-
ఎస్ఎస్సీ పోటీ పరీక్షల సన్నద్ధతకై
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి వారం రోజులపాటు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఉద్యోగ పోటీ పరీక్షలు జరగనున్నాయని, దీనికోసం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో టి–శాట్ నెట్వర్క్ చానళ్లు పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేశ్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న లైవ్ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని, పోటీ పరీక్షలకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని శైలేశ్రెడ్డి వివరించారు. 25వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే లైవ్లో సబ్జెక్టు, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు తమ సందేహాల కోసం ఫోన్ ద్వారా 040–2354 0326, 2354 0726 టోల్ ఫ్రీ 1800425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో సూచించారు. జనవరి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు ప్రసారాలుంటాయని వెల్లడించారు.(చదవండి: గిరిజన గురుకుల పరిధిలో లా కాలేజీ) ఓయూ ఎంసీఏ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంసీఏ కోర్సు పలు సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఎంసీఏ 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్లో ఫలితాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
ఎంసీఏ ఇక రెండేళ్లే
సాక్షి, అమరావతి: మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు కాల పరిమితిని రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లుగా ఉండేది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా ఈ కోర్సును రెండేళ్లకు కుదిస్తూ మార్గదర్శకాలిచ్చింది. దీనిలో చేరేందుకు మేథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ, బీఏ, బీకాం పూర్తిచేసిన అభ్యర్థులు వర్సిటీలు రూపొందించిన ‘ప్రీరిక్విజైట్’ కోర్సు పాసవ్వాలి. ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘ప్రీరిక్విజైట్’ కోర్సును రూపొందించుకోవాలని ఆయా యూనివర్సిటీల వీసీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. -
వచ్చేనెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు 14న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహిíßంచాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్, క్యాంపు అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేశారు. వచ్చేనెల నెల 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిటీ వెల్లడించింది. 7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 12న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. వారికి వచ్చేనెల 14న సీట్లు కేటాయించనుంది. ప్రస్తుతం ఐసెట్లో అర్హత సాధించిన వారు 69,900 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అది పూర్తి కాగానే సీట్ల సంఖ్య తేలనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాల్సిన వివరాలు, వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, హెల్ప్లైన్ కేంద్రాల వివరాలను ్టటజీఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో పొందొచ్చు. స్పెషల్ కేటగిరీ వారికి మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈసారి కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి. బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తారు. వెంటతెచ్చుకోవాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు హా ఐసెట్ ర్యాంకు కార్డు, హా హాల్టికెట్, హా ఆధార్ కార్డు, హా డిగ్రీ మార్కుల మె మో, పాస్ సర్టిఫికెట్, హా ఇంటర్మీడియట్ తత్సమాన మార్కుల మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, హా పదో తరగతి మార్కుల మెమో, హా 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, హా 2017 జనవరి 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, హా స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు హా నాన్ లోకల్ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రులు 10 ఏళ్లు తెలంగాణలో నివసించిన నివాస ధ్రువీకరణ పత్రం, హా రెగ్యులర్గా చదువుకోని వారైతే 7 ఏళ్ల నివాస ధ్రువీకరణపత్రం. -
ప్రశాంతంగా టీఎస్ ఐసెట్
91.93 శాతం మంది అభ్యర్థుల హాజరు కేయూ క్యాంపస్: తెలంగాణలోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఐసెట్–2017 ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో మొత్తంగా 132 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 77,422 మంది అభ్యర్థులకుగాను 71,172 మంది (91.93శాతం) అభ్యర్థులు హాజరయ్యారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.ఓంప్రకాశ్ తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు జరగగా బయోమెట్రిక్ పద్ధతి ద్వారా హాజరు నమోదు చేయనున్నట్లు ముందుగానే ప్రకటించడంతో అభ్యర్థులు ఉదయం 8–30 గంటల నుంచే పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. ఈ నెల 21న ప్రాథమిక కీని వెబ్సైట్లో అం దుబాటులో ఉంచుతామని, ఈ నెల 30న తుది కీ తోపాటు ఫలితాలను వెల్లడిస్తామని ఓంప్రకాశ్ వెల్లడించారు. టీఎస్ ఐసెట్–2017కు గురువారం ఉదయం 6 గంటలకు కాకతీయ వర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో ప్రశ్నపత్రాల సెట్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపి రెడ్డి ఎంపిక చేశారు. రెండు బాక్సుల నుంచి ‘ఏ’సెట్ ప్రశ్నపత్రాన్ని ఆయన ఎంపిక చేయగా అన్ని కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. -
రూ.10 వేలు ఇస్తాం.. కాలేజీకి రానక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా.. అయితే వెబ్ ఆప్షన్లలో మా కాలేజీని ఎంచుకోండి.. మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు.. మేమే మీకు రూ.10 వేలు ఇస్తాం’ అంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభ పెడుతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్ల్దిండ్రుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. ప్రధాన కాలేజీలు తప్ప చిన్న చిన్న కాలేజీలు మా కాలేజీలో చేరండంటే.. మా కాలేజీలో చేరండి అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. కన్వీనర్ కోటాలో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కొంత మొత్తం ఇస్తామని విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. పైగా కాలేజీకి రానవసరం లేదని అటెండెన్స్, మార్కులు తామే వేస్తామంటూ ప్రలోభ పెడుతున్నాయి. ఈ విషయం కాస్తా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి దృష్టికి వెళ్లింది. అంతేకాదు ఆయన ఓ కాలేజీ యాజమాన్యానికి పేరెంట్లాగా ఫోన్ చేసి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ‘ఇదేమీ టెక్నికల్ కోర్సు కాదు కదా.. కాలేజీకి రానవసరం లేదు. మా కాలేజీలో చేర్చితే రూ.10 వేలిస్తాం’ అని యాజమాన్యం చెప్పడంతో పాపిరెడ్డి అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థుల హాజరు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంతోపాటు యాజమాన్యాల తప్పిదాలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 250 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 28,228 సీట్లు అందుబాటులో ఉండగా, ఎంసీఏ కాలేజీల్లో 2,181 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement