-
మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు!
2024 ప్రారంభం నుంచి లే ఆప్స్ సాగుతూనే ఉన్నాయి. గత నెలలో (జనవరి) మాత్రమే 32వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు.. లేఆఫ్-ట్రాకింగ్ వెబ్సైట్ Layoffs.fyi డేటా ఆధారంగా తెలిసింది. అయితే ఈ నెలలో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా 'నైక్' (Nike) కంపెనీ ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. కంపెనీ లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, ఖర్చులు ఆదా చేయడంలో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది (1600 కంటే ఎక్కువ) సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలగింపులు ప్రక్రియ కూడా రెండు దశల్లో ఉంటుందని సమాచారం. 2023 మే 31 నాటికి నైక్ కంపెనీలో దాదాపు 83,700 మంది ఉద్యోగులు ఉన్నట్లు, ఇందులో 12000 మంది కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీ తొలగించనున్న ఉద్యోగులలో స్టోర్ ఉద్యోగులు, స్టోర్ మేనేజర్లు లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు.. మూడవ త్రైమాసికంలో ఉద్యోగుల ఖర్చుల ఖర్చులు 400 మిలియన్ డాలర్ల నుంచి 450 మిలియన్ డాలర్ల వరకు పెరిగింది. నైక్ కంపెనీ ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల ఉద్యోగుల తొలగింపుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంస్థ రానున్న రోజుల్లో లాభాలు ఆర్జించడానికి కావాల్సిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?
గతంలో ఫేస్బుక్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులలో ఒకరు ఇప్పుడు ఓ సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఏడాదికి ఏకంగా రూ.27 కోట్లు సంపాదిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ కంపెనీ స్టార్ట్ చేసాడనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 2005లో ఫేస్బుక్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేసిన 'నోహ్ కాగన్'.. టెక్ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరాలని కలలు కన్నారు. అయితే కంపెనీ సమాచారం మీడియాకు లీక్ చేశారనే ఆరోపణల కారణంగా ఫేస్బుక్ సంస్థ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత బాగా అలోచించి సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఫేస్బుక్, ఇంటెల్, మింట్.కామ్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్న నోహ్ కాగన్ 2010లో సొంత డిస్కౌంట్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ 'యాప్సుమో' (AppSumo) ప్రారంభించారు. ప్రారంభంలో ఆశించిన లాభాలు రాకపోయినప్పటికీ పట్టు వదలకుండా కృషి చేసారు. అంకిత భావంతో పనిచేయడంతో కంపెనీ లాభాల వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. గత సంవత్సరం యాప్సుమో 80 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇందులో లాభమే 7 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. అంటే ఇతనికి వచ్చిన లాభం భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 27 కోట్లు. ఇదీ చదవండి: సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం ఇజ్రాయల్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన కగన్ టెక్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నారు. తాను ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయాలన్నట్లు 'నోహ్ కాగన్' వెల్లడించారు. అప్పట్లో బిల్ గేట్స్ ఐకానిక్ పర్సన్ అని.. ఆయనకు ప్రభావితమై ఆయన బాటలోనే నడవాలని అనుకోవడం వల్లనే టెక్ ప్రపంచంలో అడుగులు వేసినట్లు తెలిపారు. -
కొత్త ఏడాదిలోనూ భారీ లేఆఫ్లు! కలవరపెడుతున్న లేటెస్ట్ సర్వే
Layoffs in 2024: లక్షలాది తొలగింపులతో ఈ ఏడాదంతా అష్టకష్టాలు పడిన ఉద్యోగులు కొత్త సంవత్సరంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నూతన ఏడాదిలో పరిస్థితులన్నీ చక్కబడతాయని భావిస్తున్న తరుణంలో ఉద్యోగులను కలపెట్టేలా ఓ లేటెస్ట్ సర్వే వెలువడింది. దీని ప్రకారం.. 2024లో భారీ తొలగింపులు ఉండనున్నాయి. ఉద్యోగార్థుల రెజ్యూమ్ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’ ఈ సర్వే నిర్వహించింది. ఈ నెలలో 900 కంటే ఎక్కువ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిస్పందనల ఆధారంగా ఈ తాజా సమాచారాన్ని ప్రకటించించింది. ఈ సర్వేలో పాల్గొన్న 10 కంపెనీలలో దాదాపు నాలుగు కంపెనీలు 2024లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని చెప్పాయి. అలాగే సగానికి పైగా కంపెనీలు 2024లో హైరింగ్ ఫ్రీజ్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. కారణాలివే.. ఎందుకు లేఆఫ్లు చేపడుతున్నారని అడిగినప్పుడు, సగం కంపెనీలు మాంద్యం అంచనా ఒక కారణమని చెప్పాయి. కొంచెం తక్కువగా అంటే 10 కంపెనీల్లో నాలుగు తాము ఉద్యోగులను తొలగించి ఆ స్థానాలను కృత్రిమ మేధస్సు (AI)తో భర్తీ చేయనున్నట్లు తెలిపాయి. ఏఐ యాడ్ టెక్కి అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలోని 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2023లో ఇప్పటికే తమ కంపెనీలు 30 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్లు చెప్పిన మెజారిటీ బిజినెస్ లీడర్లు 2024లోనూ 30 శాతం మందికిపైగానే తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీల వారీగా.. కొత్త సంవత్సరంలో అధిక సంఖ్యలో కంపెనీలు తొలగింపులు చేపడతాయని చెబుతున్నప్పటికీ అన్ని కంపెనీల్లో లేఆఫ్లు ఉంటాయని కాదు. చిన్న కంపెనీలతో పోలిస్తే మధ్యతరహా, పెద్ద కంపెనీలలో తేడాలున్నాయి. మధ్యతరహా కంపెనీల్లో 42 శాతం, పెద్ద కంపెనీల్లో 39 శాతం తొలగింపులు ఉంటాయని సూచించగా, చిన్న కంపెనీల్లో 28 శాతం మాత్రమే లేఆఫ్లు ఉంటాయని ఆ కంపెనీల లీడర్లు వెల్లడించారు. ఈ కంపెనీల్లోనే అత్యధికం పరిశ్రమల వారీగా నిర్మాణ, సాఫ్ట్వేర్ కంపెనీలు వరసగా 66 శాతం, 65 శాతం సిబ్బందిని వచ్చే సంవత్సరంలో తొలగించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్, రిటైల్, ఫైనాన్స్, బీమా కంపెనీల్లోనూ కొంత మేర లేఆఫ్ల గందరగోళం నెలకొంది. ఇన్ఫర్మేషన్, రిటైల్ కంపెనీలు 44 శాతం, ఫైనాన్స్ కంపెనీలు 38 శాతం లేఆఫ్లను చేపట్టనున్నట్లు చెబుతున్నాయి. -
అమెరికాలో లక్షల ఉద్యోగాల కోత..! సీబీఓ సంచలన రిపోర్ట్
అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది నిరుద్యోగిత రేటు పెరుగుతుందని 'కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్' (CBO) రిపోర్ట్ విడుదల చేసింది. 2024లో యూఎస్ఏలో ఎంత శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది? దీనికి ప్రధాన కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) డిసెంబర్ 15న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఉన్న 3.9 శాతం నిరుద్యోగిత రేటు 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని అంచనా. అంటే వచ్చే ఏడాదికి మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి వస్తుందని సీబీఓ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎగుమతులు తగ్గే అవకాశం ఉందని, పెట్టుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయని, NRIల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయని సీబీఓ అంచనా వేసింది. ఈ కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 18.70 లక్షల మంది నిరుద్యోగ ప్రయోజనాలను పొందుతున్నట్లు, రానున్న రోజుల్లో 2.02 లక్షల మంది అదనంగా ఇలాంటి ప్రయోజనాలను పొందటానికి అప్లై చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం 2024లో అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు సుమారు 2.1 శాతానికి తగ్గుతుందని యూఎస్ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఫెడ్ లక్ష్యం కూడా 2 శాతానికి చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగానే 2024లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే.. ఆర్ధిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినే అవకాశం లేదని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజా నిజాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. -
ఉద్యోగాలు పోతాయన్న భయం భారతీయుల్లోనే ఎక్కువ..ఎందుకంటే..
అమెరికా, యూకే , జర్మనీలోని ఉద్యోగుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల తమ కొలువులు కోల్పోవడం పట్ల భారతీయ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. రాండ్స్టాడ్ వర్క్ మానిటర్ క్వాటర్లీ పల్స్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం..అభివృద్ధి చెందిన దేశాల్లోని ముగ్గురిలో ఒకరికి ఏఐ వల్ల తమ ఉద్యోగం పోతుందనే భయం ఉంది. కానీ భారతీయ ఉద్యోగుల్లో ఆ ఆందోళన ఇద్దరిలో ఒకరికి ఎక్కువగా ఉంది. భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన పెరగడానికి గల కారణాల్లో బీపీఓ, కేపీఓ రంగాల్లో పెద్ద సంఖ్యలో వర్క్ఫోర్స్ ఉండటం, ప్రత్యేకించి ఆ పనులన్నీ ఏఐతో ఆటోమేషన్ చేయడమేనని రాండ్స్టాడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ విశ్వనాథ్ తెలిపారు. ‘ఇండియా ప్రధానంగా సర్వీస్ ఆధారిత సేవలు అందిస్తుంది. అందులో భాగంగా దేశంలో చాలా కేపీఓ, బీపీఓలు నెలకొల్పారు. అయితే భారత్లో ఉద్యోగులు ఏఐని సమర్థవంతంగా ఆచరణలో పెట్టే సత్తా కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఏఐని స్వీకరించేది మన దేశంలోనే’ అని విశ్వనాథ్ అన్నారు. ఏఐ వల్ల కొన్ని రకాల కొలువులపై ప్రభావం ఉన్నా నిరంతరం తమ నిపుణ్యాలు పెంచుకునే ఉద్యోగులకు అపారఅవకాశాలు ఉంటాయన్నారు. (ఇదీ చదవండి: ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్..కారణం అదేనా..) రాండ్స్టాడ్ వర్క్ మానిటర్ ఎడిషన్ ద్వారా కార్మికుల నైపుణ్యాలు, సంస్థ డిమాండ్లు, ఏఐ ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశంలోని 1606 ఉద్యోగులపై సర్వే చేశారు. వీరిలో 55% మంది పురుషులు, 45% మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో ఏడుగురు ఏఐ వారి పరిశ్రమలు, ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని విశ్వసించారు. ఇదే సంఖ్యలో వారు నైపుణ్యాభివృద్ధి ఔచిత్యాన్ని గుర్తించారు. రాబోయే ఐదేళ్లలో తమ స్థానాల్లో కొనసాగాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడం చాలా అవసరం అని వారు నమ్ముతున్నారు. మెజారిటీ ఇప్పటికే తమ ప్రస్తుత ఉద్యోగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. అయితే కొన్ని సంస్థల యాజమాన్యాలు మాత్రం వచ్చే 12 నెలల్లో తమ నైపుణ్యాలు పెంచుకునేలా ఎలాంటి అభివృద్ధి అవకాశాలను అందించకపోతే ఉద్యోగాలను వదిలివేస్తామని చెప్పినట్లు సర్వేలో వెల్లడైంది. కృత్రిమ మేధతో ఉద్యోగాల ప్రభావం అనేది ఆయా రంగాల్లో వేర్వేరుగా ఉండనుంది. అత్యధికంగా ఐటీ, సాంకేతిక అక్షరాస్యత, మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ సంబంధించిన ఉద్యోగాలు, ఆటోమోటివ్/ ఏరోస్పేస్ పరిశ్రమ, ఆహార ఉత్పత్తుల తయారీ, ఆర్థిక సేవలను అందించే సంస్థలపై దీని ప్రభావం పడనుందని సర్వే తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement