-
బంజారాహిల్స్ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
రాష్ట్రాభివృద్ధికి అందరూ ప్రార్థించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని, దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఆత్మీయత, స్నేహభావాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చింది. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రంజాన్ మాసంలో మీరంతా సంతోషంగా ఉండాలి, మీ అందరి ప్రార్థనలు ఫలించాలి, మీకు అంతా శుభం కలగాలి’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని మైనార్టీలకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం అత్యధిక నిధులిచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని.. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ముస్లిం మైనార్టీలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. గత ప్రభుత్వం మైనార్టీలకు తీవ్ర ద్రోహం చేసిందని, ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చి మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని అంజాద్ బాషా గుర్తుచేశారు. పలువురు ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలన ముస్లింలకు స్వర్ణయుగమని, మరో మూడు పర్యాయాలు వైఎస్ జగన్ సీఎంగా ఉండేలా అల్లాను ప్రార్థించాలన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) టోపీ, కండువా ధరించి సీఎం నమాజ్ ఇక ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన సీఎం వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు హాఫీజ్ఖాన్, ముస్తఫా, నవాజ్ బాషా, వెలంపల్లి శ్రీనివాస్, కె. రక్షణనిధి, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత, ప్రభుత్వ సలహాదారులు హబీబుల్లా, ఎస్ఎం జియాఉద్దీన్, అలీ, వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ విభాగం చైర్మన్ వి.ఖాదర్బాషా, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్, ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికారాము తదితరులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యం లో నేడు విజయవాడలో ఇఫ్తార్ విందు
-
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు ముస్లింలకు ఇఫ్తార్ విందు
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీ.. 10 సిక్స్లతో! వీడియో వైరల్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement