-
గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ తో కట్టుకథ అల్లారు: పూనమ్ కౌర్
టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలను చదించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించారని, ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీయే గెలుస్తుదని ఆమె చెప్పిన మాటలు వైరల్ కావడంతో.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు గీతాజంలిపై అసత్యాలను ప్రచారం చేశారు. ఆమెను ట్రోల్ చేస్తూ మానసికంగా హింసించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషాదాకర ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేసింది. అలాగే ‘జల్సా’ సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించింది. గీతాంజలికి న్యాయం జరగాలి ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు. దయచేసి వారిని శిక్షించండి. ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అవన్నీ పుకార్లు మాత్రమే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులర్ అయ్యారు పూనమ్ కౌర్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్లపై ఆమె చేసే ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి బాగోతాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక నటి పూనమ్ మాత్రమే. అందుకే పవన్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు ఆమెపై ఓ కట్టుకథను కూడా అల్లారు. జల్సా సినిమాలో అవకాశం అడిగే ఇవ్వలేదని.. అందుకే ఆమె వారిద్దరిని టార్గెట్ చేసిందని ప్రచారం చేశారు. (చదవండి: సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?) తాజాగా దీనిపై స్పందించింది పూనమ్ కౌర్. అవన్నీ పూకార్లు మాత్రమేనని.. తాను ఇంత వరకు ఎవ్వరినీ కూడా అవకాశాలు అడుక్కోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన మీద మాత్రమే ఆదారపడకుండా ఎప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతుంటానని చెప్పింది. తాను నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువని, దయచేసి అలాంటి రూమర్స్ నమ్మకండి అని మరోసారి తన అభిమానులను కోరింది పూనమ్. #JusticeForGeetanjali , I was confused about who led her to committing suicide , whether it’s online trollers of a particular party who are truly capable of physiologically abusing a woman or a volunteer who seems to go invisible. Please punish . Young girl kids deserve justice. — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 12, 2024 -
ఆ హీరోయిన్కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!
పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేవి మూడు పెళ్లిళ్లు. ఎప్పటికప్పుడు దీన్ని పవన్ సమర్థించుకుంటాడు గానీ ఏది ఏమైనా సరే ఇది ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా రెండో పెళ్లి చేసుకోవడానికే వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది పవన్ ఏకంగా మూడుసార్లు చేసుకున్నాడు. వాళ్లలో ఒకరు తెలుగు, ఇంకొకరు మరాఠీ, మరొకరు రష్యన్. ఇలా ప్రపంచం మొత్తాన్ని పవన్.. తన పెళ్లిళ్లతో కవర్ చేశాడు. ఈ సంగతి ఇక్కడివరకే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే సినిమా హీరోయిన్లు-పవన్కు మధ్య అప్పట్లోనే బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ ఉండాల్సిందే పవన్ కల్యాణ్ చేసిన వాటిలో చాలావరకు రీమేక్ సినిమాలే ఉంటాయి. తెలుగు మూవీస్ గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు. బయటకు అనుకోరు గానీ ఫ్యాన్స్ అయితే దీని గురించి ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. మళ్లీ ఎక్కడ చెబితే పక్కనోడు ఫీలవుతాడని అస్సలు బయటపెట్టరు. అలానే పవన్ ఏ సినిమా చేసినా సరే స్టోరీతో సంబంధం లేకుండా అందులో కచ్చితంగా హీరోయిన్ ఉండి తీరాల్సిందే. 'వకీల్ సాబ్'నే తీసుకోండి.. స్టోరీకి హీరోయిన్ అవసరం లేదు అయినాసరే శ్రుతిహాసన్ని తీసుకొచ్చారు. ఓ పాట, లవ్ ట్రాక్ పెట్టారు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్కి అవమానం!) పార్వతికి గిఫ్ట్ పవన్ కల్యాణ్కి ఉన్న ఒకటో రెండో హిట్స్లో 'జల్సా' ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యామా అని అది హిట్ అయిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో పవన్కి హీరోయన్లుగా ఇలియానా, పార్వతి మెల్టన్ చేశారు. అయితే షూటింగ్ టైంలో పవన్-పార్వతికి ఎక్కడో కుదిరిసిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. దానికి ఓ కారణముంది. అప్పట్లో ఓ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం.. 'జల్సా' రిలీజైన తర్వాత ఓ సందర్భంలో, హీరోయిన్ పార్వతి మెల్టన్ వద్దూ వద్దంటున్నాసరే రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ని పవన్ ఆమెకి గిఫ్ట్గా ఇచ్చాడట. 2 గంటలు హోటల్లో? తొలుత డైమండ్ నెక్లెస్ని పవన్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో ఏమో అని పార్వతి సింపుల్గా నో చెప్పేసిందట. కానీ తనని ఓ ఫ్రెండ్లా భావించమని, అలా ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట. ఇది జరిగిన తర్వాత వీళ్లిద్దరూ ఓ హోటల్లో దాదాపు 2 గంటలు పాటు కలిసి భోజనం చేశారట. అంతే కాకుండా స్వయంగా పార్వతి మెల్టన్ని పవన్ తన కారులో ఎక్కించుకుని ఎయిర్ పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చాడట. తర్వాత ఏమైందో ఏమో గానీ పార్వతి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తాలుకు పేపర్ క్లిప్ తాజాగా మరోసారి వైరల్ అయింది. అలా ఇది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. (ఇదీ చదవండి: రజనీ, కమల్ తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్తో!) -
చెప్పులు లేకుండా అమితాబ్.. ఆ సీక్రెట్ రివీల్
సినీ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ . ఎంతో మంది నటులకు ఆయన స్ఫూర్తి. ఎన్నో సినిమాలతో అలరించిన ఆయనకు బాలీవుడ్ వరకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకోసమే, అమితాబ్ గత 41 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం తన ఇంటి బయట అభిమానులను పలకరించే ఆచారం ఉంది దానిని అందరూ 'జల్సా' బంగ్లా అంటారు.! ఇదీ చదవండి: (ఇదీ చదవండి: పెళ్లికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన బాలీవుడ్ హీరో.. అమ్మాయిల పనే అదట!) ప్రతి ఆదివారం, ముంబైలోని అమితాబ్ బచ్చన్ యొక్క జల్సా బంగ్లా వెలుపల వందలాది మంది అభిమానులు గుమికూడుతారు. ఆ సమయంలో తను చివరన నిలబడి అభిమానులను పలకరిస్తాడు. ఈ సమయంలో అమితాబ్ ఎప్పుడూ చెప్పులు లేకుండానే కనిపిస్తాడు. తాజాగా దాని వెనుక ఉన్న కారణాన్ని ఆయన వెల్లడించాడు. ఈ విషయంపై కొందరు వివాదాస్పదంగా కూడా తనను ప్రశ్నించినట్లు తెలిపాడు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) ఎవరైనా గుడికి చెప్పులు వేసుకుని వెళ్తారా? వెళ్లరు కదా అంటూ.. ' ప్రతి ఆదివారం నా కోసం వచ్చే అభిమానులే నా శ్రేయోభిలాషులు.. వారిని దేవుళ్లతో సమానంగా భావిస్తాను. అలాంటప్పుడు వారు నిల్చున్న ప్రాంతం గుడితో సమానం అని భావించాను కాబట్టే నాలుగు దశాబ్ధాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను' అని తెలిపాడు. తన కోసం వచ్చిన అభిమానులు తీవ్రమైన ఎండలో నిల్చోని ఉంటే.. చెప్పులు వేసుకుని దర్జాగా ఎలా ఉండగలుగుతానని అమితాబ్ పేర్కొన్నారు. బచ్చన్ ఇటీవల ప్రభాస్, దీపికా పదుకొణె నటిస్తున్నా ' ప్రాజెక్ట్ కె ' షూటింగ్లో ఉండగా గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ కార్యక్రమాల్లో బిజీ అయ్యాడు. -
విద్యాబాలన్.. ‘జల్సా’ మూవీ రివ్యూ
క్రైమ్ అండ్ పనిష్మెంట్... పురుష ప్రపంచంలో కనిపించే చర్య... ప్రతిచర్య. కాని స్త్రీల ప్రపంచంలో నేరం తర్వాత శిక్ష ఉంటుందా క్షమ ఉంటుందా? ‘జల్సా’ సినిమా చూడాలి. ఇద్దరు హీరోల రోజులు పోయి ఇద్దరు మహిళా ఆర్టిస్టుల రోజులు వచ్చాయి అని ఈ సినిమా ఎలుగెత్తి చాటుతోంది. విద్యాబాలన్, షెఫాలీ షా... వీళ్ల పోస్టర్తో సినిమా రిలీజ్ కావడం పెద్ద బాలీవుడ్ లీప్. మరో విశేషం సెరిబ్రల్ పాల్సీ ఉన్న తెలుగు పిల్లవాడు సూర్య కాశీభట్ల ముఖ్యపాత్ర పోషించి ఆకట్టుకోవడం. ఈవారం సండే సినిమా. మనిషి ఒక నేరం చేస్తాడు. చట్టం శిక్ష విధిస్తుంది. అన్నిసార్లు చట్టానికి చిక్కకపోవచ్చు. ఆ శిక్ష సాపేక్షం కావచ్చు. అంతమాత్రం చేత ఆ నేరం ఆ మనిషిని ఊరికే ఉంచుతుందా? మానసికంగా అది విధించే శిక్ష ఏమిటి? పశ్చాత్తాపంతో విధించుకునే శిక్ష ఏమిటి? శిక్షను తప్పించుకుందామనుకుని ప్రయత్నిస్తూ ఆ అశాంతి లో వేసుకునే శిక్ష ఏమిటి? మానవ ప్రవర్తన, స్వభావం, ఆలోచన ఎప్పటికప్పుడు వినూత్నం. పరిస్థితులకు ఒక్కోసారి బానిస. అవే పరిస్థితులపై విజేత. ‘జల్సా’ ఒక నేరం చేసిన స్త్రీకి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ. సాధారణంగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇలాంటి కథలు మగవారి మధ్య రాసుకుంటారు. ఆ మగవాళ్ల ఇమేజ్తో సినిమాలు ఆడుతాయి. కాని ఇప్పుడు స్త్రీలతో కథ నడిపించవచ్చని నిరూపిస్తున్నారు. ఇది ప్రయోగం. ప్రయత్నం. ముందంజ. కథ ఏమిటి? ముంబై నగరంలో ఉన్నత వర్గానికి చెందిన జర్నలిస్ట్ విద్యాబాలన్. ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. తోడుగా వృద్ధురాలైన తల్లిగా రోహిణి హట్టాంగడి. వీరందరికీ వండి పెట్టడానికి రుక్సానా అనే వంట మనిషి షెఫాలీ షా. విద్యా బాలన్ విలువలు ఉన్న జర్నలిస్ట్. ఆమె సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతటి వారినైనా ఎదిరిస్తూ ఉంటుంది. కాని ఆమే సత్యాన్ని దాయవలసి వస్తే? ఒకరోజు అర్ధరాత్రి ఆమె డ్యూటీ నుంచి ముగించి కారు డ్రైవ్ చేస్తూ ఒక టీనేజ్ అమ్మాయిని ఢీ కొడుతుంది. ఊహించని ఈ ఘటనకు ఎలా రియాక్ట్ కావాలి? అక్కడ ఎవరూ ఉండరు. దిగి చూసే ధైర్యం లేదు. టీనేజ్ అమ్మాయిని ఆమె ఖర్మానికి వదిలి ఇల్లు చేరుకుంటుంది. కాని మరుసటి రోజు తెలుస్తుంది అలా తాను యాక్సిడెంట్ చేసి మృత్యువు అంచుదాకా (సీరియస్గా గాయపడుతుంది) పంపిన అమ్మాయి తన పనిమనిషి కూతురేనని. ఒక వైపు సంఘంలో పరువు, ఇంకో వైపు జైలు భయం, మరోవైపు ఎలా తప్పించుకోవాలి అనే ఆందోళన, తన సొంత ఇంటి మనిషిలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాననే గిల్ట్. ఇవన్నీ ఆమెను వెంటాడుతాయి. సత్యాన్ని వెతుకులాడే జర్నలిస్ట్ తానే ఒక సత్యాన్ని తొక్కిపెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. మరోవైపు పనిమనిషి అయిన షెఫాలీ షాకు ఇదంతా తెలియదు. ఎవరో యాక్సిడెంట్ చేశారు. తన యజమాని వైద్యం చేయిస్తోంది. కూతురు బతుకు బుగ్గిపాలైంది అనే శోకం. కాని ఒక నేరం జరిగితే అందుకు తప్పకుండా శిక్ష ఉంటుంది. చట్టానికి విద్యాబాలన్ దొరక్కపోవచ్చు. కాని షెఫాలీ షాకు దొరికిపోతుంది. తన కూతురికి యాక్సిడెంట్ చేసింది తన యజమానే అని తెలుసుకున్న షెఫాలీ షా ఏం చేసింది? చూడాలి. పరిస్థితులు ఒక ఘటన జరిగినప్పుడు పరిస్థితుల కొద్దీ మనిషి స్వభావం ఎలా మారిపోతుందో ఈ సినిమా చర్చిస్తుంది. విద్యాబాలన్ యాక్సిడెంట్ ముందు వరకూ ఒక మనిషి... అయ్యాక ఒక మనిషి. ఆమెకు తీవ్రమైన మానసిక ఆందోళన మొదలైపోతుంది. లిఫ్ట్లో, నాలుగ్గోడల మధ్య ఉండలేకపోతుంటుంది. పీడకలలు. ఇదంతా సత్యాన్ని దాచడం వల్లే. ఆమె తన స్వభావానికి విరుద్ధంగా ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే ఎవరెవరిని ఎంతెంత పెట్టి కొనాలి అనే రంధిలో పడిపోతుంది. మరోవైపు తన కూతురులాంటి అమ్మాయిని జీవచ్ఛవంలా హాస్పిటల్లో చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. అటువైపు షెఫాలీ షా చుట్టూ చాలామంది మూగుతారు. నేరం జరిగినప్పుడు శిక్ష పడాలి అని మొదట అనిపిస్తుంది. కాని పేదవాళ్లు ఆ సందర్భంలో ఒకలాగా శ్రీమంతులు ఒకలాగా వ్యవహరిస్తారని ఈ సినిమాలో చూపిస్తారు. పోలీసులే మధ్యవర్తులుగా మారి నీకో పది లక్షలు ఇప్పిస్తాం... కాంప్రమైజ్ అయిపో అని షెఫాలీని ఒప్పిస్తారు. గమనించండి. పేదవాళ్లు శ్రీమంతులకు నష్టం కలిగిస్తే ఇలాంటి అప్షన్ ఉండదు. వారు జైలుకు వెళతారు. షెఫాలీ అంగీకరిస్తుంది. కాని చివరకు నేరం చేసింది తన యజమానే అనుకున్నాక ఆమె ప్రతిచర్య వేరేగా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏమిటి? స్త్రీ అంటే క్షమ. క్షమించడమే. కాని ఇదంతా గ్రిప్పింగ్గా ఉంటుంది చూడటానికి. ఆ పిల్లాడు ఈ సినిమాలో విద్యాబాలన్ కుమారుడుగా వేసిన సూర్య కాశీభట్ల మరో ముఖ్యపాత్ర. ఈ పాత్ర ఒక సంకేతం కావచ్చు. కన్నకొడుకు సెరిబ్రల్ పాల్సీ (మాట, కదలికల లోపం)తో ఉన్నప్పటికీ విద్యా బాలన్ ఆ పిల్లాణ్ణి ప్రేమించకుండా ఉంటుందా? ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడికి వంట మనిషిగా పని చేసే షెఫాలీ కూడా వాణ్ణి ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడు సంపూర్ణుడు కాడు. లోపం ఉన్నవాడు. తాము ఇష్టపడే మనుషులు సంపూర్ణులు అయి ఉండరు. ఏవో ఒక లోపాలు ఉంటాయి. తప్పులు జరుగుతాయి. పొరపాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతమాత్రాన ఆ బంధాలను తెంపేసుకోలేము. కఠినమైన శిక్షలు విధించలేము. క్షమ ఒక మార్గం ఏమో వెతకాలి. ఏమంటే శిక్ష కంటే క్షమ గొప్పది. ఈ సినిమా అలాంటి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. విద్యా బాలన్, షెఫాలీ... వీరద్దరి గొప్ప నటనను చూడొచ్చు. సూర్య కూడా ఎంతో గొప్పగా నటిస్తాడు. కథ ఇంకా బాగుండొచ్చు. క్లయిమాక్స్ అసంపూర్ణం అనిపించవచ్చు. కాని అసంపూర్ణతను ప్రేమించమనే కదా డైరెక్టర్ సురేశ్ త్రివేణి చెబుతున్నది. అమేజాన్ ప్రైమ్లో ఉంది. -
పవన్ కళ్యాణ్ జల్సా సినిమా సీన్ను గుర్తు చేసిన ఢిల్లీ గ్యాంగ్స్టర్స్
ఢిల్లీ: గ్యాంగ్స్టర్స్ లాక్ అప్లో ఉండి జల్సా సినిమాలోని సీన్లను రిపీట్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక వివరాల్లోకి వెళితే..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాను చూసి ఉంటారుగా.. ఆ సినిమాలోని విలన్ ముకేష్ రిషి జైలు నుంచే సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సన్నివేశం ప్రారంభంలో అది జైలు అని మనకు ఏ మాత్రం అనిపించదు. విచారణ నిమిత్తం కోర్టు నుంచి జైలుకు వెళ్లే దారిలో మర్డర్లు కూడా చేసి వస్తాడు ఆ సినిమాలోని విలన్. సినిమాలో చూడటానికి ఆ సన్నివేశం ఎంత బాగున్నా కూడా నిజ జీవితంలో ఇలా జరుగుతాయా అని మనం అనుకుంటూవుంటాం. అయితే తాజాగా అలాంటి సంఘటనలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాకపోతే ఆ సినిమాలో జైలు నుంచి చేస్తే ఈ వీడియోలో మాత్రం లాకప్ నుంచి. నలుగురు వ్యక్తులు లాకప్లో హ్యాపీగా కుర్చొని మద్యం తాగుతూ అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్తో పాటు చేతిలో సిగరెట్టుతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇదిలా ఉంటే లాకప్లోని మరొక గ్యాంగ్స్టర్ సరదాగా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోని ఆ జైలులో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్స్టర్ నీరజ్ బవన పోస్ట్ చేయడం ఇందులోని ట్విస్ట్ అని చెప్పాలి. అంతే కాదు ఆ వీడియోలో ఉన్నది నీరజ్ బవన సోదరులైన రాహుల్ కాలా, నవీన్ బాలి కావడం ఇందులోని మరో ట్విస్ట్. View this post on Instagram A post shared by Neeraj_bawana_ (@neeraj_bawanaa_official_) అయితే అప్పటికే రాహుల్ కాలా, నవీన్ బాలి జైలులో ఉండగా ఈ నెల ఐదవ తారీకున పోలీసులు వారిని మళ్లీ అరెస్టు చేశారు. కస్టడిలో ఉంచి విచారణ చేసిన పోలీసులు ఆగస్టు 10న వీరిని తిరిగి జైలుకు పంపించారు. ఇదిలా ఉంటే వీళ్లను మళ్లీ అరెస్టు చేసింది కూడా జైలు నుంచి బయటి వారిని బెదిరింపులకు గురి చేసినందుకు కావడం గమనార్హం. ఇంకా ఈ వీడియోలో వీరున్న సెల్కి ఎదుట సెల్లో కొందరు ఖైదీలు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఇదంతా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా తమకు ఏమీ తెలియనట్టుగా లాకప్లో మద్యం అందించబడదని జరిగిన సంఘటణపై విచారణ చేస్తామని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉండగా ఈ వీడియో మాత్రం ఇంటర్ నెట్లో వైరలై చక్కర్లు కొడుతోంది.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement