-
జోరందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. మరింత రద్దీ
సాక్షి, ఖమ్మం : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో రిజిస్టేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మొన్నటి వరకు స్తబ్దుగా నడిచిన రిజిస్టేషన్ల ప్రక్రియ తాజా ప్రభుత్వ నిర్ణయంతో పుంజుకుంది. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పాత వాటికి లింకు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుందని, అయితే కొత్తవాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్టేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్టార్ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చదవండి: హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం ఎల్ఆర్ఎస్ రద్దుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల పరిధిలో రోజువారి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కొంత ఆలస్యమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చేవారు చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్కు ఒక మంచి గిఫ్ట్గా భావిస్తున్నామని చెబుతున్నారు. కాగా రిజిస్టేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్తోపాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించేవారు. అయితే కొత్త పద్దతిలో మాత్రం వ్యవసాయ ఆస్తుల రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాలని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం
ప్లాట్ల యజమానులకు ఉపశమనం ఎల్ఆర్ఎస్ ఊరట సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండానే రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రిజిస్టర్ అయిన ప్లాట్లు, నిర్మాణాలు పూర్తయిన వాటికి రిజిస్ట్రేషన్లను గతంలో మాదిరిగా ప్రారంభించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ వి.శేషాద్రి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, డెవలపర్లు మొదటిసారి అమ్మే క్రమంలో కొత్తగా రిజిస్ట్రేషన్కు వచ్చే ప్లాట్లకు మాత్రం సంబంధిత అనుమతులు ఉండాలని లేదా ఆ ప్లాటు అనుమతి పొందిన లే–అవుట్లో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే గతంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్ల ద్వారా అనుమతులు పొందిన లే–అవుట్లు, ప్లాట్లు, భవనాలు, నిర్మాణాల విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఉత్తర్వుల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తున్నామని, రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లు ఈ ఆదేశాలను అమలు చేయాలని ఉత్తర్వుల్లో శేషాద్రి పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్పై సర్కారు నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు తొలగిన అడ్డంకి సాక్షి, హైదరాబాద్: ఇళ్లో, పొలమో, ప్లాటో, ఇతర ఆస్తులో అమ్ముకోనిదే ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు, పిల్లల ఉన్నత చదువులు, భారీ వైద్య ఖర్చులు సామాన్యులకు సాధ్యంకాదు. అలాంటిది మూడున్నర నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)తో ముడిపెట్టడం దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. గత సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నెల 21 నుంచి పాత విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించినా ఎల్ఆర్ఎస్ నిబంధన ఇబ్బందిగా మారింది. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం కనీసం ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగిన అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోవడం సామాన్యులకు భారీ ఉపశమనం కల్పించినట్లు అయింది. మరోవైపు అనధికార ప్లాట్ల కొనుగోళ్లకు అడ్వాన్సులు చెల్లించిన కొనుగోలుదారులకు సైతం ఊరట లభించింది. అనధికార ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోకుంటే.. రిజిస్ట్రేషన్లు జరపమని గత ఆగస్టు 31న జారీ చేసిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సామాన్యుల గురించి ఆలోచించాలి... ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయంలో సైతం పునరాలోచన చేయాలని ప్రభుత్వంపై పలు వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఫీజులు అసాధారణంగా ఉన్నాయని, సామాన్యుల కోణం నుంచి చూసి ఎల్ఆర్ఎస్ ఫీజులను తగ్గించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎప్పుడో ఏళ్ల కింద కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.లక్షలు చెల్లించడం ఇబ్బందికరమేనని స్థిరాస్తి వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో 131ను తీసుకురాగా, గత అక్టోబర్ 31తో గడువు ముగిసింది. మొత్తం 25.59 లక్షల దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను ఇంకా రూపకల్పన చేయలేదు. దీంతో వీటిని పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించడం సాధ్యం కావడం లేదు. జీవోలోని నిబంధనల ప్రకారం.. జనవరి 31లోగా దరఖాస్తుదారులు మొత్తం క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించాలి. దీనికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్నా ఇప్పటివరకు వారికి ఫీజుల వివరాల లేఖలు అందలేదు. దరఖాస్తుదారుల్లో అత్యధికులు ఇటీవల కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారేనని, దీంతో వారు 10 శాతం ఖాళీ స్థలం లేని కారణంగా 14 శాతం ప్లాటు ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సి ఉంటుందని, ఇది పెనుభారంగా మారనుందని దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ►ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి. ఇది ప్రజలకు వ్యతిరేకం. ఎల్ఆర్ఎస్ జీవోలోని నిబంధనల ప్రకారం ఇళ్లను కట్టుకున్న ప్లాట్లను సైతం క్రమబద్ధీకరించుకోవాల్సిందే. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 10 శాతం ఖాళీ స్థలం లేదన్న కారణంతో 14 శాతం ప్లాటు ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాలన్న నిబంధన సరైనది కాదు. – ప్రవీణ్, తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు ►సదుద్దేశంతోనే ప్రభుత్వం ధరణి, ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. అమలులో లోపాల వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి. సామాన్యుల కోణం నుంచి చూసి ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. రిజిస్ట్రేషన్లను మూడున్నర నెలల పాటు నిలుపుదల చేయడంతో నగదు చేతులు మారక(క్యాష్ ఫ్లో) తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. జీతాలు చెల్లించడం, నిర్మాణ పనులు కొనసాగించడం, బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించడం కష్టమైంది. – ట్రెడా, క్రెడా సంస్థల ముఖ్యులు -
ఎల్ఆర్ఎస్ ఎత్తివేత: కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరగనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించిన సర్కార్.. మూడు నెలల క్రితం ఇందుకోసం ధరణి వెబ్సైట్తో పాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి ఫ్లాట్కు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని నెలల ప్రతిష్టంభన తరువాత తిరిగి పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని కొద్దిరోజుల క్రితం నిర్ణయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానాన్ని సైతం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. -
వినయ విధేయ తహసీల్దార్
విడవలూరు: ఆయనొక తహసీల్దార్. పేదలకు అండగా నిలవాల్సిన వ్యక్తి పెద్దలకు వినయ, విధేయుడిగా మారాడు. అక్రమ సొమ్ముపై ఆశతో సెలవు దినాల్లో కూడా చుక్కల భూములకు పట్టాలు చేస్తున్నారు. ♦ విడవలూరు మండలంలో తీర ప్రాంతమైన ఊటుకూరు పంచాయతీ పరిధిలోని పల్లిపాళెం గ్రామంలో ప్రస్తుతం ఆక్వా గుంతల భూముల్లో సర్వే నంబర్లు 942–1, 942–2, 1300, 1398, 1399లలో దాదాపు 14.5 ఎకరాల చుక్కలు భూములు ఉన్నాయి. వీటికి రికార్డులు తారుమారు చేసి పట్టాలను సృష్టించేందుకు కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన టీడీపీ నాయకులతో తహసీల్దార్ నౌషాద్ అహ్మద్ చేతులు కలిపాడని ఆరోపణలున్నాయి. ♦ ముదివర్తిలో ఉన్న 2.5 ఎకరాలు, పల్లిపాళెం వద్ద ఉన్న మరో నాలుగు ఎకరాలకు కూడా రికార్డులు తారుమారు చేసి పట్టాలను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తహసీల్దార్కు భారీ మొత్తంలో నగదు అందినట్లు సమాచారం. ♦ ఈ పనులకు తహసీల్దార్ నౌషాద్ అహ్మద్ సెలవు రోజు శనివారం మధ్యాహ్నం కార్యాలయానికి చేరుకున్నాడు. తన కారులో వస్తే స్థానికులకు అనుమానం వస్తుందని పడుగుపాడుకు చెందిన వ్యక్తి కారులో కార్యాలయానికి చేరుకున్నారు. ♦ తహసీల్దార్తో పాటు మరికొందరు రెవెన్యూ అధికారులను కూడా కార్యాలయానికి పిలిపించుకుని గుట్టు చప్పుడు కాకుండా పని ముగించే ప్రయత్నం చేశారు. ♦ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు సెలవు దినాల్లో కూడా తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్లు ఉండటాన్ని గమనించి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. ♦ చుక్కల భూములకు పట్టాలు సృష్టించేందుకు తహసీల్దార్ ప్రయత్నించడం ప్రభుత్వాన్నే మోసం చేయడమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు ఈ విషయమై జిల్లా కలెక్టర్ చక్రధర్బాబుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆదివారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి స్థానంలో ఉన్న తహసీల్దార్ ఇలా చుక్కల భూములకు పట్టాలను పుట్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. -
స్థిరాస్తులకు కొత్త రేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించింది. కొత్త రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. భూములు, స్థలాల విలువల విషయంలో బహిరంగ మార్కెట్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలను సవరించాల్సి ఉంది. 2017లో గ్రామీణ ప్రాం తాల్లోనూ, 2018లో పట్టణ ప్రాంతాల్లోనూ స్థిరాస్తి విలువలను సవరించారు. ఇప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రభు త్వం ఆమోదం తెలిపింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో భూములు, స్థలాల ప్రస్తుత మార్కెట్ విలువలను పరిశీలించి వాస్తవ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని పది శాతం లోపు పెంచాలని ఆదేశించింది. అంతకు మించి ఎక్కడా పెంచడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ విలువలను కొన్నిచోట్ల పెంచలేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో 5 నుంచి పది శాతం వరకూ పెంచారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని మండలాలు, గ్రామాల వారీ రహదారి పక్కనున్న భూములు, మెట్ట, మాగాణిలకు సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ విలువలు ప్రతిపాదిం చారు. ఈ ప్రతిపాదనలను మున్సిపాలిటీల్లో జాయింట్ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారుల అధ్యక్షతన గల మార్కెట్ విలువల సవరణ కమిటీలు ఆమోదించాయి. దీంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఈ రేట్లను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో నమోదు చేశారు. కట్టడాల మార్కెట్ విలువలు ఇలా కట్టడాలకు కొత్త రిజిస్ట్రేషన్ విలువలను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కార్యాలయం ఖరారు చేసింది. పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మాస్టర్ప్లాన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ఒక విభాగంగా, మేజర్ పంచాయతీలు, మున్సిపల్ నోటిఫైడ్ ప్రాంతాల్లోకి వచ్చేవి, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కలిసే పంచాయతీలను మరో విభాగంగా, మైనర్ పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కలుస్తున్న మైనర్ పంచాయతీలను మరో విభాగంగా కట్టడాలకు మార్కెట్ విలువలను నిర్ధారించారు. భవనాలను కొనుగోలు చేసేవారు ఆ కట్టడాల విలువ, భూమి విలువకు కలిపి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో చదరపు అడుగు మార్కెట్ విలువ రూ.5 వేలు ఉందనుకుంటే 200 చదరపు అడుగుల స్థలం విలువ రూ.10 లక్షలు అవుతుంది. అడుగు కట్టడం విలువ రూ.1,100 ప్రకారం 200 చదరపు అడుగుల కట్టడం విలువ రూ.11 లక్షలు అవుతుంది. ఈ రెండింటినీ కలిపి మొత్తం భవనం విలువ రూ.21 లక్షలు అవుతుంది. దీనిని కొనుగోలు చేసిన వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ.21 లక్షలపై 5 శాతం స్టాంప్ డ్యూటీ, 1.5 శాతం బదిలీ సుంకం, 1 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 7.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుముల కింద చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణాలు పూర్తికాకుండా వివిధ దశల్లో ఉన్న వాటికి ఈ ధరల్లో కొన్ని విభాగాలు పెట్టారు. ఫౌండేషన్ స్థాయిలో ఉన్న కట్టడాలకు ఇందులో 25 శాతం, శ్లాబ్ లెవల్ వరకూ ఉన్న వాటికి 65 శాతం, పూర్తికావడానికి సిద్ధంగా ఉన్న వాటికి 85 శాతం ధర నిర్ణయిస్తారు. అలాగే పదేళ్లలోపు నిర్మించిన వాటికి ఎలాంటి తరుగుదల ఉండదు. పదేళ్ల కంటే ముందు నిర్మించిన ఇళ్లకు ఏడాదికి ఒక శాతం చొప్పున తరుగుదల వేస్తారు. ఇది గరిష్టంగా 70 శాతం వరకూ ఉండవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement