-
పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం జీవో 133ని విడుదల చేశారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ వర్తిస్తుంది. రెండేళ్ల కనీస సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. స్పౌజ్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, దివ్యాంగులకు ప్రత్యేక పాయింట్లు కేటాయించి బదిలీల్లో వారికి ప్రాధాన్యత కల్పించారు. దీర్ఘకాలంగా పాలిటెక్నిక్ అధ్యాపకులు ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం అనుమతించడంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అయితే, బదిలీలు చేపట్టే నాటికి ఆ స్థానంలో ఐదేళ్లు పూర్తయి, రిటైర్మెంట్కు సమీపంలో ఆరు నెలల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న వారిని కూడా బదిలీ చేసేలా నిబంధన పెట్టారని, ఇది కొంతమంది ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతోందన్నారు. -
బాబోయ్... ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు
సాక్షి, సిద్దిపేట(హుస్నాబాద్): తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి మద్యం తాగివచ్చి సిబ్బంది, మహిళా అటెండర్, విద్యార్థులతో దురుసుగా ప్రవరిస్తున్నారని, కులాల పేరుతో దూషిస్తున్నారని విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ను తొలగించాలంటూ మూకుమ్మడిగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నిత్యం కళాశాలకు మద్యం తాగి వస్తున్నారని తెలిపారు. మాట్లాడాలని వెళ్తే దూషిస్తారని, దురుసుగా ప్రవర్తిస్తారని ఆరోపించారు. కళాశాలకు బస్సు సౌకర్యం, ల్యాబ్, ఫర్నిచర్, బోధన బోధనేతర సిబ్బంది, లైబ్రేరియన్, పీడీ ఇలా ఎవరూ లేరని, కనీస సౌకర్యాలు కరువయ్యాయన్నారు. విద్యార్థులకు మద్దతుగా టీఎస్ఎఫ్ (టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు మేకల అక్షయ్ కుమార్, రాష్ట్ర కమిటీ ఇన్చార్జి వెంకన్న నాయక్, నాయకులు బస్వరాజ్ నాగరాజు, ఎగ్గిడి వేణు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
వారికి పాఠాల్లేవు...వీరికి ఉద్యోగాల్లేవు
సాక్షి, అమరావతి : ఓ పక్క సరిపడా లెక్చరర్లు లేక కాలేజీల్లో బోధన ముందుకు సాగడం లేదు.. మరోపక్క అక్కడే పనిచేస్తూ విధులకు దూరమైన కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాల్లేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయా పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న 232 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను అప్పటి ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ అధ్యాపకులను నియమించినందున వారిని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఏపీలో 100 మంది, తెలంగాణలో 132 మంది ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉన్నారు. వాస్తవానికి ఏపీపీఎస్సీ ద్వారా కొన్ని పోస్టులు భర్తీచేసినా ఇంకా అనేక ఖాళీలున్నందున వాటిలో వీరిని తిరిగి నియమించవచ్చు. కానీ విభజన అనంతరం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వీరిని చేర్చుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు కోల్పోయిన పాలిటెక్నిక్ ఒప్పంద అధ్యాపకులను మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఖాళీ పోస్టులున్నా వీరిని తిరిగి తీసుకోకుండా కొనసాగుతున్న ఒప్పంద అధ్యాపకులకు మాత్రమే రెన్యువల్ చేస్తూ వెళ్లింది. కేంద్రం కొత్త కాలేజీలు ఇచ్చినా... కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్తగా 24 పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఆమేరకు కొన్నిటిని కొత్తగా ఏర్పాటు చేశారు. అయినా వీటిలో పోస్టులు మాత్రం భర్తీ కాలేదు. ఆ పోస్టులను ఐదేళ్లుగా ఖాళీగానే కొనసాగించారు తప్ప కాంట్రాక్ట్ పద్ధతిన కూడా నియామకాలు చేయలేదు. వీటిలో వేర్వేరు కాలేజీల్లో పనిచేస్తున్న వారినే సర్దుబాటు చేసి పాఠాలు చెప్పించారని నిరుద్యోగులు వాపోయారు. ఇప్పటికీ కొన్ని కాలేజీల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందని, కొన్నిటిలో ఒక సబ్జెక్ట్ అధ్యాపకుడు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తున్నారని పేర్కొన్నారు. బయాలజీ అధ్యాపకుడితో కెమిస్ట్రీ లేదా ఇంగ్లిష్, మరో సబ్జెక్ట్ లెక్చరర్తో సంబంధం లేని సబ్జెక్ట్లు బోధింపజేస్తున్నారని తెలిపారు. గెస్ట్ లెక్చరర్లుగా కొంతమందిని నియమించి వారితో ఇలా చేయిస్తున్నారని తెలిపారు. అర్హులైన తాము కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా పనిచేయడానికి కార్యాలయాల చుట్టూ తిరిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు. గతంలో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసి రోడ్డున పడిన తమను తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల పరిస్థితి ఇది.. కాలేజీ సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ 84 40,056 ఎయిడెడ్ 02 1,502 ప్రైవేట్ 201 1,00,470 ప్రభుత్వ కాలేజీల్లో పోస్టుల పరిస్థితి -
మా కళాశాలను సీజ్ చేస్తారా!
పటమట(విజయవాడ తూర్పు) : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తిపన్ను వసూళ్ల వ్యవహారంలో కార్పొరేషన్ వైఖరి సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 16 ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించలేదంటూ విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సీజ్ చేసేందుకు గురువారం వీఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే కళాశాల విద్యార్థులు వీఎంసీ సిబ్బందిని ప్రతిఘటించడంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు సంస్థల నుంచి కోట్ల రూపాయల బకాయిలున్నా పట్టించుకోని అధికారులు.. నిత్యం విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే కళాశాల జప్తునకు పూనుకోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సిబ్బందిని బంధించిన విద్యార్థులు మొండి బకాయిదారులుగా గుర్తించిన సంస్థల నుంచి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బందికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద చుక్కెదురైయ్యింది. విద్యార్థులు కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బందిని బందించారు. అనంతరం పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పడంతో వీఎంసీ సిబ్బంది బయటకు రాగలిగారు. నగరంలోని రోడ్లు, భవనాలశాఖ రాష్ట్ర కార్యాలయం, సబ్కలెక్టర్ కార్యాలయం, పలు విద్యుత్సబ్ స్టేషన్లు, పోలీస్స్టేషన్లు, సౌత్ సెంట్రల్ రైల్వే, పీబీ సిద్ధార్థ కళాశాలతోపాటు పలు విద్యా సంస్థలు బకాయిలున్నప్పటికీ వాటి నుంచి వసూళ్లు చేయకుండా విజ్ఞానానికి ప్రతీకగా ఉండే ప్రభుత్వ కళాశాలపై చర్యలకు వీఎంసీ అ«ధికారులు పూనుకోవటం వీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జె. నివాస్, అడిషినల్ కమిషనర్ డి. చంద్రశేఖర్ జర్మనీటూర్లో ఉండగా.. వీఎంసీ రెవెన్యూ అధికారులు చర్యలకు పూనుకోవడం గమనార్హం. ఏళ్లుగా బాకీ.. ఇటీవల సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్పొరేషన్ పన్నుల వసూళ్లకు చొరవ చూపటం, దీర్ఘకాలికంగా బకాయిదారులుగా ఉన్న సంస్థలను గుర్తించి.. వాటికి నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. ఇప్పటికీ ఈ కళాశాలకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. స్పందించకపోవటంతో కార్పొరేషన్ పాలిటెక్నిక్ కళాశాలను జప్తు చేసేందుకు సిద్ధమయ్యిందని వీఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరంలోని ఏలూరురోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2002 నుంచి వీఎంసీకి చెల్లించాల్సిన ఆస్తిపన్ను చెల్లించటంలేదని తెలుస్తోంది. 2002 నుంచి 2018 వరకు కళాశాల 6.5 కోట్లు బకాయి ఉంది. వీటితోపాటు బందరురోడ్డులోని సబ్కలెక్టర్ కార్యలయం పదేళ్లకుగానూ రూ. 3 కోట్లు, సౌత్సెంట్రల్రైల్వే ఆరేళ్లకు రూ. 50 లక్షలు, నగరంలోని సిద్ధార్థ అకాడమీ 2011 –2018 వరకు సుమారు రూ. 80 లక్షలు వీఎంసీకి బకాయి కట్టాల్సి ఉంది. వీటన్నింటినీ వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని అధికారులు చెబుతున్నారు లక్ష్యాన్ని సాధించేందుకే.. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ. 125 కోట్లు వసూళ్లు నిర్ధేశిస్తే అందులో రూ. ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొండి బకాయిలపై దృష్టిసారించారని వీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పెషల్ డ్రైవ్లో భాగమే.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు రూ. 30 కోట్ల వరకు ఆస్తిపన్నులు దీర్ఘకాలికంగా బకాయిలున్నాయి. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి పన్నులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉండటంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలోనే మొండి బకాయిలు వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. – జి. సుబ్బారావు,డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) -
ప్రేమించలేదని బీరు సీసాతో దాడి..
ఆదిలాబాద్: ఆదిలాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (16)పై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. కుమురంభీం జిల్లా ఈస్గావ్ మండలం అనుకొండకు చెందిన గోవర్ధన్ (18) ఇదే కళాశాలలో గతేడాది పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. హైదరాబాద్లో ఉంటున్న అతడు శనివారం ఆదిలాబాద్కు వచ్చి తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ కళాశాల వెనుక మైదానంలో ఉన్న ఆ విద్యార్థినితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీర్ సీసాతో దాడి చేయగా ఆమె తల, మెడ, చేతిపై గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన మరో విద్యార్థినికి కూడా చేతిపై గాయమైంది. ఈ క్రమంలో గోవర్ధన్ వారిని తోసేసి పరారీ కాగా.. స్థానికులు విద్యార్థినులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను షీ టీం సభ్యులు గాయపడిన విద్యార్థినిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement