-
కేంద్ర మంత్రికి హరీష్రావు కౌంటర్
సాక్షి, సిద్ధిపేట: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ సర్కార్పై చేసిన విమర్శలకు.. బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ సర్కార్ను ఒత్తిడి చేసిందని.. మీటర్లు పెట్టలేదనే తెలంగాణకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలా సీతారామన్ బయటపెట్టారని అన్నారాయన. బుధవారం ఉదయం సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ సర్కార్ను ఒత్తిడి చేసింది. కాదంటే రూ.25 వేల కోట్లు ఇవ్వబోమని బ్లాక్మెయిల్కు దిగింది. కానీ, కేసీఆర్ మాత్రం రైతుల పక్షానే నిలిచారు. దేశంలో రైతు పక్షపాతి కేసీఆర్ ఒక్కరే. ఢిల్లీనేమో మమ్మలి శెభాష్ అంటారు.. ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తారు’ అని నిర్మలా సీతారామన్ను ఉద్దేశించి హరీశ్ అన్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నిర్మలమ్మ ‘కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రైతులకు అన్యాయం చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఈ రెండు పార్టీలు పాలిస్తున్న ఆయా రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టాయి. రాజస్థాన్లో మోటార్లకు మీటర్లు పెట్టారు. అదే విషయం ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తారా?. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒప్పుకున్నట్లే. ’.. అని తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి హరీష్ వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో 100 లక్షల కోట్ల అప్పు చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల కంటే తక్కువ అప్పు తీసుకుంది తెలంగాణనే. మోదీ సర్కార్ కార్పొరేటర్లకు రుణ మాఫీ చేసింది కానీ పేదలను పట్టించుకోలేదు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి బీజేపీనే కారణం. చేనేతలపై.. పాలప్యాకెట్లపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీది అని హరీష్ విమర్శించారు. -
అక్కడ పూల దండలను మూర లెక్కన అమ్మితే ఇక అంతే!
పువ్వులు అలంకరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని దండల రూపంలో ఐతే మూర లెక్కన విడి పువ్వులైతే గ్రాములు, కిలోల లెక్కన తీసుకుంటాం. ఇది సర్వసాధారణం. ఐతే ఇక నుంచి మూరలు లెక్కన పూల దండలను అమ్మడానకి వీల్లేదట. ఒకవేళ అలా అమ్మితే రెండు వేలు వరకు జరిమాన విధిస్తారట. అంతేగాదు పూల దండలను మీటర్లు లేదా సెంటీమీటర్ల చొప్పునే అమ్మాలనే నిబంధన కూడా విధించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ అంశం ఇప్పుడూ కేరళ అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..సాధారణంగా మల్లెలు, కనకాంభరాలు తదితర పూల దండలను మూరలెక్కనే అమ్మతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కేరళలో త్రిసూర్లో లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ ఇక నుంచి అలా అమ్మకూడదంటూ పూల వ్యాపారులకు నోటీసులు పంపింది. ఇలా అమ్మితే పూల దండ దాదాపు 24 అంగుళాలు లేదా 60 సెంటీమీటర్లే ఉంటుందని చెబుతోంది. ఇక నుంచి పూల దండలను సెంటీమీట్లర్లు లేదా మీటర్లలోనే కొలవాలని రూల్ పాస్ చేసింది. ఒకవేళ మూర లెక్కన అమ్మినట్లు తెలిస్తే వారికి రూ. 2000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. కేరళలో ఈ అంశం ఒక హాట్టాపిక్గా మారిపోయింది. త్రిసూర్ షాపులలో తనిఖీలు నిర్వహించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని లీగల్ మెట్రాలజీ విభాగం అధికారి ఏషియానెట్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 111ఈ, పీనల్ ప్రొవిజన్ 29 ప్రకారం పూల దండలను అత్యంత సాధరణ యూనిట్ ఎస్ఐ(ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్)లో కాకుండా మూర లేదా క్యూబిట్లో అమ్మడం నేరం అని, దీని కింద రూ. 2000/- జరిమాన విధిస్తామని కరాకండీగా తేల్చి చెప్పింది. ప్రజలు గనుక మూర లేదా క్యూబిన్ల కింద కోరినట్లయితే వ్యాపారులు 44.5 సెంటీమీటర్ల పూల దండను ఇవ్వాలని లీగల్ మెట్రాలజీ సూచించింది. ఐతే కొలతల్లో చాలా మార్పులు వస్తాయని వ్యాపారులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూల అమ్మకాలు చాల సంత్సరాలుగా జరగుతున్నాయి. నిజానికి సాధారణ ప్రజలకు పూలు మూర లేదా సెంటమీటర్లలో అమ్మడం అనేది అనవసరమైన విషయమని, ఇది పెద్ద సమస్య కాదంటూ ఆ నిబంధనను వ్యాపారులు కొట్టిపారేయడం గమనార్హం. (చదవండి: వామ్మో ఎంత పెద్ద క్యూ లైన్! అంతలా బారులుతీరి జనాలు ఎందుకున్నారంటే.. -
మోటార్లకు మీటర్లు పెడతామన్నది మీరే కదా?
కమలాపూర్: ‘బీజేపీని గెలిపిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేం ఎక్కడ కూడా అలా చెప్పలేదు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందా? రాయలేదా?’స్పష్టంగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వ నూతన పాలసీని తాను చదివి వినిపిస్తే ఇప్పటిదాకా మౌనంగా ఉండి, మళ్లీ ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు. కేసీఆర్ హామీ లపై చర్చకు రమ్మని అనేక సార్లు సవాల్ విసిరితే స్పందించలేదని, వాళ్లు చేసిన సవాల్ను తాము స్వీకరించినా స్పందించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరిస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ సంస్థలో రాష్ట్రానిది 50 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయని, తక్కువ శాతం వాటా ఉన్నోళ్లకు ప్రైవేటీకరణ చేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదన్నారు. -
మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన లేదు: అమిత్షా
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని.. సీఎం కేసీఆర్ కేవలం రైతులను రెచ్చగొట్టేందుకే ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన.. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో 17 మంది ఆదర్శ రైతులు, రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, కేసీఆర్ పాలన, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న సీఎం కేసీఆర్ ఆరోపణలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అమిత్షా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టేందుకే కేసీఆర్ అర్థంపర్థంలేని వాదనలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటికి వెళ్లిందని.. పంట నష్టపోతున్న రైతులు పరిహారం రాక అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని, రైతు ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు.. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టిసారించాలని అమిత్షా సూచించారు. బీమా లేక నష్టపోతున్నాం.. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలుగాక నష్టపోతున్నామని కొందరు రైతులు అమిత్షా దృష్టికి తీసుకొచ్చారు. తెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ.. తనకు పదెకరాల భూమి ఉందని, గతంలో వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని చెప్పారు. కొంత భూమిని అమ్మేసి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టానని, దీనితో లాభాలు ఆర్జిస్తున్నానని తెలిపారు. దీనిపై అమిత్షా స్పందిస్తూ.. సేంద్రియ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందని, తాను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని పేర్కొన్నారు. తనవద్ద మేలుజాతి ఆవులు ఉన్నాయని.. అందులో ఒకటి 12వ జనరేషన్ గోమాత అని చెప్పారు. ఆ గోమాతకు మహాలక్ష్మిగా నామకరణం చేసి తన మనవడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో ఇబ్బంది ఉందని కొందరు రైతులు షా దృష్టికి తీసుకురాగా.. త్వరలో అమూల్ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. చదవండి: కుటుంబ పాలనకు చరమగీతం -
బీజేపీకి ఓటేస్తే.. మోటార్లకు మీటర్లే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘రైతు బంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలు అంతగా ఎందుకు ఇస్తున్నారని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. గుజరాత్లో రూ.600 పెన్షన్ ఇస్తుంటే.. ఇక్కడ రూ.2 వేలు ఎందుకు ఇస్తున్నారని అడుగుతోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు పడిందంటే మోటార్లకు మీటర్లు పడ్డట్టే. ప్రజలు ఆగం కావొద్దు. మోసపోతే గోస పడతాం. మోటార్ల వద్ద కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ బంద్ అవుతాయని.. ఇవి పార్టీల ఎన్నికలు కావని.. రైతులు, కార్మికుల ప్రజల బతుకుదెరువు ఎన్నికలని పేర్కొన్నారు. శనివారం మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం కేసీఆర్ మాటల్లోనే.. అమిత్షా సమాధానం చెప్పాలి.. ‘‘రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎందుకు తేల్చడం లేదు. అవసరమైన చోటికి నీళ్లు తెచ్చుకుందామనుకుంటే మా వాటా తేల్చడం లేదు. ఇందుకోసమే అమిత్షా మునుగోడుకు వస్తున్నారా.. ఇదే గడ్డపై సమాధానం చెప్పాలి. పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్రెడ్డి, ఇక్కడి నుంచి ఉన్న కేంద్రమంత్రి ఢిల్లీకి వెళ్లి కృష్ణా జాలాల వాటా సంగతేమిటని అడగలేరా. అలా కాకుండా డోలు బాజా తీసుకొని అమిత్షాను ఇక్కడికి తీసుకువస్తారా? çకృష్ణా జలాల్లో వాటా ఎందుకు తేల్చడం లేదో, మీ చేతగానితనం ఏంటో అమిత్షా చెప్పాలి. ఒక్క మంచి పని అయినా చేశారా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఒక్క మంచి పని అయినా చేశారా? దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, రైతులు ఏ వర్గానికీ మేలు జరిగిందీ లేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. ఎయిర్పోర్టులు, విమానాలు, రైళ్లు, బ్యాంకులు, గ్యాస్ కంపెనీలు, పోర్టులు అన్నీ పోయాయి. ఇప్పుడు రైతులు, భూములు, వ్యవసాయ పంటల మీద పడుతున్నారు. రైతులు, రైతు కూలీ నోట్లో మట్టి పోసే ప్రయత్నం జరుగుతోంది. బావుల వద్ద మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. నేనైతే ప్రాణం పోయినా మీటర్లు పెట్టబోనని అసెంబ్లీలోనే చెప్పిన. ఈ మీటర్ల వ్యవహారం వెనుక చాలా మోసం ఉంది. విద్యుత్ చార్జీలు, ఎరువుల ధరలు పెంచడం, పండిన పంటను కొనకపోవడం వంటివి చేసి.. రైతులు వ్యవసాయం చేయలేమనేలా చేస్తున్నారు. మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతున్నారు. మీ భూములు ఇచ్చేయండి, మేం వ్యవసాయం చేస్తం. మీరు కూలీ పనులు చేయండి అంటారు. వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మునుగోడు నియోజకవర్గంలో 1.01 లక్షల మందికి రైతు బంధు వస్తోంది. నేరుగా బ్యాంకు అకౌంట్లలో పడుతోంది. ఇప్పుడు దానిని బంద్ చేయాలని చూస్తున్నారు. రైతు బీమాను బంద్ చేయాలట.. ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు, మేం ఢిల్లీకి పొయి ధర్నా చేశాం. అంత పెద్ద ఎఫ్సీఐని చేతిలో పెట్టుకొని కూడా ధాన్యం తీసుకోబోమన్నారు. పైగా మీడియా వాళ్లు లేనిది చూసి.. మీరు అంతంత పెన్షన్లు ఎందుకిస్తున్నారు? రైతులకు డబ్బులు ఎందుకిస్తున్నారు అని అడిగారు. వికలాంగులకు, గీత కార్మికులకు, ముసలోళ్లకు పింఛన్ ఇవ్వొద్దట. ఈ నియోజకవర్గంలో 1,100 మందికి రైతు బీమా వచ్చింది. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా 15 రోజుల్లో రూ.5 లక్షలు బ్యాంకులో జమ అవుతోంది. ఇలాంటిది దేశంలో ఎక్కడైనా ఉందా? ఇది కూడా ఇవ్వకూడదంట. దీన్ని బంద్ పెట్టాలంటారు మోదీ. మరి ఏం చేయాలి? దేశంలో ఏం జరుగుతోందో ఆలోచించండి. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లే.. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు. మన జీవితాల ఎన్నిక. బీజేపీకి ఓటేస్తే నష్టపోతాం. నువ్వు మీటర్లు పెట్టుమంటే పెట్టలేదు. అయినా ప్రజలు మాకే ఓటేశారని, నువ్వు తప్పుకో మేమే మీటర్లు పెడతామని మోదీ అంటారు. మీటర్లు పెట్టే నరేంద్ర మోదీ, బీజేపీ కావాలా..? మీటర్లు వద్దనే టీఆర్ఎస్, కేసీఆర్ కావాలా.. తేల్చుకోండి. గ్రామాల్లో అందరితో చర్చించండి. నేను ప్రధాన మంత్రితో కొట్లాడుతున్నా.. నా బలం, ధైర్యం మీరే. అలాంటి మీరు బీజేపీకి ఓటు వేసి బలహీనపరచొద్దు. మునుగోడులో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్ రాలేదు. ఇప్పుడు వస్తదా.. వచ్చిందంటే మీటర్ వస్తది. బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బాయికాడ మీటర్ పడ్డట్టే. అప్రమత్తంగా ఉండండి. మోటార్ల వద్ద కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలి. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ అయి పోరాటం చేయాలి. కాంగ్రెస్కు ఓటేస్తే వృథానే.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వృధానే తప్ప ఉపయోగం ఉండదు. ఈ ఎన్నికతో తెలంగాణ ఏమంటోందన్న మెసేజీ దేశవ్యాప్తంగా Ðవెళ్లాలి. బొమ్మలు చూసో, గోల్మాల్, గ్యారడీ విద్యలు చూసో మోసపోతే గోసపడతాం. ఉన్న సౌకర్యాలు, ఉన్న పెన్షన్లు, ఉన్న వసతులు, ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి. మునుగోడు రైతులు ఓటేసే ముందు పొలం కాడికి పోయి బోరుకు దండంపెట్టి ఓటేయండి. అక్క చెల్లెళ్లు ఓటేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఏడికిపోయిందో ఆలోచించి ఓటు వేయండి. బీజేపీని తరిమి కొట్టండి. మళ్లీ వస్తా. చండూరులో సమావేశం అవుదాం. దేశవ్యాప్తంగా క్రియాశీల పోరాటాలు దేశవ్యాప్తంగా ప్రగతిశీల, క్రియశీల శక్తులు ఏకం కావాలని, ఈ దుర్మర్గులను పంపేస్తేనే ప్రజలు, దేశం బాగుపడుతుందని సీపీఐ, సీపీఎం నాయకులతో చెప్పా. బీజేపీతో దేశ ప్రజల జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే సీపీఐ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. సీపీఎం కూడా రేపోమాపో కలిసి వస్తుంది. ఈ పోరాటం ఒక్కరోజుతో ఆగేది కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా ఐక్యత ఇలాగే కొనసాగాలి. పేదలు, రైతులు బాగుపడేదాకా పోరాటం కొనసాగిస్తాం. టీఆర్ఎస్తోనే నల్లగొండ అభివృద్ధి ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. నేను రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడే ఈ సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లాం. ఢిల్లీలో ప్రధాని ముందుకు బాధితులను తీసుకెళ్లి గోస చూపించాం. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టకపోతే నల్లగొండ నో మ్యాన్ జోన్ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అయినా రాష్ట్ర పాలకులుగానీ, దేశ పాలకులు గానీ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ పథకంతో సురక్షిత తాగునీరు ఇచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం. కృష్ణా బేసిన్ నుంచి డిండి ద్వారా శివన్నగూడెం ప్రాజెక్టుకు నీరు తెచ్చుకోవాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం. తెలివిగా ఆలోచించి టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకోవాలి. ఇది గోల్ మాల్ ఎన్నిక ఇది ఆషామాషీ ఎన్నిక కాదు.. ఆగం కావద్దు.. మన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పజెప్పుకోవద్దు. ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆలోచించి ఓటేయాలి. ఇది గోల్మాల్ ఎన్నిక. ఇంకో ఏడాదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఉప ఎన్నిక ఎందుకొచ్చింది, దీని వెనక ఉన్న మాయ ఏమిటో గుర్తించాలి. లేకపోతే దెబ్బతింటాం. మనదాంట్లో కూడా కొందరు సన్నాసులు ఉంటారు. పక్క నాయకులు మందుపెట్టి, దూది పెట్టగానే వాళ్ల వెంట వెళ్లిపోతారు. దానికి ఆశపడొద్దు. నేను ఒకటే చెబుతున్నా. ఇది పార్టీల ఎన్నిక కాదు.. రైతులు, కార్మికుల బతుకుదెరువు ఎన్నిక. తెలంగాణ మన జీవితం. దీన్ని పోగొట్టుకోవద్దు. ఎవరు పెద్ద మెజారిటీతో గెలుస్తారో వాళ్ల మెసేజ్ దేశానికి పోతుంది. కాబట్టి ఆలోచించాలి. ఉన్నది మూడు తోకలు.. ఇంత అహంకారమా? తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలుంటే టీఆర్ఎస్కు 103 మంది. బీజేపీకి ఉన్నది 3 తోకలు. వాళ్లు మమ్మల్ని పడగొట్టి ఏక్నాథ్ షిండేలను తెస్తారట. ఇది అహంకారమా.. బలుపా.. ఎవరు పడితే వాళ్లు సీఎంను విమర్శిస్తారు. ఈడీ కేసు పెడతాం అంటారు. ఈడీ వస్తే ఏంటి? నాకే చాయ్ తాగించి పోవాలి. దొంగలైతే భయపడతారు. ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ప్రజల కోసం నిలబడేవాళ్లు మీకు భయపడరని మోడీ గుర్తుంచుకోవాలి. నువ్వు నన్ను గోకినా గోకకున్నా.. నేను నిన్ను గోకుతా. నీ దుర్మార్గం, నీ మోసకారి విషయాలు ప్రజలకు తెలుసు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో ప్రభుత్వాలను పడగొడతా అంటావ్. నిన్ను పడగొట్టే వారు లేరనుకుంటున్నావా? నిన్ను పడగొట్టడానికి వేరే శక్తులు అవసరం లేదు. అహంకారం, నీ గర్వమే నీ శత్రువులు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానాలే మీకు శత్రువులు అవుతాయి. రోడ్డు మార్గంలో చేరుకుని.. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు రోడ్డు మార్గంలో బయలుదేరిన సీఎం కేసీఆర్.. 3.45 గంటలకు మునుగోడు సభావేదిక వద్దకు చేరుకున్నారు. మొదట అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. తర్వాత తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించి.. టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత సభా వేదికపై ప్రసంగించారు. సభలో సీఎం కన్నా ముందు సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డి ప్రసంగించారు. మునుగోడులో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు: పల్లా వెంకటరెడ్డి ఉప ఎన్నికలో తాము టీఆర్ఎస్కు బేషరతుగా మద్దతిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్తో కలిసి వచ్చిన ఆయన సభలో మాట్లాడారు. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడుతున్నారని.. దేశంలో మేధావులు, అభివృద్ధి కాముకులకు మొదటి శత్రువు మతోన్మాద బీజేపీనేనని పల్లా వెంకట్రెడ్డి పేర్కొన్నారు. మోదీ వచ్చినా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదన్నారు. రాజగోపాల్రెడ్డి మునుగోడులో సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపిన కేసీఆర్: మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడును పట్టి పీడించిన ఫ్లోరైడ్ రక్కసిని సీఎం కేసీఆర్ రూపుమాపారని మంత్రి జి.జగదీశ్రెడ్డి మునుగోడు సభలో పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందునాటి మునుగోడు, నల్లగొండ బాధలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆవేదన కలుగుతోందన్నారు. అది దేవుడిచ్చిన శాపం కాదని.. పాలకులు చేసిన మోసమని మండిపడ్డారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏ జిల్లాకు వెళ్లినా నల్లగొండ బాధలు చెప్పేవారరని.. ప్రజల బాధను రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలియజేశారని వివరించారు. తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయిన ఏడాదిలోనే మునుగోడుకు రక్షిత తాగునీటిని తీసుకు వచ్చారని చెప్పారు. మిషన్ భగీరథతో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్ వ్యాధికి గురికాకుండా కాపాడారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ మునుగోడులో దాదాపు 15 శాతం వికలాంగులు ఉన్నారని పేర్కొన్నారు. చదవండి: 24 గంటలు టైమ్ ఇస్తున్నా.. కేజ్రీవాల్కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement