-
బాలికపై అత్యాచారం కేసు..
సోన్భద్ర: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్దులార్ గోండ్కు ప్రత్యేక న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో, శాసనసభ సభ్యత్వానికి ఆయన అర్హత కోల్పోనున్నారు. తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. సోన్భద్ర అడిషనల్ జడ్జి, ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సెషన్ జడ్జి అహ్సానుల్లా ఖాన్ తాజాగా తీర్పు వెలువరించారు. జరిమానా మొత్తాన్ని బాధితురాలి కుటుంబ సంక్షేమం కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో రామ్దులార్ గోండ్ భార్య గ్రామ సర్పంచిగా ఉన్నారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు మియోర్పూర్ పోలీస్ స్టేషన్లో గోండ్పై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మొదట్లో పోక్సో ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగింది. బీజేపీ తరఫున గోండ్ దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యాక ఈ కేసు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది. -
ఉజ్జయిని కేసులో వారిపై కూడా చట్టపరమైన చర్యలు: ఏఎస్పీ
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ సంఘటనలో నిందితుడిని కనుగొనేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించారని తెలిపారు ఉజ్జయిని అడిషనల్ సూపెరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ సింగ్ రాథోడ్. ఈ సందర్భగా సంఘటన జరిగిన తర్వాత బాధితురాలు అన్ని ఇళ్లు తిరుగుతూ సహాయం కోరినప్పుడు సాయం చేయడానికి నిరాకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. శభాష్ పోలీస్.. ఉజ్జయిని ఏఎస్పీ జయంత్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినప్పుడు తామంతా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన కార్యక్రమంలో బిజీగా ఉన్నామని వీడియో బయటకు రాగానే షాక్కు గురయ్యామన్నారు. విషయం తెలిసిన వెంటనే మొదట ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించామని అనంతరం విచారణ చేపట్టి సుమారు 700 సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించి భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్ను నిందితుడిగా గుర్తించామన్నారు. దాదాపు 30-35 మంది పోలీసులు నిద్రాహారాలు మాని ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారని వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. బాధ్యతారాహిత్యం.. సంఘటన జరిగిన తర్వాత ఆమె మరో ఆటోలో కొంతదూరం ప్రయాణించిందని.. ఆ ఆటో డ్రైవర్ రాకేష్ మాలవ్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడం వలన విషయం తెలిసేసరికి ఆలస్యమైందన్నారు. పోక్సో చట్టం ప్రకారం రాకేష్ చేసింది కూడా నేరమేనని అందుకే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాలిక ఒక్కో ఇల్లు తిరుగుతూ సాయమడిగినా ఎవ్వరూ స్పందించకపోవడంపై స్పందిస్తూ మానవతా కోణంలో వారు చేసింది తప్పేనని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరణశిక్ష విధించండి.. ఈ కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ భరత్ సోనీ తండ్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ తన కుమారుడు తప్పు చేసినట్లు నిరూపితమైతే మరణశిక్ష విధించామని అంతకంటే పెద్ద శిక్ష మరొకటి లేదు కాబట్టి అదే అమలు చేయాలన్నారు. ఈ కేసును ఛేదించిన ఉజ్జయిని మహాకాల్ ఎస్సై అజయ్ వర్మ వారి బంధువులకు అభ్యంతరం లేకపోతే బాలికను దత్తత తీసుకుంటానని ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు. ఇది కూడా చదవండి: గ్యాంగ్స్టర్ సునీల్ నాహక్ హత్య -
ఏపీ-టీఎస్: చిన్నారులపై వరుస అత్యాచారాలు
సాక్షి, హైదరాబాద్: చాక్లెట్లు కొనిపెడతానంటూ చిన్నారి పాపను తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడో వృద్ధుడు... బాలికను గర్భవతిని చేశాడు మరో ముసలోడు... నాలుగు నెలలుగా విద్యార్థినిపై అఘాయిత్యం జరుపుతూ పట్టుపబడ్డాడో ట్యూషన్ టీచర్! తెలుగు రాష్ట్రాల్లో ఒక్క శనివారం రోజే మధ్యాహ్నం వరకు రిపోర్ట్ అయిన కీచకపర్వాలివి. రాత్రికి వరకు ఇంకా ఎన్ని జరుగుతాయో, అసలు వెలుగులోకి రాకుండాపోయే ఘటనలెన్నో!! దాచేపల్లిలో మరో దారుణం: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో దారుణం వెలుగుచూసింది. 55 ఏళ్ల వృద్ధుడు కొద్దిరోజులుగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇంట్లోవాళ్లకు చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించేవాడు. ఇటీవలే పాప ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో ఆమె గర్భవతని తేలింది. భయంతో వణికిపోయిన పాప.. తనపై జరిగిన అకృత్యాన్ని చెప్పేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు నిందితుడు మహబూబ్వలీపై పోలీసులు కేసు నమోదుచేశారు. చిన్నారిపై అఘాయిత్యం.. బియ్యం ఇచ్చే యత్నం: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఐదేళ్ల చిన్నారిపై గురుస్వామి అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యం జరుపబోగా.. చిన్నారి నానమ్మ గమనించింది. చేసినతప్పుకు ప్రతిగా ఐదు కేజీల బియ్యం ఇచ్చి తప్పించుకోవాలని చూశాడా కీచకుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు గురుస్వామిని అదుపులోకి తీసుకున్నారు. మీర్పేట్లో విద్యార్థినిపై ట్యూటర్: హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లెనిన్ నగర్లో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల విద్యార్థినిపై ఆమెకు పాఠాలు చెప్పే ట్యూటర్ గోపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో బాలికను తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ట్యూటర్ గోపి.. గడిచిన నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
అత్యాచారం, వేధింపులు.. వ్యాపారి అరెస్ట్
అగర్తలా: కఠిన చట్టాలు చేస్తూ నిందితులకు శిక్షలు వేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా త్రిపురలో ఇలాంటి కీచక ఘటన వెలుగుచూసింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు వ్యాపారవేత్త, బీజేపీ మద్దతుదారుడు మనోజ్ డెబ్(54)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలిలా.. త్రిపుర ఖోవాయి జిల్లా తెలియమురాకు చెందిన మనోజ్ డెబ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. బీజేపీ నేతగా ప్రచారం చేసుకునే ఈ నిందితుడు ఛంప్లాయ్లోని తన ఫామ్హౌస్లో బాలిక(14)పై ఈ ఏడాది ఫిబ్రవరి 11న తొలిసారి అత్యాచారం చేశాడు. ఆపై ఆ కీచకపర్వాన్ని అలాగే కొనసాగించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు బాధితురాలిపై లైంగికదాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో బాలిక పేర్కొంది. గతవారం మళ్లీ ఫామ్హౌస్కు రావాలని నిందితుడు మనోజ్ కోరగా.. బాలిక తన స్నేహితురాలికి విషయం చెప్పింది. బిషాల్గఢ్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫ్రెండ్ సూచించగా.. ధైర్యం తెచ్చుకుని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఖోవాయి ఎస్పీ క్రిష్ణేందు చక్రవర్తి మాట్లాడుతూ.. నిందితుడు మనోజ్ డెబ్కు తెలియమురాలో పెద్ద వ్యాపారవేత్త అని, కేసును ప్రభావితం చేయగల వ్యక్తి కూడా అని తెలిపారు. బాలిక ఫిర్యాదు చేయగా అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. -
ఇదీ సోషల్ మీడియా చేసిన 'న్యాయం'
సాక్షి, న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ జిల్లా నాంగో మిషిమి గ్రామంలో ఫిబ్రవరి 12వ తేదీన ఐదేళ్ల పాప అదశ్యమైంది. వారం రోజుల తర్వాత తల నుంచి వేరైన ఆ పాప మొండెం ఆ పాప ఇంటికి 300 మీటర్ల దూరంలోని తేయాకు తోటలో దొరికింది. పాపను రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి ఆ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అదే రోజు అంటే ఫిబ్రవరి 18, ఆదివారం రోజు సాయంత్రం సంజయ్ సోబర్ అనే 30 ఏళ్ల యువకుడిని, జగదీష్ లోహర్ అనే పాతికేళ్ల యువకుడిని పోలీసులు నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారిని జిల్లా కేంద్రమైన తేజు పట్టణంలోని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. నిందితులు ఇద్దరు తేయాకు తోటల్లో పనిచేయడానికి వలస వచ్చిన వాళ్లు. సోబర్ అనే యువకుడు ఆ పాపను రేప్ చేసినట్లు లోహర్ అనే యువకుడు వాంగ్మూలం ఇచ్చినట్లు ఆ మరుసటి రోజు, అంటే సోమవారం సోషల్ మీడియా ద్వారా జిల్లా అంతటా పాకింది. మధ్యాహ్నానికి ఇనుప రాడ్లు, కర్రలు, సుత్తెలు పట్టుకొని దాదాపు 1500 మంది ప్రజలు పోలీసు స్టేషన్ను చుట్టుముట్టారు. రేపిస్టులను తమకు అప్పగించాల్సిందిగా డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు అప్పగించక పోవడంతో పోలీసు స్టేషన్పై దాడిచేసి లాకప్ తాళాన్ని పగులగొట్టి ప్రజలు నిందితులను పట్టుకెళ్లారు. పట్టణంలో వారిని కొట్టుకుంటూ, తన్నుకుంటూ తిప్పారు. చివరకు నిందితులిద్దరు చనిపోయారు. వారి భౌతిక దేహాలను తగులబెట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ మత్యుదండన సీన్లను కూడా సోషల్ మీడియా విపరీతంగా షేర్ చేసుకొంది. 'ఇది మూకుమ్మడి న్యాయం....ప్రజల తీర్పు.....ప్రజల న్యాయం.....రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి ప్రజలిచ్చిన బహుమతి' అంటూ పలువురు మెచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ మాత్రం చాలా బాధ్యతాయుతంగా స్పందించారు. 'రాజ్యాంగానికి, చట్టానికి నిబద్ధతతో కట్టుబడే గొప్ప దేశానికి మనం పౌరులం. చట్టాన్ని చేతుల్లోకి మనం తీసుకోవడాన్ని మన దేశం అనుమతించదు. అందుకు పోలీసు యంత్రాంగం, న్యాయవ్యవస్థలు ఉన్నాయి. ఆ రెండు వ్యవస్థలను మనం గౌరవించాలి' అని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలు ఈ సంఘటనపై ఇంతవరకు స్పందించలేదు. అంతర్జాతీయ ఆమ్నెస్టీ సంఘం మాత్రం ఖండించింది. 'భారత దేశంలో బాలికలు, మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస అంతా, ఇంతా కాదు. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. అంతమాత్రాన ప్రజలు హింసకు పాల్పడరాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. చట్టాలను గౌరవించాల్సిందే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రేపిస్టులను చంపిన వారిని కూడా చట్టం ప్రకారం శిక్షించాల్సిందే' అని పౌర హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడే అంతర్జాతీయ ఆమ్నెస్టీ సంఘం వ్యాఖ్యానించింది. ప్రజలు ఇంతగా ఆగ్రహానికి గురికావడానికి కారణం అస్సాంలో రేప్లు ఎక్కువగా జరుగుతుండడం, వాటిల్లో నేరస్థులకు సరిగ్గా శిక్షలు పడక పోవడం కారణమని కొందరు విజ్ఞులు వాదిస్తున్నారు. రాష్ట్రంలో 2015 నుంచి 2017, నవంబర్ నెల వరకు 225 రేప్ కేసులు నమోదయ్యాయి. ఒక్క 2016లోనే 91 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో నెలలు, నెలలు గడుస్తున్నా నిందితుల అరెస్ట్లు కూడా జరుగలేదు. రాష్ట్ర రాజధాని ఇటా నగర్కు సమీపంలో గత ఆగస్టు నెలలో ఓ యూనివర్శిటీ విద్యార్థిని శవం దొరికింది. ఆమెను రేప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఇంతవరకు ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇదే ఫిబ్రవరి కేసులో రెండు రేప్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీన సియాంగ్ జిల్లాలోని యింకియాంగ్లో ఐదేళ్ల బాలికను ఆమెకు పాఠాలు చెప్పే టీచరే రేప్ చేసినట్లు కేసు నమోదయింది. 14వ తేదీన సుభాన్సిరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికను రేప్ చేశారు. ఈ సంఘటనలో 23 ఏళ్ల ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రజలే పట్టుకొని ఊరంతా తిప్పి పోలీసులకు అప్పగించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
గుట్టుచప్పడు కాకుండా ‘గోకులం’ డ్రామా
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement