-
'జట్టు గెలుపుకన్నా ఇదెక్కువ ఆనందాన్నిస్తోంది'
జింబాబ్వేలో ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్(ICC CWC Qualifiers 2023) మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్కు క్వాలిఫయర్స్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. జింబాబ్వేలో జరుగుతున్న టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మెయిన్ వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. కాగా ఆ రెండు స్థానాల కోసం 8 జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. కాగా క్వాలిఫయర్ తొలి మ్యాచ్లో జింబాబ్వే, నేపాల్ తలపడ్డాయి. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ ఆటతో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.ఇక జింబాబ్వే జట్టుకు మద్దతిస్తూ పెద్ద ఎత్తున్నఅభిమానులు తరలివచ్చారు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు ఇంటికి వెళ్లే ముందు స్టేడియం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా జింబాబ్వే అభిమానుల చర్య అందరిని ఆకట్టుకుంటుంది. ఇక మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్స్ షువావ్ బర్టెల్, ఆసిఫ్ షేక్ మెుదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, కుశాల్ 95 బంతుల్లో 99 పరుగులు చేసి.. సెంచరీకి 1 పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఆసిఫ్ 66 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున నగరవా 4 వికెట్లు తీశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 44.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి గెలిచింది. జొలార్డ్ గుంబి(25), వెస్లీ మాధేవేర్(32) త్వరగానే ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు గెలుపుని అందించారు. క్రెయిగ్ ఎర్విన్ 128 బంతుల్లో 121 పరుగులు చేయగా.. విలియమ్స్ 70 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. Shout out and respect to @ZimCricketv fans for remaining behind and clearing the litter.@AdamTheofilatos @GodwillMamhiyo @bayhaus @CastleCornerZW pic.twitter.com/pquPDTznRY — Gildredge (@gillmbaku_zw) June 18, 2023 చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం' -
Zim Vs Ire: ఐర్లాండ్కు షాకిచ్చిన జింబాబ్వే.. సిరీస్ కైవసం
Zimbabwe vs Ireland, 3rd T20I: సొంతగడ్డపై జింబాబ్వే సత్తా చాటింది. ఐర్లాండ్తో మూడో టీ20లో విజయం సాధించింది. పర్యాటక జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకై ఐర్లాండ్ జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో హరారే వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా తొలి టీ20లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో జింబాబ్వే ఆఖరి వరకు పోరాడి ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసింది. టెక్టర్ ఒక్కడే ఐర్లాండ్తో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన ఐరిష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 47 పరుగులతో ఐర్లాండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. కర్టిస్ కాంఫర్ 27, డాక్రెల్ 23 పరుగులతో రాణించారు. సిరీస్ విజేత జింబాబ్వే (PC: Zimbabwe Cricket) చివరి వరకు పోరాడినా ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ వన్డౌన్లో వచ్చిన క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకం(54)తో రాణించి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నాడు. అయితే, ఐర్లాండ్ మాత్రం పట్టు సడలించలేదు. ఈ దశలో ఆల్రౌండర్ ర్యాన్ బర్ల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత రెండు మ్యాచ్లలోనూ రాణించిన అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మూడో టీ20 స్కోర్లు ఐర్లాండ్- 141/9 (20) జింబాబ్వే- 144/6 (19) చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్పై మైదానం బయటకు! IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? -
Ind Vs Zim: కచ్చితంగా టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: జింబాబ్వే కోచ్
India tour of Zimbabwe, 2022- ODI Series: స్వదేశంలో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు కైవసం చేసుకుని జోరు మీదుంది జింబాబ్వే క్రికెట్ జట్టు. టీ20, వన్డే సిరీస్లో అనూహ్య రీతిలో పర్యాటక బంగ్లాకు షాకిచ్చి 2-1తో ఓడించింది. ఇదే జోష్లో టీమిండియాతో పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జింబాబ్బే జట్టు హెడ్ కోచ్ డేవిడ్ హౌన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి పటిష్ట జట్టుతో ఆడటం తమకు లభించిన గొప్ప అవకాశమన్న డేవిడ్.. తాము కచ్చితంగా గట్టి పోటీనిస్తామనే భావిస్తున్నామని తెలిపాడు. గత కొన్ని రోజులుగా అనుకున్న ఫలితాలు సాధిస్తున్నామని.. రానున్న సిరీస్లోనూ అదే జోరు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. గట్టి పోటీనిస్తాం! ఈ మేరకు స్పోర్ట్స్ స్టార్తో డేవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఇండియా ఇక్కడికి రావడం మనకు లభించిన మంచి అవకాశం అని డ్రెస్సింగ్ రూంలో మా వాళ్లకు నేను చెప్పాను. మెరుగైన స్కోర్లు నమోదు చేయడంతో పాటుగా.. ప్రపంచంలోని మేటి జట్టుపై మెరుగైన స్కోరు నమోదు చేసే విధంగా ముందుకు సాగాలన్నాను. అయితే, కేవలం నంబర్లకే పరిమితమైతే సరిపోదు కచ్చితంగా రాణించాలని.. గట్టి పోటీనివ్వాల్సి ఉంటుందని వాళ్లకు చెప్పాను. నిజంగానే మా వాళ్లు ఆ పని చేస్తారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే! అదే విధంగా.. ‘‘నా దృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మేము గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగినపుడే అన్నీ సాధ్యమవుతాయి. గత కొన్ని రోజులుగా మేము ఇలాంటి ఆశావహ దృక్పథం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. ఇకపై కూడా.. ముఖ్యంగా టీమిండియా విషయంలోనూ ఇదే కొనసాగించగలమని నమ్ముతున్నా’’ అని డేవిడ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది జూన్లో లాల్చంద్ రాజ్పుత్ స్థానంలో జింబాబ్వే హెడ్కోచ్గా నియమితుడయ్యాడు డేవిడ్. అతడి మార్గదర్శనంలో జింబాబ్వే జట్టు టీ20 వరల్డ్కప్-2022 టోర్నీకి అర్హత సాధించడంతో పాటుగా బంగ్లాదేశ్తో సిరీస్లో అదరగొట్టింది. ఇక.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 18, 20, 22 తేదీల్లో హరారే వేదికగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా ఆతిథ్య జట్టుతో తలపడనుంది. చదవండి: IND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్తో సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్ దూరం! IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్ -
ఎనిమిదో నెంబర్ ఆటగాడు అజేయ శతకం; బంగ్లా భారీస్కోరు
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ మహ్ముదుల్లా (150 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. దీంతో 294/8 ఓవర్నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 126 ఓవర్లలో 468 పరుగుల వద్ద ఆలౌటైంది. మహ్ముదుల్లా, టెయిలెండర్ టస్కిన్ అహ్మద్ (75; 11 ఫోర్లు) తొమ్మిదో వికెట్కు 191 పరుగులు జోడించడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక తొమ్మిదవ వికెట్ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. కైటనో (33 బ్యాటింగ్), టేలర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
'ఈ అవార్డు నా చిట్టితల్లికి అంకితం'
హరారే: పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం జింబాబే దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో చేజెక్కించుకున్న పాక్ రెండు టెస్టుల సిరీస్లోనూ ఆధిపత్యం చెలాయిస్తుంది. జింబాబ్వేతో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన హసన్ అలీ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఓవరాల్గా 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం పాక్ క్రికెటర్ హసన్ అలీకి 2019లో వివాహమైంది. 'గత ఏప్రిల్ నెలలో హసన్ అలీకి కూతురు పుట్టింది. కూతురు రాక అతని అదృష్టం కలిసొచ్చిందంటూ' ఒక జర్నలిస్ట్ ట్విటర్లో కామెంట్ చేశాడు. దీనిపై హసన్ అలీ రీట్వీట్ చేశాడు. '' నా కూతురు పుట్టినప్పటి నుంచి నా ప్రదర్శన చాలా మెరుగైంది. నా కూతురే దేవుడి రూపంలో నా వెంట ఉంటూ నాకు ఆశీర్వాదం అందించింది. అందుకే ఈరోజు మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. అందుకే నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది అవార్డును నా చిట్టితల్లికి అంకితమిస్తున్నా. నా కూతురును చాలా మిస్సవుతున్నా.. కానీ బందుత్వం కంటే దేశానికి ఆడాలనేది నా మొదటి ప్రాధాన్యత.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హసన్ అలీ పాక్ తరపున 12 టెస్టుల్లో 52, 54 వన్డేల్లో 83, 36 టీ20ల్లో 48 వికెట్లు తీసుకున్నాడు. ఇక జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టు విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత పాక్ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ బ్యాటింగ్లో పవాద్ ఆలమ్ 140 పరుగులతో రాణించాడు. అనంతరం ఫాలోఆన్ ఆడిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 134 పరుగులకే ఆలౌట్ అయి ఇన్నింగ్స్ 116 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా రెండో టెస్టు మే 7 నుంచి 11 వరకు జరగనుంది. చదవండి: మరణించిన క్రికెటర్కు ‘హ్యాపీ బర్త్డే‘ చెప్పిన బోర్డు!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement