-
The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్ హీరోయిన్ ఎవరు?
‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ రానుందా? అంటే బాలీవుడ్ అవునంటోంది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ (2011) గుర్తుండే ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ నిర్మించడానికి ఏక్తా కపూర్ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో రచయితతో కలిసి కనికా థిల్లాన్ ఈ సీక్వెల్కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట. సీక్వెల్లో విద్యాబాలన్ కాదు... సీక్వెల్లో విద్యాబాలన్ నటించడంలేదు. కాగా ఫస్ట్ పార్ట్ అప్పుడే కంగనా రనౌత్ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్. అయితే కంగన తిరస్కరించారు. సీక్వెల్కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్ వంటి తారలతో సెకండ్ పార్ట్ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి.. ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్ 2’ హీరోయిన్ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్’ విద్యాబాలన్ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్ షూటింగ్ ఆరంభించాలను కుంటున్నారని భోగట్టా. -
రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ?
The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ మూవీ విద్యా బాలన్కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తకిర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. సుమారు దశాబ్దం తర్వాత 'ది డర్టీ పిక్చర్' సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శకనిర్మాతలు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ కోసం ఇంకా విద్యా బాలన్ను సంప్రదించలేదట. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానీ ఈ సీక్వెల్ను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు విద్యా బాలన్నే తీసుకుంటారా? ఇంకా ఇతర హీరోయిన్కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ కాగా మిలన్ లుత్రియా దర్శకత్వం వహించిన 'ది డర్టీ పిక్చర్' చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 117 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విద్యా బాలన్తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్ధీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. చదవండి: బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
‘క్లైమాక్స్ చూసి అమ్మ ఏడ్చేసింది’
ముంబై: ఎప్పుడూ చీరకట్టులో నిండుగా కనిపించే విద్యాబాలన్.. ‘డర్టీ పిక్చర్’ వంటి సినిమా చేస్తారని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. విద్య సైతం ఇలాగే అనుకున్నారట. డైరెక్టర్ మిలన్ లూథ్రియా ఆ కథతో తన దగ్గరికి వచ్చినపుడు ఆశ్చర్యపోయారట. అయితే ఆర్టిస్టుగా తనపై ఉన్న తనకు ఉన్న నమ్మకంతో ఓకే చేశారట. ఆమె నమ్మకం నిజమైంది. ‘సిల్క్’ స్మిత పాత్రలో జీవించిన విద్య నటనా కౌశల్యానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. నిర్మాతపై కాసుల వర్షం కురిపించారు. 2011లో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసింది. అంతేగాక, విద్యకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే, సిల్క్గా విద్యను ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు గానీ, మరి ఆమె కుటుంబ సభ్యులు ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఎలా స్పందిస్తారోనన్న అంశం తన మనసును మెలిపెట్టిందట. ఈ విషయాల గురించి తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన విద్యా బాలన్.. ‘‘మనం చేసే పని సరైందే అయితే కచ్చితంగా మనకు మద్దతు లభిస్తుంది. మీకొక విషయం చెబుతాను. డర్టీ పిక్చర్ స్క్రీనింగ్ జరుగుతున్నపుడు, మా అమ్మానాన్న ఎలా స్పందిస్తారోనన్న భయం వెంటాడింది. కానీ సినిమా చూసి బయటకు రాగానే నాన్న చప్పట్లు కొట్టారు. ‘‘ఈ సినిమాలో ఎక్కడా నా కూతురు కనిపించనేలేదు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ అయితే క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకుంది. తెర మీద నా పాత్ర చనిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. నిజానికి, సెక్సీగా కనిపించడానికి, అసభ్యంగా కనిపించడానికి ఒక సన్నని గీత ఉంటుంది. ఏదైమేనా ఆర్టిస్టుగా నాలోని భిన్న కోణాన్ని పరిచయం చేసేందుకు అవకాశం ఇచ్చిన డర్టీ పిక్చర్ టీంకు ధన్యవాదాలు’’అని విద్యా బాలన్ గత జ్ఞాపకాలు పంచుకున్నారు. చదవండి: ఫోటోలకు ఫోజులు.. బ్యాలెన్స్ తప్పిన కృతి! -
నటి ఆర్య బెనర్జీ మృతి: కీలక విషయాలు వెల్లడి
కోల్కతా: బాలీవుడ్ నటి ఆర్య బెనర్జీ గత వారం కోల్కతాలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన బెనర్జీ ఆకస్మిక మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమెది హత్య కాదని అనారోగ్య సమస్యల కారణంగా బెనర్జీ మృతి చెందినట్లు తాజాగా ఫోరెన్సిక్ నివేధికలో వెల్లడైంది. బెనర్జీ కొంతకాలంగా కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఫోరెన్సిక్ నివేధికలో వైద్యలు ధృవికరించారు. కాగా దీనిపై కోల్కతా పోలీసు జాయింట్ కమిషనర్ మురళీధర్ శర్మ మాట్లాడుతూ.. ‘నటి ఆర్య బెనర్జీది హత్య కాదు. హత్య జరిగినట్లు ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఘటన స్థలంలోనే ఫోరెనిక్స్ నిపుణులు మృతదేహం శాంపుల్స్ సెకరించారు. అయితే తను చనిపోయిన సమయంలో బెనర్జీ పొట్టలో ఆల్కహాల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు’ అని ఆయన తెలిపారు. (చదవండి: నటి ఆర్య బెనర్జీ అనుమానాస్పద మృతి) ఆర్యబెనర్జీ జోధ్పూర్లోని తన అపార్టుమెంటులో కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం బెనర్జీ ఇంటి పనిమనిషి వచ్చి తలుపు కొట్టడంతో ఆమె ఎంతకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె సమచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసుల తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి బెనర్జీ తన గదిలో బెడ్పై మృతి చెంది కనిపించారు. కాగా బెనర్జీ ప్రముఖ దివంగత సితార విద్వాంసుడు పండిత్ నిఖిల్ బెనర్జీ కూతురు. ఆమె దక్షిణాది ప్రముఖ నటి సిల్క్స్మిత జీవికథ నేపథ్యంలో తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించారు. అంతేగాక హిందీలో పలు సినిమాల్లో నటిస్తూనే ముంబైలో మోడల్గా రాణిస్తున్నారు. -
కోల్కతా:ఆర్య బెనర్జీ అనుమానాస్పద మృతి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement