-
బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం 864 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ. 864 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొండిబాకీలు మొదలైనవాటికి అధిక కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. ‘ప్రామాణిక ఖాతాలకు రూ. 1,811 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి రావడం వల్ల స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1లో రూ. 864 కోట్లు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 679 కోట్ల నికర నష్టం నమోదైంది‘ అని బ్యాంక్ వెల్లడించింది. సమీక్షాకాలంలో వడ్డీ ఆదాయం రూ. 18,944 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ. 18,494 కోట్లకు తగ్గింది. అటు కేటాయింపులు 71 శాతం పెరిగి రూ. 3,285 కోట్ల నుంచి రూ. 5,628 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 10.28 శాతం నుంచి 9.39 శాతానికి తగ్గడంతో అసెట్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. నికర ఎన్పీఏ నిష్పత్తి 3.95 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గింది. సోమవారం బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు స్వల్పంగా పెరిగి రూ. 48.55 వద్ద క్లోజయ్యింది. -
ముందస్తు హెచ్చరికల వ్యవస్థ
ఎన్పీఏలను ఎదుర్కొనడానికి ఎస్బీఐ వినూత్న చొరవ కొత్త వ్యవస్థ ఆవిష్కరణ ప్రక్రియలో బ్యాంకింగ్ దిగ్గజం న్యూఢిల్లీ : మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యను ఎదుర్కొనడంపై ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దృష్టి సారిస్తోంది. ఒక అకౌంట్ మొండిబకాయిగా మారే పరిస్థితులను గుర్తించడం, తగిన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా కొత్త వ్యవస్థ ఆవిష్కరణల ప్రక్రియలో బ్యాంక్ ఉన్నట్లు 2014-15 వార్షిక నివేదికలో బ్యాంక్ తెలియజేసింది. మొండిబకాయిగా ఒక అకౌంట్ మారుతున్న పరిస్థితుల్లో ముందస్తుగానే సంబంధిత హెచ్చరికల సంకేతాలను ఇవ్వడం ఈ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యమని బ్యాంక్ నివేదిక పేర్కొంది. విభిన్న వ్యూహాలు... మొండిబకాయిగా ఒక అకౌంట్ మారేముందుగానే పరిస్థితిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోడానికి విభిన్న వ్యూహాలను బ్యాంక్ అవలంభించనుంది. ముఖ్యమైనవి చూస్తే... జీఈ క్యాపిటల్తో అవగాహన ద్వారా రిటైల్, రియల్టీ రంగాల్లో మొండిబకాయిలను కట్టడి చేసుకోవడం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల విషయంలో మొండి బకాయిలు, రికవరీ తత్సబంధ సమస్యలను ఎస్బీఐ అసెట్స్ ట్రాకింగ్ సెంటర్స్ పర్యవేక్షిస్తాయి. రికవరీలో భాగంగా స్ట్రెస్డ్ అసెట్స్ రిజల్యూషన్ బ్రాంచీల నుంచి రుణ గ్రహీతలకు/గ్యారెంటార్లకు టెలీ-కాలింగ్ ఏర్పాట్లు. కాల్ సెంటర్లు, వెబ్-ఆధారిత పోర్టల్ వంటి వ్యవస్థల ద్వారా రుణ గ్రహీతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేలా తగిన సౌలభ్యతల ఏర్పాటు, సాంకేతిక అభివృద్ధి చర్యలు. గత ఏడాది కొంచెం బెటర్... కాగా 2013-14తో పోల్చితే 2014-15లో బ్యాంక్ అసెట్ (రుణ) నాణ్యత కొంత మెరుగుపడినట్లు బ్యాంక్ నివేదిక వెల్లడించింది. నికర రుణాల్లో 2013-14లో మొండి బకాయిల వాటా 2.57 శాతం అయితే, 2014-15లో ఈ రేటు 2.12 శాతానికి తగ్గిందని నివేదిక తెలిపింది. రుణాల వైపే కార్పొరేట్ల మొగ్గు న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు ఈక్విటీ రూపంలో కన్నా రుణాల రూపంలోనే నిధులు సమీకరించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే కంపెనీలు మార్కెట్ల నుంచి ఏకంగా రూ. 1.33 లక్షల కోట్లు సమీకరించాయి. ఇందులో సింహ భాగం.. దాదాపు రూ. 1.06 లక్షల కోట్లు డెట్ మార్కెట్ నుంచి రాగా, ఈక్విటీ మార్కెట్ల నుంచి వచ్చిన మొత్తం రూ. 27,032 కోట్లు మాత్రమే. ప్రధానంగా వ్యాపారాల విస్తరణ కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీలు ఈ నిధులను సమీకరించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశీ కంపెనీలు ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ. 3.92 లక్షల కోట్లు సమీకరించగా.. గత ఆర్థిక సంవత్సరం ఈ మొత్తం రూ. 4.80 లక్షల కోట్లకు పెరిగింది.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement