-
జీవిత రాజశేఖర్ మహానటి, నోరు అదుపులో పెట్టుకో: నిర్మాతలు
సాక్షి, తిరుపతి: గరుడ వేగ సినిమా వివాదం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో జీవిత రాజశేఖర్ ఈ అంశంపై మాట్లాడుతూ గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించింది. తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని సూచించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. వారు సాక్షితో మాట్లాడుతూ.. 'జీవిత రాజశేఖర్ ఒక మహానటి. ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ప్రజలను అబద్ధాలతో, పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారు. మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్నారు. కానీ నిన్న మా గురించి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడారు. మేము పరువుగల కుటుంబం నుంచి వచ్చాము. జీవిత రాజశేఖర్ నోరు అదుపులో పెట్టుకో. సెలబ్రిటీలకు ఒక లైఫ్, సామాన్యులకు ఒక లైఫ్ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది. జీవిత రాజశేఖర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము. కోర్టులో మేము విజయం సాధిస్తాం' అని కోటేశ్వరరాజు, హేమ పేర్కొన్నారు. చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? -
మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా?
వరుణ్తేజ్ పక్కా ప్లానింగ్తో దూసుకుపోతున్నడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో దర్శకత్వంలో గని మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాక్సర్గా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ గ్యాప్లోనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా తెరెకెక్కుతున్న ఈ మూవీతో మరోసారి బాక్సీఫీస్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్లో వరుణ్ మరో మూవీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘గరుడవేగా’తో ఇండస్ట్రీ హిట్ను అందుకున్న ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి వరుణ్ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేసినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమా కథ ప్రకారం చిత్ర షూటింగ్ మొత్తం లండన్లోనే జరగనున్నట్లు సమాచారం. దీంతో పరిస్థితులు కొంచెం సద్దుమణిగాక ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే వరుణ్తో ప్రాజెక్టు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చదవండి : దూకుడు పెంచిన నాగ చైతన్య.. ఆ హిట్ డైరెక్టర్తో నెక్స్ట్ సినిమా మరోసారి జంటగా నటించనున్న వరుణ్తేజ్, సాయిపల్లవి ? -
‘కల్కి’కి భారీ ఆఫర్స్!
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ 40 శాతం ఎక్కువగా ఆఫర్ చేసిన ప్రముఖ నిర్మాత సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారట. అంతేకాదు శాటిలైట్ రైట్స్ విషయంలోనూ మూడు బడా చానల్స్ పోటి పడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లాభాలు తెచ్చి పెట్టిన కల్కి, రిలీజ్ తరువాత ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. -
రేపే ‘కల్కి’ టీజర్
‘గరుడవేగ’ హిట్తో మళ్లీ సక్సెస్ను అందుకున్న యాంగ్రీమెన్ రాజశేఖర్.. తన తదుపరి ప్రాజెక్ట్ల విషయంలో జాగ్రత్త వహించారు. అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సంబంధించి ఓ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. మోషన్ పోస్టర్స్తోనే సినిమాపై హైప్ను క్రియేట్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. రేపు (ఏప్రిల్ 10) ఉదయం 10:10:10 (పది గంటల పది నిమిషాల పది సెకన్ల)కు మూవీ టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. Now amidst all the chaos.. Kalki teaser will be out tomorrow. Hope you guys will love it. April 10th at 10hr 10min 10sec. #KalkiTeaser @PrasanthVarma @eyrahul @adah_sharma @Nanditasweta @ProducerCKalyan pic.twitter.com/FXhqrcRObk — Dr.Rajasekhar (@ActorRajasekhar) April 9, 2019 -
ఎనిమిదేళ్ల తరువాత ‘అర్జున’ విడుదల
గరుడవేగ సినిమా యాంగ్రీ హీరో రాజశేఖర్కు పూర్వ వైభవం తీసుకువచ్చిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ఈ సినిమా తరువాత రాజశేఖర్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అంతేకాదు గతంలో రాజశేఖర్ హీరోగా ప్రారంభమై ఆగిపోయిన సినిమాలకు కూడా ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. 2011లొ రాజశేఖర్ హీరోగా అర్జున సినిమాను ప్రారంభించారు. తరువాత ఏమైందో కాని ఈ సినిమా ఊసే లేదు. ఏళ్లు గడిచిపోయాయి. రాజశేఖర్ ఇతర చిత్రాలతో బిజీ అయ్యాడు. సడన్గా ఇప్పుడు అర్జున తెర మీదకు వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇదే జోరులో రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన పట్టపగలు సినిమా కూడా రిలీజ్ అవుతుందేమో చూడాలి. కన్మణి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అర్జున’ సినిమాలో మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందించారు. రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement