-
హైదరాబాద్ ఇరానీ చాయ్: ఇలా పెంచేశారేం‘టీ’..?
సాక్షి, హైదరాబాద్: ఎవరినైనా కలవాలా.. మాట్లాడాలా..? వెంటనే ఫలానా హోటల్/కేఫ్కు రావాలంటూ ఆహ్వానిస్తుంటాం. ఇరానీ చాయ్ తాగుతూ ఎన్నో విషయాలను మాట్లాడుకుంటాం. ఇంకా కొందరికైతే ఇరానీ టీ తాగందే ఏమీ తోచదంటే అతిశయోక్తి కాదు. కప్పు టీ తాగి చలాకీగా పనిచేసుకునే వారు ఎంతోమంది. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ఇరానీ రెస్టారెంట్లు ఫుల్ బిజీగా ఉంటాయి. అయితే రోజురోజూకీ ఇరానీ చాయ్ ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అహ్మద్నగర్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నంలోని ఎన్నో రెస్టారెంట్లలో చాయ్ రూ.20కి చేరింది. ఇదేంటీ.. మొన్నటి వరకు ఒక ధర ఉండగా ఒక్కసారిగా రూ.20 వరకు చేరింది అంటున్నారు చాయ్ ప్రియులు. -
ఇరానీ చాయ్ లవర్స్కు చేదు వార్త..! భారీగా పెరిగిన ధరలు..!
ఇరానీ చాయ్ లవర్స్ చేదు వార్త..! జంట నగరాల్లో ఇరానీ చాయ్ మరింత ప్రియం కానుంది. ఒక కప్పు ఛాయ్పై ఏకంగా రూ. 5 పెంచుతున్నట్లు హోటల్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇరానీ చాయ్ రూ. 15 నుంచి రూ. 20కు చేరుకుంది. పెరిగిన ధరలు మార్చి 25 నుంచి అమలులోకి వచ్చాయి. ఇంధన ధరల పెంపు..! రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. క్రూడాయిల్ ధరల ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్యాకేజ్డ్ వస్తువులను భారీగా పెంచాయి. ఇక ద్రవ్యోల్భణ ఒత్తిళ్లను అధిగమించడానికి మరోమారు 10-15 శాతం వరకు ధరలను పెంచేందుకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు సిద్దమైన్నాయి. ఇరానీ టీ పొడి ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరుకొంది. పాలు లీటరుకు రూ.100కు చేరింది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,800కు చేరుకునే అవకాశం ఉంది. హోటళ్లలో ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇరానీ ఛాయ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరింత కష్టంగా..! కరోనా రాకతో హోటళ్ల నిర్వహణ మరింత కష్టంగా మారింది. హోటళ్ల బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఇక లాక్ డౌన్ అనంతరం అసలు వ్యాపారం సాగడం లేదని యజమానులు పేర్కొన్నారు. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో.. పాత ధరకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. భారీ నష్టాల నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైందని హోటల్ యాజమానులు తెలిపారు. కరోనాకు ముందు ఒక కప్పు ఇరానీ చాయ్ ధర రూ.10 ఉండేది ఇప్పుడు ఏకంగా..రూ.20కు చేరింది. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! వాటిని తినాలంటే జంకుతున్న భారతీయులు..! -
మన చార్మినార్ ఇరాన్లోనూ ఉంది
ఇరాన్ కార్టూన్ అసోసియేషన్ వాళ్లు ఈసారి ‘ట్రంపిజమ్–2’ కార్టూన్స్ అండ్ క్యారికేచర్ పోటీ పెట్టారు. ప్రపంచంలోని ఇప్పటి కార్టూనిస్టులందరూ ఏదో సందర్భంగా ట్రంప్ మీద కార్టూన్లు, క్యారికేచర్లు గీసే ఉంటారు. అలా నేనూ ఓ పది క్యారికేచర్లు, యాభై కార్టూన్లు గీశాను. వాటిలో కొన్నింటిని సెలెక్ట్ చేసి, పోటీకి పంపుదామని సిద్ధపడుతుంటే, ‘మిమ్మల్ని ఈ పోటీకి అంతర్జాతీయ జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా అనుకున్నాం. మీరు ఒప్పుకుంటే సంతోషం’ అని మెయిలొచ్చింది. ఇరాన్ నుంచి ఆహ్వానం అందడం ఇది రెండోసారి. ఇదివరకు 2017లో కూడా జ్యూరీ సభ్యుడిగా వెళ్లాను. మళ్లీ ఇలా పిలుస్తారని ఊహించలేదు. ఇరాన్ను ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాల్సింది మిగిలే ఉంటుంది. ముఖ్యంగా అక్కడి పోటీ సంస్కృతి, ఆర్ట్, ఫిల్మ్, ఫొటోగ్రాఫర్లు, డాక్టర్లు ఎంతో అద్భుతం. హైదరాబాద్లో జరిగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ ఎలిఫెంట్ను ఎన్నోసార్లు గెలుచుకుంది ఇరాన్. అలాగే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా పలు అవార్డులు ఇరాన్ సినిమాకు సొంతం. నాకైతే పర్షియన్ కార్పెట్ ఏనిమేటెడ్ మూవీ ఎంతో ఇష్టం. ప్రస్తుత ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఇరానీలు తమదైన ముద్ర వేసుకుంటున్నారు. అంతర్జాతీయ కార్టూన్, క్యారికేచర్ పోటీల్లోనైతే మొదటి మూడు అవార్డుల్లో ఇరాన్ పేరు తప్పక ఉంటుంది. నేను ఈ స్థాయిలో ఉండటంలో కూడా ఇరాన్ కార్టూన్ పాత్ర కీలకం. గతంలో అంటే 2002, 2003 ప్రాంతంలో ఆ వెబ్సైట్ చూడటానికి ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లి గంటకు యాభై, అరవై రూపాయలు చెల్లించేవాడిని. వారు నిర్వహించే పోటీల్లో పాల్గొనడానికి చాలాసార్లు ప్రయత్నించాను. చివరకు ఓ పదేళ్ల తర్వాత ఒక బహుమతి పొందడం ఒక తీయని అనుభూతి. ఇరాన్ కార్టూన్ అసోసియేషన్ వాళ్లు 2009లో ఓ అంతర్జాతీయ పోటీ నిర్వహించారు. కార్టూన్, క్యారికేచర్ పోటీలు, ప్రదర్శనలను వాళ్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకమైన అంశంతో నిర్వహిస్తుంటారు. ఇరాన్లో రెండవ శక్తిమంతమైన వ్యక్తి అయిన జనరల్ సులేమాన్ అమెరికా బలగాల ద్రోన్ దాడిలో మరణించడంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అయినా, ఇరాన్కు పోదామని రెడీ అవుతుంటే కొలీగ్స్, దోస్తులు వద్దు అని వారించారు. అక్కడి నిర్వాహకులు మాత్రం ‘ఫర్వాలేదు వచ్చేయమ’ని నాకు భరోసా ఇచ్చారు. టికెట్స్ రెడీ. పైగా ట్రంప్ మీద కార్టూన్ కాంపిటీషన్... చివరకు కచ్చితంగా వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. అసలు ఈ సమయంలోనే ఇరాన్ వెళ్లి ట్రంప్ కార్టూన్ ఫెస్టివల్లో పాల్గొని నైతికంగా మద్దతు ఇవ్వాలనిపించింది. 7.01.2020 సాయంత్రం 6.30 గంటలకు అల్ ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగగానే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఫెస్టివల్ డైరెక్టర్ సయ్యద్ మసవుది నన్ను ఆప్యాయంగా హగ్ చేసుకుని పూల బొకేలతో ఆహ్వానం పలికారు. ఇరాన్లో వీకెండ్స్ గురు, శుక్రవారాలు సెలవులు. పొద్దున్నే ‘టెహ్రాన్ టైమ్స్’ ఆఫీసుకు పోయాం. అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు. మధ్యాహ్నం విజువల్ ఆర్ట్స్ సెంటర్కు వెళ్లి అక్కడున్న పెద్ద ఆర్ట్ స్టూడియోలోకి వెళ్లాం. అందులో ఒకే ఒక మినియేచర్ ఆర్టిస్టు ఉన్నారు. అతనితో కాసేపు ముచ్చటించి విషయాలు అడిగి తెలుసుకున్నాను. ఖురాన్ నుంచి కొన్ని సూక్తులను పర్షియన్ కాలిగ్రఫీ స్టైల్లో వర్క్ చేస్తున్నారు. స్టూడియోలో మిగతా ఆర్టిస్టులు జనరల్ సులేమానీని వివిధ రకాలుగా చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. సెలవులు కావడంతో చాలామంది ఆర్టిస్టులు రాలేదని చెప్పారు. జ్యూరీ సభ్యులు, అవార్డు విన్నర్స్తో శంకర్ ప్రపంచంలోనే ఎల్తైన ఆరవ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్లలో ఆరవదైన మిలాద్ టవర్ను ఎక్కాం. దాని ఎత్తు 3,435 మీటర్లు. పైన మూడు మ్యూజియంలను కూడా ఏర్పాటు చేశారు. అందులో పర్షియన్ కవి ఫిరదౌసి శిల్పం కూడా ఉంది. మొదటి మ్యూజియంలో వివిధ నమూనాల్లోని పురాతన వస్తువులు ఉన్నాయి. రెండో మ్యూజియంలో ఇరాన్లోనే అతి పురాతన శిల్పం ఒకటి ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు. ప్రఖ్యాత ఇరానీ చిత్రకారులు చిత్రించిన కొన్ని ఇలస్ట్రేషన్స్ అక్కడ ఉన్నాయి. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, దయ, ప్రేమ వంటి అంశాలతో ప్రత్యేకమైన మెటల్తో ఆ చిత్రాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. తర్వాత నేను, మిత్రుడు జితేత్ కొస్తానా బస చేసిన హోటల్లో రాత్రి డిన్నర్ వన్ బై టూ చేసి పడుకున్నాం. అక్కడ కబాబ్ చాలా ఫేమస్. కాని, అంత క్వాంటిటీ సింగిల్గా తినలేక లంచ్, డిన్నర్ వన్ బై టూ తినేవాళ్లం. మంచినీళ్లు మాత్రం చిన్న చిన్న సీసాల్లో ఇచ్చేవారు. టెహ్రాన్కు ఒక పక్కన ఎత్తయిన మంచు కొండలు ఉన్నాయి. ఆ కొండల్లోని ఒక కొండ పేరున్న పేరుతో వాటర్ బాటిల్స్ ఉండేవి. వాటిపై ‘నాన్ కార్బోనేటెడ్’ అని రాసి ఉంది. ఇరాన్లో లిక్కర్, ఫేస్బుక్పై బ్యాన్ ఉంది. తెల్లారే ‘ట్రంపిజమ్–2’ క్లోజింగ్ సెరిమనీ. ‘ఇస్లామిక్ రివల్యూషన్ అండ్ హోలీ డిఫెన్స్ మ్యూజయం’ వేదిక. అక్కడకు వెళ్లే సరికి పోస్టర్లు, ప్రెస్మీట్ వేదిక, సెరిమనీ వేదిక, నేను గీసిన ట్రంప్ క్యారికేచర్తో ముస్తాబు చేశారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుంటే పక్కన ఒక ఇరానీ ఆర్టిస్టు జనరల్ సులేమానీ పెయింటింగ్ వేస్తున్నారు. ఆ స్టేజ్పైన నేను ట్రంప్ మీద గీసిన క్యారికేచర్ వీడియోను ప్రదర్శించారు. ఆ కార్యక్రమానికి అవార్డు విన్నర్స్, ప్రముఖ కార్టూనిస్టులు, అక్కడి ప్రముఖులు, మిలటరీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అవార్డు విన్నర్స్తో పాటు నాకు జ్యూరీ అవార్డు ఇచ్చి సత్కరించారు. బయటి హాలులో ప్రదర్శన ఏర్పాటు చేశారు. బయట చాలామంది ఇరానియన్ కార్టూనిస్టు మిత్రులు ఉన్నారు. వారితో కాసేపు మాట్లాడి, ఫొటోలు దిగాం. వారి బుక్స్ నాకు, నా బుక్స్ వారికి ఇచ్చి పుచ్చుకున్నాం. అదేరోజు టెహ్రాన్ నుంచి ఇస్ఫహాన్కు ఫ్లైట్లో వన్ అవర్ జర్నీ. అసలు ఇరాన్ అంతటికీ, ఇంకా చెప్పాలంటే ప్రపంచానికంతటికీ ఇరాన్ హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్ అక్కడి నుంచే వెళతాయని అక్కడకు పోయేదాకా తెలియదు. అక్కడ అద్భుతమైన కళాకారులు, చిత్రకారుల వర్క్ చూసే అదృష్టం కలిగింది. కల తీరింది ఎప్పట్నుంచో వెబ్లో చూడటం తప్ప నిజంగా ఇరాన్ కార్టూన్ హౌస్ను చూడాలనే కోరిక తీరింది. అక్కడ ప్రపంచంలోనే ప్రముఖులైన కార్టూనిస్టుల ఒరిజినల్ డ్రాయింగ్స్ చూసే అదృష్టం దక్కింది. చాలాసేపు ఒరిజినల్స్ చూడటం, ఇరాన్ కార్టూన్స్కు వచ్చిన అవార్డులు, వారు ప్రచురించిన అనేక కార్టూన్, క్యారికేచర్ ఆల్బమ్స్ను చూశాను. అందులో సయ్యద్ మసవుది గీసిన ఎలిఫెంట్ కార్టూన్ పెయింటింగ్ అద్భుతం. సయ్యద్ మసవుది హౌస్ ఆఫ్ ఇరాన్ కార్టూన్కి డైరెక్టర్ కూడా. మసవుది కార్టూన్లు చూడటానికి సింపుల్గా కనిపించినా, చాలా ఇంటలెక్చువల్గా కూడా ఉంటాయవి. ఎక్కువగా ఆయన వార్ కార్టూన్స్ గీశారు. ఇరాన్లో ఇరానీ చాయ్ లేదు ఇరానీ చాయ్ అని ఎక్కడ అడిగినా అలాంటిదేమీ లేదు. వితౌట్ మిల్క్ డికాక్షన్తో రకరకాల టీ పొడులతో చేసిన చాయ్లే తాగుతున్నారు. పాలే కాదు, చక్కెర కూడా కలుపుకోరు. ఓ సుగర్ టాబ్లెట్లాంటిది నోట్లో వేసుకుని టీ తాగుతారు. ఇరాన్ పోయి ఇరానీ చాయ్ తాగలేదని ఇక్కడి ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు! హైదరాబాద్లో గల్లీ గల్లీలోనూ ఇరానీ చాయ్ ఉంటుందని చెబితే ఆశ్చర్యపోయారు. మా ఆఫీసు ఎదురుగా ఉన్న సర్వీ హోటల్లో ఇరానీ చాయ్ తాగుతామని చెప్పా... పైగా ఆ హోటల్ యజమానులు ఇరానీ వాళ్లు కావడం అదో తృప్తి. ఇరాన్లో చార్మినార్ మన చార్మినార్లాంటిదే ఇరాన్లోనూ ఉంటుందని విన్నాను. అక్కడ చార్మినార్లా ఉండే కట్టడం నష్కే జహాన్ మసీదు చాలా పురాతనమైనది. నిజానికది చార్మినార్ కాదు, దానికి ఉన్నవి దో మినారే! ఆనుకునే ఉన్న హోటల్లో దిగడం చాలా సంతోషమేసింది. దాని లోపల పనితీరు కూడా మన చార్మినార్లాగానే ఉంది. సిటీ కూడా మన హైదరాబాద్లాగానే ఉంది. దానికి ఆనుకుని ఒక పెద్ద ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఉండటం విశేషం. మధ్యాహ్నం ఇస్ఫహాన్ హౌస్ ఆఫ్ కార్టూన్కి వెళ్లాం. ఇస్ఫహాన్ సిటీలోని ఆ ప్రయాణంలో మధ్యలో ఒక అందమైన నది ఉంది. దాని మధ్యలో 1650లో కట్టిన పురాతనమైన వంతెన ఉంది. నిజంగా సిటీ మధ్యలో ఒక పెద్ద ఓల్డ్ మాస్టర్పీస్ పెయింటింగ్లా అనిపించింది. అక్కడ చాలాసేపు గడిపాం. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల జనం చేరుకుని భోజనాలు చేయడం, పిల్లలు ఆడుకోవడం, టూరిస్టులు ఫొటోలు తీసుకోవడం కనిపించింది. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్, కార్టూనిస్టులు, క్యారికేచరిస్టుల సమక్షంలో నా వర్క్షాపు జరిగింది. దానిలో భాగంగా లైవ్ క్యారికేచర్ స్లైడ్షో జరిగింది. నేను వర్క్షాప్లో బొమ్మలు గీస్తుండగా దాదాపు ఓ ఏడెనిమిది మంది నా క్యారికేచర్ గీసి చూపించడం సరదాగా అనిపించింది. అక్కడి వారి బొమ్మలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూశాను. అక్కడ ఓ నలుగురు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో సెల్ఫీక్లిక్స్! తెల్లారి మళ్లీ టెహ్రాన్. ఆరోజు టెహ్రాన్ సిటీ రోడ్ల మీద చలికి వణుక్కుంటూ చాలాసేపు తిరిగాం. మన డబ్బులతో పోల్చితే వాళ్లవి చాలా తక్కువ. సాయంత్రం వరకు గడిపి, నైట్ హోటల్లో డిన్నర్ చేసి, నిర్వాహకులకు, మసవుదికి, ఇతర కార్టూనిస్టులు ఆత్మీయ వీడ్కోలు పలకగా, మేం నైట్ ఒంటిగంటకు మళ్లీ అల్ ఖొమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరాం. తోవలో మస్కట్ ఎయిర్పోర్టులో మిత్రుడు, తోటి జ్యూరీ సభ్యుడు జిట్ కోస్తానా ఇండోనేసియా వెళుతుండగా సెండాఫ్ ఇచ్చి, క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నాం. ఒక మిసైల్ నా మీద కాని, ఇరాన్ మీద కాని ట్రంప్ వేయలేదు. కాని మేం మాత్రం మిసైల్స్ కన్నా పవర్ఫుల్ కార్టూన్లు, క్యారికేచర్లు ‘ట్రంపిజమ్’ పేరుతో వేసి బాగా నవ్వుకున్నాం. ఈ సందర్భంగా నాకొక సామెత గుర్తొచ్చింది. ప్రపంచం ఇంకా బతికే ఉంది. ఎందుకంటే అది ఇంకా నవ్వుతోంది గనుక! 'The world lasts because it laughs' – శంకర్, చీఫ్ కార్టూనిస్ట్, సాక్షి -
వారెవ్వా.. ఏమి‘టీ’!
ఒత్తిడితో చిత్తయ్యే చాలా మంది టీ లేదా కాఫీ తాగి ఉపశమనం పొందుతుంటారు. ఇంట్లోనూ కాస్త ఫ్రీ టైమ్ దొరికిందంటే టక్కున గుర్తుకొచ్చేదీ ఇదే. అలా టీ తాగుతూ నచ్చిన పుస్తకాన్ని చదివితే అంతకంటే మనసుకు ఆహ్లాదం ఇంకేముంటుంది. స్నేహితులు కలిసినపుడు, తెలిసిన వారు బజారులో పలకరించినపుడు, మర్యాదపూర్వక భేటీల సమయంలో తప్పకుండా ఒక ‘స్ట్రాంగ్ టీ’ గుటకేయాల్సిందే!! లేదంటే చాలా మందికి ప్రాణం ఉసూరుమంటుంది. సాక్షి, ఒంగోలు: తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో టీ ప్రముఖ పాత్రే పోషిస్తోంది. మూడు దశాబ్దాల కిందట ఒకటీరెండు రకాల తేనీరే అందుబాటులో ఉండేది. కప్పు రూ.0.15 పైసలతో మొదలై.. ఇప్పుడు రూ.15కు చేరింది. ఒక్క ఒంగోలు నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా టీలు తాగుతున్నారని వ్యాపారవర్గాల అంచనా. ఈ లెక్కన జిల్లాలో టీ మార్కెట్ అంచనాలకు అందనిది. నాలుగు చినుకులు పడ్డాయంటే.. బయట చిరుజల్లులు. ఆహ్లాదకరమైన వాతావరణం. వేడివేడిగా తేనీటి చుక్కలు గొంతులోకి దిగుతుంటే భలే ఉంటుంది కదూ. ఇద్దరు మిత్రులు కలవగానే నోటి నుంచి వచ్చే మొదటి మాట ‘టీ తాగుదాం భయ్యా’, ‘టీ తాగుదాం బాబాయ్..’, స్ట్రాంగ్ చాయ్ తాగుదాం మావా..’. ఇక విద్యార్థులైతే ఒన్బైటూ చాయ్ చెబుతారు. బందువులు ఇంటికి రాగానే తేనీటి సేవనంతోనే కబుర్లు మొదలవుతాయి. మనసు చికాకు పుట్టినా.. కొత్తవారితో దోస్తీ కట్టినా.. వాన పడినా.. మంచు కురిసినా, ఎండ కాసినా టీ రుచులను ఆస్వాదించాల్సిందే. చిరుద్యోగి నుంచి కార్పొరేట్ కంపెనీ సీఈఓ వరకు రోజుకు ఒక్కసారైనా టీ సేవించాల్సిందే. నగరాల్లో ఇరానీ చాయ్ వచ్చేసింది. ప్రత్యేకంగా ఇరానీ చాయ్ రుచులు చూపించే దుకాణాలు ఉన్నాయి. తేయాకు రుచులకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఆరోగ్యం.. ఆనందం..ఆహ్లాదం.. ఆస్వాదన పంచే తేనీరుతో కొన్ని హోటళ్లు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాయి. సమయానికి తగినట్లుగా, మూడ్కు అనుగుణంగా సరికొత్తగా కొత్త కొత్త రుచులతో తేనీరు అందుబాటులోకి వచ్చింది. మారిన జీవన శైలి.. పోటీ పడి అలసిన వారు కాసేపు సేద తీరేందుకు ఇటు వైపుగా అడుగులు వేస్తున్నారు. నగరంలోనూ కేఫ్ క్లబ్లు వెలుస్తున్నాయి. ఆధునిక పోకడలకు దర్పణం పడుతున్నాయి. కొత్తగా ఆస్వాదించాల్సిందే.. మారుతున్న పరిస్థితుల్లో అన్ని వర్గాల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఖర్చు ఎక్కువనా వెనుకంజ వేయడం లేదు. కార్పొరేట్ సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. కాసేపైనా సమావేశాలు, స్నేహితులు బందువులతో గడపాలంటే టీ రూమ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకాంతంగా గడిపేందుకు అనుకూల వాతావరణం ఆస్వాదించడానికి అద్భుతమైన రుచులను కోరుతున్నారు. నగరంలో వివిధ బ్రాండ్ల టీ రకాలు అందుబాటులో ఉన్నాయి. హైవే పైనా కాఫీ క్లబ్లు, టీ షాప్లు వెలిశాయి. 24 గంటలపాటు వీటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక టీ బంకులు ఉండనే ఉన్నాయి. టీ కాస్త బాగుంటే చాలు.. షాప్ వద్ద జనాలు గుంపులు గుంపులే. అర్ధరాత్రి వరకు టీ దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. పాత మార్కెట్ సెంటర్తోపాటు పలు ప్రాంతాల్లో రకరకాల టీలు లభిస్తున్నాయి. ఘుమఘుమలతో ఫిదా.. టీ గ్లోబల్ మార్కెట్. అంతర్జాతీయంగా ఉండే టీ రకాలు స్థానిక మార్కెట్కు వస్తున్నాయి. మూడు దశాబ్దాల కిందట టీ రకం ఒకటే. ఇప్పుడు రకరకాలు. రంగు.. రుచి.. వాసన ఘుమఘుమలతో నగరవాసులు టీకి ఫిదా అవుతున్నారు. 1853లో తేయాకు తోటలను తొలిసారిగా సాగు చేశారు. క్రమంగా విస్తరించి లక్షలాది ఎకరాల్లో తేయాకు పండిస్తున్నారు. అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, త్రిపుర, అరుణాచల్ప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, ఉత్తరాఖండ్, మిజోరాం, మేఘాలయ, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి రకరకాల తేయాకు మార్కెట్కు వస్తోంది. కిలో రూ.139 నుంచి రూ.1200 వరకు ఉండే రకాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఆరోగ్య సూత్రాలు బాగా అవలంబిస్తున్న నేపథ్యంలో బ్లాక్, గ్రీన్, హెర్బల్, దినుసులతో తయారు చేసిన టీ రకాలను ఆస్వాదించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు చిన్న డిస్పోజల్ బ్యాగ్లలోనూ టీ లభిస్తోంది. బ్లాక్, చీజ్, పౌడర్, రెడీ టీ, గ్రీన్, జింజర్ రకరకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఔరా అనాల్సిందే.. ఎల్లో బడ్ టీ రెండు కప్పుల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.6,500. స్టార్ హోటళ్లల్లో ఈ టీ లభిస్తుంది. టీ వినియోగానికి పెరిగిన ఆదరణకు ఇది ప్రతీక. అచ్చమైన తేయాకును ఎండబెట్టి 24 కేరట్ల బంగారంతో మిళితం చేసిన ఫ్లేవర్తో ఎల్లో బడ్ టీ పొడి తయారు చేస్తారు. ఈ టీ పౌడర్ కిలో ధర సుమారు రూ.8 లక్షలు. ఎంతటి వారైనా ఈ ధర చూసి ఔరా అనాల్సిందే. స్థానిక మార్కెట్లోనూ 40 రకాలకు తగ్గకుండా టీ లభిస్తోంది. అల్పాహార హోటళ్లల్లోనూ నిత్యం వినియోగించే రకాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఒంగోలులోని వివిధ సెంటర్లలో జింజర్ టీ, గ్రీన్, బ్లాక్, దాల్చిన చెక్క, వైట్ టీ, ఎల్లో టీ, బాదం టీ, మింట్, మిరియాలు, వాము, గార్లిక్.. ఇలా రకరకాల టీలు విక్రయిస్తున్నారు. ఉదయాన్నే అల్లం టీ తాగేందుకు వాకర్లు గుంపులుగుంపులుగా టీ కొట్ల వద్దకు చేరుతున్నారు. ఉదయం పూట ఒక్క మంగమూరు రోడ్డులోని రెండు మూడు కేంద్రాల్లో వందలాది టీలు అమ్ముడవుతున్నాయి. షాప్ నిర్వాహకులు పార్ట్ టైం సర్వెంట్లను పెట్టుకుని ఉదయం టీ మార్కెట్ నడిపిస్తున్నారు. పాలు, పంచదార కలపకుండా చక్కటి రుచి, సువాసన కలిగిన టీలు కాఫీ షాప్ల్లో లభిస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు కలపకుండా స్వచ్ఛమైన తేయాకుతో తయారు చేసే టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. -
హైదరాబాద్ అంటే దానికి ఫేమస్
హైదరాబాద్ అంటే ఇరానీ ఛాయ్కి ఫేమస్ అని చాలా మందికి తెలుసు. కానీ అర బిక్ ఘావా అనే మరో రకం ‘టీ’కి కూడా మనం కేరాఫ్ అడ్రస్ అని ఎంత మందికి తెలుసు. అలాగే పౌనా, సులేమాన్ ఛాయ్, కేశర్.. ఇలా చలికాలంలో సిటీలో ప్రత్యేకంగా లభించే ‘టీ’ వెరైటీలు చాలా తక్కువ మందికే తెలుసు. విభిన్న దేశాలు, సంప్రదాయాలతో మమేకమై ఎన్నో అభి‘రుచుల’ను తనలో ఇముడ్చుకున్న మన సిటీ హిస్టారికల్ ‘టీ’లకు కేంద్రమైంది. - ఎస్.సత్యబాబు కేశర్.. రిచ్ ఫ్లేవర్ ఇది కొంచెం ఖరీదైన టీ. కుంకుమ పువ్వును వినియోగించి ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారు చేస్తారు. గతంలో సంపన్నుల ఇళ్లకు మాత్రమే పరిమితమైనా ఇప్పుడు పాతబస్తీ ఫేవరెట్. నగరంలోని కొన్ని హోటళ్లలో మాత్రమే లభిస్తుంది. జలుబు నివారణకు ఇది ఉపకరిస్తుంది. దీనిని చిన్న పిల్లలు, మహిళలకు విక్రయించరు. ధర రూ.20 నుంచి రూ.45 సులేమానీ.. ఫ్యాట్ పరారీ... ఇది చాపత్తాతో తయారవుతుంది. లెమన్, పుదీనా, మసాలా రుచుల్లో లభ్యమవుతుంది. ఏ కాలంలోనైనా అన్ని వయసుల వారు తాగేందుకు అనువైన పానీయం. సిటీలో లెమన్, పుదీనా సులేమానీల వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. దీన్ని తాగడం వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటు కొవ్వు కరిగిస్తుందని చెబుతున్నారు అమ్మకందారులు. సులేమానీని విక్రయించేందుకు పాతబస్తీలో ప్రత్యేక దుకాణాలున్నాయి. ఇది సౌదీ నుంచి నగరానికి వచ్చింది. ధర రూ.8 నుంచి రూ.20 చలికాలం.. ఛాయ్ కాలం.. వినూత్న రుచితో పాటు వైద్య పరమైన విలువలు కూడా ఉండడం చలికాలం ఛాయ్ల పాపులారిటీని ఇనుమడింపజేస్తూ హాట్హాట్గా అమ్ముడయ్యేలా చేస్తోంది. అరబ్ దేశస్తుల మూలాలు ఎక్కువగా కనిపించే బార్కాస్లో ఈ వింటర్ టీలు బాగా పాపులర్. ఈ సీజన్లో బార్కాస్లో పెద్ద సంఖ్యలో షాప్లు నెలకొల్పి ఈ వేడి వేడి హిస్టారికల్ టీలను అందిస్తారు. పౌనా.. లేడీస్ స్పెషల్ దీని రుచి లైట్గా ఉంటుంది. తయారీలో పాలమీగడను వినియోగిస్తారు. ఇందులో డికాక్షన్ తక్కువ, పాల మోతాదు ఎక్కువ. తక్షణ శక్తినివ్వడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా ఇది మహిళలకు ప్రత్యేకం. యువతులు బాగా మక్కువ చూపే పానీయం ఇది. ధర రూ.20 నుంచి రూ.30
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement