-
నాటి మాటల్ని.. కానివ్వకండి..నీటిమూటలు
మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చండి విలీన మండలాల సమస్యల్ని పరిష్కరించండి చంద్రబాబును కోరిన జిల్లా తెలుగుదేశం అన్నవరం మినీమహానాడులో పలు తీర్మానాలు అన్నవరం:జిల్లాకు సంబంధించి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అన్ని హామీలను పూర్తిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కోరుతూ జిల్లా తెలుగుదేశం మినీమహానాడులో తీర్మానించారు. అన్నవరం శివారు వల్లభ ఎస్టేట్లో ఆవరణలో ఆదివారం జరిగిన మినీ మహానాడుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్చార్జి, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. చినరాజప్ప ప్రసంగిస్తూ పోలవరం ప్రాజెక్ట్ను నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను ఆంధ్రలో కలపడం వెనుక చంద్రబాబు కీలకపాత్ర పోషించారన్నారు. అందుకే ఈ రబీ లో నీటి ఎద్దడి ఏర్పడినా సీలేరు, శబరి నుంచి నీరు తెచ్చుకుని పండించుకున్నామన్నారు. విలీన మండలాల ప్రజలకు గల పెక్కు సమస్యలను పరిష్కరించాలని సీఎం ను కోరుతూ తీర్మానించారు. కాకినాడలో నిర్మించతలపెట్టిన పెట్రోలియం ప్రాజెక్ట్కు వెంటనే భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలని, రాజమండ్రిలో రూ.80 కోట్లతో నిర్మించనున్న టూరిజం ప్రాజెక్ట్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతూ తీర్మానించారు. సుబ్బారెడ్డి ప్రాజెక్ట్, చంద్రబాబు సాగర్, ఏలేరు, తదితర ప్రాజెక్టుల ఆధునికీకరణ, కాల్వల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ తీర్మానించారు. రైతు రుణమాఫీ అమలు చేసినందుకు సీఎంను అభినందించారు. అధికారుల గుణగణాలు పరిశీలించండి.. ఎవరైనా అధికారి బదిలీకి సిఫార్స్ చేసేముందు నీతిమంతుడో, కాదో తెలుసుకుని సిఫార్స్ చేయాలని దేవినేని ప్రజాప్రతినిధులకు సూచించారు. అవినీతిపరులకు సిఫార్స్చేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. 2013-2015 మధ్య మృతి చెందిన జిల్లా టీడీపీ నాయకులకు సంతాపం ప్రకటించే తీర్మానంతో బాటు ఆర్థిక వ్యవహారాలు, శాంతిభద్రతలు, సాగు నీటి సమస్య, సంక్షేమం, మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు, పారిశ్రామిక ప్రగతి, ఈ గవర్నెన్స్, గిరిజన, మహిళా సంక్షేమం తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడే జిల్లాలో పార్టీకి సుప్రీం జిల్లా ఇన్చార్జి, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రసంగిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు జిల్లాలో పార్టీకి సుప్రీం అని, మంత్రులైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలైనా ఆయన సూచనల మేరకు నడవాల్సిందేని అన్నారు. ‘పదేళ్లు అధికారానికి దూరమై ఎన్నో బాధలు పడ్డాం. ఇంక అలాంటి పరిస్థితి రానీయవద్దు. కార్యకర్తలు, నాయకులు అంతా కలిసికట్టుగా సాగుదాం’ అన్నారు. ‘ఇకపై పార్టీ సమావేశాలు మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా జరగాలి. జెడ్పీ సమావేశానికి ముందు పార్టీ జిల్లా మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇన్చార్జి మంత్రిగా నే ను కూడా వస్తా. జెడ్పీ సమావేశం కూడా 8 గంటలు జరగాలి. అన్నీ చర్చించాలి’ అన్నారు. ఎన్నికలప్పుడు జిల్లా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని నీటి ప్రాజెక్ట్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మినీ మహానాడు తీర్మానాలపై 27, 28, 29 తేదీల్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. -
సమష్టిగా పనిచేసి పూర్వవైభవం తీసుకొద్దాం
శ్రీకాకుళం అర్బన్: టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అందరమూ కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర కార్మికశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆదివారం టీడీపీ జిల్లా మినీమహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పర్యాయాలు టీడీపీ అధ్యక్షునిగా చౌదరి బాబ్జి పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేశారన్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు శిరీష కూడా రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తని, ఆమెకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలన్నారు. జిల్లాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోతున్నామని, రెండేళ్లలో జిల్లాను అగ్రగామిగా ఉంచుదామన్నారు. జూలై నెలాఖరుకు తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నారాయణపురం ఆనకట్ట నిర్మాణానికి కూడా కృషిచేస్తామన్నారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పవర్కు లోటులేదన్నారు. అధికారం చేపట్టి వచ్చేనెల 2వ తేదీకి ఏడాది కావస్తోందని, జిల్లాలోని అన్ని గ్రామాల్లో నవనిర్మాణదీక్ష కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ విప్ రవికుమార్ మాట్లాడుతూ ఓర్పు, సహనం, అవగాహనతో మూడు తరాలను కలుపుకొంటూ పనిచేయాలని పార్టీ అధ్యక్షురాలు శిరీషకు సూచించారు. జిల్లా మహానాడులో మొదటితీర్మానంగా ఆమదాలవలసలోని సుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టాలని కోరారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా శిరీష పనిచేయాలన్నారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ 32సంవత్సరాలుగా పార్టీ కొనసాగుతూ వస్తోందంటే దానికి కారణం కార్యకర్తలేనన్నారు. వారి అభిప్రాయానికి అనుగుణంగానే పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ ఏడాది కాలంలో *20 కోట్లతో మంచినీటి సమస్యలు పరిష్కరించినట్టు వెల్లడించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని పరుగెత్తించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రజలపక్షాన పోరాడే పార్టీ టీడీపీగా కొనియాడారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ ఉద్దానం ప్రాజెక్టుకు ఎర్రన్న పేరు పెట్టాలని తీర్మానం చేశారు. ఈ సమావేశానికి ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్, ఎర్రన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చౌదరి బాబ్జి, హరిబాబునాయుడు, బి. మాధురి, నిమ్మక జయకృష్ణ, బి.గోవిందరాజులు, ఎ. మోహనరావు, ఎల్.ఎల్.నాయుడు, కె.అప్పలనాయు డు, ఎం.వెంకటేష్, జామి బీమశంకర్, పి.వి.రమణ, ఎస్.చంద్రమోహన్, కె.అప్పలనాయుడు పాల్గొన్నారు.
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రిషబ్ పంత్కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement