈ ‘సింగిల్ హ్యాండర్’ పంజా విసిరాడు. ఓ ఆటోను వెంబడిస్తూ వచ్చిన దుండగుడు... అదును చూసి అందులోని ప్రయాణికురాలి మెడలో గొలుసు తెంచుకుపోయాడు. ఎనిమిది నెలలుగా మిస్టరీగా ఉన్న ఈ నేరగాడు మరెవరో కాదు... మహ్మద్ మోసిన్ అలీ షాగా తేలింది. శనివారం పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠాలకు చెందిన నలుగురిలో ఇతడొకడు. పండిత పుత్ర... మాదిరిగా నగరానికి చెందిన మహ్మద్ సర్వర్ అలీ షా వత్తిరీత్యా వైద్యుడు. ప్రస్తుతం దుబాయ్లో ప్రాక్టీస్ చేస్తున్న ఈయన కుమారుడే మోసిన్ అలీ షా. చిన్నప్పటి నుంచీ నేరాలు చేస్తుండటంతో కుటుంబానికి దూరమయ్యాడు. కాచిగూడలోని ఛాపెల్ బజార్లో ఓ గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఓ యువతితో అయిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేయసితో కలిసి జల్సాలు చేయడం కోసం స్నాచింగ్స్ బాటపట్టాడు. ఏడాదిన్నర కాలంలో ఆసిఫ్నగర్, హుమాయూన్నగర్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, రాంగోపాల్పేట్, చిక్కడపల్లి, చిలకలగూడ, నాంపల్లి, అబిడ్స్, నల్లకుంట, సుల్తాన్బజార్ ఠాణాల పరిధిలో 18 గొలుసు దొంగతనాలు చేశాడు. కొన్ని నేరాలు చేయడానికి కోఠికి చెందిన విద్యార్థి సయ్యద్ జమీల్ హుస్సేన్ను వాడుకున్నాడు. అతడికి ఉన్న అవసరాలకు ఆసరాగా చేసుకుని నేరాలు చేసేప్పుడు తన వెంట తిప్పుకున్నాడు. పక్కా ప్లాన్ తో.. తన అవసరాలకు తగ్గట్టు సిటీలో వరుస స్నాచింగ్స్ చేసిన ఘరానా దొంగ మోసిన్ అలీ పోలీసులకు చిక్కకుండా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వీరు ఓ నేరం చేసిన తర్వాత ఆ సొత్తును సొమ్ము చేసుకునేవాడు. అది ఖర్చయ్యే వరకు మరో స్నాచింగ్ చేసే వాడు కాదు. గతేడాది మేలో అలిషా అనే వ్యక్తి నుంచి చోరీ వాహనమైన నీలి రంగు పల్సర్ ఖరీదు చేశాడు. అబిడ్స్ స్నాచింగ్తో పాటు మిగిలినవీ దీని పైనే తిరుగుతూ చేశాడు. కేవలం స్నాచింగ్స్ చేయడానికి మాత్రమే దీన్ని వినియోగించే వాడు. ఇతడి ప్రేయసి కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెను కలవడానికి వెళ్తున్న నేపథ్యంలోనే వివిధ కారణాలు చెప్పి అక్కడి పార్కింగ్ నిర్వాహకుడితో పరిచయం పెంచుకున్నాడు. ఓ స్నాచింగ్ చేసిన తర్వాత వాహనాన్ని ఆ పార్కింగ్లోనే పెట్టి మిగిలిన సమాయాల్లో యాక్టివా వాహనంపై తిరిగేవాడు. వాట్సాప్ ద్వారా క్రై మ్ అప్డేట్స్... మోసిన్ షాను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ బందం అతడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో టాస్క్ఫోర్స్తో పాటు శాంతిభద్రతల విభాగం పోలీసులు అరెస్టు చేసిన దొంగలు, నగరంలో జరుగుతున్న స్నాచింగ్స్కు సంబంధించిన సమాచారం ఉండటం చేసి అవాక్కయ్యారు. ఆరా తీయగా... వార్తల్ని మార్పిడి చేసుకునే ఓ వాట్సాప్ గ్రూప్లో తాను సభ్యుడిగా మారానని చెప్పాడు. ఆ గ్రూప్ ద్వారానే పోలీసుల కదలికలు, నగరంలో స్నాచింగ్స్ తీరుతెన్నులు తెలుసుకుంటూ పంజా విసిరేవాడినని వివరించాడు. మోసిన్ షా తాను స్నాచింగ్ చేసిన మర్నాడు ఈ గ్రూప్తో పాటు పత్రికల్నీ క్షుణ్ణంగా పరిశీలించే వాడట. ఎక్కడైనా సీసీ కెమెరాల్లో తన ఫొటో రికార్డు అయిందా? ఆ వివరాలు పోలీసులు గుర్తించారా? తదితర అంశాలు తెలుసుకోవడానికి ఇలా చేసే వాడినని టాస్క్ఫోర్స్ విచారణలో బయటపెట్టాడు. అబిడ్స్ ఠాణా పరిధిలో 2015 అక్టోబర్ 29న ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై సింగిల్గా పంజా విసిరిన ఫుటేజ్ కొన్ని రోజుల తర్వాత బయటకు రావడంతో కాస్తంత ఉలిక్కిపడ్డాడట ఈ ఘరానా స్నాచర్. మోసిన్, జమీల్లను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన ఆసిఫ్నగర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
కూర వండలేదని హత్య
నవవధువును కడతేర్చిన భర్త జీడిమెట్ల: భర్త చేతిలో ఓ నవవధువు హత్యకు గురైంది. తప్పతాగి వచ్చిన ఆ దుర్మార్గుడు కూర వండలేదని గొంతు నులిమి భార్య ఉసురుతీశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భూపాల్ గౌడ్, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... మెదక్జిల్లా ఆందోల్ మండలం తాడ్మనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ హుస్సేన్, మహబూబ్ బీలకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుతురు మోసిన్(19)ను గాజులరామారం డివిజన్ శ్రీరాం నగర్లో ఉండే దూరపు బంధువు మహ్మద్ ఫరీద్ 3వ కుమారుడు ఎండీ ఎజాస్(22)కు ఇచ్చి ఐదు నెలల క్రితం పెళ్లి చేశారు. కట్నం కింద అతనికి రూ.40 వేల నగదు, తులం బంగారంతో పాటు వంటసామగ్రి, బైక్ ఇచ్చారు. ఎజాస్ కూలి పనులు చేస్తుంటాడు. భార్య మోసిన్ అంటే మొదటి నుంచీ అతనికి ఇష్టం లేదు. బుధవారం రాత్రి 10 గంటలకు తప్ప తాగి ఇంటికి వచ్చిన ఎజాస్ అన్నం పెట్టమని భార్యను అడిగాడు. అన్నం వడ్డించిన ఆమె కూర వండలేదని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎజాస్ భార్యతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సమీపంలో ఉండే బంధువులకు విషయాన్ని చెప్పి తెల్లవారుజామున 3 గంటలకు జీడిమెట్ల పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వెంటనే సీఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మోసిన్ హత్య విషయం తెలిసి నగరానికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని రాక్షసుడికి ఇచ్చి చంపుకున్నామని వారు రోదించిన తీరు అందరి హృదయాలను కలిచి వేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement