-
క్యాన్సర్తో బుల్లితెర నటి మృతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చివరి పోస్ట్!
బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది. డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్లెస్ కనెక్షన్ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కోసం పూనమ్ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. జాండిస్తో ఆమె సోదరి మృతి.. పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్కు దగ్గరైంది. View this post on Instagram A post shared by Dolly Sohi (@dolly_sohi) -
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
రచ్చే కాదు... ఇంట కూడా గెలిచా!!
నాకు తిక్కుంది కానీ దానికో లెక్కుంది అన్నట్లుగా ఆమె ఎంబీఏ చేసింది. దిల్లీలో చక్కటి జీతంతో సకల సదుపాయాలతో పెద్ద పేరున్న బహుళజాతి సంస్థలో ఉద్యోగం ఆమెది. అలాంటిది, బంగారంలాంటి ఉద్యోగాన్ని, అందులో కంపెనీ ఇచ్చిన హోదాని, ఆ హోదాకు తగ్గ సౌకర్యాలనూ వదులుకుని బిహార్లోని మారుమూల ప్రాంతమైన గయ జిల్లా షాదిపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి గెలిచింది. తాను మెట్టిన గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఆమే డాలీ. ఎందుకలా చేశావని అడిగితే ఇలా చెప్పింది. ‘‘నిజానికి నేనీ పని ఎప్పుడో చేసుండాల్సింది, చేశాను కూడా. అయితే అప్పుడు కుదరలేదు. 2015లో మా పెళ్లయింది. భర్త, మామగారు చాలా మంచివారు. అయితే అది పల్లెటూరు కావడంతో నేను అక్కడ ఉండలేకపోయాను. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయి, ఎప్పటిలాగే నా ఉద్యోగం చేసుకుంటూ సెలవ దొరికినప్పుడు వచ్చి కొద్దిరోజులు గడిపి వెళ్లేదానిని. అలా కొద్దికాలం గడిచింది. ఇంతలో పంచాయతీ ఎలక్షన్లొచ్చాయి. అంతవరకు జనరల్ స్థానంగా ఉన్న మా గ్రామ పంచాయతీని మహిళలకు కేటాయించారు. మా మామగారు, మా వారు ఆ స్థానానికి నన్ను పోటీ చేయమన్నారు. నేను ముందు ఆశ్చర్యపోయాను. తర్వాత చాలా ఆలోచించాను. ఢిల్లీ వంటి మహానగరంలో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మంచి జాబ్ చేసుకుంటున్న నేను మారుమూల పల్లెటూళ్లో సర్పంచ్గా పోటీ చేయడమా? అనుకున్నాను. మా వారు, మా వారు నన్ను 13 వార్డులున్న ఈ పంచాయతీకి సర్పంచ్ పోటీ చేయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని, గెలవడం కూడా అంత తేలికేమీ కాదని, అయితే బాగా ఆలోచించుకోమన్నారు. ఆ ఊరికి నేను కొత్త. పైగా అప్పటికే నేను ఢిల్లీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. నా వేషభాషలు, మాటలు చూసిన గ్రామస్థులు ఇంత ఆధునికంగా ఉన్న ఈమె ఈ ఊరికి ఎంపికై ఏం చేస్తుంది అనుకున్నారో ఏమో, మా కుటుంబానికి ఎంతో పలుకుబడి, డబ్బు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ నన్ను నమ్మేలా కనిపించలేదు. దాంతో నేను దానిని సవాల్గా తీసుకున్నాను. ఉద్యోగంలో వచ్చే సవాళ్లను ఏ విధంగా అయితే అధిగమించే దానినో, ఈ సర్పంచ్ పదవికోసం అదేవిధంగా కృషి చేయాలనుకున్నాను. గ్రామీణుల నుంచి ఇతరులను వేరు చేసే వాటిలో ముఖ్యమైనవి వస్త్రధారణ, భాష, సంస్కృతి. మా కుటుంబానికి రాజకీయాలు ఏమీ కొత్తకాదు. నేను అడుగుపెట్టేటప్పటికే మా అత్తగారు లేరు కానీ, మా అత్తగారు గతంలో సర్పంచిగా పని చేసినట్లు విన్నాను. అందుకే అప్పటివరకూ చాలా ఆధునికంగా ఉన్న నేను నా వస్త్రధారణను, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నాను. నిండుగా చీరకట్టు, నుదుట బొట్టు, చేతులకు గాజులు, కంటికి కాటుక, తలపై ముసుగుతో నేను పూర్తిగా అక్కడి అమ్మాయిలా మారిపోయాను. మాట తీరును కూడా మార్చుకున్నాను. కనిపించిన వారినందరినీ ఆప్యాయంగా పలకరించడం, వారి కష్టసుఖాలను కనుక్కోవడం, పెద్దవాళ్లకు గౌరవప్రదంగా నమస్కరించడం వంటి పద్ధతులతో వారికి నా పట్ల నమ్మకం కలిగించాను. ఇదంతా నేను సర్పంచ్ పదవిని ఆశించి చేసినవి కాదు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగంలో రకరకాల సవాళ్లు ఎదురుకాకుండా ఉండవు కదా... మన తెలివితేటలు, ఓర్పు, నేర్పుతో వాటిని ఏ విధంగా అధిగమిస్తామో, అలాగే ఇది కూడా అనుకున్నాను. అందుకే వారికి తగ్గట్టు నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. ఆ గ్రామానికి మౌలిక వసతులు కల్పించడం, అందరూ చదువుకునేలా చేయడం, గ్రామస్థుల సమస్యలు పరిష్కరించడం ముఖ్యలక్ష్యాలుగా ఎంచుకున్నాను. అంతే! వారు నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. అప్పటినుంచి నేను పూర్తి సమయాన్ని గ్రామాభివృద్ధి కోసమే కేటాయిస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించిన వారందరూ నా వారే అనుకున్నాను. రకరకాల కుటుంబ సమస్యలతో నా దగ్గరకొచ్చిన వారికి నాకు చేతనైన రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాను. గ్రామంలో స్త్రీ విద్య కోసం కృషి చేశాను. పంచాయతీకి నిధుల కేటాయింపు కోసం కృషి చేశాను. అక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాకు చేతనైన రీతిలో ఆధునికీరించాను. రోడ్లు మరమ్మతు చేయించడం, వీధి దీపాలు వెలిగేలా చూడటం, పంచాయతీకి రావలసిన పన్నులను సక్రమంగా వసూలయేలా చర్యలు తీసుకోవడం వంటివన్నీ చేస్తూపోయాను. పురుషాధిక్య భావనలు ఉన్న ఆ గ్రామంలో అందరూ నన్ను గౌరవించడం, వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు నన్ను ఆహ్వానించడం వంటి వాటితో చిత్రంగా నా కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్న పోటీ, పరుగులు తీయడం, చికాకు, ఆందోళన, టెన్షన్లు వంటివి ఇక్కడ లేవు. నేను ఉద్యోగం చేస్తే కేవలం డబ్బు మాత్రమే వచ్చేది. అదే ఇక్కడ సర్పంచ్గా ఉండటం వల్ల ఎందరో గ్రామీణుల జీవితాలను బాగు చేయగలిగానన్న ఆత్మసంతృప్తి, మానసిక ప్రశాంతత కలిగాయి. అప్పుడు అనిపించింది... ఇంట గెలిచి రచ్చగెలువు అన్న సామెత ఉట్టిది కాదని... నేను బయటే కాదు, ఇంట కూడా గెలిచాననీ’’ పెద్ద చదువులు చదువుకున్న ప్రతి వారూ పెద్ద కంపెనీలలోనే పని చేసి రెండు చేతులా సంపాదించాలని ఏమీ లేదు, పెద్ద మనసుతో సొంత వూళ్లో సొంత ప్రజలకు సేవ చేసినా తృప్తితో గుండెలు నింపుకోవచ్చునని డాలీ ఉదంతం చెబుతోంది. (క్లిక్ చేయండి: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!) -
కాబోయే అమ్మకు ఎంత కష్టమో.. !
శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం కురిడికి చెందిన ఎం.పెంటమ్మ అనే గర్భిణికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. స్థానిక మహిళలు సుఖప్రసవానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో డోలీలో 20 కిలోమీటర్లు మోసుకొచ్చి దబ్బగుంటకు చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేశారు. కురిడి గిరిశిఖర గ్రామం కావడం, సరైన దారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర వేళ కష్టాలు తప్పడంలేదని గిరిజనులు వాపోతున్నారు. గిరిశిఖర గిరిజన గ్రామాలకు త్వరితగతిన బీటీ రోడ్డు సౌక ర్యం కల్పించాలని గిరిజన పెద్దలు జె.గౌరీషు, ఆర్.శివ, సన్యాసిరావు, మాజీ సర్పంచ్ మాదల బుచ్చయ్య కోరారు. -
ఇక వారిని ‘అయ్యప్పే ఆదుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘అప్పుడు నాకు పాతికేళ్లు. యవ్వనంతో దృఢంగా ఉన్నా. సైన్యంలో చేరేందుకు కసరత్తు చేసి బలంగా తయారయ్యాను. అయినప్పటికీ సైన్యం శారీర దారుఢ్య పరీక్షలో పాస్కాలేక పోయాను. కొల్లాం జిల్లా పునలూరులోని మా గ్రామానికి వచ్చి పడ్డాను. ఇక చాలు, వచ్చి నా ఉద్యోగంలో చేరంటూ నా తండ్రి ఆదేశించాడు. చేసేదేమీలేక పుణ్యమూ, పురుషార్థమూ రెండూ దక్కుతాయనుకొని వచ్చి ఈ వృత్తిలో చేరాను. ఇప్పుడు నాకు 53 ఏళ్లు. దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొండలెక్కేటప్పుడు భరించలేని ఒళ్లు నొప్పులు వస్తాయి. పంటి బిగువున నొప్పిని భరిస్తాను. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. విశ్రాంత వేళలో కూడా కీళ్ల నొప్పులు, వెన్నుముక నొప్పి వేధిస్తాయి. ప్రతి రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొనిదే నిద్రరాదు’ శబరిమల ఆలయం వద్ద డోలి సర్వీసులో పనిచేసే సత్యన్ తెలిపారు. ఇక్కడ డోలి అంటే రెండు కర్రల మధ్య ఓ వెదురు కుర్చీని బిగిస్తారు. ఆ వెదురు కుర్చీలో భక్తులను కూర్చో బెట్టుకొని నలుగురు కూలీలు తీసుకెళ్లడమే డోలీ సర్వీసు. దానిలో భక్తులను పంబా నది నుంచి నాలుగు కి లోమీటర్ల దూరంలోని సన్నిధానం అయ్యప్ప ఆలయానికి తీసుకెళతారు. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో సన్నిధానం ఉంది. అక్కడికి భక్తులు చెప్పులకు పాదరక్షలు లేకుండా అడ్డదిడ్డంగా ఉండే అటవి బాటలో వెళ్లాల్సి ఉండేది. శారీరకంగా బలహీనంగా ఉండే భక్తులకు అలా వెళ్లడం కష్టం కనుక 1966లో కేవలం పది డోలీలతో ఈ సర్సీసు ప్రారంభమైంది. అప్పటి ‘ట్రావన్కోర్ దేవసం బోర్డు’ చైర్మన్ ప్రక్కులం భాసి ఈ డోలి సర్వీసును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు ఆధ్వర్యంలోనే ఈ డోలి సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 500 డోలీలు ఉండగా, వాటిని లాగేందుకు 2000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి డోలీ సర్వీసు కింద 4,200 రూపాయలను వసూలు చేస్తారు. అందులో 200 రూపాయలు దేవసం బోర్డుకు వెళుతుంది. నాలుగు వేల రూపాయలను నలుగురు కూలీలు సమంగా పంచుకోవాలి. సీజన్లో ఒక్కో కూలీకి 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సీజనంటే ప్రస్తుతం నడుస్తున్న మండల సీజన్. ఈ సీజన్లో 41 రోజులు అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. ఇది మలయాళం క్యాలండర్ ప్రకారం వృశ్చిక మాసంలో వస్తుంది. ఆ తర్వాత మకరవిలక్కసు సీజన్ వస్తుంది. అదో 20 రోజులు, రెండు సీజన్లు కలిసి 61 రోజులు ఆలయం తెరచి ఉంటుంది. ఈ సీజన్లోనే డోలీ కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం ఏడాదిలో 126 రోజులు మాత్రమే అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. డోలీ కూలీలు బస్టాండుకు వెళ్లి భక్తులను అక్కడే ఎక్కించుకొని పంబా నది తీరానికి రావాలి. నదిలో స్నానమాచరించాక మళ్లీ వారిని ఎక్కించుకొని కొండపైన అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్లాలి. ఆ భక్తులే అదే రోజు వెనక్కి వస్తానంటే తీసుకరావాలి. మరుసటి రోజు వస్తానంటే మరుసటి రోజే తీసుకరావాల్సి ఉంటుంది. వారు భక్తులను రెండు గంటల్లో కొండపైకి తీసుకెళతారు. మార్గమధ్యంలో పది నిమిషాల చొప్పున మూడుసార్లు ఆగుతారు. వారికి గతంలో పంబా నది తీరాన విశ్రాంతి మందిరం ఉండేది. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదల్లో అది కాస్త కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆరు బయటే వారి విశ్రాంతి. కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన డోలీ కూలీలు సీజనంతా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వారు దేవసం బోర్డు పరిధిలో కాంట్రాక్టు కూలీలుగా పనిచేస్తున్నందున వారికి సెలవులు లేవు. రోగమొస్తే, నొప్పొస్తే ఉచిత వైద్య సౌకర్యం లేదు. మంచాన పడినా పింఛను సౌకర్యం లేదు. ఒకప్పుడు ముళ్ల పొదలు, కొనదేలి కోసుకుపోయే రాళ్ల మీది నుంచి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు సిమ్మెంట్ రోడ్డు మీద వెళుతున్నారు. భక్తులులాగే వీరు కూడా పాద రక్షలు లేకుండానే వెళ్లాలి. రావాలి. వృత్తి కారణంగా వారికి కీళ్ల నొప్పులే కాకుండా ‘డిస్క్ పొలాప్స్’ లాంటి వెన్నుముఖ జబ్బులు కూడా వస్తున్నాయి. 53 ఏళ్లు వచ్చినా మన సత్యన్ ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు కనిస్తున్నాడుకానీ చాలా మంది కూలీలు 50 ఏళ్లకే చనిపోతారట. ఇప్పుడు వారికి నిరుద్యోగం భయం పట్టుకుంది. యాత్రికుల తాకిడి ఎక్కువవడం, వారి నుంచి టీడీబీకి వస్తున్న ఆదాయం కూడా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం పంబా నది నుంచి సన్నిధానం వరకు ‘రోప్ వే’ను ప్రవేశ పెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో డోలీ సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పుడు తాము రోడ్డున పడతామని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ పాలక, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమకు అయ్యప్పే దిక్కని, ఆయన ఎలా కాపాడుతారో చూడాలి అని వారు మొరపెట్టుకుంటున్నారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై రాష్ట్ర అసెంబ్లీలో కుమ్ముకుంటున్న పాలక, ప్రతిపక్షాలకు వీరి గురించి పట్టించుకునే తీరికెక్కడిది! సోమవారం కూడా కేరళ అసెంబ్లీ స్తంభించిపోయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement