-
ప్రాణం తీసిన పంచాయితీ తీర్పు
తరిగొప్పుల: పల్లెల్లో పెద్ద మనుషులు ఇచ్చే తీర్పులు మనుషుల ప్రా ణాలు బలికొంటున్నా యి. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం వాల్యా తండాకు చెందిన బానోతు రాజు (22), అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో వారి కోసం సదరు వివాహిత భర్త, బంధువులు వెతకగా.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్లో దొరికారు. అనంతరం గ్రామంలో పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా రూ.20 లక్షలు సదరు వివాహిత భర్తకు రాజు చెల్లించేలా తీర్మానించారు. దీంతో మనస్తాపం చెందిన రాజు.. అదేరోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
బయటపడుతున్న ట్రంప్ అక్రమ సంబంధాలు!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాహేతర సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ ట్రంప్పై దావా వేయగా.. ఇప్పుడు మరో మాజీ మోడల్ ఆయనపై కోర్టుకు ఎక్కింది. ట్రంప్తో తనకు ఎఫైర్ ఉందని, ఈ వ్యవహారంపై నోరు మెదపకుండా ఉండేందుకు చేసుకున్న లీగల్ ఒప్పందం నుంచి తనకు విముక్తి కల్పించాలని ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్డౌగల్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ట్రంప్తో ఎఫైర్ గురించి బయటకు వెల్లడించవద్దంటూ నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికన్ మీడియా ఇంక్ 2016లో తనకు లక్ష 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో పేర్కొన్నారు. ఈ మీడియా సంస్థ అధిపతి డేవిడ్ పెకర్ గతంలో ట్రంప్ తన వ్యక్తిగత స్నేహితుడని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్తో మెక్డౌగల్ ఎఫైర్ గురించి కథనాన్ని ప్రచురించే హక్కులను ఆమె నుంచి అమెరికన్ మీడియా సంస్థ కొనుగోలు చేసినప్పటికీ.. అది ఇప్పటివరకు ప్రచురించలేదని న్యూయార్కర్ మ్యాగజీన్ గత నెల వెల్లడించింది. ఈ నేపథ్యంలో మెక్ డౌగల్ ట్రంప్పై దావా వేయడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్ ఇద్దరు మహిళల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. ట్రంప్తో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని, వీటి గురించి బయటకు వెల్లడించవద్దంటూ ట్రంప్ లాయర్ తనతో ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందం నుంచి తనకు విముక్తి కల్పించాలని పోర్న్స్టార్ స్టార్మీ డానియెల్ కేసు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ ఆధ్వర్యంలో నడిచిన రియాలిటీ షో ‘అప్రెంటిస్’ కంటెస్టెంట్ అయిన సమ్మర్ జెరోస్ కూడా ఆయనపై దావా వేశారు. ఈ షోలో పాల్గొంటున్న సమయంలో ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ట్రంప్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యూయార్క్ స్టేట్ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాజా కేసు వెలుగుచూడటం అధ్యక్షుడిగా మరో ఎదురుదెబ్బగా మారింది. 10 నెలలపాటు... 2006-07 మధ్యకాలంలో పది నెలలపాటు ట్రంప్ తనతో ‘వివాహేతర ప్రణయ సంబంధాన్ని’ కొనసాగించాడని మెక్డౌగల్ దావాలో పేర్కొన్నారు. ఈ సమయంలోనే ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్తో కూడా ఎఫైర్ నడిపించారు. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా గర్భవతిగా ఉండి.. తమ చిన్న కొడుకు బ్యారన్కు జన్మనిచ్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తన లాయర్ కీత్ డేవిడ్సన్తో.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ రహస్యంగా సంప్రదింపులు జరిపారని ఆమె తెలిపారు. స్టార్మీ డానియెల్తోనూ ఇదేవిధంగా సంప్రదింపులు జరిపి.. ఆమె ఈ బాగోతాన్ని బయటపెట్టకుండా చెల్లింపులు జరిపినట్టు కోహెన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ట్రంప్పై న్యాయపోరాటం చేస్తున్న ముగ్గురు మహిళలు సమ్మర్ జెరోస్.. పోర్న్స్టార్ స్టార్మీ డానియెల్ ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్డౌగల్ -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
షాద్నగర్: నిత్యం తాగి వేధింపులకు గురిచేస్తుండటంతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలసి పథకం పన్ని కట్టుకున్న భర్తను హతమార్చిన కేసులో నిందితులను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు షాద్నగర్ పోలీస్స్టేషన్లో ఏసీపీ శ్రీనివాస్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం వీరంపల్లి గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. తాగుడుకు బానిసైన ఆంజనేయులు నిత్యం తన భార్య లక్ష్మిని వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన కావలి హన్మంతుతో అక్రమ సంబంధం పెట్టుకున్న లక్ష్మి భర్తను కడతేర్చాలని పథకం పన్నింది. ఆర్మీ జవాన్గా పని చేస్తున్న హన్మంతుతో లక్ష్మి విషయాన్ని చెప్పడంతో విధులకు సెలవు పెట్టి హన్మంతు జూన్14న హైదరాబాద్కు చేరుకున్నాడు. అనంతరం లక్ష్మి భర్త ఆంజనేయులుకు ఫోన్ చేసి వెంటనే గ్రామానికి వెళ్లే పని ఉందని ఆటో తీసుకురావాలని చెప్పాడు. తాగుడుకు బానిసైన ఆంజనేయులు హైదరాబాద్ నుంచి ఆటోలో హన్మంతుతో కలసి రాత్రి 11 గంటలకు గ్రామానికి బయలుదేరాడు. పథకం ప్రకారం ఆంజనేయులును కడతేర్చాలని వచ్చిన హన్మంతు ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామ సరిహద్దులోనికి చేరుకోగానే ఆటోను నిలిపి తన వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించి బయలు దేరుదామని చెప్పాడు. దీంతో అక్కడే ఆటో నిలిపి వేసి మద్యం సేవించిన అనంతరం మత్తులో ఉన్న ఆంజనేయులును బూటు కాల్లతో తన్ని , గొంతు నులిమి హత్య చేసి హన్మంతు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు షాద్నగర్ సీఐ శ్రీనివాసచారి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపగా అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి భార్య లక్ష్మితో పాటు, కావలి హన్మంతును విచారించారు. ఈ మేరకు నిందితులు చేసిన తప్పును అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో చురకుగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పట్టణ సీఐ శ్రీనివాస చారితో పాటు ఐడి పార్టీ సిబ్బంది అబ్దుల్లా, వెంకటేష్, శేఖర్, రవికుమార్, గురు ప్రసాద్, నవీన్కుమార్, శివకుమార్లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో షాద్నగర్ ఎస్ఐ దాసు, ఐడి పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
శ్రీకాకుళం సిటీ: ఎచ్చెర్ల మండలంలో ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు చాకచక్యంతో చేధించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. ఎచ్చెర్ల మండలం దారపువానిపేటకు చెందిన బోర రాములమ్మతో అదే గ్రామానికి చెందిన సుగంధి లక్ష్మణరావు నాలుగు నెలల నంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. వారిద్దరి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా దీన్ని గుర్తించామన్నారు. రాములమ్మ తనను ఎక్కడికైనా తీసుకువెళ్లి వేరే కాపురం పెట్టమని లక్ష్మణరావును వేధించడంతో విరక్తి చెందిన లక్ష్మణరావు ఎలాగైనా రాములమ్మను చంపేయాలని పథకం పన్నినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 14న సాయంత్రం రాముల్మను జీడిమామిడి తోట వద్దకు రమ్మని చెప్పి పథకం ప్రకారం ఆమెపై లక్ష్మణరావు దాడి చేశాడని తెలిపారు. కర్రతో తలపై కొట్టడమే కాకుండా ఆమె మెడపై కర్రను అణిచివేయడంతో మృతి చెందినట్టు ఎస్పీ వివరించారు. బంగారు ఆభరణాలు స్వాధీనం రాములమ్మ చనిపోయిందని నిర్ధారణకు వచ్చాక ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను లక్ష్మణరావు తీసుకుపోయాడని ఎస్పీ చెప్పారు. వీటిలో రెండు తులాల బంగారు పుస్తెలతాడు, రెండు పుస్తెలు, రెండు బుట్టల బంగారు ఆభరణాలను ఓ పశువుల శాలలో దాచి పెట్టినట్లు నేర పరిశోధనలో ముద్దాయి లక్ష్మణరావు ఒప్పుకున్నాడని చెప్పారు. అలాగే రాములమ్మపై దాడి చేసిన కర్రను పక్కనే ఉన్న చిన్నపాటి చెరువులో పడేసాడన్నారు. మూడు తులాల బంగారు ఆభరణాలతో పాటు పర్సు, కర్ర, రెండు మొబైల్ ఫోన్ల చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. భర్తకు దూరంగా ఉన్న రాములమ్మ ఇద్దరు పిల్లలతో కలసి పుట్టింట్లోనే గత కొన్నేళ్లుగా నివాసం ఉంటోందన్నారు. పోలీసులకు అభినందన ఇది మర్డర్ ఫర్ గెయిన్ కేసుగా ఎస్పీ బ్రహ్మారెడ్డిగా పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఈ కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ కె.భార్గవరావునాయుడు, ఎచ్చెర్ల సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు సీహెచ్ రామారావు, వి.సందీప్కుమార్ పాల్గొన్నారు. -
'ఆమె వివాహేతర సంబంధమే అసలు విషయం'
తన తదుపరి చిత్రం 'రుస్తుం' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో అక్షయ్ కుమార్. క్రైమ్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ తొలిసారి నేవల్ ఆఫీసర్గా కనిపించనున్నారు.నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో భార్య ప్రియుడిని చంపే వ్యక్తిగా అక్షయ్ నటిస్తున్నారు. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ.. సాధారణంగా హిందీ సినిమాల్లో భర్త వివాహేతర సంబంధం కలిగి ఉంటాడు, చివరికి తన తప్పు తెలుసుకున్నాక భార్య అతడిని క్షమిస్తుంది, అంగీకరిస్తుంది. తిరిగి వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు. కానీ ఈ కథలో అలా కాదు. భార్యే వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటుంది, భర్త క్షమాపణలు కోరుతుంది.. ఆ భర్త క్షమించాడా లేదా అన్నది తెర మీద చూడాల్సిన కథ అన్నారు. భార్య వివాహేతర సంబంధమే కథకు కీలకమైన పాయింట్ అని తెలిపారు. ఈ సినిమాలో అక్షయ్ భార్యగా ఇలియానా నటిస్తున్నారు. తొలిసారి ఇంత వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నందుకు ఈ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి నౌకాదళ అధికారిగా నటిస్తున్న అక్షయ్.. పాత్రకు సంబంధించి ఎలాంటి శిక్షణ తీసుకోలేదని చెబుతున్నారు. ప్రత్యేకించి నౌకాదళ ఆఫీసర్లను కలవడంగానీ, పుస్తకాలను చదవడంలాంటివేమీ చేయలేదట. ఓ అధికారి మాత్రం సెల్యూట్ ఎలా చేయాలి, బ్యాడ్జెస్ ఎలా ధరించాలి అనే విషయాల్లో ఆయన్ను గైడ్ చేసినట్లు తెలిపారు. ఆ యూనిఫామ్ వేస్కున్న తరువాత మాత్రం తెలీకుండానే బాధ్యతగా ఫీలయ్యానని, అధికార దర్పం తెలిసిందని అంటున్నారు. ఆ యూనిఫామ్ ధరించేవారిని చూస్తుంటే తనకిప్పుడు అసూయగా ఉందని చెప్పారు ఎయిర్ లిఫ్ట్ స్టార్ అక్షయ్ కుమార్. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన రుస్తుం ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఇలియానా మరోసారి బాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకోనుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement