-
పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలి: మంత్రి అంబటి
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలంటూ హితువు పలికారు. అసలు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ప్రశ్నించినందుకు ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు వేధించారని తెలిపారు. 'ఆయన కుటుంబ సభ్యులను కూడా ఎలా వేధించారో చూశాం. మరి ఆనాడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు హయాంలో కాపులు ఉద్యమం చేస్తే పవన్ మద్దతు తెలపరు. అదే జగన్ ప్రభుత్వంలో ఉద్యమం చేస్తే ఎందుకు మద్దతు తెలుపుతున్నారు. ఈ వైఖరిని కాపు సోదరులు అర్థం చేసుకోవాలి' అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చదవండి: (ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: జీవీఎల్) -
‘కాపులను అడ్డుపెట్టి కుట్ర రాజకీయాలు’
సాక్షి, అమరావతి: కాపులను అడ్డుపెట్టుకుని మరోసారి కుట్ర రాజకీయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాపులను మోసం చేసిన చంద్రబాబు ట్రాప్లో పడొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి (శేషు) విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాపులను మళ్లీ రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి, వారిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. చంద్రబాబు కుట్రలకు పవన్ తోడ్పాటునందిస్తున్నారని ఆరోపించారు. రంగాను టీడీపీ వాళ్లే హత్య చేయించారని తన పుస్తకంలో రాసిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఇప్పుడు కాపు జాతిని రెచ్చగొట్టేలా దీక్షకు దిగడం బాధాకరమన్నారు. 87 ఏళ్ల జోగయ్యతో పథకం ప్రకారం దీక్ష చేయిస్తున్నది ఎవరని అనుమానం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమం చేసినప్పుడు పవన్, జోగయ్య, జీవీఎల్ ఎక్కడున్నారని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం తన చేతిలో లేని పని అని, వారికి ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సాహం అందిస్తానని కిర్లంపూడి సభలో ప్రకటించిన సీఎం వైఎస్ జగన్.. ఇచ్చిన మాటకు కట్టుబడి కాపుల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కాపుల సంక్షేమానికి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తే సీఎం వైఎస్ జగన్ మూడున్నరేళ్లలోనే రూ.1,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. బాబు పాలనలో జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తే పథకాలు అందేవని, సీఎం వైఎస్ జగన్ కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరిలో కాపులకు నిజమైన మేలు చేసింది ఎవరో బహిరంగ చర్చలకు తాను సిద్ధమని అడపా శేషు సవాల్ విసిరారు. -
కాపులకు రిజర్వేషన్ అమలుకు కృషిచేయాలి
కిర్లంపూడి: కాపు జాతికి రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి జాతులు కోల్పోయిన రిజర్వేషన్ విషయమై గతంలో రాసిన లేఖ సారాంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సోషల్ జస్టిస్ మంత్రి స్పందిస్తూ రాజ్యాంగ సవరణలు 103, 105–2019, 2021 యాక్ట్స్ను అనుసరించి ఆర్టికల్ 342ఎ(3) ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చని చెప్పారని తెలిపారు. తదనుగుణంగా కాపులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు దృష్టి పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, తమ సామాజికవర్గానికి కూడా రిజర్వేషన్ కల్పించి వెలుగు నింపాలని ముద్రగడ తన లేఖలో కోరారు. -
కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు
-
బాబుతో దోస్తీ.. కాపులకు న్యాయమేది? పవన్ను ప్రశ్నించిన కాపు ఐక్యవేదిక
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): జనవాణి కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ వైఖరినే ప్రశ్నిస్తూ కాపు ఐక్యవేదిక వినతిపత్రం అందజేసింది. కాపు రిజర్వేషన్ల అంశం సహా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని అందులో డిమాండ్ చేసింది. 2014లో చంద్రబాబును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన పవన్.. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని, అప్పట్లో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 నెలల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయలేదని ఐక్యవేదిక గుర్తుచేసింది. కాపు యువతకు టీడీపీ ప్రభుత్వం ద్వారా న్యాయం చేయించలేకపోయావంటూ కూడా తప్పుపట్టింది. వినతిపత్రం అందజేసిన తర్వాత కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. చదవండి👇 మా ఫ్లెక్సీలు తొలగిస్తావా? మళ్లీ కూసిన గువ్వ
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement