-
దుర్గమ్మకు పట్టు వ్రస్తాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టు వ్రస్తాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్లాదకర వాతావరణం మధ్య క్యాంప్ కార్యాలయం నుంచి ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పరివేష్టితం నిర్వహించారు. పరివేష్టితం ధారణతో అమ్మ వారి పట్టువ్రస్తాలు, పసుపు, కుంకుమలను ముఖ్యమంత్రి తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అంతరాలయంలో శ్రీసరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మ వారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ఇతర అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు సీఎం వైఎస్ జగన్ను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అమ్మవారి తీర్థ ప్రపాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, దేవదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాల రాజు, దేవదాయ కమిషనర్ సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, కల్పలతా రెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, కనకదుర్గ ఆలయం చైర్మన్ కర్నాటి రాంబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరి గౌతంరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్షి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టి.కె.రాణా, ఆలయ ఈవో కెఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సోమవారంతో ఆషాఢ మాసోత్సవాలు ముగియనున్నాయి. దీంతో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ఆదివారం నిర్వహించిన ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవార్చన, శాంతి కలల్యాణం, చండీహో మం, గణపతి హోమంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి మూడు గంటలు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. మరో వైపున అమ్మవారికి సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్తులను సైతం రూ.300, రూ.100 క్యూలైన్లోకి అనుమతించారు. భక్తుల రద్దీతో పలు దఫాలుగా అంతరాలయ దర్శనం నిలిపివేసి ముఖ మండప దర్శనానికి అనుమతించారు. వీఐపీ గేటు వద్ద రూ.500 టికెట్ తీసుకున్న భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. సారె సమర్పించే భక్తుల రద్దీ తగ్గిన సమయంలో రూ.500 టికెట్ క్యూలైన్ను అంతరాలయంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సారె సమర్పించిన భక్త బృందాలు దుర్గమ్మకు ఆదివారం పలు భక్త బృందాలు సారెను సమర్పించాయి. దుర్గగుడి పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య బృందం, దేవిశెట్టి బాలకృష్ణ బృందం, ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక పీఠం ఈది ఎల్లారావు శిష్య బృందానికి చెందిన 700 మంది భక్తులు, మొగల్రాజపురం కళావతి బృందానికి చెందిన 50 మంది, పొన్నూరుకు చెందిన ఎం.అరుణ బృందానికి చెందిన 50 మంది భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన 2 వేల మంది భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. వీరికి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. కార్యక్రమంలో డీఈవో గురు ప్రసాద్, పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, దేవిశెట్టి బాలకృష్ణ, బచ్చు మాధవికృష్ణ, కేసరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. సోమవారం ఉదయం 7–30 గంటలకు ఆలయ ఈవో, ఆలయ సిబ్బంది అమ్మవారికి సారెను సమర్పించనున్నారు. అడ్డుకున్న నిఘా సిబ్బంది కనకదుర్గనగర్ పరిసరాల్లో తిరిగే డిప్యూటీ (శ్రీను) అనే వ్యక్తి ఆదివారం ఆలయంలో విధులు నిర్వహించే ఓ వ్యక్తికి ఫోన్ చేసి ముగ్గురు భక్తులకు వీఐపీ దర్శనం చేయించాలని కోరాడు. దీంతో సదరు ఉద్యోగి ఆ ముగ్గురు భక్తులను ఆలయంలోకి తీసుకెళ్తుండగా, నిఘా సిబ్బంది అడ్డుకున్నారు. ఉద్యోగిని మందలించారు. అక్రమ మార్గంలో వీఐపీ దర్శనాలు చేయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి USలో కట్టిన గుడి !
ఈ గుడి కథంతా తెలుగు సినిమా కథలా కనిపిస్తుంది. కాని ఇది యథార్థంగా జరిగిన ఘటన. కాలిఫోర్నియాలో ఒక దేవాలయ నిర్మాణం విషయంలో. ఫేస్ బుక్ లో వల్లీశ్వర్ గుండు (Valliswar Gundu) షేర్ చేసుకున్న కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ యథాతధంగా.. 1974 లో ఉత్తర కాలిఫోర్నియాలో హిందువుల కోసం ఒక దేవాలయం ఉండాలని కొందరు స్థానిక భారతీయులకు ఒక కోరిక కలిగింది. ఆ ఆలోచనకి ఒక రూపం వచ్చి 1977లో ఒక రిజిస్టర్డ్ కమ్యూనిటీగా ఏర్పడింది. ప్లెసంటన్ అనే ప్రాంతంలో షాడో క్లివ్స్ అనే సరస్సు ప్రక్కన ఓ నాలుగెకరాల స్థలంలో దేవాలయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి తొలి విరాళంగా 50 వేల డాలర్లు (రూ. 4.50 లక్షలు అప్పట్లో) ఇచ్చిన భక్తుడు ఒక గుజరాతీ. ఆయన పేరు గులు అద్వాణి. రకరకాల 'సాంకేతిక కారణాలు ' చూపిస్తూ స్థానిక పాలనా సంస్థ ఈ నిర్మాణానికి అభ్యంతరాలు తెలిపింది. ప్లెసంటన్ పౌరులు మూడు వేల సంతకాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ళపాటు పోరాడారు. ప్రయోజనం శూన్యం. ఆ భూమి క్రయాన్ని రద్దు చేసుకున్నారు. అక్కడికి తూర్పుగా తొమ్మిది మైళ్ళ దూరంలో నాలుగెకరాల భూమి కొన్నారు. సరైన రోడ్లు లేవు. విద్యుత్ నీటి సదుపాయాలు సరిగ్గా లేవు. అక్కడే 1983లో దేవాలయం కట్టాలనుకున్నచోట ఒక పాత ఇల్లు కొని, తమ కార్యాలయం చేసుకున్నారు. ఆ కార్యాలయానికి ప్రక్కనే ఆలయ క్షేత్ర భూమిలో సర్వశక్తిమంతురాలైన శ్రీ కనక దుర్గాదేవి మందిరానికి భూమి పూజ జరిగింది. గత నాలుగు దశాబ్దాలకు పైగా దేవాలయ అభివృద్ధిలో పాత్రధారిగా, అలుపెరగని సేవకురాలిగా, అన్ని పరిణామాలకి సాక్షిగా అనునిత్యం తరిస్తున్న నీలంరాజు విజయలక్ష్మి జ్ఞాపకాల్లోకి తొంగి చూస్తే..సంభ్రమం, ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఎన్నో!. (నీలంరాజు విజయలక్ష్మి) అప్పుడే అద్భుతం జరిగింది! ఆమె మాటల్లో చెప్పాలంటే … 1982 ఆగష్టులో గణపతి స్థపతి గారు వచ్చి చూసి, అమ్మవారు ఉన్న చోట ఆగమ శాస్త్రం ప్రకారం ఏయే దేవతా విగ్రహాలు ఉండాలో చెప్పారు. 'పద్మశ్రీ' గ్రహీత ముత్తయ్య స్థపతి కూడా చూసి, కొన్ని సూచనలు చేశారు. దక్షిణభారత, ఉత్తర భారత శైలులు రెండిటినీ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఆ సూచనల ప్రకారం విష్ణ్వాలయానికి చోళ శైలి గోపురం, శివాలయానికి కళింగ శైలి గోపురం ఎంచుకున్నారు. గణేశ, శివ, కార్తికేయ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, హనుమ, కాల భైరవులకు నల్లని గ్రానైట్ విగ్రహాలు, రామకృష్ణులు, దశ భుజ దుర్గలకు పాలరాతి విగ్రహాలు ఎంచుకున్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది ! 1980 ప్రాంతంలో ఈ కమిటీ సారథుల్లో ఒకరైన శ్రీ ముత్తురామన్ అయ్యర్ శాన్ఫ్రాన్సిస్కోలో శివ-సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమెరికన్ స్వామీజీ తానే చొరవ తీసుకొని గణేశ, కార్తికేయ విగ్రహాలు ఇచ్చారు. కాని ఆలయం లేదు కదా! అందుకని వాటిని భక్తుల ఇళ్ళల్లో ఉంచి, వాటికి నిత్య పూజాభిషేకాలు జరిగేలా చూశారు. సరిగ్గా ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. గుడి కట్టడానికి నిధులు కావాలి. భారతీయ స్టేట్ బ్యాంకు వారు "రుణం ఇస్తాం. హామీ ఏం పెడతారు?" అని అడిగారు. అంతే.. 20 మంది భక్తులు తమ ఇళ్ళను హామీగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు అయిదు లక్షల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షలు) రుణం తీసుకున్నారు. తరువాత ఇంకో అద్భుతం జరిగింది ! 1984 ప్రథమార్థంలో అమెరికా వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుని కమిటీ సభ్యులు కలిసి "టీటీడా వారి చేత మాకు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, స్వామి వారి అలంకారాలు ఇప్పించండి స్వామీ" అని కోరటం, వివేకానందుడి ఆహార్యంలో దర్శనమిచ్చిన ముఖ్యమంత్రి తక్షణం "అలాగే " అని హామీ ఇవ్వటం చకచక జరిగిపోయింది. సరిగ్గా నెల తిరక్కుండా టీటీడీ నుంచి ఆగమ శాస్త్రానుసారం ఏకశిల గ్రానైట్ మీద చెక్కిన శ్రీనివాసుడి విగ్రహం, అలంకార సామగ్రి, వస్త్రాలు, పాత్రలు (మొత్తం లక్ష రూపాయల విలువ) కాలిఫోర్నియా చేరిపోవటం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం మంచి శిల్పుల్ని, కొన్ని విగ్రహాల్ని ఇస్తామని వాగ్దానం చేసింది. అప్పటికి చేతిలో ఉన్న విరాళాలతో కమిటీ 1984 ఏప్రిల్ దేవాలయ నిర్మాణానికి నిర్మాణానికి ఉపక్రమించింది. మళ్ళీ అమెరికా వచ్చిన ముఖ్యమంత్రి శ్రీఎన్.టి.రామారావు 1984 జూన్ 13 న ఆలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు. (నాడు పూజలో పాల్గొన్న ఎన్టీఆర్) నా భక్తుడు నా కోసం వస్తాడు నన్ను పంపించు.. అప్పుడింకో అద్భుతం జరిగింది ! ఈ ఆలయ నిర్మాణానికి తపిస్తున్న భక్తుడు ముత్తురామన్ అయ్యర్ గారికి న్యూయార్క్ గణేశ దేవాలయ వ్యవస్థాపకులు అలిగప్పన్ గారు ఫోన్ చేసి, "మీకు అమ్మవారి విగ్రహం కావాలి కదా! మద్రాసు (చెన్నై)లో దేవీ భక్తుడు రిటైర్డ్ ఇంజినీర్ డాక్టర్ రాజు గారితో మాట్లాడండి" అని చెప్పారు. తరువాత ఆ ఇంజినీరే ఫోన్ చేశారు. ముత్తురామన్, తన భార్య గీతతో కలిసి మద్రాసు వెళ్తే, ఆ ఇంజినీర్, "ముత్తుస్వామి అనే భక్తుడు అమెరికాలో దేవాలయం కోసం వచ్చి నా విగ్రహం అడుగుతారు. నన్ను పంపించు" అని అమ్మవారు కొన్నేళ్ళక్రితమే తనకు చెప్పిందంటూ తన డైరీ చూపించారు. వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న ఆ విగ్రహం కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి స్పర్శతో దివ్యత్వాన్ని సంతరించుకున్నదని అంటూ ఆ విగ్రహాన్ని అమెరికా పంపించే ఏర్పాటు చేశారు. అలా వచ్చిన అమ్మవారికి ముందు తాత్కాలిక వసతి కల్పించారు. తర్వాత ప్రతిష్ట చేశారు. శివలింగాన్ని, మరి కొన్ని విగ్రహాల్ని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది. ఇతర పాలరాతి విగ్రహాల్ని కమిటీయే సమకూర్చుకుంది. 1983 లో ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్ రవి శంకర్ శంకుస్థాపన చేసినా, ఈ ఆలయ సముదాయం నిర్మాణ పనులు మాత్రం అమ్మవారి విగ్రహం వచ్చాకనే వేగంగా పుంజుకున్నాయి. అయితే నిధులు లేక మొత్తం సముదాయానికి పైకప్పు నిర్మాణం చాలాకాలం పట్టింది. అలాంటి రోజుల్లో, చెదురుమదురుగా వచ్చే భక్తులు శివలింగం ముందర పైసలు (సెంట్లు) వేసేవారు. అలా 99 సెంట్లు ఎప్పుడు సమకూరితే అప్పుడే అయిదు లీటర్ల పాలు కొని శివుడికి క్షీరాభిషేకం చేసేవాళ్ళు. అంతదాకా జలాభిషేకాలే ! మూడు నాలుగేళ్ళు అలాగే జరిగింది. రాధాకృష్ణులు, శ్రీరామ పరివారం, నవగ్రహాలు, హనుమ, కాలభైరవ ... అందరూ స్థిరపడ్డాక, 1986లో తొలి కుంభాభిషేకంలో ఈ మందిరాల మీద హెలికాప్టర్లోంచి పుష్ప వృష్టితో కూడా అర్చించారు. నిత్య పూజలతో పాటు కళ్యాణం, అభిషేకం వంటి సేవలన్నీ మొదలయ్యాయి. నలభయ్యేళ్ళు గడిచాయి. ఇప్పుడు 11 మంది అర్చకులు, ఆరుగురు ముఖ్య సిబ్బంది, ఇతరసహాయకులు, వారాంతాల్లో, ఇతర పర్వ దినాల్లో వచ్చి సేవలందించే వందమంది దాకా స్వచ్ఛంద సేవ చేసే భక్తులతో ప్రకాశిస్తున్న ఈ దేవాలయంలో ప్రతి పన్నెండేళ్ళకోసారి కుంభాభిషేకాలు జరుగుతున్నాయి. పాలతో అభిషేకం చేయలేని స్థితి నుంచి నిత్యాన్నదానం ఇచ్చే.. మళ్ళీ ఓ అద్భుతం ! క్రమంగా ఆలయ అవసరాలు పెరుగుతున్నాయి. "ఏం చేద్దాం ?" అనుకుంటున్న రోజుల్లో అమెరికా వాసులైన ఆకెళ్ళ సోదరులు ముందుకు వచ్చి, ఆలయానికి అనుకుని ఉన్న భూమిని తమ తల్లిదండ్రులు ఆకెళ్ళ మనోరమ, ఆకెళ్ళ శాస్త్రి గారి పేరు మీద విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత డాక్టర్ హనుమరెడ్డి లక్కిరెడ్డి, డాక్టర్ పేరయ్య సూదనగుంట వంటి దాతలు సహా అనేక మంది విరాళాలతో ఆలయ సముదాయం భవనాలు, సదుపాయాలు విస్తరించాయి. ఇక్కడ ప్రముఖ పండితుల ప్రవచనాలు, క్రతువులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’గా ఈ దేవతా క్షేత్రం భాసిల్లుతోంది. ఒకప్పుడు శివలింగానికి పాలతో అభిషేకం చేసే స్తోమత లేని ఈ ఆలయంలో నేడు ప్రతి రోజూ అన్న ప్రసాదాలే. పర్వ దినాల్లో మూడువేల మందిదాకా భక్తులకు అన్న ప్రసాదాలు లభిస్తున్నాయి. ప్రతి జనవరి 1 నాడు ఎన్నో వేలమంది భక్తులు ఇక్కడి దేవతలను సేవిస్తుంటారు.. ఇప్పుడు కాలిఫోర్నియాలో అతి పెద్ద దేవాలయంగా లివర్ మోర్లో భక్తుల సేవలందుకుంటున్నది ఈ శివ-విష్ణు దేవాలయం (Hindu Cultural and Community Centre). “తొలి భూమిపూజ నాడు దీపం వెలించే భాగ్యం నాకు లభించింది. అప్పట్నుంచీ, నేను మా వారు శ్రీనివాస రావు గారు ఈ సముదాయంలోని అన్ని ఆలయాల అభివృద్ధిలో పాత్రధారుల మయిపోయాం. మేనేజ్మెంటు కమిటీలో రక రకాల బాధ్యతల్లో ఉన్నాం. కొన్ని సంవత్సరాల పాటు నేను ప్రతిరోజూ 30 మైళ్ళ (50 కి.మీ) దూరం నుంచి దేవాలయానికి సేవలకోసం వచ్చేదాన్ని. ఇప్పుడు మంగళ, శుక్రవారాలు, పర్వదినాలు ....! అనేక అద్భుతాలతో, అనేకమంది దాతల విరాళాలతో, సేవలతో నిర్మాణమయింది ఈ దేవాలయం. గత నాలుగున్నర దశాబ్దాలలో ఇందులో ప్రతి మందిరంలోనూ మా చేత ఏదో ఒక పాత్రను ధరింపజేసి, ఈ దేవాలయంతో మా అనుబంధాన్ని అమ్మవారు సుసంపన్నం చేస్తోంది. పన్నెండేళ్ళకోసారి చొప్పున ఇప్పటిదాకా జరిగిన నాలుగు కుంభాభిషేకాల్లో ఉన్నాను. ఏనాడూ అమ్మవారు నన్ను విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఎంతకాలం ఆమె ఇలా శక్తినిస్తే, అంతవరకూ సేవిస్తూనే ఉంటాను..." అంటారు భక్తురాలు విజయలక్ష్మి. (చదవండి: ధర్మచక్ర ప్రవర్తనా పూర్ణిమ) -
Vijayawada: దుర్గమ్మకు భారీగా దసరా ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో రూ.16 కోట్ల మేర ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరో అంతస్తులో ఆమె సోమవారం విలేకరులకు ఉత్సవ ఆదాయ వ్యయాలను వివరించారు. హుండీ కానుకల ద్వారా రూ.9.11 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లు, ప్రసాదాల విక్రయాలతో రూ.2.48 కోట్లు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షలు, విరాళాలు ఇతరత్రా కలిపి రూ.16 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొవిజన్స్, ఇతర ఖర్చులకు రూ.10.50 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమా పాల్గొన్నారు. 26 నుంచి కార్తిక మాసోత్సవాలు ఈ నెల 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కార్తిక మాసోత్సవాలను వైభవంగా నిర్వహి స్తామని ఈఓ భ్రమరాంబ తెలిపారు. 23వ తేదీన ధనత్రయోదశి సందర్భంగా మహాలక్ష్మి యాగం, 24న దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తామన్నారు. 25వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, 26 ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. నవంబర్ ఎనిమిదో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేసి మరుసటిరోజు ఉదయం పూజల అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నవంబర్ 4 నుంచి భవానీ మండల దీక్షలు నవంబర్ నాలుగో తేదీ నుంచి భవానీ మండల దీక్షలు, 24వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమై 19వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తాయని పేర్కొన్నారు. డిసెంబర్ ఏడో తేదీన సత్యనారాయణపురం రామకోటి నుంచి కలశజ్యోతుల మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. (క్లిక్ చేయండి: గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ) -
దుర్గమ్మను దర్శించుకున్న సాయిధరమ్ తేజ్..
Sai Dharam Tej And His Family: హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా సోమవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలను, శేషవ్రస్తాలను బహూకరించారు. ఎప్పుడూ విజయవాడ వచ్చిన తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగిందన్నాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకొని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నట్లు సాయిధరమ్తేజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement