-
బెజవాడను అమ్మేద్దాం
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ పశ్చిమ శివారులోని ఇబ్రహీంపట్నం నుంచి తూర్పు శివారులోని గుణదల వరకు.. ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాలు, ఖాళీ స్థలాల అన్యాక్రాంతానికి తెరలేచింది. విజయవాడలోని స్వరాజ్ మైదానం, స్టేట్ గెస్ట్ హౌస్, డీజీపీ పాత కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ట్రాన్స్కో సబ్స్టేషన్, గుణదలలోని ట్రాన్స్కో భూములు.. ఇలా మొత్తం 49 ఎకరాల ప్రభుత్వ భూములను పర్యాటకాభివృద్ధి ముసుగులో ప్రైవేటు సంస్థల పేరిట బినామీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నారు. భూ వినియోగ మార్పిడి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఆర్డీయే పర్యవేక్షణలో విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) ఈ పన్నాగాన్ని అమలు చేస్తోంది. అందుకు అడ్డంకిగా ఉన్న నగరపాలక సంస్థ మాస్టర్ప్లాన్ను సవరిస్తూ తీర్మానం చేసింది. ఈ 49 ఎకరాల మార్కెట్ విలువ సుమారు రూ.6,500 కోట్లు కావడం గమనార్హం. మాస్టర్ ప్లాన్నే మార్చేశారు.. నదీముఖ ద్వార పర్యాటక ప్రాజెక్టులు, సిటీ స్క్వేర్, స్టార్ హాటళ్ల పేరిట నగరం నడిబొడ్డున, కృష్ణా నది తీరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. అయితే ఆ భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయించేందుకు విజయవాడ నగర పాలక సంస్థ జోనల్ అభివృద్ధి ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) ప్రతిబంధకంగా నిలిచింది. మాస్టర్ప్లాన్ ప్రకారమే నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయినా చేపట్టాలి. ప్రభుత్వ భూములను ఏ వినియోగం కోసమైతే నిర్దేశించారో వాటికే ఉపయోగించాలి. ప్రభుత్వ పెద్దలు కన్నేసిన భూములు కూడా మాస్టర్ప్లాన్లో పబ్లిక్, సెమీ పబ్లిక్ అనే కేటగిరీల కిందే ఉన్నాయి. అంటే వాటిని ప్రభుత్వ, ప్రజోపయోగ పనుల నిమిత్తమే ఉపయోగించాలి. ఇతర అవసరాలకు కేటాయించకూడదు. ఈ నేపథ్యంలో ఏకంగా విజయవాడ నగర పాలక సంస్థ మాస్టర్ ప్లాన్నే సవరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో... సీఎం గత ఆగస్టు 30న సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ మాస్టర్ప్లాన్లో పేర్కొన్న భూములను వినియోగ మార్పిడి చేయాలని ఆదేశించారు. పబ్లిక్, సెమీ పబ్లిక్ కేటగిరీల కింద పేర్కొన్న భూములను ‘మిక్స్డ్’ కేటగిరీలోకి మార్చాలని సూచించారు. పంచాయతీరాజ్, నగర పాలక సంస్థల చట్టం ప్రకారం స్థానిక సంస్థల పాలకమండళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి భూ వినియోగ మార్పిడి చేయాలని ఆదేశించడం గమనార్హం. మిక్స్డ్ కేటగిరీలోకి మారుస్తూ తీర్మానం నగరపాలక సంస్థ ఆస్తులను కాపాడాల్సిన వీఎంసీ పాలకమండలి ముఖ్యమంత్రి అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించింది. గత సెప్టెంబర్ 15న సÐమావేశం నిర్వహించి.. మాస్టర్ప్లాన్లో పబ్లిక్, సెమీ పబ్లిక్ కేటగిరీల కింద పేర్కొన్న భూములు 49 ఎకరాలను మిక్స్డ్ కేటగిరీలోకి మారుస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అంతకుముందు నగర పాలక సంస్థకు చెందిన 82 సెంట్ల భూమిని మినహాయించాలని కోరింనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు అ«ధ్యక్షుడిగా ఉన్న అమరావతి అభివృద్ధి మండలి (ఏడీసీ) ససేమిరా అంది. ప్రభుత్వ భూములను మాస్టర్ప్లాన్లో మిక్స్డ్ కేటగిరీలోకి మార్చడంతో ప్రభుత్వ పెద్దల పన్నాగానికి మార్గం సుగమమైంది. వీఎంసీ తీర్మానానికి త్వరలోనే సీఆర్డీయే రాజముద్ర వేయనుంది. అనంతరం ఏడీసీ ద్వారా ఆ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే తతంగం పూర్తి కానుందని అధికార వర్గాల సమాచారం. అయితే ప్రైవేటు సంస్థల ముసుగులో బినామీలకే ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిటీ స్క్వేర్ నిర్మాణం కోసం స్వరాజ్ మైదానాన్ని చైనాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ సంస్థలో పబ్లిక్ షేర్స్ పేరిట పలువురు వాటాదారులు ఉన్నారని, వారంతా ప్రభుత్వ పెద్దల బినామీలేనని అధికారవర్గాల సమాచారం. ఇదే విధంగా ఇతర భూములను కూడా బినామీలు చక్రం తిప్పే సంస్థలకే కట్టబెడతారని తెలుస్తోంది. భవిష్యత్లో ఇవి కూడా..? భవిష్యత్లో విజయవాడలోని మరో 12.34 ఎకరాలను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. బృందావన్ కాలనీ మున్సిపల్ క్వార్టర్స్, హనుమాన్పేట మున్సిపల్ పాఠశాల, కబేళా సమీపంలోని మున్సిపల్ స్థలం మొదలైనవి ఆ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వీఎంసీ మాస్టర్ప్లాన్లో మిక్స్డ్ కేటగిరీలోకి మార్చిన ప్రభుత్వ భూముల జాబితా ఇదీ... 1) స్వరాజ్ మైదానం, విస్తీర్ణం: 20 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.3,000కోట్లు 2) స్టేట్ గెస్ట్ హౌస్, డీజీపీ పాత కార్యాలయం, విస్తీర్ణం: 6 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.900కోట్లు 3) విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం, పాలకమండలి సమావేశ మందిరం, విస్తీర్ణం: 3.22 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.322కోట్లు 4) విద్యుత్ సబ్స్టేషన్, మున్సిపల్ రోడ్డు, విస్తీర్ణం: 1.13 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.113కోట్లు 5) రాజీవ్గాంధీ పార్కు, విస్తీర్ణం: 9 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.900కోట్లు 6) విద్యుత్ సబ్స్టేషన్ (బందరు రోడ్డు), విస్తీర్ణం: 1.14 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.171కోట్లు 7) పాత పోలీస్ క్వార్టర్స్ (సీతమ్మవారి పాదాలు ప్రాంతం), విస్తీర్ణం: 2.90 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.290కోట్లు 8) హోల్సేల్ కూరగాయల మార్కెట్, పూల మార్కెట్, విద్యుత్ కార్యాలయం రోడ్డు (బందరు రోడ్డును ఆనుకుని), విస్తీర్ణం: 5.54 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ. 831కోట్లు -
16 వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయం
జగిత్యాల: ప్రభుత్వ సొమ్ము మాయం కావడం సాధారణం. కాకపోతే ఈసారి జగిత్యాలలో ఏకంగా వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయమైంది. స్థానిక మండలంలోని తాటిపల్లి శివారులోని శ్రీ రాజరాజేశ్వర రైస్మిల్ పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వ ధాన్యం నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన 22 వేల బస్తాల ధాన్యం మిల్లులో ఉండాల్సింది కానీ.. ప్రస్తుతం మిల్లులో కేవలం 6 వేల బస్తాల ధాన్యం మాత్రమే ఉన్నాయి. కోటి రూపాయల విలువైన 16 వేల బస్తాల ధాన్యం మాయం కావడం పై అధికారులు విచారణ చేపడుతున్నారు. -
నాలుగేళ్ల బాలుడికి యావజ్జీవ శిక్ష
కైరో: ఓ వ్యక్తిని హత్య చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తిని, భద్రతా సిబ్బంది వాహనాలను ధ్వంసం చేసిన కేసులో నాలుగేళ్ల బాలుడికి ఈజిప్టు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించి ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. బాలుడు రెండేళ్ల క్రితం ఈ నేరాలకు పాల్పడ్డాడట. అంటే రెండేళ్ల వయస్సులోనే ఈ నేరాలన్ని చేశారంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు. కానీ ఈజిప్టు కోర్టు నమ్మి మంగళవారం నాడు తీర్పు చెప్పింది. ఆ రోజున ఆ నాలుగేళ్ల బాలుడు లేకుండానే కోర్టు తీర్పు చెప్పడంతో ఆ బాలుడు ఎలా ఉంటారో చూడడానికి ఎవరికి అవకాశం లభించలేదు. అహ్మద్ మన్సూర్ కర్ణి అనే నాలుగేళ్ల బాలుడిపై హత్యకు సంబంధించి నాలుగు అభియోగాలు, హత్యా యత్నానికి సంబంధించి ఎనిమిది అభియోగాలు, ఈజిప్టు ఆరోగ్య సంస్థకు చెందిన ఆస్తులను ధ్వంసం చేసినందుకు, ఆస్పత్రి సిబ్బందిని, భద్రతా సిబ్బందిని బెదిరించారనే అభియోగాలను విచారించిన పశ్చిమ కైరోలోని ఓ కోర్టు ఈ సంచలనాలకే సంచలనమైన తీర్పును వెలువరించింది. కేసును సరిగ్గా చదవకుండానే జడ్జీ తీర్పు చెప్పి ఉంటారని నిందితుడి తరఫు న్యాయవాది ఫైజల్ ఏ సయ్యద్ వ్యాఖ్యానించారు. ఈజిప్టులో న్యాయం జరగదనే విషయం మరోసారి రుజువైందని మొహమ్మద్ అబూ హురీరా వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. చనిపోయిన వారికి మరణ శిక్షలు విధించిన చరిత్ర ఈజిప్టు కోర్టులకు ఉన్నప్పుడు ఇదేమి వింతకాకపోవచ్చని ఒకరు వ్యాఖ్యానించగా, నాలుగేళ్ల బాలుడి పేరు గల వ్యక్తి ఈ నేరాలకు పాల్పడితే అన్యాయంగా బాలుడిని ఇరికించారేమోనని కొందరు, నేరస్థుడి పుట్టిన రోజు తప్పుందేమో అని మరికొందరు ఆనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా కోర్టుకు క్లారిటీ ఉండాలికదా!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement