-
రూ.90 కోట్ల విలువైన మద్యం దగ్ధం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లిక్కర్ డిపోలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.90 కోట్ల విలువైన మద్యం నిల్వలు దగ్ధమైనట్లు డిపో మేనేజర్ ప్రభుదాస్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని డిపో అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్లోని తెలంగాణ రాష్ట్ర బ్రివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్బీసీఎల్) గోదాంలో 1985 నుంచి లిక్కర్ డిపో నిర్వహిస్తున్నారు. ఈ డిపో నుంచి ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వైన్స్ షాపులకు మద్యం సరఫరా అవుతోంది. బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ డిపోలో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. కాసేపటికే మంటలు చెలరేగి మద్యం నిల్వలను చుట్టుముట్టాయి. మంటల ధాటికి లిక్కర్ బాటిళ్లు పేలిపోవడంతో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. లిక్కర్లో ఉన్న స్పిరిట్ వల్ల మంటలు దావానలంలా వ్యాపించాయి. లోపలి నుంచి బాటిళ్లు పేలిపోయి పైకప్పురేకులను పగలగొట్టుకొని బయటకు వచ్చిపడ్డాయి. ఉట్నూర్కు సమీపంలో ఉన్న ఆరు అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అవి అదుపులోకి రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో డిపోలో 50 వేల ఐఎంఎల్ కేసులు, 30 వేల బీర్ల కేసులు ఉన్నాయని, వీటి విలువ రూ.90 కోట్లు ఉంటుందని డిపో మేనేజర్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ఎక్సైజ్ శాఖ విచారణ మొదలుపెట్టినట్టు తెలిసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి అధికారులు రానున్నారని సమాచారం. -
పైసా వసూల్..
ప్రొద్దుటూరు క్రైం :చేయి తడిపితేనే అక్కడ మద్యం కేసులు వాహనాల్లోకి వెళ్తాయి. లేదంటే మాత్రం వాహనంతో పడిగాపులు కాయాల్సిందే. డిపో అధికారులు ఒక రేటు నిర్ణయించి మద్యం షాపుల నుంచి వసూలు చేస్తున్నారు. నెలకు సుమారు రూ.4 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఒక వేళ డబ్బు ఇవ్వకుంటే తమకు మద్యం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో డబ్బు ఇస్తున్నామని వారు అంటున్నారు. ప్రొద్దుటూరు ఈఎస్ పరిధిలో 134 మద్యం షాపులు ప్రొద్దుటూరు శివారులోని లింగాపురం సమీపంలో ఇటీవల కొత్తగా ఏఎంఎఫ్ఎల్ డిపో (లిక్కర్ డిపో)ను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు, పులివెందుల, ముద్దనూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లోని మద్యం వ్యాపారులకు కడప ఎక్కువ దూరం అవుతుందనే ఉద్దేశంతో.. ప్రొద్దుటూరులో నూతనంగా లిక్కర్ డిపో ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు ఈఎస్ పరిధిలో సుమారు 134 మద్యం షాపులు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపు నిర్వాహకులు వారంలో రెండు–మూడు సార్లు డిపో నుంచి స్టాకు తీసుకెళ్తారు. ఇలా నెలలో 10–12 సార్లు స్టాకు తెచ్చుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. మద్యం వ్యాపారులు చలానా రూపంలో డబ్బు చెల్లించి సరుకు తెచ్చుకుంటారు. డబ్బు తీసుకోలేదు మద్యం డిపోలో ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని డిపో ఇన్చార్జి మేనేజన్ చెన్నప్ప అన్నారు. మద్యం కోసం యజమానులు ఎవ్వరూ రారని, ట్రాన్స్పోర్టు ద్వారా చలానా పంపిస్తారని ఆయన చెప్పారు. డబ్బు వసూలు చేయడం కోసం ఎవ్వరినీ నియమించలేదని పేర్కొన్నారు. ప్రారంభంలో డబ్బుఇవ్వబోమన్న వ్యాపారులు లిక్కర్ డిపో ప్రారంభంలో ఒక్కో చలానాకు రూ. 300 ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయగా మద్యం వ్యాపారులు ఇవ్వబోమని కరాఖండిగా చెప్పేశారు. అయితే తిరిగి మద్యం దుకాణదారులు సమావేశమై రూ.250 ఇచ్చేలా తీర్మానం చేసినట్లు తెలిసింది. కాగా వసూలు చేసిన డబ్బులో అధికారులతోపాటు ఎక్సైజ్ స్టేషన్లకు పంపిస్తున్నామని డిపోలోని ఒక అధికారి చెప్పడం గమనార్హం. ప్రత్యేక సిబ్బందిచే వసూలు తమకు దగ్గరలో మద్యం డిపో ఏర్పాటైందని, ఖర్చులు తగ్గుతాయని తొలుత వ్యాపారులు భావించారు. అయితే డిపోలోని అధికారుల ధన దాహానికి తీవ్రంగా నష్టపోతున్నామని దుకాణ యజమానులు చెబుతున్నారు. అసలే అంతంత మాత్రంగా వ్యాపారాలు ఉన్నాయని, స్టాకు కోసం వెళ్లినప్పుడు డిపో సిబ్బంది అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో చలానాకు రూ. 250 కచ్చితంగా ఇవ్వాల్సిందేనని వారు అంటున్నారు. డబ్బు లేదంటే మాత్రం వారి వాహనాలకు స్టాకు ఎత్తరని, ఒక వేళ స్టాకు లోడ్ చేసినా తీవ్ర జాప్యం చేస్తారని వాపోతున్నారు. రెండు మూడు కేసుల మద్యం తీసుకున్నా రూ.250 చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఇలా నెలకు మద్యం షాపుల నుంచి రూ.4 లక్షలు పైగా వసూలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. డబ్బు వసూలు కోసం అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. -
మద్యం మాయాజాలం
ఆ అధికారి దందాకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. నేనే రాజు.. నేనే మంత్రి అనేలాడిపోలో ఆయన పాలన సాగిస్తున్నాడు. తనకుఎవరైనా అడ్డు తగిలితే బదిలీ చేయిస్తాడు.తన అవినీతి బాగోతం బయటికి పొక్కకుండాఉండేందుకని ముందు జాగ్రత్తగా ముఖ్యమైనవిభాగాల్లో కుటుంబ సభ్యులను ఏర్పాటుచేసుకున్నాడు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రొద్దుటూరులో పని చేస్తున్నఆ అధికారి అవినీతి తారా స్థాయికి చేరింది. ప్రొద్దుటూరు క్రైం :గతంలో జిల్లా అంతటికి కడపలో మాత్రమే లిక్కర్ డిపో ఉండేది. మద్యం వ్యాపారుల సౌలభ్యం కోసం గత నవంబర్లో ప్రొద్దుటూరులో డిపోను ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 134 మద్యం షాపులు, 12 బార్లు ఉన్నాయి.ఇందులో సుమారు 61 మంది హమాలీలు పని చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూలు నిర్వహించి 58 మందిని నియమించగా తర్వాత మరో ముగ్గురిని చేర్చుకున్నారు. నియామకాల సమయంలో కొందరి హమాలీల వద్ద రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైదుకూరు రోడ్డులోని లింగాపురం సమీపంలో ఉన్న ప్రొద్దుటూరు మద్యం డిపోకు వివిధ ప్రాంతాల నుంచి రోజు 10 లారీల లోడ్ వస్తుంది. ఒక్కో లారీలో 1275 కేసులు దాకా ఉంటాయి. లోడింగ్ సమయంలో సుమారు 15–20 సీసాలు దాకా డ్యామేజ్ అవుతాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే డిపోలోని అధి కారి మాత్రం 40–50 దాకా సీసాల బ్రే కేజీ అయినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్స్బర్గ్, సాబ్, యూబీ, బడ్వైజర్, టెన్ తౌజండ్ తదితర కంపెనీలకు చెం దిన ప్రతినిధులు (రెప్లు) డిపోలో ఉం టారు. బ్రేకేజీ ఎక్కువ ఎందుకు రాసుకుంటున్నారని అడ్డు చెప్పిన వారిపై అధికారి కంపెనీకి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారి అవినీతి దందాను ప్రశ్నించినందుకు గాను కొం దరు కంపెనీ ప్రతినిధులను డిపో ఆవరణలోకి కూడా రానివ్వడం లేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. డిపోకు లారీ లోడ్ రాగానే ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని బ్రేకేజీ అయ్యాయో కంపెనీ రెప్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. మద్యం సరుకు ఇన్వాయిస్ పరిశీలించి కంపెనీకి రోజు వారి సమాచారం పంపించాలి. అయితే 20 బాటిళ్లకు బదులు 50 పగిలి నట్లు రాసుకుంటూ అధికారి మాయాజాలం చేస్తున్నట్లు సమాచారం. ఇలా రోజుకు 10 లారీల నుంచి సుమారు 12 కేసుల మద్యాన్ని సేకరించి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు డిపోలోని సిబ్బంది కొందరు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇందులో రూ.200 నుంచి రూ.2 వేల విలువ చేసే మద్యం సీసాలు ఉన్నా యి. వీటిని విక్రయించడం వల్ల ఆ అధి కారికి రోజు సుమారు రూ.40–50 వేలు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. కనిపించని సీసీ కెమెరాలు: ప్రొద్దుటూరు మద్యం డిపోలో రూ. కోట్ల విలువ చేసే మద్యం నిలువలు ఉన్నాయి. చిన్న దుకాణాలకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్న ఈ రోజుల్లో డిపోలో కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా ఏర్పాటు చేయకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. గోడౌన్లోని మద్యం సీసాల లెక్కింపులో తేడాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నం అవుతోంది. కావాలనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. అనధికారికంగా ఎవరూపని చేయడం లేదు.. మా డిపోలో అనధికారికంగా ఎవరూ పని చేయడం లేదు. సీసీ కెమెరాల కోసం రాసి పంపించాం. ఎన్ని కెమెరాలు కావాలి.. ఎంత ఏరియా ఉందని ఉన్నతాధికారులు అడిగారు. ఇంకా కెమెరాలు రాలేదు. లారీ లోడ్లో మద్యం సీసాలు ఎన్ని బ్రేకేజీ అవుతాయో ఖచ్చితంగా చెప్పలేం. ఎన్ని పగిలితే అన్ని మాత్రమే స్కాన్ చేసి రాసుకుంటాం. ఎక్కువ బ్రేకేజీ రాసుకుంటామనడంలో వాస్తవం లేదు. అలా చేయడానికి అవకాశం ఉండదు. మద్యం కంపెనీల రెప్లు లోపలికి రాకూడదు. ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్లాలి. అవసరం ఉంటే మేమే పిలిపిస్తాం. వాళ్లు లోపలికి రావాలనే రూల్స్ పొజిషన్ ఏదీ లేదు. కాంపౌండ్లో స్టాఫ్, వర్కర్లు మాత్రమే ఉండాలి. – చెన్నప్ప,ఇన్చార్జి డిపో మేనేజర్, ప్రొద్దుటూరు అభ్యంతరం చెబితే వేధింపులు.. తన దందాకు అడ్డు వచ్చినా, అభ్యంతరం చెప్పినా వేధింపులు ఎదురౌతాయని సిబ్బంది అంటున్నారు. కృష్ణారావు అనే అధికారి నవంబర్ నుంచి స్టోర్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. మద్యం సీసాల బ్రేకేజీని ఎక్కవగా నమోదు చేయలేదనే కారణంతో డిపోబాస్ అతన్ని రోజు వేధింపులకు గురి చేసేవాడు.ఒత్తిడిని భరించలేక 15 రోజుల కిందట కృష్ణారావు బదిలీ చేయించుకొని వెళ్లిపోయాడు. రోజుకు ఎన్ని లారీలు వచ్చాయి.. ఎంత మేర డ్యామేజీ అయిందనే వివరాలను డిపోలోని కంప్యూటర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కీలకమైన ఈ విభాగంలోని పనులనుఅధికారి తన కుమారుడి ద్వారా చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్ విభాగంలో ఆపరేటర్ ఉన్నా అధికారి మాత్రం అనధికారికంగా తన కుమారుడిని నియమించుకున్నాడని వ్యాపారులు చెబుతున్నారు. కడప డిపోలో పని చేస్తున్న ఒక హమాలిని డిపో బాస్ ప్రొద్దుటూరుకు రప్పించుకున్నాడు. హమాలి పోస్టును ఇతరులకు రూ.8 లక్షలకు విక్రయించి అతన్ని ప్రొద్దుటూరులో నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీపీపీలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ద్వారా హమాలీ ఉద్యోగానికి దరఖాస్తు చేయించి ఎంపికైన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఇతరులకు రూ. 4 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రెండో మద్యం డిపో ప్రారంభానికి బాలారిష్టాలు
హమాలీల నియామకం విషయంలో వివాదం వెనుదిరిగిన మద్యం లారీలు పండగ అనంతరం సన్నాహాలు నెల్లూరు(క్రైమ్): గూడూరు ఎక్సైజ్ జిల్లాలో రెండో మద్యం డిపో నిర్మాణం పూర్తయింది. ఈనెల మొదటివారంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హమాలీల నియామక విషయంలో వివాదం చెలరేగడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో డిపోకు వచ్చిన 30 లారీల మద్యం దేవరపాలెం ఐఎంఎల్ డిపోకు తరలింది. జిల్లాలో 336 మద్యం దుకాణాలు 42 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ నెల్లూరు ఎౖMð్సజ్ జిల్లా పరిధిలోని దేవరపాలెం ఐఎంఎల్ డిపో నుంచే మద్యం, బీరు సరఫరా అవుతోంది. గూడూరు సబ్డివిజన్ పరిధిలోని తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడి నుంచే మద్యం ఏన్నోఏళ్లుగా తీసుకెళుతున్నారు. కొంతకాలంగా ఖర్చు అధికమవుతుండటం వ్యాపారులకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని ఓజిలిలో రెండో మద్యం డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 141 మద్యం దుకాణాలకు సరఫరా గూడూరు జిల్లాలోని 141 మద్యం దుకాణాలకు, నాలుగుబార్లకు ఓజిలి నుంచే మద్యం సరఫరా అవుతోంది. దీంతో వ్యాపారుల్లో ఆనందం నెలకొంది. ఈ నెల మొదటివారంలో ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేశారు. 30 లారీల మద్యాన్ని సైతం తెప్పించారు. అయితే హమాలీల నియామక విషయంలో నెలకొన్న వివాదంతో ప్రారంభానికి బ్రేక్ పడింది. దీంతో మద్యాన్ని దేవరపాలెంలోని డిపోకు తరలించారు. డిపోలో పనిచేసేందుకు çసుమారు 80మంది లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు హమాలీలు అవసరం. హమాలీల నియామకాల్లో 80శాతం స్థానికులకు, 20శాతం స్థానికేతరులకు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో హమాలీల నియామక బాధ్యతలు జేసీ చేపట్టారు. పదోతరగతి ఉత్తీర్ణులై, 40 ఏళ్లలోపు వారినే నియమించేందుకు చర్యలు చేపట్టారు. స్థానికేతరులకు ఎలాంటి పరిస్థితుల్లో అవకాశం కల్పించరాదని, తమనే నియమించాలని, అధికారపార్టీ నేతలు సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో డిపో ప్రారంభానికి నోచుకోలేదు. గత కొద్దిరోజులుగా అధికారులు, కార్మిక నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం డిపోను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావును వివరణ కోరగా హమాలీల నియామకం విషయంలో కొంత సమస్య ఉందని అది త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు. పండగ అనంతరం డిపోను ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. -
బాటిల్ పగిలితే పండగే..
• డ్యామేజ్ పేరిట ఐఎంఎల్ డిపోలో దోపిడీ • పగిలేది తక్కువ....చూపించేది ఎక్కువ • వైరా మద్యం డిపోలో సిబ్బంది చేతివాటం వైరా: మద్యం డిపోలో ఐఎంఎల్(ఇండియన్ మేడ్ లిక్కర్) సిబ్బంది బహిరంగంగానే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైరా ఐఎంఎల్ డిపోలో తక్కువ డ్యామేజ్ను ఎక్కువగా చూపి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వైరా డిపో నుంచి జిల్లా వ్యాప్తంగా బార్లు, వైన్స్కు మద్యం సరఫరా చేస్తుంటారు. వివిధ మద్యం కంపెనీల సరఫరాదారుల ద్వారా వచ్చిన మద్యాన్ని డిపోల్లో నిల్వ ఉంచుతారు. మద్యం సరఫరాకు సంబంధించిన లోడింగ్, అన్లోడింగ్ సమయంలో కొంత మేర డ్యామేజ్ కావడం సహజం. పగిలిన బాటిళ్లను డ్యామేజ్ను లాస్ కింద చూపించడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు డ్యామేజ్ను ఎక్కువగా చూపుతున్నారు. ఈ తతంగం చాలాకాలం నుంచి జరుగుతోంది. ఒకటికి....రెండు లెక్క... డిపోలో ఒక బాటిల్ పగిలితే రెండు లెక్క రాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మామూలుగా ఐదు బాక్సుల(కాటన్లు) లిక్కర్, బీర్ డ్యామేజ్ అయితే 10 బాక్సులు డ్యామేజ్ అయినట్లు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పగిలిన సీసాల పేరు చెప్పి మిగుల్చుకున్న మద్యం బాటిళ్లను తమకు తెలిసిన వారు నిర్వహించే బార్లు, వైన్స్ షాపులకు సరాసరి ధరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్యామేజ్ అయిన సరుకుకు అధికారికంగా ఎలాంటి బిల్లులూ ఉండకపోవడం వీరి తెరచాటు వ్యవహారానికి దోహదపడుతోంది. డిపోలో ధర కన్నా తక్కువకు కొందరు డిపో సిబ్బంది సరుకు బయటకిస్తుండటంతో వైన్స్ యజమానులు వాటిపై మక్కువ చూపుతున్నారని వినికిడి. ఈ విధంగా వచ్చిన రోజువారీ ఆదాయం తిలాపాపం తలా పిడికెడు అన్నచందంగా పంపిణీ జరుగుతుంది. ప్రతిరోజూ రూ.వేలల్లో ఆదాయం ఐఎంఎల్ డిపోలకు రోజు వారీగా పదుల సంఖ్యలో లారీలు మద్యాన్ని తీసుకొస్తుంటాయి. ఇక్కడి నుంచి తిరిగి రెండు జిల్లాల్లోని వైన్స్లు, బార్ షాపులకు అదేస్థాయిలో వెళ్తుంటాయి. ఒక్కో లారీలో తక్కువలో తక్కువ రెండు మూడు బాక్సులైనా పగిలినట్లుగా ఇక్కడి సిబ్బంది చూపుతున్నట్లు సమాచారం. రవాణా సమయంలో డ్యామేజ్ అయితే సదరు కంపెనీ వారే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. రోజుకు డిపోలో పది నుంచి పదిహేను బాక్సులనైనా డ్యామేజ్ కింద చూపుతారని తెలుస్తోంది. ఓ కంపెనీకి చెందిన క్వార్టర్ బాటిళ్ల మద్యం ఒక్కో బాక్సు ధర వైన్స్ షాపులో పెరిగిన ధరల ప్రకారం రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్యలో ఉంటుంది. ఒక రోజు ఈ కంపెనీకి చెందిన కనీసం ఐదు బాక్సులు డ్యామేజ్ చూపితే ఒక్కో బాక్సుకు రూ.2 వేల చొప్పున ఐదు బాక్సులకు సుమారుగా రూ.10 వేల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఇక్కడి విధులకు పోటీ ఎక్కువ వైరాలోని ఐఎంఎల్ డిపోలో పని చేసేందుకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఇష్టపడతారు. ఇక్కడ పనిచేస్తే వేతనంతో పాటు చేతి నిండా ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్సైజ్ వారు ఐఎంఎల్ డిపోలో పని చేసేందుకు పోటీ పడతారని సమాచారం. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పి మరీ పోస్టింగ్లు వేయించుకుంటారు. ఇక్కడ పని చేస్తున్న కొద్ది మంది అధికారులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వారికి బదిలీలు కూడా లేవు. అంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement