-
మహా రణసభ
నిరసనలు, ధర్నాలతో అట్టుడికిన గోవాడ వేదికపైకి కుర్చీలు విసిరిన రైతులు మహాజన సభలో తీవ్ర ఉద్రిక్తత చోడవరం: గోవాడ చక్కెరమిల్లు మహాజన సభ బుధవారం రణరంగమైంది. నిరసనలు,ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు, లాఠీ ఛార్జీలతో అట్టుడికిపోయింది. నెలరోజులుగా రైతుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరసన ఒక్కసారిగా పెల్లుబికింది. మునుపెన్నడూలేని విధంగా చెరకు రైతుల మహాజనసభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమకు జీవనాధారమైన సుగర్ ఫ్యాక్టరీని అధికార టీడీపీ నాయకులు దోచుకుతింటున్నారంటూ అన్నదాతలు ఊగిపోయారు. భోజనాలు ముగిశాక రైతులంతా సమావేశం ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చున్నారు. చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లింపులు పూర్తిచేశామంటూ ఫ్యాక్టరీ చైర్మన్ చైర్మన్ మల్లునాయుడు మాట్లాడగానే రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహాజన సభ రసాభాసగా మారిపోయింది. అబద్ధాలు చెప్పి రైతులను మోసం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. కోట్ల రూపాయలు పందికొక్కుల్లా దోచుకున్నారని, వెంటనే చైర్మన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. చైర్మన్ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించడంతో రైతులు కుర్చీలను వేదిక పైకి విసిరారు. స్పెషల్ పోలీసులు వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పాలకవర్గ సభ్యులకు రక్షణ కల్పించారు. అప్పటికీ శాంతించని రైతులు నాయకులంతా వేదిక దిగేవరకు కుర్చీలు, చెప్పులు, రాళ్లు విసిరి తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులపై కూడా రైతులు కుర్చీలు విసిరారు. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా రైతులకు చితక బాదారు. కొట్టొద్దంటూ కాళ్లావేళ్లా పడినా పట్టించుకోలేదు. లాఠీ దెబ్బలకు రైతులు పరుగులు తీయడంతో భయానక వాతావరణం నెలకొంది. చైర్మన్ను నిలదీసిన బలిరెడ్డి: వేదికపైకి వచ్చిన మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావును సైతం పోలీసులు అడ్డుకోవడంతో శాంతిమూర్తి అయిన ఆయన కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతు సభా? పోలీసుల సభా?అంటూ చైర్మన్ చేతిలోని మైకు లాక్కొని సభకు పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టారంటూ చైర్మన్ను ప్రశ్నించారు. వేలాదిగా సభ్య రైతులు రావడంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. చాలామంది బయటే ఉండిపోయారు. అడుగడునా పోలీసులు పహారాతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వేదికపై చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కెఎస్ఎన్ఎస్ రాజు, బూడిముత్యాలనాయుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతోపాటు పాలకవర్గ సభ్యులు ఎవరూ ప్రసంగించకుండానే సభ ముగిసిపోయింది. ఇటువంటి సంఘటన ఫ్యాక్టరీ చరిత్రలోనే మొదటిసారని సీనియర్ రైతులు అంటున్నారు. వైఎస్సార్సీపీ, అఖిలపక్షాల ఆందోళన: సభ జరగకుండా పోలీసులను, కొందరు సభ్యులు కానివారిని లోపలికి ముందస్తుగా రప్పించారని, ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న లోపాలను నిలదీసిన రైతులను లాఠీలతో కొట్టించారంటూ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, రైతు సంఘాలు బిఎన్రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశాయి. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఫ్యాక్టరీ వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేసిన వైఎస్సార్సీపీ నాయకులు అరెస్టును నిరశిస్తూ చోడవరం పోలీసు స్టేషన్ వద్ద అఖిలపక్షాల నాయకులు, రైతులు ధర్నాకు దిగారు. ఇది అధికార పార్టీ కుట్ర: రైతులకు మద్దతు నిలిచిన తమను అరెస్టు చేయడం అధికార పార్టీ అధికార దుర్వినియోగమేనని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మాడుగుల ఎమ్మెల్యే బూడిముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు, సీపీఎం కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, కాంగ్రెస్ నాయకుడు సీడీసీ చైర్మన్ దొండారాంబాబు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ దొండా కన్నబాబు ధ్వజమెత్తారు. పంచదారఅమ్మకాల్లో అవినీతికి పాల్పడటమే కాకుండా రైతుల సమస్యలు చర్చింకుండా సభ రసాభాస కావడానికి స్థానిక ఎమ్మెల్యే, ఫ్యాక్టరీ చైర్మనే కారణమని వారు ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి మహాజన సభను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విపక్షాల వల్లే గందరగోళం: ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడం వల్లే సభలో గందరగోళం నెలకొందని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. సభను సజావుగా నడిపి చైర్మన్ ప్రసంగం తర్వాత ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలనుకున్మాని, ఇంతలోనే రైతులు ఆందోళన చేయడం సరికాదన్నారు. ఈ క్రషింగ్ సీజన్లో టన్నుకు రూ.2375 మద్దతు ధర ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. -
‘గోవాడ’లో గోల్మాల్?
చోడవరం : గోవాడ చక్కెర మిల్లులో తడిసిన పంచదార అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి కాసులు కురిపించినట్టు చెప్పుకుంటున్నారు. సుమారు రూ.8కోట్లు మేర అవినీతి జరిగిందన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ కర్మాగారం గతేడాది వరకు లాభాల బాటలో పయనించింది. పాలకవర్గం నిర్లక్ష్యంతో గతేడాది ప్రారంభంలో క్వింటా రూ.2900 ధర ఉన్నప్పుడు పంచదార అమ్మకుండా గోడౌన్లలో నిల్వ ఉంచేశారు. సుమారు 5.2లక్షల క్వింటాళ్ల పంచదారను వడ్లపూడి, కశింకోటల్లోని ప్రైవేటు గోడౌన్లతోపాటు ఫ్యాక్టరీ గోడౌన్లలో నిల్వ చేశారు. ఇంతలో హుద్హుద్ ధాటికి గోడౌన్ల పైకప్పులు గతేడాది ఎగిరిపోయాయి. సుమారు 2.61లక్షల క్వింటాళ్ల పంచదార తడిసిపోయింది.దీనివల్ల రూ.80కోట్లు వరకు నష్టం వచ్చిందని పాలకవర్గం, యాజమాన్యం అప్పట్లో గగ్గోలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తడిసిన పంచదార అమ్మకం,బీమా పరిహారం పొందడంలో కొంత హైడ్రామా సాగినట్టు తెలిసింది. నష్టాల బూచిని చూపి పాలకవర్గం, యాజమాన్యం కుమ్మక్కయి రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫ్యాక్టరీకి చెందిన ఓ అధికారి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని తెలిసింది. కశింకోట సీడబ్ల్యూసీ గోడౌన్లలోని 1.19లక్షల క్వింటాళ్ల అమ్మకాల్లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నా యి. ఈ పంచదారకు యాజమాన్యం ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీకి పూర్తిగా ప్రీమియం చెల్లించకపోవడం, తర్వాత ఏదోలా పూర్తిసరకుకు బీమా వర్తించేలా తంటాలు పడినట్టు చెప్పుకుంటున్నారు. తడిసిన పంచదారను పరిశీలించేందుకు బీమా కంపెనీ అధికారులు రావడం, బస్తాలన్నింటినీ టెండరు ద్వారా అమ్మేసి, మిగతాది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు జోడించి నష్టపరిహారం ఇస్తామని వారు చెప్పడం జరిగింది. దీంతో ఫ్యాక్టరీకి గోనెలు సరఫరా చేస్తున్న హైదరాబాద్కు చెందిన గ్రీన్మింట్ ఇండియా అగ్రిటెక్ప్రైవేటు పేరున ఈ వ్యవహారంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారే బీమా టెండరు వేసి తర్వాత క్వింటా రూ.1070కి కోడ్ చేసి, టెండరును దక్కించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎకాయెకిన యా జమాన్యం, పాలకవర్గంలో మెజార్టీ సభ్యులు ఏకమై మధ్యంతరంగా తీర్మానించి పంచదారను వివిధ ధరలకు బహిరంగమార్కెట్లో విక్రయించినట్టు తెలిసింది. ఈక్రమంలో సుమారు రూ.8కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పేరున వేసిన టెండరు మేరకు సరకు అప్పగించాలని సంబంధిత కంపెనీ యజమాని ఇన్సూరెన్సు సంస్ధకు కోర్టు నోటీసులు కూడా పంపినట్టు తెలిసింది. కాగా అక్రమాల విషయం ఎక్కడ బయటపడుతుందోనని బీమా పరిహా రం రూ.4కోట్లు వద్దంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు ఇందులో కీలకపాత్రవహిస్తున్న వారు నానా తంటాలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement