-
కసరత్తు షురూ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసన సభ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ముసాయిదా ఓటరు జాబితా విడుదలకు కసరత్తు చేస్తూనే.. మరోవైపు జిల్లాలోని ఈవీఎం పరిశీలనతోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన విధుల్లో నిమగ్నమయ్యారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఓటరు జాబితా ముసాయిదా ప్రకటన కోసం అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతుండగా.. రాష్ట్ర శాసన సభ రద్దు కావడం.. ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుండటంతో ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి సిద్ధంగా ఉండేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల పనుల తీరుపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సాగుతోంది. ఇది వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. అదేరోజు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనున్నారు. అనంతరం 8వ తేదీన పూర్తిస్థాయి ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఇతర పనులను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో ఎఫ్ఎల్సీ.. త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు చేరాయి. వీటిని కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాం లో భద్రపరిచారు. ఇక్కడ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. గత నాలుగు రోజుల క్రితం జిల్లాకు చేరిన ఈవీ ఎంలు, వీవీ ప్యాట్లను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో కలిసి కలెక్టర్ ఈవీఎంలను ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) చేశారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులకు ఈవీఎంల పనితీరుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు గురించి వివరించారు. అలాగే తమ ఓటు ఎవరికి వేశామనే విషయా న్ని తెలుసుకునేందుకు వీవీ ప్యాట్లు కూడా ఉంటాయ ని పార్టీల నాయకులకు వివరించారు. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ స్వయంగా గోదాం వద్దకు వచ్చి ఈవీఎంలను పరిశీలించారు. అలాగే జాయింట్ కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అక్కడే ఉండి.. ఈవీఎంలు, వీవీ ప్యాట్ వద్ద అధికారులు చేస్తున్న పనిని పరిశీలిస్తున్నారు. అమలులోకి నియమావళి.. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీనిని తూచ తప్పకుండా అధికారులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ పార్టీల నాయకులు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలను అధికార యంత్రాంగం తొలగిస్తోంది. తాజాగా ఖమ్మం నగరం, కొణిజర్ల, వైరా, ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులను తొలగించారు. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించారు సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అమలులోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇప్పటి నుంచే అమలు చేసేందుకు జిల్లా అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ముఠాపురం, ముజ్జుగూడెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో మంత్రి పర్యటన రద్దయినట్లు సమాచారం. దీంతో ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదే రీతిన జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని.. నియమావళికి అనుగుణంగా వ్యవహరించని వారికి సంబంధించి తక్షణమే సమాచారం అందించాలని నియోజకవర్గ, మండలస్థాయి అధికారులకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. -
కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
మయూరిసెంటర్ (ఖమ్మం): పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం మంగళవారం ఉదయం ఖమ్మం నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్రావు మండిపడ్డారు. ఏటా 40 శాతం వరకూ ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే, పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు అవుతున్నప్పటికీ టీచర్ల కొరత సమస్య తీరలేదన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా సమస్యలు అలానే ఉన్నాయని, వీటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement