-
2011లో ఇలాగే.. నమ్మలేం కానీ నిజమైతే బాగుండు!
2011 వన్డే వరల్డ్కప్ ఎవరు గెలిచారు అని అడగ్గానే టక్కున వచ్చే సమాధానం టీమిండియా. ఎంఎస్ ధోని సారధ్యంలోని టీమిండియా సొంతగడ్డపై ఫేవరెట్గా బరిలోకి దిగి అంచనాలకు మించి రాణించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్కు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయాన్ని అందుకుంది. కాగా ఐర్లాండ్ విజయాన్ని టీమిండియా అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి టీమిండియా అభిమానుల సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణాలేంటి అనేది విశ్లేషిస్తే ఒక ఆసక్తికర విషయం బయటపడింది. 2011 వన్డే వరల్డ్ కప్లో టైటిల్ ఫెవరెట్గా బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, ఐర్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. 328 పరుగుల భారీ టార్గెట్ని పసికూన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో ఛేదించి... టాప్ టీమ్కి ఊహించని షాక్ ఇచ్చింది. ఇది జరిగిన 11 ఏళ్లకు మళ్లీ ఐర్లాండ్ చేతిలోనే పరాజయం ఎదురైంది ఇంగ్లండ్కు. ఇక అప్పటి వరల్డ్కప్ను టీమిండియా నెగ్గిన సంగతి తెలిసిందే. అలా చూసుకుంటే మళ్లీ 11 ఏళ్లకు ఇంగ్లండ్ను ఐర్లాండ్ను ఓడించింది. దీంతో ఈసారి టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవబోతుందనే సెంటిమెంట్ నిజమయ్యే అవకాశాలున్నట్లు అభిమానులు పేర్కొన్నారు. అయితే ఇలాంటి సిల్లీ లాజిక్లు పట్టించుకుంటే అంతేనంటూ కొంతమంది కొట్టిపారేయగా.. మరి కొంతమంది మాత్రం..''నమ్మలేం కానీ నిజమైతే బాగుండు'' అంటూ పేర్కొన్నారు. ఇంతకముందు 2011లో ఇండియాలో ఓరియో లాంఛ్ అయ్యిందని.. అప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని ఎంఎస్ ధోనీ చెప్పిన 'బిస్కెట్' లాజిక్తో పోలిస్తే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సెంటిమెంట్ చాలా బెటర్గా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ పేర్కొనడం గమనార్హం. టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 దశలో ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆఖర్లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా తర్వాతి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడనుంది. గురువారం సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చదవండి: కంగ్రాట్స్ ఐర్లాండ్.. ఇంగ్లండ్ అలా అనకుంటే చాలు! న్యూజిలాండ్కు ఊహించని షాక్.. ఆఫ్ఘన్తో మ్యాచ్ రద్దు It's time to revisit Ireland victory against England in 2011.pic.twitter.com/rd8zU9ZUy3 — Cricket Videos🏏 (@Crickket__Video) October 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డుప్లెసిస్ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానుల ఫైర్
న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్పై భారత క్రికెట్ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. అద్భుతమైన ఆటతో సౌతాఫ్రికాను మట్టి కరిపించిన టీమిండియా మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్లు నమోదు చేసిన మన ఆటగాళ్లు ప్రత్యర్థికి చెమటలు పట్టించారు. వారికి తోడు బౌలర్లు తలోచేయి వేయడంతో సఫారీ జట్టు ఏ మ్యాచ్లోనూ తేరుకోలేకపోయింది. అయితే, టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనను కించపరుస్తూ డుప్లెసిస్ వ్యాఖ్యలు చేశాడు. టాస్ కలిసిరావడం వల్లే భారత బ్యాట్స్మెన్ భారీగా పరుగులు చేయగలిగారని.. వరుసగా టాస్ ఓడిపోవడం మా కొంపముంచిందని అన్నాడు. అంతటితో ఆగకుండా.. ప్రతిమ్యాచ్ కాపీ, పేస్ట్లా సాగిందని చులకనగా మాట్లాడాడు. (చదవండి : అసలు మీరు ఆడితేనే కదా?: స్మిత్ చురకలు) ‘ప్రతి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచేది. తొలుత బ్యాటింగ్ చేపట్టి 500 పైచిలుకు పరుగులు సాధించేది. చీకటి పడుతుందగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేది. అదే చీకట్లో మమ్మల్ని బ్యాటింగ్కు ఆహ్వానించి మూడు వికెట్లు పడగొట్టేది. ప్రతి మ్యాచ్లో ఇదే తంతు. అంతా కాపీ, పేస్ట్లా సాగిపోయింది’అని ఓ స్పోర్ట్స్ చానెల్లో వ్యాఖ్యానించాడు. ఇక డుప్లెసిస్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ ఫ్యాన్స్ ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ఇలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి జట్టుకు కెప్టెన్గా ఉంటే దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదని ఒకరు చురకలంటించారు. ‘డుప్లెసిస్ మాటలు చాలా కోపం తెప్పించేవిగా ఉన్నాయి. అతన్ని బండబూతులు తిట్టాలనుంది. కానీ, సీఎస్కే ఆటగాడు కదా అని వదిలేస్తున్నా’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘డుప్లెసిస్ చెప్పే సాకులు భయంకరంగా ఉన్నాయి. పోనీలే అతన్ని వదిలేద్దాం అనుకుంటే పొరబాటే. అతను మారడు. మళ్లీ అలానే చేస్తాడు. అందుకే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుందాం’ అని మరో అభిమాని రాసుకొచ్చాడు. ‘చిన్నపిల్లల మనస్తత్వం. కాపీ పేస్ట్లా మ్యాచ్లు సాగాయట. అతని మాటలు విని పగలబడి నవ్వుకున్నా’అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. -
మాజీ క్రికెటర్పై ఇండియన్ ఫ్యాన్స్ గరం
సాక్షి, స్పోర్ట్స్: శ్రీలంక సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై ఇండియన్స్ గరంగరంగా ఉన్నారు. అసంబద్ధ వ్యాఖ్యల నేపథ్యంలో లంక మాజీ కెప్టెన్ పై ట్విట్టర్లో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆగష్టు 27న పల్లెకల్లె మూడో వన్డే సందర్భంగా లంక ఓటమిని తట్టుకోలేక శ్రీలంక ఫ్యాన్స్ బాటిళ్లను మైదానంలోకి విసిరి రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆరగంట సేపు ఆటను నిలిపివేసి అనంతరం తిరిగి ప్రారంభించగా, భారత్ విక్టరీ సాధించింది. అయితే వరసగా ఓటమి పాలవుతున్న తమ జట్టును చూసి మండిపడుతున్న శ్రీలంక ఫ్యాన్స్ ను అర్జున రణతుంగ ఊరడించే క్రమంలో ఇండియన్ ఫ్యాన్స్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈడెన్ గార్డెన్ లో 1996లో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి అప్పట్లో పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ విషయాన్ని ఉటంకిస్తూ అభిమానులతో రణతుంగ... ‘మీకు నా విన్నపం ఒక్కటే. క్రికెట్ చరిత్రలో మనకంటూ ఓ చరిత్ర, సాంప్రదాయం ఉన్నాయి. దయచేసి భారత క్రికెట్ అభిమానుల్లాగా మాత్రం ప్రవర్తించకండి. ఇలాంటి ప్రవర్తనతో లంక టీం పరువు తీయకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో రణతుంగా వార్ ప్రకటించిన ఇండియన్ క్రికెట్ లవర్స్ ట్వీట్లతో రణతుంగపై విరుచుకుపడుతున్నారు. Think before you speak. Indian spectators are matured than srilankans @ArjunaRanatunga — harikrishnaa (@harikrishnaa114) 30 August 2017 @ArjunaRanatunga A man who just have 4 test hundreds in his name (just equal to what our Aswin a batsman Cum bowler has in his name) — Ajay Sharma (@ajay_saraswat18) 30 August 2017 -
చిత్తుగా ఓడినా టీమిండియానే గ్రేట్!
న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ తమ జట్టు విజయం కోసం పూజలు, హోమాలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోహ్లి సేన విజయాన్ని కాంక్షిస్తూ మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఊహించిన దానికి భిన్నంగా మ్యాచ్ ఏకపక్షంగా జరగడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీంతో చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొంత మంది క్రీడాస్ఫూర్తి కనబరిచారు. ఆటలో గెలుపోటముల సహజమని, బాగా ఆడిన జట్టే గెలిచిందని పేర్కొన్నారు. అనూహ్యంగా పుంజుకుని విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు అభినందనలు తెలిపారు. చివరి మెట్టుపై బోల్తా పడిన కోహ్లి సేనకు బాసటగా నిలిచారు. గెలిచినా, ఓడినా టీమిండియాను అభిమానిస్తూనే ఉంటామన్నారు. ఒక్క మ్యాచ్ ఓడినంతమాత్రానా ద్వేషించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. ప్రతిసారి మనమే గెలవడం సాధ్యంకాదని, ఇప్పటికీ గొప్ప జట్టు టీమిండియానే అని పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యా ఎదురు నిలిచి పోరాడాడని ప్రశంసించారు. కోహ్లి క్రీడాస్ఫూర్తిని మెచ్చుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు రిషికపూర్, అభిషేక్ బచ్చన్, రణవీర్ సింగ్, సిద్ధార్థ మల్హోత్ర, అర్జున్ రాంపాల్, వరుణ్ ధావన్, ఫర్హాన్ అక్తర్, సుస్మిత సేన్, దియా మిర్జా, సోహ అలీఖాన్, విశాల్ తదితరులు కూడా ఇండియా టీమ్కు మద్దతుగా ట్వీట్లు పెట్టారు. Yes Pakistan, you have defeated us. Well played, outplayed us in all departments. Many congratulations, I concede. Best wishes! — Rishi Kapoor (@chintskap) June 18, 2017 Win some, lose some..still the greatest team in the world! ✊ -
టీవీలు ధ్వంసం.. పోస్టర్లు దగ్థం
న్యూఢిల్లీ: టీవీలు పగిలాయి.. పోస్టర్లు దగ్థమయ్యాయి.. నినాదాలు హోరెత్తాయి... చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత భారత క్రికెట్ అభిమానుల రియాక్షన్ ఇది. దాయాదుల సమరంలో పోరాడకుండానే కోహ్లి సేన సులువుగా లొంగిపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా ఫ్యాన్స్ తమ కోపాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి కోహ్లి సేనకు వ్యతిరేకంగా గళమెత్తారు. అహ్మదాబాద్లో కొంత మంది టీవీలు రోడ్డు మీదకు తెచ్చి బద్దలు కొట్టారు. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్పూర్లో కెప్టెన్ కోహ్లి, అశ్విన్, యువరాజ్ సింగ్, ఇతర ఆటగాళ్ల పోస్టర్లను తగలబెట్టారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో క్రికెట్ ప్రేమికుల ఆగ్రహానికి టీవీలు పగిలిపోయాయి. టీమిండియా సభ్యుల ఆటతీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాళ్లదాడి, అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్తగా రాంచిలోని మహేంద్ర సింగ్ ధోని ఇంటి వద్ద భద్రతను పెంచారు. మిగతా ఆటగాళ్ల నివాసాల దగ్గర కూడా భద్రత కట్టుదిట్టం చేసినట్టు సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement