-
పనిమంతులు ముంబైవాసులు...!
అడుగు తీస్తే మరో అడుగు పెట్టేందుకు ఖాళీ లేక కిక్కిరిసిన లోకల్ ట్రైన్లు...స్టేషన్లలో రైళ్లు ఆగినపుడు ఎక్కడానికి, దిగడానికి ఒలంపిక్ పతకం కోసమా అన్నట్టుగా పోటీపడే జనం...లక్షలాది ఉద్యోగులకు సమయానికి మధ్యాహ్న భోజనం అందించేందుకు అహోరాత్రులు శ్రమించే డబ్బా వాలాలు...వాహనాలు, మనుషులు, ట్రాఫిక్తో నిండిపోయిన రహదారులు... రెండుకోట్లకు పైగా ప్రజల రంగురంగుల కలల ప్రపంచం... ముంబై...! అసలు అలుపనేదే లేని, నడిరాత్రి అయినా ఎక్కడ ఆగకుండా నిరంతరం పయనిస్తూ, రాత్రిపూట కూడా విశ్రాంతి అనే మాట కూడా ఎరగని మహానగరమిది. ఉద్యోగులు అత్యధికంగా కష్టించే నగరంగా దీనిని మార్చడంలోనూ అక్కడి ఉద్యోగులు పై చేయి సాధించారు. ఇప్పుడిక్కడి ఉద్యోగులు ప్రపంచంలోనే అత్యధిక గంటలు పనిచేస్తున్న వారిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని 77 ప్రధాన నగరాల్లో ఏడాదికి 3,314.7 గంటల పాటు పనిచేస్తున్న రికార్డ్తో ప్రథమస్థానంలో నిలిచారు. ఇది ప్రపంచ సగటు 1,987 గంటల కంటే ఎంతో ఎక్కువ. ముఖ్యమైన ఐరోపా నగరాలు... రోమ్–1,581, పారిస్–1,662 పనిగంటలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువే.. ముంబైలో సగటు ఉద్యోగి ఏడాదికి 3,314.7 గంటలు పనిచేస్తున్నట్లు తాజాగా స్విస్ బ్యాంక్ యూబీఎస్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 77 నగరాల్లో సగటున ఏడాదికి పనిచేసే గంటలతో పాటు వివిధ అంశాలపై జరిపిన పరిశీలనను ‘ప్రైస్ అండ్ ఎర్నింగ్స్ 2018 రిపోర్ట్’పేరిట విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్యలో ఈ నగరాల్లోని 75 వేలకు పైగా డేటా పాయింట్లను సేకరించారు. ఈ మహానగరాల్లో ధరలు, ఆదాయం, కొనుగోలుశక్తి స్థాయి, తదితరాలను సూచికలుగా తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. టాప్–5 నగరాలివే: 1) ముంబై–3,314.7– 2) హనోయి–2,691.4– 3) మెక్సికో సిటీ–2,622.1– 4) న్యూఢిల్లీ–2,511.4–5) బొగొటా–2,357.8 అతి తక్కువ పనిగంటల నగరాలివే:1) లాగోస్–609.4– 2) రోమ్–1,581.4–3) పారిస్–1,662.6– 4) కోపెన్హగన్–1,711.9–5) 1,719.6 ఏడాదికి తక్కువ సెలవులు తీసుకున్న వారిలో (సగటున 10,4 రోజులతో) కూడా ముంబైవాసులు కింది నుంచి అయిదో స్థానంలో నిలిచారు. మొదటి నాలుగుస్థానాల్లో లాగోస్, హనోయి, బీజింగ్, లాస్ఏంజిల్స్ నగరాలున్నాయి. అత్యధికంగా 37 రోజుల సెలవులతో రియాద్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, బార్సిలోనా, దోహ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం స్టేటస్ సింబల్గా, ఖరీదైన మొబైళ్లలో ఒకటిగా పరిగణిస్తున్న ఐ ఫోన్ గీ (టెన్) ఫోన్ కొనేందుకు కైరో వాసి 1,066.2 గంటలు, ముంబై ఉద్యోగి 917.8 గంటలు, న్యూఢిల్లీ పౌరుడు 804 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, అదే జూరిచ్లోనైతే 38.2 గంటలు, జెనీవాలో 47.5 గంటలు, లాస్ ఏంజెల్స్లో 50.6 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఆయా మహానగరాల్లో ఆర్జించే వేతనాల్లోని వ్యత్యాసాలను కూడా ఈ సర్వే ఎత్తిచూపింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కొండ నిండింది
- తిరుమలలో పోటెత్తిన భక్తులు - సాయంత్రం 5.30 గంటలకే కాలిబాట క్యూ మూసివేత సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 66,371 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి ఈ సంఖ్య 95 వేలు దాటనుంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 14 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. పెరిగిన రద్దీ వల్ల టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు క్యూలను పర్యవేక్షించారు. ఫలితంగా అన్ని క్యూలు త్వరగా కదిలి, సామాన్య భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం లభించింది. వేకువజాము ప్రొటోకాల్ వీఐపీలకు గంటలోనే దర్శనం పూర్తి చేశారు. పెరిగిన రద్దీ వల్ల కాలిబాట భక్తుల క్యూ సాయంత్రం 5.30 గంటలకు మూసివేశారు. శనివారం రికార్డు స్థాయిలో 95,113 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 68,364 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆరుబయటే నిద్ర భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గదులకు కొరత ఏర్పడింది. తిరుమలలో ఉండే సుమారు 6,800 గదులు కేటాయించినప్పటికీ అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చారు. శ్రీవారి ఆలయం, కల్యాణకట్ట, బస్టాండ్, సత్రాల వద్ద ఆరు బయటే భక్తులు నిద్రించారు. ఆదివారం లెక్కించిన హుండీ కానుకలు రూ. 2.40 కోట్లు లభించాయి. ఆలయం వద్ద 20 నిమిషాలు అంధకారం తిరుమలలో ఆలయం వద్ద ఆదివారం రాత్రి 7.10 గంటలకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా అగిపోయింది. ఆ సమయంలో ఎక్కడి భక్తులు అక్కడే నిలిచిపోయారు. నాలుగు నిమిషాల తర్వాత జనరేటర్ సాయంతో ఆలయం లోపల మాత్రం బల్బులు వెలిగించారు. ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు నాలుగు మాడ వీధుల్లో 20 నిమిషాల తరువాత విద్యుత్ను పునరుద్ధరించారు. ఈ సమయంలో భక్తులు ఇబ్బందిపడ్డారు. చిన్నపిల్లల ఏడ్పులు వినిపించాయి.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement