-
స్పీకర్పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
-
హమ్ సబ్ భాయీభాయీ
వెల్లివిరిసిన మత సామరస్యం క్రీస్మస్ కేక్లు కట్చేసి, దుస్తులు పంపిణీ చేసిన ముస్లిం సోదరులు కాశిబుగ్గ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకోని గురువారం లోతుకుంట చర్చిలో స్థానిక మాజీ కార్పొరేటర్ యాకుబ్పాషా ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండా సురేఖ హాజరై క్రిస్మస్ కేక్ను కట్ చేసి, స్థానికులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత సామరస్యాన్ని చాటేలా క్రిస్మస్ నిర్వహించిన యాకూబ్పాషాను ఎమ్మెల్యే కొండా సురేఖ అభినందించారు. నిజాంపురలో చీరల పంపిణీ.. వరంగల్ 16వ డివిజన్ నిజాంపురలోని సెంటినరీ ట్రినిటి బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అబ్దుల్ ఖహార్ స్థానికులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు సాబిర్, అప్సర్, సలీమ్, గోరెబాయి, దేవదాసు, బాబురావు, వినోద్కుమార్, ఆశిర్వాదం, జోసఫ్, అలెగ్జండర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 15వ డివిజన్లో.. వరంగల్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని 15వ డివిజన్లోని అంబేద్కర్భవన్లో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ కార్పొరేటర్ మునవరున్నిసా క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు సాదిఖ్, టీఆర్ఎస్ నాయకులు బరుపట్ల మొగిళి, జన్ను ప్రదీప్, కందుకూరి దినేష్, రాము,వేణు, సంజీవ, దయాకర్, స్వామి, సుధీర్ రమేష్, సంఘ పాస్టర్ నరేష్పాల్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుకు హాజరైన కొండా సురేఖ, బోడకుంటి
జనగామ రూరల్: ఓ కేసు విషయమై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యూరు. 2008లో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ, టీడీపీ తరఫున బోడకుంటి వెంకటేశ్వర్లు అభ్యర్థులుగా పోటీ చేశారు. చేర్యాలలో కొండా సురేఖ సమయానికి మించి ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపిస్తూ బోడకుంటి వెంకటేశ్వర్లు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల అధికారి కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఇరువురు జనగామ కోర్టుకు హాజరయ్యూరు. అడిషనల్ ఫస్ట్ క్లాసు మెజిస్ట్రేట్ టి.నర్సిరెడ్డి ఈనెల 16కు వాయిదా వేశారని న్యాయవాది ఆలేటి సిద్ధిరాములు తెలిపారు. కొండా సురేఖ, బొడకుంటి వెంకటేశ్వర్లును కలుసుకున్న వారిలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రవి, సర్పంచ్ జయప్రకాష్ నారాయణరెడ్డి, నాయకులు ఈగం శ్రీనివాస్ ఉన్నారు. -
చందూలాల్కు క్లియర్
గిరిజన సంక్షేమ శాఖ దక్కే అవకాశం పార్లమెంటరీ సెక్రటరీగా వినయభాస్కర్ తుది ప్రయత్నాల్లో సురేఖ వరంగల్ : రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు మరో పదవి ఖాయమైంది. ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్కు కేబినెట్లో చోటు ఖరారైందని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్.. ఈ నెల 11న జరిగిన గిరిజన భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖను గిరిజనుడికి అప్పగిస్తామని ప్రకటించారు. దీని ప్రకారం చందూలాల్కు గిరిజన సంక్షేమ శాఖ దక్కనుంది. మంత్రి పదవి విషయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఆధారంగా సురేఖకు మంత్రి పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆమెకు మంత్రి పదవి బదులు.. ఆమె భర్త కొండా మురళీధర్రావుకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వవచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండుకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సురేఖకు మంత్రి పదవి దక్కకపోతే మురళీధర్రావుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని గులాబీ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మంత్రి పదవి ఆశించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ సెక్రెటరీ పదవి ఖాయమైందని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారం జరగునున్న మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత వెలువడే ఉత్తర్వులతో జిల్లా ఎమ్మెల్యేలకు దక్కే పదవులపై పూర్తి స్పష్టత రానుంది. పార్లమెంటరీ సెక్రటరీ.. పార్లమెంటరీ సెక్రటరీకి రాష్ట్ర సహాయ మంత్రి హోదా ఉంటుంది. ముఖ్యమంత్రి ఇష్టానుసారం వీరిని నియమించుకోవచ్చు. జీతభత్యాలు, వసతులు, ఇతర రవాణా సౌకర్యాల వంటివన్నీ మంత్రులతో సమానంగానే ఉంటాయి. ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్, అస్సాం, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, గోవా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు వీరు సహకరిస్తారు. వీరికి కేటాయించిన శాఖలకు రాజకీయ అధిపతులుగా వ్యవహరిస్తారు. సమీక్షలు నిర్వహించి ఆదేశాలిస్తారు. ఫైల్స్పై సంతకాలు చేస్తారు. కార్యాలయాల కేటాయింపుతోపాటు బుగ్గ కార్లు, జీతభత్యాలు గౌరవమర్యాదలు, ఇతర వసతులు వర్తిస్తాయి. సీఎం అనుమతిస్తే కేబినెట్ సమావేశాల్లో పాల్గొంటారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా వీరితో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వీరికి శాఖల కేటాయింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటన జారీ చేస్తారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం తెలంగాణలో ఇదే మొదటిసారి. మర్రిచెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 1978-80లో పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు ఉన్నాయి. పేరు : అజ్మీరా చందూలాల్ పుట్టిన తేదీ : 08-07-1954 విద్యార్హతలు : ఇంటర్మీడియెట్ తల్లిదండ్రులు : మీటూనాయక్, మీరాబాయి భార్య : శారద పిల్లలు : పద్మాదేవి, ధరంసింగ్, ప్రహ్లాద్, ప్రవీణ్ సామాజిక వర్గం: ఎస్టీ(లంబాడా) స్వస్థలం : సారంగపల్లి, జగ్గన్నపేట గ్రామపంచాయతీ, ములుగు మండలం. రాజకీయ నేపథ్యం.. 1981లో జగ్గంపేట సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1983లో టీడీపీలో చేరారు. 1985, 1994లో టీడీపీ అభ్యర్థిగా ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1994,1996 టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1996,1998లో వరంగల్ ఎంపీగా ఎన్నికయ్యారు.(అప్పుడు జనరల్ స్థానం) 2001లో ట్రైకార్ చైర్మన్గా మూడేళ్లు చేశారు. 1983, 1989, 1999 ఎన్నికల్లో ములుగు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ఓటమిపాలయ్యారు. 2005లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వ్యవహరిస్తున్నారు. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ములుగు నుంచి 16,399 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement