-
రూ. 9 కోట్ల సంపాదనకు సగటు భారతీయుడికి ఎన్నేళ్లు పడుతుందంటే..
ఒక మిలియన్ యూరోలు సంపాదించడానికి భారత్లోని సగటు జీతగాడికి ఎంత సమయం పడుతుంది? ఇంతకీ మిలియన్ యూరోలు అంటే ఎంతో చెప్పలేదు కదూ.. రూ. 9.09 కోట్లు.. ఈ లెక్కన భారతీయులకు 158 ఏళ్లు పడుతుందట! 30 ఏళ్లు సర్వీసు వేసుకున్నా.. ఐదు జీవితకాలాలు అన్నమాట. మన పరిస్థితి ఇలా ఉంటే.. పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. అక్కడైతే.. ఏకంగా 664 ఏళ్లు పడుతుందట. ప్రపంచంలో అత్యంత తక్కువగా స్విట్జర్లాండ్ వాసులకు ఇందు కోసం కేవలం 15 ఏళ్లే పడుతోంది. మన దేశవాసుల సగటు జీతం రూ.48 వేలు కాగా.. స్విట్జర్లాండ్లో అది రూ.5 లక్షలు. ఆయా దేశాల్లోని ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. మరి ఓసారి ఇందులో టాప్–5.. లీస్ట్ 5 జాబితాన్ని చూసేద్దామా.. చదవండి: 18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..! -
ప్రధాని రాజీనామా దెబ్బ: 20ఏళ్ల కనిష్టానికి యూరో
రోమ్ : ఇటలీలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభం దేశ కరెన్సీపై భారీగా పడింది. ఇటలీ రాజ్యాంగ సవరణలపై రెఫరండం వైఫల్యం నేపథ్యంలో యూరో భారీగా పతనమైంది. దాదాపు20 సం.రాల కనిష్టానికి చేరింది. ఇటలీ ప్రధాన మంత్రి మాటియో రెంజి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన అనంతరం ఈ పతనం నమోదైంది. ప్రధాని మాటియో రెంజీ ప్రతిపాదించిన రాజ్యాంగ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇటలీ పార్లమెంట్ ఓటు వేసింది. దీంతో ప్రధాని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. డాలరుతో మారకంలో యూరో 20 ఏళ్ల కనిష్టం 1.05ను తాకింది. ఇప్పటికే యూరోజోన్ నుంచి వైదొలగేందుకు బ్రిటన్ నిర్ణయించుకున్న(బ్రెగ్జిట్) సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూరోజోన్ ముక్కలయ్యే పరిస్థితులు నెలకొంటున్నట్లు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అటు న్యూ జిలాండ్ ప్రధాని జాన్ కీ అనూహ్య రాజీనామా ప్రభావం అక్కడి మార్కెట్లపై పడింది. డాలర్ మాకరపు విలువలో న్యూజిలాండ్ కరెన్సీ 0.8 శాతం క్షీణించింది. సూచీలు దాదాపు 0.6 శాతం తక్కువ నష్టపోయాయి. రాజకీయాలనుంచి తప్పుకోడానికి ఇది సరైన సమయమని జాన్ వ్యాఖ్యానించారు. కాగా డెమోక్రటిక్ పార్టీ ప్రధాని మాటెవో రెంజీ తలపెట్టిన రిఫరెండానికి ప్రజలు వ్యతిరేకించారు. లక్షలమంది కార్మికులు, ప్రజలు రెఫరండానికి వ్యతిరేకంగా గతంలో ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ సంస్కరణలను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రోమ్లో అమెరికా రాయబారి బహిరంగంగానే సమర్ధించారు. ఒకవేళ సంస్కరణలకు 'నో' చెబితే పెట్టుబడులను నిలిపివేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. -
కల నెరవేరేనా...
పోర్చుగల్... తమ చరిత్రలో ఎప్పుడూ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవని జట్టు. స్టార్ ఆటగాడు రొనాల్డో సూపర్ ప్రదర్శనతో ఈసారి ఫైనల్కు వచ్చింది. ఇప్పుడు గెలవకపోతే మళ్లీ గెలవలేమనే కసితో బరిలోకి దిగుతోంది. ఫ్రాన్స్... ఈసారి యూరో గెలిస్తే మూడుసార్లు గెలిచిన జట్టుగా జర్మనీ, స్పెయిన్ల సరసన నిలుస్తుంది. సొంతగడ్డపై అభిమానులను నిరాశపరచకూడదనే పట్టుదలతో ఆడబోతోంది. మరి ఎవరి కల నెరవేరుతుంది..? యూరో ఫైనల్ నేడు ⇒ తొలి టైటిల్పై పోర్చుగల్ గురి ⇒ రికార్డు కోసం ఫ్రాన్స్ ఆరాటం ⇒ రొనాల్డో, గ్రిజ్మన్లపైనే దృష్టి రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం పారిస్: యూరోపియన్ చాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అభిమానులను అలరించిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు నేడు (ఆదివారం) జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో కొత్త స్టార్గా అవతరించిన ఆంటోనీ గ్రిజ్మన్ (ఫ్రాన్స్)తో పాటు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)ల సత్తాకు ఈ మ్యాచ్ అసలైన పరీక్ష కానుంది. సొంత ప్రేక్షకుల మద్దతుతో తమ జట్టును మరోసారి చాంపియన్గా నిలపాలని గ్రిజ్మన్ భావిస్తున్నాడు. మరోవైపు పోర్చుగల్కు మేజర్ టైటిల్ లేని లోటును తీర్చాలనే కసితో రొనాల్డో ఉన్నాడు. 2004లో స్వదేశంలోనే జరిగిన యూరో కప్ ఫైనల్లో గ్రీస్ చేతిలో 0-1తో పోర్చుగల్ ఓడిపోయింది. అప్పుడు 19 ఏళ్ల రొనాల్డో జట్టు ఓటమికి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఇక ఫ్రాన్స్ జట్టు 1984, 2000లో యూరో కప్లో విజేతగా నిలిచింది. అయితే ఈ రెండు సార్లు సెమీస్లో పోర్చుగల్ను ఓడించే తుది పోరుకు చేరింది. ఇది ఈ జట్టుకు మూడో ఫైనల్. చివరిసారి ఈ రెండు జట్లు 2006 ప్రపంచకప్ సెమీస్లో తలపడగా జిదానే ఏకైక గోల్తో ఫ్రాన్స్ గెలిచింది. 1975లో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్లో ఫ్రాన్స్పై నెగ్గిన పోర్చుగల్ ఆ తర్వాత త లపడిన 10 సార్లు పరాజయమే ఎదుర్కొంది. పటిష్టంగా ఫ్రాన్స్: ప్రత్యర్థితో పోలిస్తే ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్లతో పైచేయిలో ఉంది. గోల్డెన్ బూట్ రేసులో ఆరు గోల్స్తో అందరికన్నా ముందున్న గ్రిజ్మన్ మరోసారి కీలకం కానున్నాడు. అతడితో పాటు ఫార్వర్డ్ గిరౌడ్, మిడ్ఫీల్డర్లు పయెట్, పోగ్బా ప్రత్యర్థి ఆటగాళ్లను వణికిస్తున్నారు. పోరాటమే ధ్యేయంగా..: రొనాల్డో ఇప్పటిదాకా ఫ్రాన్స్ జట్టుపై విజయం రుచి చూడలేదు. సెమీస్లో వేల్స్పై అత్యద్భుత ఆటను చూపెట్టి ఫామ్లో ఉన్న అతడిపైనే జట్టు ఆశలున్నాయి. నాని తనకు సహకారం అందిస్తే ఫ్రాన్స్కు ఇబ్బందులు తప్పవు. -
వేల్స్ కొత్త చరిత్ర
లిల్లీ: యూరో కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో సంచలనం నమోదైంది. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ బెల్జియం ఇంటిముఖం పట్టింది. అమీతుమీ తేల్చుకోవాల్సిన పోరులో పసికూన వేల్స్ 3-1 తేడాతో బెల్జియంను బోల్తా కొట్టించి సెమీస్ కు చేరింది. తద్వారా ఓ ప్రధాన టోర్నీలో తొలిసారి సెమీస్ కు చేరి కొత్త చరిత్ర సృష్టించింది. ఆట 13వ నిమిషంలో బెల్జియంకు రాద్జా తొలి గోల్ ను అందించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.ఈడెన్ హజార్డ్ నుంచి పాస్ ను అందుకున్న రాద్జా గోల్ గా మలచాడు. కాగా, ఆట 30వ నిమిషంలో వేల్స్ ఆటగాడు ఆష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు.ఇక ఆ తర్వాత రెచ్చిపోయిన వేల్స్..పటిష్టమైన బెల్జియం ఎటాక్ ను నిలువరించడమే కాకుండా, మరో రెండు గోల్స్ నమోదు చేసి అద్భుతమైన విక్టరీ సాధించింది. ఆట 55వ నిమిషంలో హాల్ రాబ్సన్ కాను, 85వ నిమిషంలో శ్యామ్ వేక్స్ తలో గోల్ చేయడంతో వేల్స్ ఘనమైన విజయం సాధించింది. ఇదిలా ఉండగా, 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మేజర్ టోర్నీలో వేల్స్ బరిలోకి దిగడం కూడా ఇదే తొలిసారి. -
ప్రిక్వార్టర్లో స్పెయిన్
నైస్(ఫ్రాన్స్):యూరో కప్లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ ప్రిక్వార్టర్లోకి ప్రవేశించింది. గ్రూప్-డిలో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో టర్కీని ఓడించి ప్రిక్వార్టర్స్కు చేరింది. స్పెయిన్ ఆటగాళ్లలో అల్వారో రెండు గోల్స్ తో, నిలోటి ఒక గోల్ నమోదు చేసి జట్టు సంపూర్ణ విజయంలో సహకరించారు. హ్యాట్రిక్ టైటిల్ పై ఆశపెట్టుకున్న స్పెయిన్ అంచనాలకు తగ్గట్టు రాణించి ప్రిక్వార్టర్స్ చేరింది. మంగళవారం క్రొయేషియాతో జరిగే స్పెయిన్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ను డ్రా చేసుకున్నా గ్రూప్-టాపర్ గా నిలుస్తుంది. మరోవైపు టర్కీ తన చివరి లీగ్ మ్యాచ్ లో చెక్ రికపబ్లిక్ పై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement